-
హంతకులెవరైనా శిక్ష తప్పదు : నారా లోకేష్
పాడేరు/అరకులోయ: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సీవేరి సోమల హత్యకు కారణమైన వారిని విడిచిపెట్టేది లేదని, ఎవరైనా శిక్ష తప్పదని మంత్రి నారా లోకేష్ అన్నారు. బుధవారం ఆయన పాడేరులోని కిడారి, అరకులో సీవేరి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ నెల 14న అరకులో నిర్వహించనున్న కిడారి, సోమల స్మారక సం తాప కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కిడారి, సోమ ల హత్యల వెనుక ఎవరున్నారో బయటకు వస్తుందని, దీనిపై సిట్ విచారణ కొనసాగుతోందన్నారు. సొంత పార్టీలోని వ్యక్తులే ఈ హత్యలకు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయని, దీనివల్లే సిట్ నివేదిక బయటకు రాకుండా చేస్తున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. సొంత ఎమ్మెల్యేను చంపుతారా.. అంటూ నివేదిక రాకుండా మాట్లాడడం, అర్థంపర్థం లేని ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. నివేదిక రాకుండా దీనిపై మాట్లాడటం సబబు కాదన్నారు. హోంమంత్రి చినరాజప్ప, మంత్రి నక్కా ఆనందబాబు పాడేరు, అరకు ప్రాంతాల్లో రోడ్డు మార్గంలో పర్యటించారు. -
మీరే బాధ్యులు!
శ్రీకాకుళం సిటీ : పోలీస్శాఖపై పత్రికల్లో వ్యతిరేక వార్తలు వస్తున్నాయి. ఇది ఇబ్బందికరంగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని కొంతమంది సీఐ, ఎస్ఐ స్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్టు తనకు రోజూ మెసేజ్లు అందుతున్నాయి. ఇక్కడ శాంతిభద్రతల లోపం స్పష్టంగా కనిపిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (హోంశాఖ మంత్రి) నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. విమర్శలు వస్తున్న వారిపై విచారణ జరిపి వాస్తవాలు ఉంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పత్రికా కథనాలు రుజువైతే అందుకు మీరే బాధ్యులన్నారు. జిల్లాలోని పలు ప్రాంతా ల్లో అభివృద్ధి పనులను మంగళవారం ప్రారంభించిన ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఐజీ ఎ.రవిచంద్ర, జిల్లా ఎస్పీ ఏఎస్ ఖాన్లతో కలిసి డీఎస్పీలు, సీఐల సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇసుకను ఇస్తోందని..అక్రమాలు జరగకుండా ఇందులో రెవెన్యూ, పోలీస్శాఖలు భాగస్వామ్యం చేసినట్లు వివరించారు. జిల్లాలో శాంతిభద్రల పరిస్థితులను ఎస్పీ ఏఎస్ ఖాన్ హోంమంత్రికి వివరించా రు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు పరిస్థితి, కొత్తగా ఆరు పోలీస్స్టేషన్ల మంజూరు, పోలీస్క్వార్టర్లు, పోలీసులకు అందుబాటులో ఉండే వాహనాల స్థితిగతులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో నెలకొని ఉన్న క్రైం రేటుపై ఓఎస్డీ పేర్కొన్నారు. ప్రత్యేక బృందాలను వేసి నేరాలు జరగకుండా చూడాలని ఉపముఖ్యమంత్రి ఆదేశించారు. శతశాతం రికవరీ సొత్తును రాబట్టాలని సూచించారు. శ్రీకాకుళంలో మూడు సబ్డివిజన్ పరిస్థితులను డీఎస్పీలు వివరించారు. మహిళా పోలీసు స్టేషన్లో నెలకున్న పరిస్థితులను, అక్కడకి వచ్చే వారికి ఇస్తున్న కౌన్సెలింగ్లను డీఎస్పీ సుబ్రహ్మణ్యం వివరించారు. జిల్లాలో ట్రాఫిక్పై పరిస్థితులను చినరాజప్ప ఆరా తీశారు. - పత్రికల్లో వస్తున్న వార్తలపై ఎస్పీ ఏమన్నారంటే.. పత్రికల్లో విలువలు తగ్గిపోతున్నాయని, అందుకే పోలీసులపై వస్తున్న వ్యతిరేక వార్తలకు తాము స్పందించడం లేదని జిల్లా ఎస్పీ ఏఎస్ ఖాన్ ఉపముఖ్యమంత్రి దృష్టికి సమావేశంలో తీసుకెళ్లినట్టు తెలిసింది. పోలీసులకు వ్యతిరేకంగా పత్రికల్లో వస్తున్న వార్తలపై స్పందించాలని ఉపముఖ్యమంత్రి పదేపదే అనడంతో ఎస్పీ జోక్యం చేసుకున్నారు. ఇటీవల ఓ పత్రికలో అంటూ..జిల్లాలోని ఏఎస్సై ఒకరు రూ.25 లక్షలు అవినీతికి పాల్పడిన వ్యవహారంపై సాక్షిలో కథనం ప్రచురితమైన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లేప్రయత్నం చేసినట్లు తెలిసింది. దీనికి హోంమంత్రి బదులిస్తూ పత్రికల్లో వ్యతిరేక కథనాలు వస్తే వాస్తవ పరిస్థితులపై కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీస్ అధికారులపై ఉందన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు. హోంమంత్రి పర్యటన సాగిందిలా హోం మంత్రి చినరాజప్ప శ్రీకాకుళం, ఆమదాలవలస, పలాస, సోంపేట, టెక్కలి, ఎచ్చెర్ల మండలాల్లో పర్యటించి పలు భవనాలను ప్రారంభించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. శ్రీకాకుళంలోని పొట్టిశ్రీరాములు జంక్షన్ సమీపంలో పెట్రోల్బంకుకు శంకుస్థాపన చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఎచ్చెర్లలో పోలీస్ ఆపరేషన్ కమాండెంట్ బ్యారక్స్ను, ఆమదాలవలస మండలం కొర్లకోటలో రక్షితమంచినీటి పథకాన్ని, సీసీ రోడ్డు, పాఠశాల భవనాన్ని, కోటబొమ్మాళిలో పోలీస్స్టేషన్ను, కాశీబుగ్గలో పోలీస్బ్యారక్స్, సెంట్రల్ భవనాన్ని, ఎంపీడీవో కార్యాలయం వద్ద స్త్రీశక్తి భవనాన్ని ప్రారంభించారు. హరిపురంలో ఎన్టీఆర్, గౌతులచ్చన్నల విగ్రహాలను ఆవిష్కరించారు. ఆదిత్యున్ని దర్శించుకున్న హోంమంత్రి ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామివారిని ఉపముఖ్యమంత్రి చినరాజప్ప దర్శించుకున్నారు. అర్చకుడు నగేశ్కాశ్యప ఆధ్వర్యంలో అర్చక బృందం శాస్త్రోక్తంగా పూర్ణకుంభంతో ఆయకు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం అనివెట్టి మండపంలో అర్చకుల బృందం ఆశీర్వదించగా, ఆలయ సహాయ కమిషనర్ శ్యామలాదేవి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. ఈయన వెంట రాష్ట్ర కార్మికశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గౌతు శిరీష, ఓఎస్డీ తిరుమలరావు, డీఎస్పీ భార్గవరావునాయుడు, ఆర్డీవో బలివాడ దయానిధిలు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Advertisement