-
ఆరేళ్ల క్రితం ఇల్లు లేదు... ఇప్పుడు మిలియనీర్
కాలిఫోర్నియా: ఆరేళ్ల క్రితం నిలువ నీడలేని అమెరికన్ మహిళ నక్కతోక తొక్కారు. అదృష్టం లాటరీ రూపంలో తలుపు తట్టి రాత్రికి రాత్రి కోట్లకు పడగలెత్తారు. లాటరీలో 50 లక్షల డాలర్లు గెలుచుకున్నానని తెలియగానే ఆమె మొదట నమ్మలేదు. అది నిజమేనని అర్థమయ్యాక ఆమె ఆనందానికి అంతేలేదు. కాలిఫోర్నియాకు చెందిన లూసియా ఫోర్సెథ్ను చాలా కాలంగా ఆర్థిక కష్టాలు వేధిస్తున్నాయి. ఆరేళ్ల క్రితం ఇల్లు కూడా లేదు. కష్టపడి చదివి డిగ్రీ సంపాదించారు. చిన్న ఉద్యోగం వచ్చింది. కారులో ఆయిల్ కొట్టించినప్పుడు చిల్లర లేక అయిష్టంగానే లాటరీ టిక్కెట్ తీసుకున్నారు. దాంతోనే ఆమె ఇంట డాలర్ల వర్షం కురిసింది. ఈ ఏడాది లూసియా పెళ్లి చేసుకోనున్నారు. జీవిత భాగస్వామితో పాటు ఈ లాటరీ టిక్కెట్ తన జీవితాన్నే మార్చేసిందని సంబరపడుతున్నారు. -
Sister Lissy Chakkalakkal: ఈ స్కూల్లో పిల్లలకు ఇళ్లులేకపోతే టీచర్లే ఇళ్లు కట్టిస్తారంట!!
కొందరు టీచర్లు స్టూడెంట్స్ పట్ల దయతో బుక్స్ కొనిస్తారు. బూట్లు కొనిస్తారు. ఫీజులు కడతారు. బట్టలు కుట్టిస్తారు. కాని కేరళలో ఈ టీచర్ కథ వేరు. ఆమె ఏకంగా ఇల్లే కట్టించి ఇస్తుంది. ఇది నిజం. గత 7 సంవత్సరాలలో 150 ఇళ్లు స్టూడెంట్స్కు కట్టి ఇచ్చింది. టీచర్ల విశాలమైన మనసుకు గిన్నెస్ రికార్డు ఉంటే అది ఈమెకే దక్కుతుంది. ఒక టీచర్గా పని చేస్తే ఆ టీచర్కు ఒక సైన్యం తయారవుతుందని ‘సిస్టర్ లిజీ చక్కలకల్’ను చూస్తే అర్థమవుతుంది. కొచ్చిలో ‘అవర్ లేడీస్ గర్ల్స్ స్కూల్’ ప్రిన్సిపాల్గా పని చేస్తున్న ఈ 53 ఏళ్ల నన్ తన విద్యార్థినులపై కురిపిస్తున్న దయ అసామాన్యమైనది. 2012 నుంచి నేటి వరకు ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఆమె తన విద్యార్థినుల కోసం మొత్తం 150 ఇళ్లు కట్టించింది. ప్రభుత్వమో, వ్యవస్థో, సంస్థో చేయాల్సిన పని కేవలం ఒక టీచర్గా ఆమె సాధించింది. ఎలా? ఎందుకు? ఇంటికి వెళ్లి చూడాలి త్రిశూర్లో ఎనిమిది మంది సంతానంలో ఒకదానిగా జన్మించిన లిజీ మిగిలిన తోబుట్టువులందరూ పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అవగా తాను మాత్రం దైవ మార్గంలో మానవ సేవ చేయడానికి అంకితమైంది. కేరళలోని ‘ఫ్రాన్సిస్కన్ మిషనరీస్’లో సభ్యురాలయ్యి తమ మిషనరీ నడిపే స్కూలు ఉపాధ్యాయనిగా పని చేయడం మొదలెట్టింది. కాని టీచర్ పని కేవలం పాఠాలు చెప్పడం కాదు. విదార్థికి సంబంధించిన బాగోగులు కూడా గమనించడం. అందుకే లిజీ స్కూల్ అయ్యాక ‘విద్యార్థుల ఇంటికి వెళ్లి పరిశీలించే’ కార్యక్రమాన్ని స్వీకరించింది. కాని ఆ పరిశీలనలు ఆమెను విపరీతంగా డిస్టర్బ్ చేశాయి. ‘చాలామంది విద్యార్థినులకు అసలు ఇళ్లే లేవు. చాలామంది ఒక్క గది అద్దె ఇళ్లలో ఉంటున్నారు. వయసొచ్చిన అమ్మాయిలకు చాటు లేదు. భద్రత లేదు. వీరికోసం ఏదైనా చేయాలి అనిపించింది’ అంటుంది లిజీ. 2012లో ఒక విద్యార్థిని ఇంటికెళితే ఆ విద్యార్థిని కుటుంబం ఒక పాలిథిన్ షీట్ కప్పుతో ఉన్న గుడిసెలో జీవిస్తున్నట్టు ఆమె గమనించింది. తాగుడు వల్ల తండ్రి చనిపోగా తల్లి పిల్లలను సాకుతోంది. ఆ స్థలం వారిదే అని తెలుసుకుని అక్కడ ఇల్లు కట్టించి ఇవ్వడానికి ఆమె సంకల్పం తీసుకుంది. 2014 నుంచి హౌస్ ఛాలెంజ్ అందరూ మొక్కలు నాటే ఛాలెంజ్, ఐస్ బకెట్ ఛాలెంజ్ లాంటివి చేస్తుంటే లిజీ ‘హౌస్ ఛాలెంజ్’ తీసుకుంది. అవును. ఇల్లు లేని తన విద్యార్థినులకు ఇల్లు కట్టించే ఛాలెంజ్ అది. కాని అందుకు డబ్బు? ఇక్కడే ఆమెకు తన ప్రస్తుత విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఒక సైన్యంగా పనికొచ్చారు. ‘మా స్కూల్లో చదువుకునే విద్యార్థినులు వారానికి ఒకసారి ఒక రూపాయి డొనేట్ చేయాలి. అలాగే పుట్టినరోజులు జరుపుకోకుండా అందుకు అయ్యే ఖర్చును డొనేట్ చేయాలి. ఆ డబ్బును ఇల్లు కట్టేందుకు ఉపయోగిస్తాను. అంతే కాదు... మా పూర్వ విద్యార్థులను సహాయం అడుగుతాను. ఊళ్లోని దాతలను సంప్రదిస్తాను. నా ఉద్దేశంలోని నిజాయితీని అర్థం చేసుకుని అందరూ సాయం చేస్తారు. అంతెందుకు.. నేను ఇల్లు కట్టివ్వమంటే మేస్త్రీలు కూడా తక్కువ కూలి తీసుకుని పని చేస్తారు. అలా ఒక్కో ఇల్లు కట్టుకుంటూ వస్తున్నాను’ అంటుంది లిజీ. అయితే ఆ ఇళ్లు హల్కాడల్కా ఇళ్లు కాదు. కచ్చితమైన మంచి రూపం, నాణ్యత ఉంటాయి. ఒక సెంట్ లేదా రెండు సెంట్ల స్థలంలో 500 చ.అడుగుల నుంచి 600, 700 చదరపు అడుగుల ఇళ్లను ఆమె కట్టి ఇస్తుంది. 5 లక్షల నుంచి 10 లక్షల వరకూ ఒక్కో ఇంటికి వెచ్చిస్తుంది. ఎలా ఎంపిక? సరే. ఒక స్కూల్లో ఎంతో మంది విద్యార్థినులకు సొంత ఇల్లు ఉండదు. మరి సిస్టర్ లిజీ ఎవరికి ప్రాధాన్యం ఇస్తుంది అనంటే దానికి ఆమె ఒక పద్ధతి పెట్టుకుంది. ‘నేను కట్టిచ్చే ఇళ్లు చాలామటుకు వితంతు స్త్రీలకు అయి ఉంటాయి. లేదా భర్త మంచం పట్టి పిల్లలు దివ్యాంగులు అయితే వారికి ప్రాధాన్యం ఇస్తాను. దారుణమైన పేదరికంలో ఉంటే వారికి కట్టి ఇస్తాను. వారి పరిస్థితులు చూడగానే మనకు తెలిసిపోతుంది ఇళ్లు కట్టించి ఇవ్వాలా వద్దా అని’ అంటుందామె. లిజీ కట్టించి ఇచ్చే ఇళ్లలో హాల్, కిచెన్, షాపు పెట్టుకుని బతకాలంటే ఆ ఇంటిలోనే వీధిలోకి ఒక గది ఇలా ప్లాన్ చేసి కట్టి ఇస్తుంది. ‘ఈ దేశంలో ఇల్లు లేని వారే ఉండకూడదు అని నా కోరిక’ అంటుంది సిస్టర్ లిజీ. స్థలాలు కూడా ఇస్తున్నారు సిస్టర్ లిజీ ఇంత వరకూ స్థలాలు ఉండి అక్కడ ఇళ్లు కట్టుకోలేని వారికి ఇల్లు కట్టి ఇచ్చేది. ఇప్పుడు ఆమె ప్రయత్నం చూసి స్థలదాతలు కూడా ముందుకు వస్తున్నారు. ‘మేము భూమి ఇస్తాం. మీరు పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వండి’ అని ఇస్తున్నారు. తాజాగా రంజన్ వర్గీస్ అనే దాత 70 సెంట్ల స్థలం దానం చేస్తే సిస్టర్ లిజీ ఆ స్థలంలో 12 ఇళ్లు కట్టించి తన పేద విద్యార్థినులకు ఇచ్చింది. సొంత ఇంటిలో అడుగుపెట్టేటప్పుడు ఆ కుటుంబాల కళ్లల్లో కనిపించే ఆనందం వర్ణనకు అతీతం. ఆ విద్యార్థినులు సిస్టర్ లిజీని సాక్షాత్తు దైవదూతలా చూస్తారు. ఇంతకాలం గురుదక్షిణ గురించి విన్నాం. కాని సిస్టర్ లిజీ సేవ చూస్తే గురుదక్షిణ అనేది చిన్నమాట అనిపిస్తుంది. ఇలాంటి గురువులకు ఎటువంటి దక్షిణ ఇవ్వలేం. కాని ఈ స్ఫూర్తిని కొనసాగించి చేయగలిగిన శక్తి వచ్చినప్పుడు ఇలా లేని వారికి గూడు ఏర్పాటు చేయడమే అసలైన గురుదక్షిణగా భావిస్తే లిజీ ఆశించినట్టు ఇళ్లు లేనివారే ఉండని రోజు తప్పక వస్తుంది. చదవండి: Zinc Rich Diet: వీటిలో జింక్ పుష్కలంగా ఉంటుంది.. ఇవి తింటే! -
అమ్మమ్మ లాంటి ప్రభుత్వం ఉండాలి
ఒడిశా: తండ్రి చనిపోతాడు. తల్లి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది. వాళ్లు ఐ.ఏ.ఎస్.లు, ఐ.పి.ఎస్.లు అవుతారు. (లేదా) తల్లి చనిపోతుంది. తండ్రి పిల్లల్ని వదిలేసి వెళ్లిపోతాడు. వాళ్లను అమ్మమ్మ చేరదీస్తుంది. చాలావరకు ఇలాగే జరుగుతుంది. తండ్రికి పిల్లలెందుకు పట్టరో తల్లిని తీసుకెళ్లిన ఆ దేవుడికే తెలియాలి. మూడేళ్ల క్రితం తల్లి చనిపోయి, తండ్రి వదిలేసి పోతే విమలమ్మే ఇద్దరు మనవరాళ్లను (8 ఏళ్లు, 4 ఏళ్లు) మనవడిని (6 ఏళ్లు) సాకుతోంది. ఏ ప్రభుత్వ రికార్డులలో లేని ఈ కుటుంబం ఒడిశాలోని అంగుల్ జిల్లా, కిషోర్ నగర్ తాలూకా, బైసాన గ్రామంలో ఉంది. మొన్నటి వరకు మట్టి గుడిసెలో ఉండేవారు. వర్షాలకు అది మెత్తబడి, కూలిపోవడంతో గ్రామ శివారులో కొత్తగా కట్టిన స్వచ్ఛ భారత్ మరుగుదొడ్డిలో తల దాచుకుంటున్నారు. తలే దాచుకుంటున్నారు. చదవండి: (ఈ చిన్నారులకు దిక్కెవరూ...! ) వంట, స్నానాలు ఆరు బయట. ఆ నలుగురే ఒకరికొకరు నా అన్న వాళ్లు. పిల్లల్ని ఇంట్లో వదిలేసి ఏ రోజుకారోజు పని వెతుక్కోడానికి వెళ్లొస్తుంటుంది విమలమ్మ. వయసు మీద పడి ఇప్పుడు ఏ పనీ చేయలేకపోతోంది. ఆ కష్టాలను ఊహించుకోవలసిందే. పై నుంచి తల్లి తన తల్లిని, బిడ్డల్ని చూసిందో ఏమో, ఆమే పంపినట్లుగా ఒక సామాజిక కార్యకర్త వాళ్లను చూశాడు. పంచాయితీ ఆఫీసులో తాత్కాలికంగా గూడు ఏర్పాటు చేయించాడు. ఆ నలుగురు పొట్టల్ని నింపడానికి ప్రభుత్వం దగ్గర బియ్యం, పప్పులు ఉప్పులు ఉన్నాయి. ఆమెకు పింఛను ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి. పిల్లల్ని చేర్చడానికి బడులు ఉన్నాయి. నివాసం ఉంచేందుకు షెల్టర్లు ఉన్నాయి. ప్రభుత్వం దగ్గర ఇన్ని ఉన్నా, తీసుకోడానికి వీళ్ల దగ్గర పౌరులుగా ఏ గుర్తింపూ లేదు. కనీసం ఆధార్ కార్డు లేదు. అవన్నీ వచ్చేవరకు పంచాయితీ కార్యాలయం లో ఉండేందుకైతే అనుమతి వచ్చింది. అక్కడికే సంతోషంగా ఉంది విమలమ్మ. విమలా ప్రధాన్ పూర్తి పేరు. పిల్లలకు ఇవేమీ తెలియదు. తల్లి లేకపోవడం పేదరికం. అమ్మమ్మ దగ్గర ఉండటం రాజరికం. పేదలందరికీ అమ్మమ్మ లాంటి ప్రభుత్వం ఉండాలి. వారిని ప్రభుత్వం దగ్గరకు చేర్చేందుకు అమ్మ లాంటి యాక్టివిస్ట్ లు ఉండాలి. -
వరద విషాదం..43 మంది మృతి
న్యూఢిల్లీ/బెంగళూరు/తిరువనంతపురం/సాక్షి, ముంబై/ పింప్రి: కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్నాయి. మహారాష్ట్రలో వరదల కారణంగా 27 మంది మరణించారు. ముఖ్యంగా సాంగ్లీ జిల్లాలోని పలుస్ తాలూకాలో వరద బాధితులతో వెళ్తున్న బోటు బోల్తా పడటంతో 9 మంది మృత్యువాత పడ్డారు. కర్ణాటకలో 9 మంది, కేరళలో నలుగురు, తమిళనాడులోని కోయంబత్తూరులో ఇద్దరు, ఒడిశాలో ఒకరు వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడు చరిత్రలోనే అత్యధికంగా నీలగిరి జిల్లా అవలాంచి అడవుల్లో 82 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. వివిధ రాష్ట్రాల్లో వరదల్లో చిక్కుకున్న లక్షలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇళ్లు నేలమట్టం కావడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వానలు, వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్డు, రైల్వే రవాణా స్తంభించింది. వరద బాధిత రాష్ట్రాల్లో సహాయక చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ నేత రాహుల్ పిలుపునిచ్చారు. ఐదు జిల్లాల్లో అత్యధిక ప్రభావం మహారాష్ట్రలోని పుణే, సతారా సాంగ్లీ, కొల్హాపూర్, షోలాపూర్ జిల్లాల్లో వరదల కారణంగా ఇప్పటి వరకు 27 మంది మరణించినట్టు పుణే డివిజన్ కమిషనర్ దీపక్ మైసేకర్ తెలిపారు. ముఖ్యంగా సాంగ్లీ పలుస్ తాలుకాలో కృష్ణా, యేర్లా నదీ సంగమంలో వరద తీవ్రతకు పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గురువారం ఉదయం పలుస్ గ్రామస్తులను తరలిస్తున్న బోటు బోల్తా పడింది. దీంతో 14 మంది గల్లంతు కాగా 15 మంది సురక్షితంగా బయటపడ్డారు. సహాయక సిబ్బంది 9 మృతదేహాలను వెలికితీశారు. సాంగ్లీ జిల్లా జైలు వరద నీటిలో చిక్కుకుంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆ ప్రాంతానికి విమానంలో వెళ్లి రక్షణ, సహాయక చర్యలను పర్యవేక్షించారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో ఫోన్లో మాట్లాడారు. సాంగ్లీలో పరిస్ధితిని అదుపులోకి తెచ్చేందుకు ఆల్మట్టి డ్యాం నుంచి 5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కోరారు. వరదల కారణంగా కొల్హాపూర్–మిరజ్ మార్గంలో రైళ్లను రద్దు చేశారు. పుణే–బెంగళూర్ జాతీయ రహదారి దెబ్బతినడంతో పుణే–షోలాపూర్ రహదారి మీదుగా వాహనాలను మళ్లించారు. సాయం అందించండి: యడియూరప్ప కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు 9 మంది చనిపోగా 43 వేల మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యమంత్రి యడియూరప్ప బెళగావిలో మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు రూ.5వేల కోట్లు అవసరమవుతాయని, దాతలు ముందుకు రావాలని సీఎం విజ్ఞప్తి చేశారు. సీఎం సహాయ నిధికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్ సుధామూర్తి రూ.10 కోట్లు అందజేయనున్నట్లు ప్రకటించారు. కేరళలోని ఇడుక్కి జిల్లాలో భారీ వర్షాలు, కొండచెరియాలు విరిగిపడటంతో ఏడాది చిన్నారి సహా నలుగురు మృతి చెందారు. -
చిన్నారులకు కేటీఆర్ సాయం
సాక్షి, హైదరాబాద్: సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉండే తెలంగాణ అపద్ధర్మ మంత్రి కేటీఆర్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలపై వేగంగా స్పందించే కేటీఆర్.. గతంలో పలువురికి సాయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కష్టాల్లో ఉన్న చిన్నారులకు తనవంతు సాయం అందించడానికి ముందుకొచ్చారు. వివరాల్లోకి వెళ్తే హెల్పింగ్ హ్యాండ్స్ హ్యూమానిటీ పేరుతో ఓ వ్యక్తి నిరాశ్రయులైన చిన్నారులను చేరదీసి వారికి అండగా నిలబడ్డాడు. చాలా కాలంగా పిల్లల బాగోగులు చూసుకుంటున్న ఆ వ్యక్తికి ఇటీవల కాలంలో నిధుల కొరత తలెత్తడంతో వారి పోషణ భారంగా మారింది. దీంతో ఆ పిల్లలు రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యలను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేశారు. అయితే ఆ పోస్టు చూసిన కేటీఆర్ స్పందించారు. ఆ పిల్లలకు తన వ్యక్తిగతంగా 10 లక్షల రూపాయలు అందజేయనున్నట్టు ప్రకటించారు. అలాగే ఆ మొత్తానికి సంబంధించిన చెక్ను ఎవరికి అందజేయాలో తెలుపాల్సిందిగా ఆ నెటిజన్ను కోరారు. దీంతో ఆ నెటిజన్ వారి వివరాలను కేటీఆర్కు పంపించారు. I’ll contribute 10 lakhs in personal capacity. Who & where do I send the cheque to? https://t.co/t5bNu3GFKk — KTR (@KTRTRS) 6 November 2018
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement