-
ఏపీలో అమెరికా పూల సోయగాలు
సాక్షి, అమరావతి: లిసియాంతస్.. ఉత్తర అమెరికా ప్రాంతానికి చెందిన ఈ పువ్వులు గులాబీలను పోలి ఉండే కట్ ఫ్లవర్స్. విభిన్న రంగుల్లో ఉండే ఇవి మైదాన, కొండ ప్రాంతాల్లోనే కాదు ఇంటి ఆవరణలో పూలకుండీల్లోనూ పెంచుకునేందుకు అనువైనవి. బొకేలు, అలంకరణకు ఉపయోగించే ఈ పూలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. వీటిని ఏపీలోనూ సాగు చేసేవిధంగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు ఫలించాయి. దేశంలోని బెంగళూరు పరిసర ప్రాంతాల్లో కొద్దిపాటి విస్తీర్ణంలో లిసియాంతస్ పూల ను సాగు చేస్తున్నారు. వీటి సాగుకు ఆంధ్రప్రదేశ్లోనూ అనువైన వాతావరణం ఉన్నట్టు వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు గుర్తించారు. అల్లూరి జిల్లాలోని చింతపల్లి ఉద్యాన పరిశోధన కేంద్రంలోని పాలీహౌస్లో 6 రకాల లిసియాంతస్పై పరిశోధనలు జరిపారు. పింక్, ఆకుపచ్చ, పసుపు, తెలుపు, నీలం, పికోటీ, చాంపేన్ రకాలను ప్రయోగాత్మకంగా సాగు చేశారు. శీతాకాలంలో మైదాన ప్రాంతాల్లోను, కొండ ప్రా ంతాల్లో వేసవి కాలంలోనూ వీటిని సాగు చేయవచ్చని గుర్తించారు. ఇండోర్ డెకరేషన్కు ఉప యోగించే ఈ పూలు కనీసం ఐదారు రోజుల పాటు తాజాదనం కోల్పోకుండా ఉంటున్నాయి. అలంకరణ కోసం ఉపయోగించే ఈ పూలకు యూరోప్, చైనా, ఇంగ్లాండ్, వియత్నాం, మలేíÙ యా, జపాన్ దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. రూ.40 లక్షల ఆదాయం వీటి పంట కాలం నాలుగు నెలలు. నర్సరీల్లో 70 నుంచి 75 రోజులు ఉంచాలి. నాటిన 60 రోజులకు పుష్పిస్తాయి. ఒక మొక్క మూడు కొమ్ములతో ఉంటుంది. కాండానికి 9 నుంచి 12 పువ్వులు వస్తాయి. సీజన్ బట్టి ఒక్కొక్క పువ్వు రూ.20 నుంచి రూ.35 వరకు పలుకుతుంది. రూ.24 లక్షల వరకు పెట్టుబడి పెడితే.. రూ.40 లక్షల వరకు ఆదాయం వస్తుంది. పెట్టుబడి పోనూ రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల నికర ఆదాయం పొందొచ్చు. మన ప్రాంతానికి రోసిట 3 బ్లూ పికోటీ వెరైటీ–2, ఎక్స్ కాలిబూర్ 3 బ్లూ పికోటీ, రోసిట 4 ప్యూర్ వైట్, రోసిట 3 పింక్ పికోటీ, రోసిట 4 గ్రీన్ రకాలు అనుకూలమని తేల్చారు. -
ఆంధ్ర ‘అమృతపాణి’కి పునర్జీవం
సాక్షి, అమరావతి: దాదాపు మూడు దశాబ్దాల క్రితం కనుమరుగైపోయిన ఆంధ్ర ‘అమృతపాణి’ డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్శిటీ శాస్త్రవేత్తల విశేష కృషి వల్ల మళ్లీ జీవం పోసుకుంటున్నది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన, పురాతనమైన ఈ అరటి రకం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే ప్రత్యేకమైంది. ఒకప్పుడు గోదావరి జిల్లాలతో పాటు ప్రతీ ఇంటి పెరట్లో విస్తృతంగా సాగయ్యేది. అలాంటి ఈ అరుదైన రకం ప్రస్తుతం అంతరించిపోయిన అరటి రకాల జాబితాలో చేరింది. 1950–60 దశకంలో ‘పనామా’ తెగులు ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా సాగులో ఉన్న ‘గ్రాస్ మైఖెల్’తో పాటు మన దేశానికి చెందిన నాన్జనుడ్ రసబలి, రస్తాలి, శబరి, అమృతపాణి వంటి రకాలు కనుమరుగైపోయాయి. పునరుత్పత్తి కోసం విస్తృత పరిశోధనలు.. అంతరించిపోయిన ఆంధ్ర అమృతపాణి రకాన్ని పునరుత్పత్తి చేయాలన్న సంకల్పంతో ఉద్యాన వర్శిటీ గత కొన్నేళ్లుగా విస్తృత పరిశోధనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వర్సిటీకి అనుబంధంగా ఉన్న కొవ్వూరు ఉద్యాన పరిశోధనా శాస్త్రవేత్తల బృందం రెండేళ్ల క్రితం మారేడుమిల్లి మండలం కొండవాడ గ్రామంలో అరగటి సుబ్బారెడ్డి అనే గిరిజన రైతు ఇంటి పెరట్లో ఉన్న అరటి మొక్కలను చూసి ఆశ్చర్యపోయారు. మొక్కల కాండం, ఆకులు, గెల, కాయల లక్షణాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు దేశవాళి అమృతపాణి రకంగా గుర్తించారు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 300 అడుగులు ఎత్తులో ఉండడంతో ఎలాంటి పోషక, కలుపు యాజమాన్య పద్ధతులు చేపట్టకపోయినా ఎలాంటి తెగుళ్లు సోకకుండా మొక్కలు ఆరోగ్యకరంగా ఉన్నట్లు గుర్తించారు. అక్కడ నుంచి సేకరించిన మొక్కల నుంచి ఇప్పటి వరకు 3వేల టిష్యూ కల్చర్ దేశవాళి అమృత పాణి రకం మొక్కలను అభివృద్ధి చేశారు. గిరిజన ప్రాంతం అనుకూలం దేశవాళి అమృతపాణి సాగుకు గిరిజన ప్రాంతం అనువైనదిగా గుర్తించారు. ఎత్తయిన గిరిజన ప్రాంతాలు కావడంతో పాటు దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఈ నేలలో సేంద్రీయ కర్బనం అధికంగా ఉండడం వలన మొక్కలకు అవసరమైన అన్ని రకాలైన పోషక పదార్థాలు అందుతున్నాయని గుర్తించారు. పైగా వాణిజ్యపరంగా, ఇతర ఉద్యానపంటలతో కలిపి సాగు చేయకపోవడం వలన ఈ నేలల్లో తెగుళ్లను కలిగించే శిలీంధ్రాల ఉనికి లేదని గుర్తించారు. గిరిజన రైతులకు పంపిణీ అల్లూరి సీతారామరాజు జిల్లా పెదగెద్దాడ పంచాయతీ పరిధిలో వెయ్యి టిష్యూ కల్చర్ అమృతపాణి మొక్కలను వంద మంది గిరిజన రైతులకు ఇటీవలే ఉద్యాన వర్శిటీ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఎస్టీ సబ్ ప్లాన్ కింద మరో 2వేల మొక్కలను జూన్లో పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. అమృతపాణికి ఎన్నో ప్రత్యేకతలు ఆంధ్రప్రదేశ్కు మాత్రమే ప్రత్యేకమైన ఈ రకానికి వాణిజ్యపరంగా మంచి డిమాండ్ ఉంది. ఇతర రాష్ట్రాలలోని రస్తాలి, రసబలె, రసకేళి, మల్ఫోగ్, సాప్కాల్, మార్టమాన్, దూద్ సాగర్ వంటి రకాల లక్షణాలను పోలి ఉంటుంది. 11–12 నెలల కాలపరిమితితో 2.5–3 మీటర్లు ఎత్తు వరకు పెరుగుతూ సగటున 15–18 కిలోల బరువైన గెలలు వేస్తుంది. కాయలు లేత దశలో పసుపు ఆకుపచ్చ రంగులో, పక్వదశలో లేత పసుపువర్ణం నుండి బంగారు వర్ణంలోకి మారతాయి. పలుచని తొక్కతో ప్రత్యేకమైన రుచి, సువాసన కలిగి ఉంటాయి. పక్వ దశలో పండ్లు గెల నుంచి రాలిపోయే లక్షణం ఉండడంతో దూర ప్రాంత రవాణాకు అనుకూలం కాదు. గిరిజనులకు అదనపు ఆదాయ వనరు అరుదైన ఈ జన్యురకాన్ని పరిరక్షించడం, విస్తృతంగా సాగులోకి తీసుకురావడం లక్ష్యంగా విస్తృత పరిశోధనలు చేస్తున్నాం. వీటి సాగుకు అనువైన గిరిజన ప్రాంతంలో ఈ రకం సాగును ప్రోత్సహించాలని సంకల్పించాం. గిరిజనులకు మంచి పోషకాహారంగానే కాకుండా అదనపు ఆదాయ వనరుగా ఉపయోగపడుతుంది. – టి.జానకీరామ్, వీసీ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ కణజాల ప్రవర్ధన పద్ధతిలో పునరుత్పత్తి అంతరించిపోయిన ఈ అరుదైన రకాన్ని పరిరక్షిస్తున్న గిరిజన రైతు సుబ్బారెడ్డిని ముందుగా అభినందించాలి. దాదాపు ఐదారు దశాబ్దాల నుంచి పెంచుకుంటూ వాటిని పరిరక్షిస్తుండడం వలనే ఈ మొక్కల నుంచి పునరుత్పత్తి చేయగలిగే అవకాశం మనకు దక్కింది. ఈ మొక్కల నుంచి సేకరించిన మగపువ్వులలోని లేత హస్తాలను కణజాల ప్రవర్ధన పద్ధతిలో దశల వారీగా ప్రవర్ధనం చేసి ఎలాంటి తెగుళ్లు సోకని మొక్కలను పునరుత్పత్తి చేశాం. – డాక్టర్ కె.రవీంద్రకుమార్, సీనియర్ సైంటిస్ట్, ఉద్యాన పరిశోధనా కేంద్రం, కొవ్వూరు -
వ్యవసాయ వర్సిటీపై ఆశలు..!
నంద్యాల: కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన వ్యవసాయ యూనివర్సిటీ నంద్యాలలో ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. వందేళ్ల చరిత్ర కలిగిన వ్యవసాయ పరిశోధనాకేంద్రం (ఆర్ఏఆర్ఎస్) ఇక్కడ ఉంది. అలాగే అత్యున్నత ప్రమాణాలు కలిగిన విత్తనాలు కూడా ఇక్కడే తయారవుతున్నాయి. వ్యవసాయ కళాశాల, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, ఉద్యానవన పరిశోధనాకేంద్రాలు ఉన్నాయి. సీడ్ ధ్రువీకరణ కేంద్రంతో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఘనీకృత వీర్యకేంద్రం తదితర సంస్థలు కూడా కొనసాగుతున్నాయి. వ్యవసాయపరంగా అన్ని రకాల విత్తనాలు తయారయ్యే నంద్యాల పట్టణంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన హంగులు ఉన్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శతాబ్దకాలంగా పరిశోధనలు..: దాదాపు 100ఎకరాల విస్తీర్ణంలో పరిశోధనాకేంద్రాన్ని 1906లో ఏర్పాటు చేశారు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఇలాంటి వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు దేశంలో చాలా తక్కువ అని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ప్రస్తుతం అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని 117 మండలాల రైతులకు ఇక్కడి శాస్త్రవేత్తలు సలహాలు అందిస్తున్నారు. నంద్యాలలో ఏటా 675 మి.మీ వర్షపాతం నమోదవుతోంది. పరిశోధనలకు ఈ వర్షపాతం అనువుగా ఉంటోంది. ఈ పరిశోధనా కేంద్రం పరిధిలో అనంతపురం జిల్లాలోని కదిరి, రెడ్డిపల్లి, అనంతపురం పట్టణాల్లో పరిశోధనలు కొనసాగుతున్నాయి. మడకశిర, రెడ్డిపల్లె, నంద్యాలలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు మరో నాలుగు కృషి విజ్ఞాన కేంద్రాలు నడుస్తున్నాయి. పరిశోధనా కేంద్రంలో కేసీకెనాల్కు సంబంధించి ప్రత్యేక కాల్వ కూడా ఉండటంతో నీటి సమస్య తలెత్తే ప్రసక్తే ఉండదు. నంద్యాలకు 60కి.మీ దూరంలో1400 ఎకరాల తంగడంచె ఫారం ఉండటంతో స్థల సమస్య ఉండబోదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement