-
ఓటీటీలో గోపీచంద్ 'భీమా'.. రిలీజ్ ఆ రోజేనా..?
భారీ అంచనాలతో విడుదలైన గోపీచంద్ 'భీమా' సినిమా విడుదలైన తొలిరోజే బాక్సాఫీస్ వద్ద డివైడ్ టాక్ తెచ్చుకుంది. దంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్దమైనట్లు ప్రచారం జరుగుతుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని ఎ.హర్హ డైరెక్ట్ చేశారు. ఇందులో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ కథానాయికలు. ఇందులో గోపీచంద్ పోలీసు పాత్రలో మరోసారి తన అభిమానులను మెప్పించారు. మార్చి 8న థియేటర్లలో విడుదలైన భీమా డిజిటల్ రైట్స్ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 5 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. టెంపుల్ బ్యాక్డ్రాప్లో కథ ప్రారంభం కావాడంతో సినిమా సూపర్ హిట్ అనుకున్నారు. కానీ తర్వాత ఔట్డేటెడ్ స్టోరీతో కథను నడిపించడం వల్ల సినిమాకు పెద్ద మైనస్ అయిందని ఆడియన్స్ చెప్పుకొచ్చారు. భీమా తర్వాత దర్శకుడు శ్రీనువైట్లతో గోపీచంద్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాకు విశ్వం అనే పేరును ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్ రాధాకృష్ణ కాంబోలో కూడా గోపీచంద్ మరో ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. జిల్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. -
అంబానీ ‘కొత్త’ అడుగు.. ఒకే దెబ్బకు మూడు పిట్టలు!
ముఖేష్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏ రంగంలోకి అడుగుపెట్టినా అనూహ్యమైన అడుగులతో ప్రత్యర్థి కంపెనీలకు చెక్ పెడుతుంది. టెలికం రంగంలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే రిలయన్స్ జియో అగ్రగామిగా ఎదిగింది. ఇప్పుడు అదే జియో ఓటీటీ రంగంలోనూ టాప్ కంపెనీగా ఎదిగేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ప్రస్తుతం రిలయన్స్ జియో వాల్ట్ డిస్నీని కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం.. ఈ ఒప్పంద ప్రక్రియ వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశంలో డిస్నీ హాట్స్టార్ మీడియా కార్యకలాపాలు రిలయన్స్కు దక్కుతాయి. ఈ డీల్ తర్వాత, ఉమ్మడి సంస్థలో రిలయన్స్ 51 శాతం, డిస్నీ హాట్స్టార్ 49 శాతం వాటాను కలిగి ఉంటాయి. ప్రత్యక్ష పోటీకి చెక్! జియోకు చెందిన ఓటీటీ ప్లాట్ఫామ్ జియో సినిమా.. డిస్నీ ప్లస్ హాట్స్టార్ నుంచి ప్రత్యక్ష పోటీని ఎదుర్కొంటోంది. మొదట జియో సినిమా.. డిస్నీ హాట్స్టార్ నుంచి ఐపీఎల్ హక్కులను దక్కించుకుంది. ఆ తర్వాత డిస్నీ హాట్స్టార్.. జియో సినిమా నుంచి ఆసియా కప్, క్రికెట్ ప్రపంచ కప్ హక్కులను చేజిక్కించుకుంది. ఇప్పుడు జియో ఏకంగా డిస్నీ హాట్స్టార్నే కొనుగోలు చేస్తోంది. జియో సినిమాతో పోటీలో ఈ కంపెనీ గణనీయమైన నష్టాలను చవిచూడటం గమనార్హం. ఐపీఎల్, ఫిఫా ప్రపంచ కప్ తర్వాత, హాట్స్టార్ సబ్స్క్రైబర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆ రెండింటిలో టెన్షన్.. ఈ ఒప్పందం తర్వాత, జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్స్టార్ విలీనం కానున్నాయి. అంటే రెండు యాప్ల కంటెంట్ను ఒకే యాప్లో యాక్సెస్ చేయవచ్చు. ఇప్పటికే ఉన్న డిస్నీ ప్లస్ హాట్స్టార్ కస్టమర్లు జియో సినిమాకి మారతారు. ఈ పరిణామాలు ప్రముఖ ఓటీటీలైన నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్లలో టెన్షన్ను కలిగిస్తున్నాయి. ఎందుకంటే జియో సినిమా సరసమైన ప్లాన్లను అందించవచ్చు. టెలికాం, ఓటీటీ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని జియో రీఛార్జ్తో చవకైన యాడ్-ఆన్ ప్లాన్లను ప్రవేశపెట్టవచ్చు. అంటే ఒకే దెబ్బకు ముడు పిట్టలు అన్నమాట! ఇదీ చదవండి: ఈ విషయంలో అంబానీ కంపెనీ తర్వాతే ఏదైనా..! -
‘ఆసియా’ పోరుకు రంగం సిద్దం
ముల్తాన్: ప్రపంచ కప్ పోరుకు ముందు మరో ప్రధాన టోర్నీకి రంగం సిద్ధమైంది. నేటినుంచి జరిగే ప్రతిష్టాత్మక ఆసియా కప్ సమరంలో ఆరు జట్లు తమ సత్తాను పరీక్షించుకోనున్నాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు వరల్డ్ కప్కు ముందు ఇది ట్రయల్గా ఉపయోగపడనుండగా... వరల్డ్ కప్ బరిలో లేని నేపాల్ ఆరో టీమ్గా తన ఉనికిని ప్రదర్శించే ప్రయత్నం చేయ నుంది. అన్నీ జట్లూ సహజంగానే టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతుండగా... ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే సమరాలు అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి. కనీసం రెండు సార్లు ఇరు జట్లు తలపడే అవకాశం ఉండగా, ఫైనల్ చేరితే మరోసారి దాయాదుల మధ్య పోరును చూడవచ్చు. నేడు సొంతగడ్డపై జరిగే టోర్నీ తొలి మ్యాచ్లో బాబర్ ఆజమ్ నాయకత్వంలోని పాకిస్తాన్ జట్టు రోహిత్ కుమార్ సారథ్యంలోని నేపాల్తో తలపడుతుంది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న కొలంబోలో జరుగుతుంది. ఆరు జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచే రెండేసి జట్లు ముందంజ వేస్తాయి. సూపర్–4 దశలో మిగిలిన మూడు టీమ్లను ఎదుర్కొన్న తర్వాత టాప్–2 టీమ్లు ఫైనల్లో తలపడతాయి. ఫేవరెట్గా రోహిత్ బృందం... ఏడాది క్రితం కూడా యూఏఈలో ఆసియా కప్ జరగ్గా అప్పుడు రాబోయే వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని టి20 ఫార్మాట్లో నిర్వహించారు. ఇప్పుడు వన్డే వరల్డ్ కప్కు సరిగ్గా నెల రోజుల ముందు వన్డే ఫార్మాట్లో ఈ టోర్నమెంట్ జరగబోతోంది. అన్ని రకాలుగా పటిష్టంగా ఉన్న భారత్ సహజంగానే ఫేవరెట్గా కనిపిస్తుండగా... వరల్డ్ నంబర్వన్ ర్యాంక్ హోదాలో పాకిస్తాన్ బరిలోకి దిగుతోంది. భారత్ తమ తొలి మ్యాచ్ను సెప్టెంబర్ 2న క్యాండీలో పాకిస్తాన్ జట్టుతో ఆడుతుంది. అనంతరం సెప్టెంబర్ 4న నేపాల్తో రెండో మ్యాచ్లో తలపడుతుంది. భారత జట్టు ఇటీవల ప్రదర్శన, వ్యక్తిగతంగా ఆటగాళ్ల రికార్డులు, టీమ్ కూర్పును బట్టి చూస్తే భారత్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా గట్టి పోటీనిచ్చే స్థితిలో ఉండగా, అఫ్గానిస్తాన్ కూడా సంచలనాలు ఆశిస్తోంది. అధికారికంగా ఆసియా కప్ నిర్వహణ హక్కులు పాకిస్తాన్ బోర్డుకే ఉన్నాయి. అయితే పాకిస్తాన్కు వెళ్లేందుకు భారత్ అంగీకరించకపోవడంతో హైబ్రీడ్ మోడల్లో టోర్నీని నిర్వహిస్తున్నారు. మొత్తం 13 మ్యాచ్లలో 4 మాత్రమే పాకిస్తాన్లో జరుగుతుండగా, శ్రీలంక 9 మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. శ్రీలంకలో జరిగే మ్యాచ్లకు వాన కొంత అంతరాయం కలిగించే అవకాశం ఉంది. -
భారత్, పాకిస్తాన్ మ్యాచ్కు ఫుల్ డిమాండ్.. 10 సెకన్లకు 30 లక్షలు!
భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023ను క్యాష్ చేసుకోనేందుకు అధికారిక బ్రాడ్ కాస్టర్ డిస్నీస్టార్ సిద్దమైంది. ఐపీఎల్ 2023 హక్కులు కోల్పోయి నష్టాలు చవిచూసిన హాట్స్టార్.. వాటిని పూడ్చే పనిలో పడింది. ఆక్టోబర్ 5 నుంచి జరగనున్న ఈ మెగా ఈవెంట్ను డిస్నీస్టార్ మీడియా ప్లాట్ ఫామ్స్ స్టార్స్పోర్ట్స్, డిస్నీ హాట్స్టార్ ప్రసారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మెగా టోర్నీ అడ్వర్టైజమెంట్స్కు సంబంధించిన రేట్ కార్డ్ను డిస్నీ హాట్స్టార్ ప్రకటించిందని ఎక్స్ఛేంజ్4మీడియా పేర్కొంది. అయితే వన్డే ప్రపంచకప్ 2023లోని మ్యాచ్లు అన్నింటిని ఉచితంగా అందిస్తామని ప్రకటించిన హాట్స్టార్.. అడ్వర్టైజ్మెంట్ రేట్స్ను మాత్రం భారీగా పెంచేసింది. ఈ నేపథ్యంలో మెగా టోర్నీలో కోప్రజెంటర్స్ అడ్వర్టైజింగ్ స్లాట్ ఫీజు రూ. 150 కోట్లుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదే విధంగా అసోసియేట్ స్పాన్సర్స్ స్లాట్ ఫీజు రూ. 88 కోట్లుగా ఉంచిందని సమాచారం. పవర్డ్ బై స్పాన్సర్ కావాలనుకునే బ్రాండ్లు రూ. 75 కోట్లు చెల్లించాలి. అదేవిధంగా ఆసోసియేట్ స్పాన్సర్షిప్ను ఎంచుకునే వారు మాత్రం రూ. 40 కోట్ల బడ్జెట్ను అందించాల్సి ఉంటుంది. భారత్-పాక్ మ్యాచ్కు ప్రత్యేక ధర.. ఇక ప్రపంచక్రికెట్లో అత్యంత క్రేజ్ ఉన్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్కు రేట్లను ప్రత్యేకంగా హాట్స్టార్ నిర్ణయించింది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో 10 సెకన్ల యాడ్ కు రూ. 30 లక్షల ధర ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఓవరాల్గా ఈ ప్రపంచకప్ ద్వారా మొత్తం 1000 కోట్లను ఆర్జించాలని డిస్నీ హాట్స్టార్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఆక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. చదవండి: IND vs WI: వెస్టిండీస్తో తొలి వన్డే.. టీమిండియా క్రికెటర్ రీఎంట్రీ! 9 ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్ -
ఈ ఇయర్ సెకండాఫ్ నాకు బాగుంది
‘బటర్ ఫ్లై’ సినిమాలో చేసిన గీత క్యారెక్టర్ నాకు సవాల్ అనిపించింది. ఈ పాత్ర చాలా ఎమోషనల్గా ఉంటుంది’’ అని అనుపమా పరమేశ్వరన్ అన్నారు. ఘంటా సతీష్ బాబు దర్శకత్వంలో అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘బటర్ ఫ్లై’. భూమికా చావ్లా, రావు రమేష్, నిహాల్ కోధాటి కీలక పాత్రల్లో రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువల్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి నిర్మించారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ నెల 29న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అనుపమా పరమేశ్వరన్ మాట్లాడుతూ – ‘‘ఈ ఇయర్ సెకండాఫ్ నాకు చాలా బాగుంది. నేను హీరోయిన్గా నటించిన ‘కార్తికేయ 2, 18 పేజెస్’ హిట్టయ్యాయి. ఇప్పుడు ‘బటర్ ఫ్లై’ రిలీజ్ అవుతోంది’’ అన్నారు. ఘంటా సతీష్ బాబు, ప్రసాద్ తిరువళ్లూరి, నిహాల్, సంగీత దర్శకుడు అర్విజ్ తదితరులు మాట్లాడారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా
Summer 202: కీరదోసను తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ
జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం
చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు
చంద్రబాబు వల్గర్ కామెంట్స్ పై ఎన్నికల కమిషన్ సీరియస్
ఏపీ పరిశ్రమలపై ఈనాడు విషం.. అసలు విషయం ఇదే!
రఘరామలీలలు కన్నెత్తి చూడరు.. పట్టించుకోరు
చంద్రబాబుపై బీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు
పచ్చ బ్యాచ్.. నీతిమాలిన రాజకీయాలు
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement