-
బిర్యానీ బాలేదన్న యువకులపై హోటల్ సిబ్బంది దాడి
సాక్షి, హైదరాబాద్: స్నేహితుడితో కలిసి బిర్యానీ తినేందుకు వెళ్లగా హోటల్ సిబ్బంది చితకబాదిన సంఘటన హైదరాబాద్లోని మైలార్దేవ్పల్లిలో చోటుచేసుకుంది. మటన్ బిర్యానీ బాగా లేదని చెప్పడంతో మొదలైన వాగ్వాదం పరస్పరం దాడి చేసుకునే స్థాయికి చేరుకుంది. మైలార్దేవ్పల్లి ప్రాంతంలోని దుర్గానగర్లో ఉన్న మెఫిల్ హోటల్కు ఇద్దరు స్నేహితులు వచ్చారు. మటన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చి తింటుండగా రుచీ, నాణ్యత లేదని గుర్తించి హోటల్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దీంతో వాగ్వాదం మొదలు కాగా ఆగ్రహంతో హోటల్ సిబ్బంది ఆ ఇద్దరు యువకులపై దాడికి పాల్పడ్డారు. హోటల్ సిబ్బంది దాడిలో ఒకరు తీవ్ర గాయాలయ్యాయి. లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా యథాతథంగా మెఫిల్ విక్రయాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కర్ఫ్యూ సమయంలో రహాస్యంగా బిర్యానీ విక్రయిస్తున్న హోటల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ హోటల్పై గతంలో నాణ్యత లేని ఆహారం అందించడంతో భోజనప్రియులు ఆందోళన చేశారు. -
బిల్లు కట్టమంటే.. చితక్కొట్టిన పూజామిశ్రా
మీరు ఏదైనా దుకాణానికి వెళ్లి, అక్కడ ఏమైనా కొంటే ఏం చేస్తారు... దానికి బిల్లు కడతారు. అదే హోటల్కు వెళ్లి రెండు మూడు రోజులు అక్కడ బస చేస్తే, అద్దె చెల్లిస్తారు. కానీ, ప్రముఖ మోడల్, బిగ్బాస్ 5లో పాల్గొన్న పూజామిశ్రా మాత్రం అలా చేయదు. ఇంతకుముందు ఓ పారిశ్రామికవేత్త మీద, సోనాక్షి సిన్హా, ఇషా కొప్పికర్ లాంటి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల మీద కూడా కేసులు దాఖలు చేసిన ఘనచరిత్ర ఈ అమ్మడికి ఉంది. ఇప్పుడు తాజాగా ఓ హోటల్ సిబ్బంది మీద ఆమె తన ప్రతాపం చూపించింది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ద్వారకలో పూజా మిశ్రా ఓ హోటల్కు వెళ్లింది. అక్కడ తానున్న గదిలో కొన్ని వస్తువులను పగలగొట్టింది. వాటికి గాను డబ్బు చెల్లించాలని హోటల్ యాజమాన్యం అడిగితే, లేదు పొమ్మంది. హోటల్ ఖాళీ చేసి వెళ్లిపోతానంటూ బయల్దేరగా, సిబ్బంది ఆమెను ఆపేందుకు ప్రయత్నించారు. దాంతో ఒక్కసారిగా ఆమె పూనకం వచ్చినట్లు సిబ్బందిమీద పడి కొట్టేసింది. తనను ఫొటోలు తీస్తారా అంటూ వాళ్ల ఫోన్లు పగలగొట్టింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
టీడీపీపై ఎన్నికల సంఘం సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
తప్పక చదవండి
- లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement