-
అప్పుడు వాట్సాప్.. ఇప్పుడు మెసేజ్లు! బ్లాక్ చేస్తున్న ప్రముఖ బ్యాంకు..
ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బీసీ (HSBC Holdings Plc).. తమ ఉద్యోగులు ఆఫీస్ మొబైల్ ఫోన్ల నుంచి మెసేజ్లు పంపే వీలు లేకుండా కట్టడి చేస్తోంది. అనధికారిక కమ్యూనికేషన్ పద్ధతులను ఉపయోగించడంపై రెగ్యులేటరీ సంస్థలు ఇటీవల చర్యలు చేపట్టిన నేపథ్యంలో హెచ్ఎస్బీసీ తమ సిబ్బందిని ఆఫీస్ ఫోన్లలో సందేశాలు పంపకుండా బ్లాక్ చేస్తోంది. కంపెనీ ఉద్యోగులకు జారీ చేసిన ఫోన్లలో మెసేజ్ ఫంక్షన్ను డిసేబుల్ చేసే ప్రక్రియలో ఉందని విషయం తెలిసిన కొందరు వ్యక్తుల ద్వారా తెలిసింది. అంటే బ్యాంకు సిబ్బంది తమ ఆఫీస్ ఫోన్ల నుంచి సందేశాలను పంపలేరు, స్వీకరించలేరు. కాగా హెచ్ఎస్బీసీ ఇప్పటికే సిబ్బంది వర్క్ ఫోన్లలో వాట్సాప్ ఉపయోగించకుండా బ్లాక్ చేసింది. అయితే కీలకమైన బాధ్యతల్లో ఉన్న కొంతమంది ఉద్యోగులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిసింది. వారు తమ వర్క్ ఫోన్ల నుంచి మెసేజ్లు పంపించే అవకాశం ఉంది. ఇక ఉద్యోగుల వ్యక్తిగత ఫోన్లపై ఎలాంటి ఆంక్షలూ లేవు. రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా ఆమోదించిన కమ్యూనికేషన్ పద్ధతులను అవలంభిస్తున్నట్లు హెచ్ఎస్బీసీ బ్యాంక్ ప్రతినిధి చెప్పారు. సమాచారాన్ని పంచుకోవడానికి ట్రేడర్లు, డీల్మేకర్లు ఫోన్లు, సిస్టమ్లను ఎలా ఉపయోగిస్తున్నారు.. వారి యజమానులు వీటిని ఎలా ట్రాక్ చేస్తున్నారన్న దానిపై నియంత్రణ సంస్థలు పరిశోధిస్తున్న నేపథ్యంలో ఈ చర్య వచ్చింది. వాల్ స్ట్రీట్లోని కొన్ని అతిపెద్ద బ్యాంకులలో మార్కెట్ మానిప్యులేషన్కు సంబంధించిన అధిక ప్రొఫైల్ కేసుల తర్వాత ఆర్థిక దుష్ప్రవర్తనను నిరోధించడమే లక్ష్యంగా రెగ్యులేటరీలు ఈ చర్యలు చేపట్టాయి. వందల కోట్ల జరిమానా వాట్సాప్తో సహా అనధికారిక మెసేజింగ్ యాప్లలో ఉద్యోగుల కమ్యూనికేషన్లను పర్యవేక్షించడంలో విఫలమైనందుకు గానూ హెచ్ఎస్బీసీ ఈ ఏడాది ప్రారంభంలో యూఎస్ రెగ్యులేటరీ సంస్థకు పెద్ద మొత్తంలో జరిమానా కట్టేందుకు అంగీకరించింది. ఇందులో భాగంగా కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్కు 30 మిలియన్ డాలర్లు ( దాదాపు రూ. 250 కోట్లు), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్కు మరో 15 మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 124 కోట్లు) చెల్లించింది. -
కెనరా హెచ్ఎస్బీసీ నుంచి కొత్త పథకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కెనరా హెచ్ఎస్బీసీ ఓబీసీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కొత్త పథకాలపై దృష్టిసారించింది. ఈ మధ్యనే చిన్న పిల్లల కోసం యులిప్ పథకం ప్రవేశపెట్టిన కంపెనీ త్వరలోనే మరో ఐదు పథకాలను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. వచ్చే నాలుగు నెలల్లో రెండు టర్మ్ పథకాలతో పాటు ఒక పెన్షన్, యాన్యుటీ, ఎండోమెంట్ పథకాలను ప్రవేశపెట్టడానికి ఐఆర్డీఏకి దాఖలు చేయనున్నట్లు కెనరా హెచ్ఎస్బీసీ ఓబీసీ డెరైక్టర్ చిరాగ్ జైన్ మంగళవారం ఇక్కడ విలేకరులకు తెలిపారు. -
వాయిదాలపై విమాన టికెట్లు..
♦ స్పైస్జెట్ పోస్ట్-పెయిడ్ ఆఫర్ ♦ అతి తక్కువగా 12-14% వడ్డీ రేటు న్యూఢిల్లీ : చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్జెట్ తాజాగా పోస్ట్-పెయిడ్ స్కీము కింద టికెట్లు కొనుగోలు చేసే అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్ కింద నెలవారీ వాయిదా చెల్లింపుల (ఈఎంఐ) విధానంలో టికెట్స్ తీసుకోవచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇలాంటి వాటికి అత్యంత తక్కువగా 12-14 శాతం వడ్డీ రేటు ఉంటుందని పేర్కొంది. ఇతరత్రా క్రెడిట్ కార్డుల ద్వారా ఈఎంఐల విధానంలో తీసుకునే వాటితో పోలిస్తే వడ్డీ వ్యయం దాదాపు 70 శాతం తక్కువగా ఉంటుందని స్పైస్జెట్ వివరించింది. యాక్సిస్ బ్యాంక్, హెచ్ఎస్బీసీ బ్యాంక్, కొటక్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు ఉన్న కస్టమర్లు ఈ స్కీమును ఉపయోగించుకోవచ్చని స్పైస్జెట్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ దేవజో మహర్షి తెలిపారు. త్వరలో ఇతర బ్యాంకుల క్రెడిట్ కార్డు హోల్డర్లకు కూడా దీన్ని అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఈ ఆఫర్ కింద టికెట్లు తీసుకునే వారు 3 నుంచి 12 నెలల కాలం పాటు చెల్లింపు వ్యవధిని ఎంచుకోవచ్చని వివరించారు. అయితే, స్పైస్జెట్ వెబ్సైట్ ద్వారా చేసే బుకింగ్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. -
స్విస్బ్యాంకులో కోట్లు దాచిన హెచ్ఎస్బీసీ చీఫ్?
స్కాముల్లో కూరుకుపోయిన హెచ్ఎస్బీసీ బ్యాంకును సంస్కరిస్తానని ఇన్నాళ్లూ చెబుతూ వస్తున్న ఆ బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టువార్ట్ గలివర్ వాస్తవానికి స్విస్ బ్యాంకులో కోట్ల కొద్దీ రూపాయలు దాచుకున్నారట. ఈ విషయాన్ని గార్డియన్ వార్తాపత్రిక బయటపెట్టింది. మే నెలలో బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ఇది అక్కడి ప్రభుత్వానికి పెద్ద శరాఘాతంగానే పరిణమిస్తుందని అనుకుంటున్నారు. బాగా డబ్బులున్న ఆసాములు పన్ను ఎగవేయడానికి స్విస్ బ్యాంకుల్లో సొమ్ములు దాచుకుంటున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో గలివర్ కూడా 2007 సంవత్సరంలో రూ. 47.26 కోట్లను పనామాలో రిజిస్టర్ అయిన ఓ కంపెనీ పేరుమీద స్విస్ బ్యాంకులో దాచుకున్నట్లు తెలిసింది. స్వతహాగా బ్రిటన్కు చెందిన గలివర్, తన న్యాయపరమైన, పన్ను అవసరాల కోసం హాంకాంగ్లో ఉంటున్నారు. అయితే ఈ స్విస్ బ్యాంకు ఖాతా వ్యవహారంపై హెచ్ఎస్బీసీ వర్గాలు ప్రస్తుతానికి ఏమీ స్పందించలేదు. -
మళ్లీ నల్లడబ్బు గబ్బు!
మళ్లీ మరోసారి నల్లడబ్బు పతాక శీర్షికలకెక్కింది. మన పాలకుల చిత్తశుద్ధిని సందే హాస్పదం చేసింది. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్ల డబ్బును తీసుకొస్తామన్న హామీలు హామీలుగానే మిగిలిపోతుండగా తాజాగా స్విట్జర్లాండ్లోని హెచ్ఎస్బీసీ బ్యాంకు శాఖలోనూ, ఇతరచోట్లా నల్ల ఖాతాలున్న భారతీయుల వివరాలు వెల్లడ య్యాయి. ఫ్రాన్స్ మన దేశానికి 2011లో అందించిన జాబితాలో 628మంది భారతీ యులుండగా...ఇప్పుడు వెల్లడైన జాబితాలో ఆ సంఖ్య 1,195కు చేరుకుంది. ఇందు లో రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, మాజీ అధికారులున్నారు. పన్ను ఎగ్గొట్టినట్టు తగిన ఆధారాలున్న పక్షంలో అలాంటి వారి వివరాలను మాత్రమే వెల్లడిస్తామని ఫ్రాన్స్ విధించిన షరతువల్ల గతంలో 628మంది వివరాలు మాత్రమే లభ్యమయ్యాయి. ఆ జాబితాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టు నియమిం చిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు అందజేసింది. నిబంధనల మేరకు పన్నులు చెల్లించకుండా కోట్లాది రూపాయలు దేశం దాటిస్తున్నవారి వివరాలను బహిరంగ పరచడంలో మన ప్రభుత్వానికి ఒడంబడికలు, నిబంధనలు అడ్డొస్తుండగా... మీడియా గతంలో వలే మరోసారి ఖాతాల వివరాలను బట్టబయలు చేసింది. పాత ఖాతాల్లో మొత్తం రూ. 4,500 కోట్లుండగా...తాజాగా వెల్లడించిన ఖాతాల్లో ఆ మొత్తం దాదాపు రూ. 25,420 కోట్లు. ఈ వివరాలన్నీ 2007 నాటివి గనుక ఇందులో ఎంత డబ్బు స్విస్ ఎల్లలు దాటి ఉంటుందో, ఎన్ని ఖాతాలు మూతపడి ఉంటాయో అంచనా వేయడం సాధ్యంకాదు. ఇప్పుడు మీడియా వెల్లడించిన వివరాలు కూడా గతంలో వలే హెచ్ఎస్బీసీ మాజీ ఉద్యోగి అందించినవే. వివిధ దేశాల్లోని మీడియా సంస్థలు సమష్టిగా దర్యాప్తు చేసి వెలికితీస్తున్న ఇలాంటి వివరాలు ఇంత యంత్రాంగమున్న ప్రభుత్వానికి ఎందు కు దొరకడంలేదో అర్ధంకాని విషయం. ఆ మాజీ ఉద్యోగిని తాము కూడా సంప్రదిస్తు న్నామని కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పడం ఆశాజనకమైన పరిణామం. ఆయనంటున్నట్టు విదేశాల్లో ఖాతాలున్న ప్రతి ఒక్కరూ దోషులు కానవసరం లేదు. వ్యాపార లావాదేవీల రీత్యా ప్రపంచంలో ఏమూలైనా ఖాతాను తెరిచే స్వేచ్ఛ ఎవరి కైనా ఉంటుంది. ఏటా సమర్పించే ఆదాయ పన్ను వివరాల్లో వాటిని కూడా వెల్లడిం చి ఉంటే ఆ ఖాతాలు సవ్యమైనవే అవుతాయి. ఇప్పుడు వెల్లడైన జాబితాలో అంబానీ సోదరులు, యశోవర్ధన్ బిర్లా, లక్ష్మణదాస్ రహేజా, రాజన్ నందా, ఆనంద్ చాంద్ బర్మన్వంటి వ్యాపార దిగ్గజాలతోపాటు నారాయణ్ రాణే, స్మితా ఠాక్రే వంటి రాజకీయవేత్తల పేర్లు కూడా ఉన్నాయి. అంబానీ సోదరులతోపాటు మరికొందరు విదేశాల్లో తమకు అక్రమ ఖాతాలేవీ లేవని చెబుతున్నారు. గతం లోనూ, ఇప్పుడూ వెల్లడైన ఖాతాదారుల జాబితాలు దొంగిలించిన సమాచారం ఆధారంగా చేసుకున్నవేనని ఫ్రాన్స్ ప్రభుత్వం చెప్పడాన్నిబట్టి చూస్తే వాటిని కొట్టి పారేయడానికి లేదని సులభంగానే అర్ధమవుతుంది. మరోపక్క చాలామంది తమ పేర్లు ఎందుకున్నాయో తెలియదంటున్నారు. కనుక నిజం అనేది ఈ రెండింటి మధ్యా ఎక్కడో ఉంటుంది. 2011 నాటి జాబితాలోని నిజానిజాలను వెలికితీసే పని ఎంత వరకూ వచ్చిందో తెలియని పరిస్థితుల్లో తాజా జాబితా విషయంలో ఎప్పుడు దర్యాప్తు ప్రారంభమవుతుందో, ఎన్నాళ్లకు వాస్తవాలు వెల్లడవుతాయో అంచనా కందదు. దేశంనుంచి ఏటా లెక్కలు చూపని దాదాపు లక్షా 30 వేల కోట్ల రూపాయల డబ్బు దేశం దాటిపోతున్నదని గతంలో సీవీసీగా పనిచేసి ప్రత్యూష్ సిన్హా చెప్పారు. పన్ను ఎగవేతలు, ఇతర అవినీతి కార్యకలాపాలవల్ల నల్ల డబ్బు తరలిపోతున్న దేశా ల జాబితాలో భారత్ తొలి పది స్థానాల్లో ఉన్నదని గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ సంస్థ చాన్నాళ్లక్రితం వెల్లడించింది. నల్లడబ్బు ఆనుపానులు రాబట్టడానికి 81 దేశాలతో ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం కుదర్చుకున్నామని, మరికొన్నిటితో పన్ను సమాచార బదిలీ ఒప్పందాలు కుదుర్చుకున్నామని యూపీఏ సర్కారు లోగడ చెప్పింది. అందుకనుగుణంగా చాలా సమాచారం సేకరించామని, అయితే ఒడంబడి కల్లో ఉన్న నిబంధనలవల్ల వివరాలు వెల్లడించలేకపోతున్నామని చెప్పింది. యూపీ ఏ సర్కారు చట్టాలను కట్టుదిట్టం చేసి ఉంటే విదేశీ బ్యాంకులు ఇలా మన ఆర్థిక వ్యవస్థతో ఆటలాడుకునే స్థితి ఉండేది కాదు. బ్యాంకుల గోప్యతకు కాలం చెల్లిందని జీ-20 శిఖరాగ్ర సదస్సు 2009లోనే ప్రకటించింది. అటు తర్వాత చాలా దేశాలు తమ తమ దేశాల్లో చట్టాలను కఠినం చేశాయి. విదేశీ పన్ను అనువర్తన చట్టాన్ని తీసుకొచ్చిన అమెరికా...తమ జాతీయులు డబ్బు దాచుకున్న సందర్భాల్లో ఆ వివరా లను వెల్లడించాల్సిన బాధ్యతను విదేశీ బ్యాంకింగ్ సంస్థలపైనే ఉంచింది. అలా వెల్లడించని పక్షంలో తమ దేశంలో ఆ సంస్థల పెట్టుబడులపై 30 శాతం జరిమానా విధిస్తామని ఆ చట్టంలోని నిబంధనలు చెబుతున్నాయి. బ్రిటన్ అయితే నల్లడబ్బు పోగేసినవారికి పదేళ్ల జైలు, ఆస్తుల జప్తు, భారీగా జరిమానా విధింపు వంటి అంశాల తో చట్టం తీసుకొచ్చింది. ఫ్రాన్స్, ఐర్లాండ్, ఈయూ వంటివి కూడా ఈ తోవనే వెళ్లాయి. ఆ దేశాలన్నీ స్విట్జర్లాండ్ బ్యాంకులను, ఇతర బ్యాంకులను దారికి తెచ్చుకో గలిగాయి. ఆ దేశాలు పెట్టిన నిబంధనలకు తలొగ్గి నల్ల ధనం దాచుకున్నవారి సమస్త వివరాలను అందజేస్తున్న బ్యాంకులు మన దగ్గరకొచ్చేసరికి మాత్రం ఎందుకు బెట్టుచేస్తున్నాయో...మన ప్రభుత్వం ఎందుకని చురుగ్గా వ్యవహరించలేకపోతు న్నదో అర్ధంకాని విషయం. అక్రమాస్తులు ఉన్నాయని తేలిన పక్షంలో అలాంటివారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకునేలా చట్ట సవరణ చేయాలని గతంలో సిట్ సూచించింది. ఇదే సమయంలో పన్నుల చట్టాలను సరళీకరించి, పారద ర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నది. దేశ ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తున్న నల్లధనం విషయంలో కఠినంగా వ్యవహరించాలని అంతర్జాతీయంగా అవగాహన ఏర్పడిన నేపథ్యంలో మన దేశం కనీసం ఇప్పుడైనా కదలాలి. పటిష్టమైన చర్యలకు నడుం బిగించాలి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement