-
అనుమతులు లేని రియల్ దందా
కొణిజర్ల : సాధారణంగా ఓ వ్యక్తి ఇల్లు కట్టుకోవాలంటే అధికారులు సవాలక్ష నిబంధనలు పెడతారు. ఆ ధ్రువ పత్రం కావాలి, ఈ అధికారి అనుమతి కావాలి అంటూ కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటారు. అదే రియల్ ఎస్టేట్ పేరుతో వ్యాపారం చేస్తున్న వారికి మాత్రం అధికారులకు నిబంధనలు పట్టవు. కనీసం వారి వైపు కూడా తిరిగి చూడ కుండా ఉంటారు. మండలంలోని పలు గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలియడమే ఇందుకు నిదర్శనం. ఎటువంటి అనుమతులు లేకుండా భారీ భవనాలు నిర్మిస్తున్నా, వ్యాపారాలు నిర్వహిస్తున్నా అధికార్లు ఏమీ పట్టనట్టు ఉంటున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మండలం లోని కొణిజర్ల,తనికెళ్ల, అమ్మపాలెం, దుద్దెపూడి , పల్లిపాడు,చిన్నమునగాల తదితర గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు కుప్పలు తెప్పలుగా విస్తరిస్తున్నాయి.వీటిలో ఒక్కదానికి కూడా ప్రభుత్వ అనుమతి లేదు. కొన్ని వ్యవసాయ భూముల నుంచి వ్యవసాయేతర భూమిగా కూడా మార్పు చేయలేదు. అయినా దర్జాగా ప్లాట్ల వ్యాపారం కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రీయ రహదారి పక్కన ఉన్న భూములు రూ. కోట్లలో ధరలు పలుకుతుంటడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అడ్డూ అదుపులేకుండా పోతుంది. ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే అందుకు ప్రభుత్వం నుంచి 5 రకాల అనుమతులు పొందవలసి ఉంటుంది.ఈ ధ్రువపత్రాలు వివిధ శాఖల నుంచి తీసుకువచ్చి పంచాయతీరాజ్ వారికి ఇచ్చి వారి నుంచి అనుమతి పొందాలి.కాని అటువంటిది ఏమీ లేకుండా ముందు ప్లాట్లు చేసి అమ్మేద్దాం ఎవరైనా వచ్చి అడిగితే అప్పుడు చూసుకుందాములే అన్నట్లుగా వ్యవ హరిస్తున్నారు రియల్టర్లు. ఈ పత్రాలు తప్పని సరిగా ఉండాలి. వెంచర్లకు సంబంధించి ఆర్డీఓ నుంచి వ్యవసాయ భూమిని వ్యవసాయేత భూమిగా భూమార్పిడి పత్రం తీసుకోవాలి.గ్రామ కార్యదర్శి అనుమతి పత్రం, ఈసీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఇండివిడ్యువల్ అప్రూవల్, మండల సర్వేయర్ ఇచ్చే టోపోప్లాన్ రిపోర్టు అనే అయిదు రకాల ధ్రువపత్రాలు తప్పని సరిగా ఇవ్వవలసి ఉంటుంది. ఎవ్వరూ కూడా వీటి కోసం దరఖాస్తు చేసుకోరు కేవలం ల్యాండ్ కన్వర్షన్ చేసుకుని ప్లాట్లుగా విభజిస్తారు. ఈ అయిదు రకాల ధ్రువపత్రాలు పంచాయతీ రాజ్ శాఖకు ఇచ్చి వారి నుంచి అనుమతి పొందాలి. ఇందుకోసం మొత్తం వెంచర్ వేసే భూమిలో 10 శాతం గ్రీన్ బె ల్ట్ కోసం గ్రామ పంచాయతీ పేరమీద రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలి.ఇవేమీ లేకుండా ఇష్టానుసారంగా వెంచర్లు వేస్తున్నారు. అనుమతులు లేకుండా వేసిన వెంచర్లలో ఇండ్లు , ప్లాట్లు కొన్నవారికి నష్టం జరుగుతుందని ప్రభుత్వం నుంచి ఎటువంటి లోన్ సౌకర్యం ఉండదని చెప్పే టౌన్ ప్లానింగ్ అధికార్లు వెంచర్లపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. వాతావరణ కాలుష్యం బాగా పెరిగి పోతున్న తరుణంలో చెట్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించి హరిత హారం పథకాన్ని ప్రవేశ పెట్టింది, అయితే ఉన్న చెట్లనే నరికి వెంచర్లు తయారు చేసి మొక్కల పెంపకాన్ని పట్టించుకోని రియల్ ఎస్టేట్ వ్యాపారులపై అధికార్లు ఎటువంటి చర్యలు తీసుకోవడడం లేదు. వెంచర్లు,పరిశ్రమలు, ఇతర ప్రాజెక్ట్లకు సంబంధించి గ్రీన్ బెల్ట్ ఖచ్చితంగా అమలు చేయాలి.కాని మండలంలో వెంచ ర్లు వేసిన వారు రోడ్లను గ్రీన్ బెల్ట్ కింద చూపి మాయ చేస్తున్నారు. గ్రీన్ బెల్ట్ కింద భూమిని తీయకుండా ప్లాట్ల అమ్మకాలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికార్లు స్పందించి గ్రీన్ బెల్ట్ స్టలాలను స్వాధీనం చేసుకుని చెట్టు పెంచాలని పలువురు కోరుతున్నారు. -
మింగేశారు
ఒక్కటీ..వదల్లేదు.! జీహెచ్ఎంసీ పరిధిలో 169 చెరువుల్లో సర్వే మాయమైన బతుకమ్మ కుంట రికార్డులు కబ్జాకు గురైన దుర్గం చెరువు ఆనవాళ్లే లేని పెద్దబందం, ఖాజాకుంట సర్వేలో విస్తుపోయే వాస్తవాలు నగరంలో చెరువులను కబ్జాదారులు మింగేస్తున్నారు. ప్రజల ఆట, పాటల్లో భాగమైన బతుకమ్మ చెరువు రికార్డుల నుంచి మాయమైంది.. కుతుబ్షాహిల పాలనలో గోల్కొండకు మంచినీళ్లందించిన దుర్గం చెరువు కబ్జా కోరల్లో చిక్కుకుంది.. పెద్ద బందం, ఖాజా కుంట, నాగిరెడ్డి కుంట ఇలా పలు చెరువులు ఆనవాళ్లు లేకుండా పోయాయి. చాలా చెరువుల్లో భారీ భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు పుట్టుకొచ్చాయి. మాయగాళ్లు చెరువులను మింగేస్తూ కోట్లు గడిస్తుంటే.. సిటిజన్లు మాత్రం గుక్కెడు నీళ్ల కోసం అల్లాడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 169 చెరువులపై జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా సర్వే చేపట్టాయి. ఈ సర్వేలో విస్తుపోయే అంశాలు వెలుగుచూస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 169 చెరువులు, కుంటలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీటి పరిస్థితిపై జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా సర్వే చేపట్టాయి. ఇప్పటి వరకు 133 ప్రాంతాల్లో సర్వే పూర్తయింది. పలుచోట్ల ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు ఆక్రమణలకు పాల్పడితే కొన్ని చోట్ల చెరువు పరిధుల్లోనూ రైతుబజార్లు, కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ పాఠశాలలు నిర్మించారు. ఈ నేపథ్యంలో చెరువుల ఆనవాళ్లే లేకుండా పోయాయి. వాటిలో పెద్దబందం(సూరారం), తూంకుంట (నిజాంపేట), నాగిరెడ్డికుంట (మంచిరేవుల), మైసమ్మకుంట (లాంకోహిల్స్), ఎర్రకుంట (ఐఎస్ సదన్), ఎర్రకుంట (లాలాపేట), ఖాజాకుంట (కూకట్పల్లి)లకు అలుగు కూడా లేకుండా పోయాయి. శ్యామలకుంట (అమీర్పేట), మాసాహెబ్ట్యాంక్ (విజయనగర్కాలనీ), నాగమయ్యకుంట (నల్లకుంట), బొగ్గులకుంట (ఆబిడ్స్)లతో పాటు మరో ఐదు చెరువులు ఆనవాళ్లు లేకుండా పోయాయి. అంబర్పేటలోని బతుకమ్మకుంట రికార్డులు గల్లంతయ్యాయి. సర్వే ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 32 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మకుంట ఉండగా, హైదరాబాద్ జిల్లా రెవెన్యూ యంత్రాంగం మాత్రం అక్కడ చెరువు ఉన్న దాఖలాలే లేవంటూ రెండేళ్ల క్రితం తేల్చింది. అయితే తాజాగా నీటిపారుదల శాఖ చేపట్టిన సర్వేలో బతుకమ్మకుంట అలుగు, తూము, వరద కాలువను గుర్తించి 17 ఎకరాల్లో హద్దులు నిర్ధారించారు. బతుకమ్మకుంటపై న్యాయస్థానాలతో పాటు, లోకాయుక్తలోనూ పలు వ్యాజ్యాలు కొనసాగుతున్నాయి. నీటిపారుదల శాఖ నోటిఫై చేసిన 17 ఎకరాల్లో ప్రస్తుతం మూడు ఎకరాల విస్తీర్ణం మాత్రమే ఖాళీగా ఉండడం గమనార్హం. ఖాజాగూడ, బందం చెరువు అలుగు మొత్తం ఓ సినీ నిర్మాత ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఇది గుర్తించిన అధికార యంత్రాగం సదరు నిర్మాతకు త్వరలో నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 169 చెరువులను గుర్తించిన యంత్రాంగం వాటి పూర్తి స్థాయి నీటిమట్టాలను (ఎఫ్టీఎల్) గుర్తించే పనిని దాదాపు పూర్తి చేసి జీపీఎస్ సహాయంతో శాశ్వత మార్కింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం శాస్త్రీయపద్ధతిలో చేస్తున్న ఎఫ్టీఎల్ మార్కింగ్ను భవిష్యత్తులో ఎవరికి వారు మార్పు చేసేందుకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కబ్జా కోరల్లో... దుర్గం చెరువులో 30 ఎకరాల్లో భారీ నిర్మాణా లు ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చినట్లు సర్వేలో తేలిం ది. కుతుబ్షాహీల కాలంలో గోల్కొండ కోటకు మంచినీటిని అందించేందుకు 160.7 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన దుర్గం చెరువు తాజా సర్వేల్లో 30 ఎకరాలకు పైగా కబ్జాకు గురైనట్లు అంచనాకు వచ్చారు. ఎఫ్టీఎల్ పరిధిలో సుమారుగా రూ. 100 కోట్లకు పైగా విలువైన క్రయవిక్రయాలు జరిగినట్లు భావిస్తున్నారు. జీపీఎస్ సాయంతో ఇప్పటికే ఎఫ్టీఎల్ హద్దులను నిర్ధారించిన అధికారులు చెరు వు తూమును ఇటీవలే మూసేశారు. దీంతో పక్షం రోజులుగా దుర్గం చెరువులోకి వస్తున్న వరద నీటితో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. పూర్తి స్థాయి నీటిమట్టం వచ్చేంత వరకు తూమును మూసెయ్యాలని నీటిపారుదల శాఖ నిర్ణయించడంతో చెరువు సమీపంలోని భవనాల్లోకి వరద నీరు క్రమంగా చేరుతోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
Advertisement