-
ఖమ్మంలో ఎన్నికల భారీ బహిరంగ సభ
సాక్షిప్రతినిధి,ఖమ్మం: టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి ఖమ్మంజిల్లా లో ఎన్నికల శంఖా రావం పూరించడానికి సమాయత్తమైంది. నోటిఫికేషన్ రావడానికి ముందే.. ఖమ్మం వంటి రాజకీయ చైతన్యవంతమైన జిల్లాలో ప్రచార పర్వాన్ని ప్రారంభించాలని సంకల్పించింది. ఈ మేరకు.. అక్టోబర్ 8వ తేదీన టీఆర్ఎస్ పార్టీ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు.. పార్టీ ఖరారు చేసింది. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ పర్యటన ఏర్పాట్లకు అంతా సిద్ధం చేయబోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థులకు పార్టీ సమాచారం అందించడంతో పాటు కార్యకర్తల సమీకరణ చేయాలని సూచించింది. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ 8వ తేదీ మధ్యాహ్నం ఖమ్మం చేరుకుని.. స్థానిక ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసే.. ఎన్నికల ప్రచారం బహిరంగ సభలో పాల్గొననున్నారు. సభ కోసం..ఇటు మంత్రి తుమ్మలతో పాటు ఖమ్మం టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ ఏర్పాట్లు, జన సమీకరణపై దృష్టి సారించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు రాష్ట్రమంతటా చాటిచెప్పేవిధంగా జన సమీకరణ, ఏర్పాట్లు ఉండాలని భావిస్తున్న పార్టీ నేతలు ఈ మేరకు.. కేసీఆర్ సభకు పెద్ద ఎత్తున జనసమీకరణపై దృష్టి సారించారు. కేసీఆర్.. పర్యటనకు సంబంధించి ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి జన సమీకరణ చేయడానికి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టి సారించారు. ఈ పర్యటనలో పార్టీలో నెలకొన్న..అసమ్మతి, అసంతృప్తులు, కార్యకర్తల్లో నెలకొన్న నైరాశ్యానికి కాయకల్ప చికిత్స చేసి.. నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కించే విధంగా దిశానిర్దేశం చేసే అవకాశముందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రధానంగా ఖమ్మం, పాలేరుతో పాటు సమీప నియోజకవర్గాల నుంచి భారీగా జన సమీకరణ చేసేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కేసీఆర్ పర్యటనకు ఇంకా 13 రోజుల సమయం ఉండడంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు జన సమీకరణపై దృష్టి సారిం చారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మంకు ఆరోజు ఎన్ని గంటలకు చేరుకుంటారు..? ఎన్ని గంటల వరకు ఉంటారు..? అన్న అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. -
మావోయిస్టుల భారీ సభ
దండకారణ్యంలో మూడు రోజుల పాటు సభలు క్రీడా సామగ్రి పంపిణీ.. పోటీల నిర్వహణ దుమ్ముగూడెం: తెలంగాణలోని ఖమ్మం జిల్లా సరిహద్దు ఛత్తీస్గఢ్ జిల్లా సుకుమా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలో బూరుగులంక అటవీ ప్రాంతంలో శుక్రవారం ఆదివాసీలతో మావోయిస్టుల అగ్ర నేతలు భారీ బహిరంగ సభ నిర్వహించినట్లు సమాచారం. అంతటితో ఆగకుండా బహిరంగ సభలు నిర్వహించిన స్థలం నుంచి 100 మీటర్ల దూరంలోని బూగురులంక సంతలో మావోయిస్టు అగ్రనేత సావిత్రి (రామన్న భార్య)సహా 200 మంది మావోయిస్టులు తుపాకులతో హల్చల్ చేసినట్లు తెలిసింది. ఈ బహిరంగ సభలను మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి రామన్న నేతృత్వంలో సంతోష్, సావిత్రి, లచ్చన్న, ఉదమ్సింగ్, భగ త్, నగేష్, సోనిల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల ఆదివాసీలను తమ ఆధీనంలో ఉంచుకునేందుకు బుధవారం నుంచి బూరుగులంక అటవీప్రాంతంలో ఈ బహిరంగ సభలను నిర్వహించినట్లు తెలుస్తోంది. సభలకు దండకారణ్యానికి చెందిన ఆదివాసీలు పెద్ద ఎత్తున హాజరైనట్లు తెలుస్తోంది. సభల్లో మావోయిస్టు నేతలు మాట్లాడుతూ పోలీసులు దండకారణ్యంలో నిర్మించతలపెట్టిన బేస్క్యాంపు నిర్మాణాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చినట్లు సమాచారం. ప్రశాంత వాతావరణంలో బతుకుతున్న తమ గ్రామాలను నాశనం చేయవద్దని.. బేస్ క్యాంపు నిర్మాణానికి వచ్చిన పోలీసులను అడ్డుకోవాలని ఆదివాసీలకు సూచించినట్లు సమాచారం. అటవీ ప్రాంతంలో అదేవిధంగా నిర్మాణాలు చేపడితే ఎదురుతిరిగి అడ్డుకోవాలని ఆదివాసీలకు ధైర్యం నూరిపోసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. క్రీడా సామగ్రి పంపిణీ.. మావోయిస్టులు సరిహద్దు ఆదివాసీలను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఆదివాసీ యువకులకు క్రీడా కిట్లు పంపిణీ చేయడంతో పాటు.. క్రీడా పోటీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులనూ పంపిణీ చేసినట్లు సమాచారం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement