-
ఆస్ట్రేలియాలో అధికారం చేపట్టిన లేబర్ పార్టీ
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పరిపాలనకు తెరపడింది. ఇప్పటివరకు 50శాతం ఓట్లను లెక్కించగా ప్రతిపక్ష లేబర్ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉన్నట్టు ఆస్ట్రేలియా మీడియా ఇదివరకే వెల్లడించింది. లేబర్ పార్టీ అధ్యక్షుడు ఆంటోనీ అల్బనీస్ తదుపరి ప్రధానమంత్రి పదవి చేపట్టారు. ప్రస్తుత ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ తన ఓటమిని అంగీకరించారు. గత మూడేళ్లలో కరోనా విజృంభణ, వాతావరణ మార్పులు కారణంగా ఏర్పడిన విపత్తుల్ని ఎదుర్కోవడంలో అధికార పార్టీ వైఫల్యం ప్రజల్లో వ్యతిరేకతను పెంచింది. మూడేళ్లకి ఒకసారి జరిగే పార్లమెంటు ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ సంకీర్ణ కూటమి కంటే లేబర్ పార్టీ హామీలు ఇవ్వడంలోనూ, ప్రజల విశ్వాసం చూరగొనడంలోనూ విజయం సాధించింది. -
ఎన్డీయేయేతర పార్టీలకు సోనియా ఆహ్వానం!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: తమకు 300 పైచిలుకు సీట్లు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెబుతున్నప్పటికీ.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ బీజేపీకి రాకపోవచ్చని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నాయి. కాషాయ పార్టీని అధికారానికి దూరంగా ఉంచే లక్ష్యంతో పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలోనే యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ఈ నెల 23న ఎన్డీయేయేతర పార్టీలు, ఇతర భావసారూప్య పార్టీలతో సమావేశం నిర్వహించనున్నారు. పలు ప్రధాన ప్రాంతీయ పార్టీలతో సహా 20కి పైగా ప్రతిపక్ష పార్టీలతో ఇప్పటికే చర్చలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. 23న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్లతో పాటు ఆర్జేడీ, టీఎంసీ వంటి లౌకిక, తటస్థ పార్టీల నేతలను సోనియా ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీల నేతలు అందుబాటులో ఉండటాన్ని బట్టి ఈ సమావేశం 21 లేదా 22వ తేదీన కూడా జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ అంశంలో సమన్వయం కోసం నలుగురు కాంగ్రెస్ నేతలతో ఒక బృందం ఏర్పాటైనట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, పి.చిదంబరం, గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లోత్లతో కూడిన బృందం.. భావసారూప్య పార్టీలతో ఎన్నికల అనంతర పొత్తు అవకాశాలపై కసరత్తు చేస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఫ్రంట్ ఏర్పాటు యోచన బీజేపీకి మెజారిటీ రాదని కాంగ్రెస్ విశ్వసిస్తోందని, ఒకవేళ హంగ్ పార్లమెంట్ ఏర్పడిన నేపథ్యంలో బీజేపీకి ఎలాంటి అవకాశం చిక్కకుండా చేసే క్రమంలో ఓ ఫ్రంట్ను ముందుకు తేవాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ప్రధానమంత్రి పదవిపై కాంగ్రెస్కు ఆసక్తి లేదని ఆజాద్ ఇప్పటికే ప్రకటించడంతో ఆ అంశం ఇందుకు ఆటంకం కాబోదని వివరించాయి. కర్ణాటకలో తమకు 78 మంది ఎమ్మెల్యేలున్నా, కేవలం 37 సీట్లున్న జేడీఎస్ నేత కుమారస్వామి ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు మద్దతు పలికిన విషయం గుర్తు చేశాయి. పరిస్థితిని బట్టి వీలైతే ప్రతిపక్ష పార్టీల ప్రతినిధి బృందం 23నే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలసి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి పూర్తి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిందిగా కోరాలని నిర్ణయించుకున్నట్లు వివరించాయి. -
కమల్ నాధ్కు కీలక బాధ్యతల అప్పగింత
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకీ విస్పష్ట మెజారిటీ రాకుంటే బీజేపీయేతర పార్టీలతో కూటమి ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నాన్ బీజేపీ అలయన్స్ ఏర్పాటు దిశగా చర్చలు జరిపేందుకు మధ్యప్రదేశ్ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత కమల్ నాధ్కు యూపీఏ చీఫ్ సోనియా గాంధీ బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది. మే 23న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం హంగ్ పార్లమెంట్ అనివార్యమైతే చిన్న, ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే కసరత్తును కమల్ నాధ్కు సోనియా అప్పగించినట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానిపక్షంలో ఎన్డీఏయేతర పక్షాలు, తటస్ధంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్లకు కీలకంగా మారనున్నాయి. కేంద్రంలో ఎవరు అధికార పగ్గాలు చేపడతారో నిర్ణయించే కీలక పార్టీలుగా ఇవి అవతరిస్తాయి. ఇక హంగ్ పార్లమెంట్ అనివార్యమైతే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా పార్టీకి మద్దతును కూడగట్టే ప్రక్రియను కమల్ నాధ్ సమర్ధంగా ముందుకు తీసుకువెళతారని సోనియా భావిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. -
బ్రిటన్లో హంగ్ పార్లమెంట్
ప్రధాని థెరిసా మేకు షాక్.. ► డీయూపీ పార్టీతో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమన్న థెరిసా లండన్: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని థెరిసా మేకు ఊహించని షాక్ తగిలింది. బ్రెగ్జిట్ చర్చల కోసం పార్లమెంట్లో బలం పెంచుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నాన్ని ప్రజలు తిరస్కరించారు. మూడేళ్ల ముందుగానే నిర్వహించిన ఎన్నికల్లో థెరిసా నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ మెజార్టీకి కొద్ది దూరంలోనే ఆగిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు 326 స్థానాలు అవసరం కాగా..8 స్థానాలు తక్కువగా కన్జర్వేటివ్ పార్టీ 318 చోట్ల గెలిచింది. లేబర్ పార్టీ 261, స్కాటిష్ నేషనలిస్ట్ పార్టీకి 35, లిబరల్ డెమొక్రటిక్ పార్టీ 12, డెమొక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ(డీయూపీ)10 స్థానాల్లో గెలుపొందాయి. పార్లమెంట్ దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్లోని మొత్తం 650 సీట్లకు గురువారం ఎన్నికలు జరిగాయి. థెరిసా ప్రయత్నాన్ని ప్రజలు తిరస్కరించారని, ఆమె తక్షణం రాజీనామా చేయాలని ప్రధాన ప్రతిపక్షం డిమాండ్ చేయగా.. డీయూపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆమె పావులు కదుపుతున్నారు. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ను కలసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని శుక్రవారం విజ్ఞప్తి చేశారు.బ్రెగ్జిట్ చర్చల్లో పట్టు పెంచుకునేందుకు మూడేళ్ల ముందుగానే ఏప్రిల్లో ఎన్నికలకు మే పిలుపునిచ్చారు. ముందస్తు సర్వేలు, ఎగ్జిట్ పోల్స్లో కన్జర్వేటివ్ పార్టీ విజయం ఖాయమని ప్రకటించగా.. ఫలితాలు మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎంపీగా సిక్కు మహిళ రికార్డు బ్రిటన్ ఎన్నికల్లో తొలిసారిగా ఓ సిక్కు మహిళ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. లేబర్ పార్టీకి చెందిన ప్రీత్కౌర్ గ్రిల్ బర్మింగ్హామ్ ఎడ్జ్బాస్టన్ నుంచి కన్జర్వేటివ్ అభ్యర్థిపై 6,917 ఓట్ల తేడాతో గెలుపొందారు. లేబర్ పార్టీకే చెందిన మరో సిక్కు అభ్యర్థి తన్మన్జీత్ సింగ్ దేశి కూడా స్లోగ్ సీటు నుంచి గెలిచారు. ఈ ఫలితాలతో బ్రిటన్లో భారత సంతతి ఎంపీల సంఖ్య 12కి పెరిగింది. -
హంగ్ పార్లమెంట్.. రాష్ట్రపతి పాత్ర.. అవిశ్వాస తీర్మానం
హంగ్ అసెంబ్లీ లేదా హంగ్ పార్లమెంట్ ఏర్పడితే రాష్ట్రపతి/గవర్నర్ ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి? విశ్వాస, అవిశ్వాస తీర్మానాల గురించి రాజ్యాంగం ఏం చెబుతోంది? గత అనుభవాలు.. తదితర అంశాలపై విశ్లేషణ.. ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికలు, రాజకీయ పార్టీలు అనివార్యం. ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరు రాజకీయ పార్టీలపైనే ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో పరోక్ష ప్రజాస్వామ్యం ఉంది. పౌరులు తమ ఓటు హక్కు ద్వారా ప్రతినిధులను ఎన్నుకుంటారు. వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలను పాలిస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఎన్నికల్లో పోటీ చేసిన ఏదైనా పార్టీ చట్టసభల్లో నిర్ణీత మెజారిటీ సాధించాలి. లోక్సభ, రాష్ట్ర విధానసభలలోని మొత్తం స్థానాల్లో సగానికంటే ఎక్కువ స్థానాలు దక్కించుకున్న పార్టీ లేదా కూటమిగానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. లోక్సభలో మొత్తం స్థానాల సంఖ్య 545 (నామినేట్ సభ్యులతో సహా). ఇందులో 273 స్థానాలు సాధించిన పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ రాష్ట్రపతి కోరతాడు. ఈ పద్ధతినే గవర్నర్లు రాష్ట్రాల్లో అనుసరిస్తారు. ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదా కూటమికి సంపూర్ణ మెజారిటీ రాకపోతే దాన్ని హంగ్ పార్లమెంట్/హంగ్ అసెంబ్లీ అని వ్యవహరిస్తారు. ప్రభుత్వ ఏర్పాటు - రాజ్యాంగ ప్రస్తావన: రాజ్యాంగ ప్రకరణ 74 (1) ప్రకారం విధుల నిర్వహణలో రాష్ట్రపతికి సలహా, సహకారాలను అందించడానికి ప్రధానమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి ఉంటుంది. ప్రకరణ 75 (1) ప్రకారం రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తాడు. అతని సలహాపై మంత్రిమండలి ఏర్పాటవుతుంది. రాష్ట్రాల విషయంలో కూడా ఇలాంటి ఏర్పాటును రాజ్యాంగ ప్రకరణ 163 (1), 164 (1)లో ప్రస్తావించారు. ఈ ప్రకరణల్లో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిని నియమించే విషయంలో అనుసరించాల్సిన పద్ధతులు, నియమాలను వివరించలేదు. పార్లమెంటరీ పాలనా వ్యవస్థ అమల్లో ఉన్న దేశాలు ముఖ్యంగా బ్రిటిష్ తరహా రాజ్యాంగాన్ని అనుసరించే విధంగా మనదేశంలో కూడా కొన్ని సంప్రదాయాలు, రాజకీయ ఆచారాలున్నాయి. అవి.. ఎన్నికల ఫలితాలను బట్టి రాష్ట్రపతి లోక్సభలో మెజారిటీ సాధించిన రాజకీయ పార్టీ లేదా కూటమి నాయకున్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానిస్తాడు. ఉదాహరణకు 1977లో ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడి మెజారిటీ సాధించిన జనతాపార్టీ కూటమి నాయకుడైన మొరార్జీదేశాయ్ని ప్రధానమంత్రిగా నియమించారు. ఎన్నికైన పార్టీల్లో కొన్ని సంకీర్ణ కూటమిగా రూపొంది, తమ నాయకున్ని ఎన్నుకుంటే.. ఆ నాయకున్ని ప్రధానమంత్రి పదవి చేపట్టమంటూ రాష్ట్రపతి ఆహ్వానించవచ్చు. ఉదాహరణకు 1999లో బీజేపీ 12 పార్టీలతో కలిసి (ఎన్డీఏ) ప్రభుత్వాన్ని, 2004లో కాంగ్రెస్ పార్టీ మరో 11 పార్టీలతో కలిసి (యూపీఏ పేరుతో) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏ ఒక పార్టీ లేదా కూటమికి పూర్తి మెజారిటీ లభించని పక్షంలో అత్యధిక సీట్లు సాధించిన పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని కోరవచ్చు. ఉదాహరణకు 1989 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు సాధించడంతో అప్పటి రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్, కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ గాంధీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించగా, కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. దాంతో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి వి.పి.సింగ్ను ప్రధానమంత్రిగా నియుమించారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానప్పుడు రాష్ట్రపతి విచక్షణాధికారంతో తన దృష్టిలో ఎవరైతే స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలరో ఆ రాజకీయ పార్టీ నాయకున్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ ఆహ్వానించవచ్చు. అలాంటి ప్రభుత్వం రాష్ట్రపతి ఇచ్చిన గడువులోగా తన మెజారిటీని నిరూపించుకోవాలి. గత సందర్భాలు: 1952, 1957, 1962, 1967, 1971 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో ప్రధానమంత్రిని నియమించడంలో నాటి రాష్ట్రపతులకు ఎలాంటి సమస్యా ఎదురుకాలేదు. 1964లో నెహ్రూ మరణానంతరం ప్రధానమంత్రి నియామకంలో సమస్యలు మొదలయ్యాయి. నెహ్రూ వారసున్ని సర్వసమ్మతితో ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సిన ఆవశ్యకతను ప్రతిపాదించి (కామరాజ్ నాడర్) 1964లో లాల్ బహదూర్శాస్త్రిని ప్రధానమంత్రిగా నియమించారు. 1971, 1980 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లభించిన ఆధిక్యత వల్ల ఇందిరాగాంధీ ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. 1977లో జనతా పార్టీకి మెజారిటీ వచ్చినప్పటికీ, ఆది ఐదు పార్టీల కూటమి కావడంతో.. జయప్రకాశ్ నారాయణ్, ఆచార్య జె.బి. కృపలానీ కృషి ఫలితంగా మొరార్జీ దేశాయ్ని జనతా పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఆనాటి తాత్కాలిక రాష్ట్రపతి బి.డి. జెట్టి మొరార్జీ దేశాయ్ని ప్రధానమంత్రిగా నియమించారు. ఆ సందర్భంలో రాష్ట్రపతి.. జనతా పార్టీ స్వరూప స్వభావాలను విచారించాక కేవలం పార్లమెంటరీ సంప్రదాయాన్ని పాటించారు. 1979లో మొరార్జీ దేశాయ్ రాజీనామా తర్వాత నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కొన్నారు. జనతాపార్టీ చీలికతో మొరార్జీ దేశాయ్ రాజీనామా చేశారు. ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో లోక్సభలో తమకు మెజారిటీ ఉందని, చరణ్సింగ్, జగ్జీవన్రామ్లు తమ మద్దతుదారుల జాబితాను రాష్ట్రపతికి సమర్పించారు. ఇక్కడ వారు ప్రస్తావించిన సభ్యుల సంఖ్య లోక్సభ మొత్తం సభ్యుల సంఖ్యను మించిపోయింది. అయితే రాష్ట్రపతి తన అంతరాత్మ ప్రభోదాన్ని అనుసరించి చరణ్సింగ్ను ప్రధాని పదవిని చేపట్టమని ఆహ్వానించారు. రాష్ట్రపతిగా సంజీవ రెడ్డి అనుసరించిన ఈ పద్ధతి బ్రిటిష్ పార్లమెంటరీ సంప్రదాయాలకు పూర్తిగా భిన్నమైంది. చరణ్సింగ్ రాష్ట్రపతి ఇచ్చిన గడువులోగా లోక్సభ విశ్వాసం పొందకుండానే రాజీనామా చేశారు. అరుుతే జగ్జీవన్రామ్ తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో ఉన్నానంటూ లిఖిత పూర్వకంగా తెలిపినా అవకాశం ఇవ్వకుండా లోక్సభ విశ్వాసం పొందని ప్రధాని చరణ్సింగ్ సలహా మేరకు రాష్ట్రపతి లోక్సభను రద్దు చేశారు. 1990లో వి.పి.సింగ్ ప్రభుత్వం పడిపోవడంతో కాంగ్రెస్ మద్దతుతో చంద్రశేఖర్ ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. కానీ, కొన్ని నెలల్లోనే ఆ ప్రభుత్వం కూడా పడిపోయింది. 1996లో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించడంతో వాజ్పేయ్ని ప్రధానిగా నియమించారు. కానీ లోక్సభ విశ్వాసం పొందలేక ఆ ప్రభుత్వం 13 రోజుల్లోనే రాజీనామా చేసింది. ఆ తర్వాత దేవేగౌడ, గుజ్రాల్ ప్రభుత్వాలు కూడా ఇదే తరహాలో పడిపోయాయి. రాష్ట్రాల్లో కూడా: రాష్ట్రాలలో హంగ్ అసెంబ్లీలు ఏర్పడిన సందర్భాలు తక్కువే. 1965 ఎన్నికల్లో కేరళలో తొలిసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ఏ ఒక్క పార్టీ మరొక పార్టీ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించకపోవడంతో రెండేళ్లపాటు అనిశ్చితి సాగింది. చివరకు ఒక్క సమావేశం జరగకుండానే శాసనసభ రద్దయింది. ఇటీవలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ పరిస్థితే తలెత్తింది. అత్యధిక సీట్లు సాధించిన బీజేపీ ప్రభు త్వ ఏర్పాటుకు అనాసక్తత వ్యక్తపర్చడంతో రెండో పెద్ద పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) నాయకుడైన అరవింద్ కేజ్రీవాల్ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా లెఫ్ట్నెంట్ గవర్నర్ ఆహ్వానించిన పరిణామాన్ని గమనించవచ్చు. హంగ్ పార్లమెంట్- రాజ్యాంగం: ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాని పక్షంలో రాష్ట్రపతి ఏ విధంగా వ్యవహరించాలి? అనే విషయాన్ని రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. ప్రకరణ 75 (1)ని అనుసరించి రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తాడు అని మాత్రమే ఉంది. స్పష్టమైన మెజారిటీ లేనప్పుడు ఏ పద్ధతిని అనుసరించాలి అనేది సంశయమే? పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అన్వయించుకోవాలి. సర్వ విషయాలను, సర్వ సందర్భాలను ఊహించి రాజ్యాంగాన్ని రూపొందించడం సాధ్యం కాదు. అలా చేస్తే రాజ్యాంగం సరళతను కోల్పోయి సంక్లిష్ట సనాతన చట్ట స్వభావాన్ని సంతరించుకొంటుంది. అది ప్రగతికి ఆటంకమే కాకుండా సందర్భహితాన్ని కోల్పోతుంది. అందువల్ల అనుభవాల దృష్ట్యా కొన్ని అలిఖిత రాజ్యాంగ విలువలను, ఆచారాలను సృష్టించి పాటించడం పరిపాటి. దీనికి ఏ రాజ్యాంగం మినహాయింపు కాదు. అయితే మంచి సంప్రదాయాలను ఏర్పరచాల్సి ఉంటుంది. అవిశ్వాస- విశ్వాస తీర్మానం రాజ్యాంగ ప్రకరణ 75(3) ప్రకారం మంత్రిమండలి సంయుక్తంగా లోక్సభకు బాధ్యత వహిస్తుంది. అది లోక్సభలో మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నంత వరకే అధికారంలో కొనసాగుతుంది. ప్రభుత్వంపై విశ్వాసం లేదని ఒక తీర్మానంతో మెజారిటీ సభ్యులు తెలిపితే ప్రభుత్వం రాజీనామా చేయాలి. ప్రభుత్వాన్ని నియంత్రించడానికి, తప్పొప్పులకు బాధ్యున్ని చేయడానికి ఉన్న పార్లమెంటరీ ప్రక్రియగా దీన్ని పేర్కొనవచ్చు. అవిశ్వాస తీర్మానం: ఈ తీర్మానం గురించి రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేదు. పైన పేర్కొన్నట్లు ప్రకరణ 75(3)తో పరోక్ష సంబంధం ఉంది. అయితే ప్రకరణ 118 ప్రకారం ఉభయ సభలు తమ పద్ధతులను, ప్రక్రియలను నిర్దేశించుకొనే అధికారాన్ని కలిగి ఉంటాయి. ఆ ప్రకారం పార్లమెంట్ రూల్స్ అండ్ ప్రోసీజర్సను రూపొందించుకొంది. అందులో భాగంగా లోక్సభ నియమం 198 (1) ప్రకారం లోక్సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. సభ్యులు సంతకాలు చేసి, అవిశ్వాస తీర్మాన నోటీస్ను స్పీకర్కు అందజేయాలి. ఈ నోటీస్కు 50మంది సభ్యుల మద్దతు ఉంటే స్పీకర్ నోటీస్కు అనుమతిస్తాడు. దానిపై సభలో చర్చ ఉంటుంది. ఆ తర్వాత ఓటింగ్ కూడా నిర్వహిస్తారు. మెజారిటీ సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తే ప్రభుత్వం పడిపోతుంది. అవిశ్వాస తీర్మానానికి ప్రత్యేక కారణం సూచించాల్సిన అవసరం లేదు. విశ్వాస తీర్మానం: దీన్ని ‘ట్రస్ట్ మోషన్’ అని కూడా అంటారు. విశ్వాస తీర్మానం గురించి రాజ్యాంగంలోగానీ, పార్లమెంటరీ రూల్స్లో గానీ లేదు. రూల్ 184 కింద సాధారణ తీర్మానం మాదిరిగానే విశ్వాస తీర్మానాన్ని అనుమతిస్తారు. అధికారంలోని పార్టీ మెజారిటీ కోల్పోతే, తిరిగి మెజారిటీ నిరూపించుకోవాలంటూ రాష్ట్రపతి ప్రధానమంత్రిని కోరతాడు. ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రానప్పుడు, ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ముందుకు వచ్చిన నాయకున్ని ప్రధానమంత్రిగా నియమించి, నిర్ణీత గడువులో సభ విశ్వాసాన్ని పొందాల్సిందిగా రాష్ట్రపతి కోరవచ్చు. రాజకీయ సంక్షోభంలో ఎవరు మిత్రులో, శత్రువులో, ఎవరు ఎవరికి మద్దతు ఇస్తారో తెలుసుకొని సంఘటితం కావడానికి కూడా విశ్వాస తీర్మానాన్ని వాడుకోవచ్చు. తక్కువేమీకాదు: ఇంతవరకూ ఏర్పడిన 15 లోక్సభల్లో 26 సార్లు అవిశ్వాస తీర్మానాలను, 12 సార్లు విశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టారు. మొదటి, రెండో లోక్సభల్లో ఎలాంటి తీర్మానాలు ప్రవేశపెట్టలేదు. అత్యధికంగా అవిశ్వాస తీర్మానాలను మూడు, నాలుగో లోక్సభలో ఆరు సార్లు, అతి తక్కువగా 13వ లోక్సభలో ఒక సారి మాత్రమే ప్రవేశపెట్టారు. అతి ఎక్కువ విశ్వాస తీర్మానాలను నాలుగు సార్లు 11వ లోక్సభ ఎదుర్కొంది. మొట్టమొదటి అవిశ్వాస తీర్మానాన్ని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంపై 1963లో ఆచార్య జె.బి.కృపలాని ప్రవేశపెట్టారు. అత్యధికంగా 15 సార్లు అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొన్న ప్రధానమంత్రి ఇందిరా గాంధీ. కానీ వీటిలో ఏ ఒక్క తీర్మానం కూడా నెగ్గలేదు. లాల్ బహదూర్ శాస్త్రి, పి.వి.నరసింహా రావు చెరో మూడు సార్లు, మొరార్జీ దేశాయ్ రెండు సార్లు, రాజీవ్ గాంధీ, వాజ్పేయి ఒక్కోసారి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. క్రియాశీలకం: తొమ్మిదో లోక్సభ (1989) నుంచి ఏ రాజకీయ పార్టీకి ప్రజలు స్పష్టమైన మద్దతు ఇవ్వడంలేదు. వూరిన పరిస్థితుల నేపథ్యంలో హంగ్ పార్లమెంట్ అనివార్యం అవుతోంది. హంగ్ పార్లమెంట్, సంకీర్ణ రాజకీయాల నేపథ్యంలోనే రాష్ట్రపతి పాత్ర క్రియాశీలకమవుతోంది. రాజకీయాలకు అతీతంగా, రాజ్యాంగ సంప్రదాయాలు, ఉత్తమ రాజకీయ సంస్కృతికి అద్దం పట్టేలా రాష్ట్రపతి, గవర్నర్లు వ్యవహరించాలి. అప్పుడే మన రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి ద్విగుణీకృతమవుతుంది. ‘రాజ్యాంగం గొప్పతనం దాన్ని గౌరవించి, అమలు చేసే వారిపై ఆధారపడి ఉంటుంది గానీ, రాజ్యాంగంపై మాత్రమే కాదు. రాజ్యాంగం ఉత్కృష్టమైంది. అయినా పాలించే వారిని బట్టి దానికి విలువ ఉండదు. పాలకులు మంచివారైతే రాజ్యాంగంలో లోపాలున్నా పాలన ఉత్తమంగానే ఉంటుంది’. - డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ‘రాజ్యాంగబద్ధ ప్రభుత్వం పాలనలో ఉండటం పాలకులకు దాసోహం కాదు. స్వేచ్ఛకు, విముక్తికి ప్రతీక’ - అరిస్టాటిల్ మధ్య తేడా? విశ్వాస, అవిశ్వాస తీర్మానాల ఉద్దేశం ఒక్కటే. ప్రభుత్వానికి ఉన్న మెజారిటీని తెలుసుకోవడమే. ప్రక్రియలో కొంత తేడా ఉంటుంది. ఈ మధ్యకాలంలో కేంద్రం, రాష్ట్రాలలో మైనారిటీ ప్రభుత్వాలు ఏర్పడటం, మద్దతు ఇస్తున్న పార్టీలు తర్వాత మద్దతు ఉపసంహరించడం, పార్టీలో చీలికలు రావడం, హంగ్ పార్లమెంట్లు ఏర్పడడంతో ఈ తీర్మానానికి సమకాలీన ప్రాముఖ్యత పెరిగింది. విశ్వాస తీర్మానానికి సభ అనుమతి అవసరం లేదు కానీ అవిశ్వాస తీర్మానానికి సభ అనుమతి ఉండాలి. ఒకవేళ రెండు తీర్మానాలు ఒకేసారి సభ ముందుకు వస్తే విశ్వాస తీర్మానానికి ప్రాధాన్యత ఇస్తారు. బి. కృష్ణారెడ్డి, డెరైక్టర్, క్లాస్-1 స్టడీ సర్కిల్, హైదరాబాద్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement