-
సుదీర్ఘ చర్చ!
► పలు అంశాలపై సమీక్ష ► రెండు గంటల పాటు కేబినెట్ భేటీ ► మూడో వారంలో బడ్జెట్ ఈ నెల మూడో వారంలో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు తగ్గ నిర్ణయాన్ని కేబినెట్ భేటీలో తీసుకున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. రెండు గంటల పాటు కేబినెట్ భేటీ శుక్రవారం సాగడంతో పలు అంశాలపై సుదీర్ఘ చర్చ సాగినట్టు సచివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. సాక్షి, చెన్నై: రాష్ట్ర ముఖ్యమంత్రిగా కే పళనిస్వామి బాధ్యతలు చేపట్టినానంతరం పాలన మీద పట్టు సాధించేందుకు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏర్పడడంతో అందుకు తగ్గ కసరత్తుల్లో పడ్డారు. ఇందుకుగాను శుక్రవారం కేబినెట్ మీటింగ్కు పిలుపు నిచ్చారు. సచివాలయంలో సాయంత్రం నాలుగున్నర గంటలకు మంత్రి వర్గం భేటీ అయింది. ముందుగా దివంగత సీఎం జయలలిత చిత్ర పటం వద్ద నివాళులర్పించినానంతరం మంత్రి వర్గ సమావేశం ప్రారంభవైుంది. రెండు గంటల పాటు పలు అంశాలపై సుదీర్ఘ చర్చతో ఈ సమావేశం సాగినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అసెంబ్లీలో బడ్జెట్ దాఖలు, శాఖల వారీగా నిధుల కేటాయింపులు మీద సమీక్షించి ఉన్నారు. ఈనెల మూడో వారం సభలో బడ్జెట్ దాఖలుకు తగ్గ నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్రపతి ఆమోదంతో తేదీని అసెంబ్లీ కార్యదర్శి మరో రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఇక, హైడ్రోకార్బన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా, నీట్ పరీక్షలకు వ్యతిరేకంగా, ఏడోవ వేతన కమిషన్ సిఫారసుల పరిశీలనకు నియమించిన కమిటీ అధికారాలు, స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు తదితర అంశాలపై చర్చించి కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. అలాగే, కరువు ప్రాంతాల్లో రైతుల్ని ఆదుకునేందుకు తగ్గ చర్యల వేగవంతం, ప్రధాన ప్రతి పక్షాన్ని ఢీకొట్టేందుకు తగ్గ అస్త్రాలపై కూడా చర్చించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక, రాష్ట్రంలో అప్పులు, నిధుల వనరుల మీద సమీక్షించి ఉన్నారు. -
తమిళనాట జల్లికట్టు తరహా మరో ఉద్యమం!
చెన్నై: తమిళనాడులోని కావేరీ డెల్టా ప్రాంతంలో ఉన్న ఓ మారుమూల పల్లె నెడువసల్. ఇంతకుముందు కొబ్బరి చెట్లు, పచ్చని పొలాలు, వేరుశనగ పంటలతో ఆహ్లాదకరంగా ఉండే ఈ గ్రామం.. ఇప్పుడు హైడ్రోకార్బన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనలతో హోరెత్తిపోతోంది. విద్యార్థి సంఘాలు, రాజకీయపార్టీలు, సినీతారలు, పర్యావరణవేత్తలు, పలు స్వచ్ఛంద సంస్థలు వారి పోరాటానికి మద్దతు తెలుపుతున్నాయి. మెరీనా బీచ్లో జల్లికట్టు కోసం చూపిన ఉద్యమ స్ఫూర్తి.. మరోసారి నెడువసల్ లో కనిపిస్తోంది. ఓఎన్జీసీ ఆధ్వర్యంలో ఇక్కడ హైడ్రోకార్బన్ ప్రాజెక్ట్ చేపట్టారు. పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదని చెప్పి నెడువసల్తో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భూములను లీజుకు తీసుకున్నారు. పరిశోధన కోసం తవ్విన హైడ్రోకార్బన్ బావుల వద్ద వెలువడుతున్న నల్లటి బురద లాంటి ఆయిల్ మెల్లగా ఆ ప్రాంతంలో వ్యాపిస్తోంది. దీంతో గ్రామస్తుల్లో ఆందోళన మొదలైంది. ఈ ప్రాజెక్ట్ మూలంగా దీర్ఘకాలంలో ఆరోగ్యం, జీవనోపాధి కోల్పోతామని వారిప్పుడు బలంగా నమ్ముతున్నారు. ఫిబ్రవరి 15న ప్రధానమంత్రి నేతృత్వంలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రాజెక్ట్ ఒప్పందాలను ఆమోదించింది. దీంతో ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఉద్యమబాట పట్టారు. నిరక్షరాస్యులైన తమ కుటుంబపెద్దల నుంచి గతంలో తమ భూములు లాక్కున్నారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పళనిస్వామి సైతం ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు. హైడ్రోకార్బన్ ప్రాజెక్టును ఆపాలని ఆయన ప్రధానిని కోరారు. ఆందోళనలు విరమించాలని పళని స్వామి నెడువసల్ వాసులను కోరారు . అయితే స్పష్టమైన హామీ కేంద్రం నుంచి వచ్చేంతవరకు తమ నిరసన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement