-
ఒకరికి ఒకరు తోడు నీడగా జీవిస్తున్న ఆదర్శదంపతులు..
నీవు లేక సృష్టిలో మానవ ప్రపంచం వికసించి వర్థిల్లడానికి మూలం దాంపత్యం. ఆలుమగల పవిత్ర బంధమే దాంపత్యం. వివాహంతో ప్రారంభమయ్యే దాంపత్యం జీవిత పరిసమాప్తి వరకు తోడూనీడగా కొనసాగుతుంది. సంతాన ఫలాలను పండిస్తుంది. సహజీవన సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది. అనురాగాల తేనెలను చిందిస్తుంది. కష్టసుఖాల్లో ఒకరికొకరి అండతో ఎన్నో అనుభూతులను పలికిస్తుంది. మనో గృహ ప్రాంగణంలో రంగురంగుల ముగ్గులను అలికిస్తుంది. అందుకే దాంపత్యం మానవ జీవితానికి ఒక అమూల్య వరం. అర్థం చేసుకుని జీవిస్తే కష్టాలు..కన్నీళ్లైనా కరిగిపోతాయి. ఇలా ఒకరికి ఒకరు తోడు నీడగా జీవిస్తున్న ఆదర్శదంపతులపై ఈ ప్రత్యేక కథనం.. చీడికాడ(విశాఖపట్నం): ఓర్పే దాంపత్య జీవన గమనానికి పునాదని వృద్ధ దంపతులు బలిరిశెట్టి నారాయణరావు, జయలక్ష్మి దంపతులు చాటి చెబుతున్నారు. నేటి సమాజంలో భార్యాభర్తలు చిన్ని చిన్న వాటికే ఇగోలకు పోయి కాపురాలు నాశనం చేసుకుంటూ ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఆస్తులు లేకపోయినా కన్నవారు అండగా నిలవక పోయినా ఒకరికి ఒకరు తోడుంటే అడవైనా.. ఆశ్రమమైనా స్వర్గమేనని ఈ దంపతులను చూస్తే అర్థమవుతోంది. మాడుగులకు చెందిన బలిరిశెట్టి నారాయణరావు, జయలక్ష్మీలకు 1970లో వివాహమైంది. నారాయణరావు ఎస్ఎస్ఎల్సి వరకు, జయలక్ష్మి 7వ తరగతి చదువుకున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. నారాయణరావు కిరాణాదుకాణంలో రూ.100 జీతానికి గుమాస్తాగా పనిచేస్తూ తల్లితండ్రులు, తమ్ముడు, భార్యాపిల్లలను పోషించేవాడు. ఆదాయం సరిపోకపోవడంతో 40 ఏళ్ల క్రితం విశాఖకు వలస వెళ్లి అద్దింట్లో కాపురం పెట్టారు. అక్కడ నారాయణరావు మరో కిరాణాదుకాణంలో రూ.200 కు గుమాస్తాగా చేరగా జయలక్ష్మి కాలనీలో చిన్నపిల్లలకు ప్రైవేట్లు చెబుతూ రూ.100 సంపాదించేది. ఈ డబ్బుతోనే ఇంటి అద్దె, పిల్లల చదువులు, తల్లిదండ్రుల పోషణకు భారంగా మారేది. ఖర్చులు ఎక్కువ ఆదాయం తక్కువైనా భార్యాభర్తలిద్దరూ పస్తులుండైనా కుటుంబ అవ సరాలు తీర్చుతూ ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశారు. అయితే భార్యభర్తలిద్దరూ ఏనాడు తమ సంపాదనపై కించపరచకోలేదు. ఉన్నదాంట్లోనే సంతోషం వెతుకున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల జయలక్ష్మి అనారోగ్యానికి గురైంది. జయలక్ష్మిని రమ్మని పిల్లలు కోరినా భారం కాకూడదని దంపతులిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేక అప్పలరాజుపురంలోని లలితాదేవి వృద్ధాశ్రమంలో చేరారు. నారాయణరావుకు చెవులు వినిపించవు, అయినా ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ దాంపత్య జీవనానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎవర్నీ ఇబ్బంది పెట్టకూడదనుకున్నాం డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): అందరూ సంతోషంగా ఉండాలి. మా వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు. శేష జీవితం హాయిగా సాగిపోవాలి... అంటూ నగరానికి చెందిన వృద్ధ భార్యాభర్తలు ప్రేమసమాజంలో ఆనందంగా గడుపుతున్నారు. కోరకాన లక్ష్మణరావు, భార్య సుశీల భార్యాభర్తలు. వీరి దాంపత్య జీవితానికి ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. లక్ష్మణరావు 1959లో బిలాస్ స్టీల్ప్లాంట్లో డ్రాఫ్ట్మన్గా విధుల్లో చేరారు. 1993 నవంబర్ 30న పదవీ విరమణ పొందారు. పదవీ విరమణ పొందిన సరిగ్గా ఏడాదికి అంటే..1994 నవంబర్ 30న తన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుమారుడు చనిపోవడంతో కుంగిపోయారు. అప్పటి నుంచి మానసికంగా బాధపడుతూ..మూడేళ్ల కిందట వారిద్దరూ ప్రేమసమాజంలో (పేయింగ్ గెస్ట్గా) చేరారు. ప్రస్తుతం వారు సంతోషంగా..అక్కడ ఉన్న వారితో గౌరవ ప్రదమైన శేష జీవితాన్ని గడుపుతున్నారు. శేష జీవితంగా హాయిగా ఉండాలని కష్టాలు చూశాం. సుఖాలు అనుభవించాం. మాకు కావల్సింది శేషజీవితం హాయిగా సాగిపోవాలి. అది ఇక్కడ దొరికింది. ఉదయం 5 గంటలకు నిద్ర లేస్తాం. 5.15 గంటలకు టీ ఇస్తారు. అనంతరం కాలకృత్యాలు పూర్తయిన తర్వాత కొంతసేపు యోగా అనంతరం పూజ చేసుకుంటాం. టిఫిన్ చేస్తాం. తర్వాత మ్యాగజైన్లు, దినపత్రికలు, పారాయణ చేసుకుంటాం. మధ్యాహ్నం 12.15కు భోజనం చేసిన తరువాత... ఒంటి గంట నుంచి 3 గంటల వరకు నిద్రిస్తాం. 3.15కు టీ ఇస్తారు. 6 గంటలకు భజన కీర్తనల్లో పాల్గొంటాం. సరిగ్గా 7 గంటలకు భోజనం పెడతారు. తర్వాత కొంత సేపు వాకింగ్ చేసి నిద్రిస్తాం. పిల్లలు వస్తుంటారు. పిల్లల్ని ఎంఎస్సీ వరకు చదివించాం. –కోరకాన లక్ష్మణరావు, సుశీల దంపతులు భారం కాకూడదనే.. భర్త తెచ్చే సంపాదనపై ఎప్పుడు చులకనగా మాట్లాడవద్దని ఇచ్చిన దాంట్లోనే ఇల్లు చక్కదిద్దుకుని భర్తతో మంచిగా ఉండాలని నా తల్లి, అత్త చెప్పిన మాటలు ఎప్పుడూ జవదాటలేదు. ఎన్ని ఇబ్బందులెదురైనా ఇద్దరూ సర్దుకుపోయాం. వయస్సు మళ్లిన ఈ సమయంలో ఎవరికీ భారం కాకూడదని భావించే వృద్ధాశ్రమంలో చేరాం. –బి.జయలక్ష్మి ఆమె సహనానికి రుణపడి ఉంటా నా భార్య సహనం మరెవరికీ ఉండదు. ఆమెకు ఏమిచ్చినా తక్కువే. నేనేం చేసినా సర్దుకుపోయేది తప్ప..ప్రశ్నించేది కాదు..నేను పడుతున్న కష్టాన్ని గుర్తించిన వ్యక్తి నా అర్థాంగి. వేడినీళ్లకు చన్నీళ్లుగా కుటుంబ పోషణలో ఆమె పాత్ర నాకంటే ఎక్కువ. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేని బంధం మాది. భగవంతుడు మా ఇద్దరిని ఒకేసారి తన ఒడిలోకి చేర్చుకోవాలని కోరుకుంటున్నాం. – బి.నారాయణరావు -
అపూర్వ జంట..అందరికీ ఆదర్శం
-
ప్రోత్సాహకం ఏదీ!
‘ఆదర్శ దంపతుల’కు మొండిచెయ్యి ⇒ నిధుల మంజూరులో పాలకుల నిర్లక్ష్యం ⇒ ఏళ్ల తరబడి 90 జంటల ఎదురు చూపులు ⇒ బీసీ సంక్షేమ శాఖలో పెరిగిపోయిన దరఖాస్తులు ⇒ ఉన్నతాధికారులకు నివేదించినా ఫలితం లేదు ఇందూరు : శ్రావణ్, సౌమ్య పెద్దలను ఎదిరిం చి, కట్టుబాట్లను వదులుకుని కులాం తర వివాహం చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వం అందించే ప్రోత్సాహక బహుమ తి కోసం 2009లో బీసీ సంక్షేమ శాఖకు దరఖాస్తు చేసుకున్నా రు. ప్రస్తుతం ఆ దంపతులకు సంతానం కలిగి అమ్మా, నాన్నలయ్యారు. పుట్టిన పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. నేడో రేపో స్కూల్కు కూడా వెళ్లే వయస్సు కూడా వచ్చేస్తోంది. నే టి వరకూ ఆ దంపతులకు ప్రభుత్వం నుంచి కులాంతర వివాహ ప్రోత్సాహక బహుమతిని అందజేయలేదు. వచ్చే రూ. పదివేలు ఆసరాగా ఉం టాయనుకున్న ఆ దంపతులు నిధుల కోసం జిల్లా బీసీ సంక్షేమ శాఖ చుట్టూ తిరిగిన సంద ర్భాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిని ఈ ఒక్క జంటే కాదు. ప్రోత్సాహకం కోసం దరఖాస్తు చేసుకున్న 90 జంటలూ ఎదుర్కొంటున్నాయి. అరకొర విదిలింపులు కులాంతర వివాహాలు చేసుకున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కుల, మత భేదాలు లేకుండా ఆదర్శ వివాహా లు చేసుకున్న దంపతులకు నగదు బహుమతులు అందజేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అమలులో మాత్రం పూర్తిగా విఫలమైంది. దీంతో ఆ జంటల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ముఖ్యంగా బీసీల పరిస్థితి దారుణంగా ఉంది. ఆదర్శ వివాహాలు చేసుకున్న దంపతులు ప్రభుత్వం అందిం చే పోత్సాహక బహుమతి కోసం 2009లో జిల్లా బీసీ సంక్షేమ శాఖలో దరఖాస్తులు చేసుకున్నా ఇప్పటి వరకూ అందలేందటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. నిధులు ఇస్తున్నాం అన్నట్లుగా సంవత్సరానికి రూ.20 వేలు మంజూరు చేస్తూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. ఈ నిధులు కేవలం రెండు జంటలకు మాత్రమే సరిపోతారుు. మిగతా జంటలకు నిరాశే మిగులుతోంది. ఏటా పెరుగుతున్న అర్జీలు ఏటా బీసీ సంక్షేమ శాఖకు 20 నుంచి 30 దరఖాస్తులు అందుతున్నాయి. సంవత్సరానికి రెండు జంటలకు సరిపోయే నిధులివ్వడంతో తదుపరి దంపతులు సంవత్స రాల తరబడి వేచి చూడటం తప్పడం లేదు. జిల్లాలో 2009 నుంచి నేటి వరకూ కలిపి మొత్తం 90 జంటలు దరఖాస్తులు చేసుకున్నాయి. నిధులు వస్తే దేనికైనా ఉపయో గపడుతాయనే ఉద్దేశంతో బీసీ సంక్షేమ శాఖ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. సమాధానాలు చెప్పలేని అధికారులు నిధులు వస్తే సమాచారం ఇస్తాం అని విసుక్కుం టున్నారు. 2012-13 సంవత్సరానికిగాను ప్రభుత్వం రూ.40 వేలను జిల్లాకు మంజూరు చేయగా, వాటిని సీనియార్టీ ప్రకారం ఉన్న నాలుగు జంటలకు అందజేశారు. ప్రస్తుతం రూ.80 లక్షలు అవసరం. ఈ నిధులను విడుదల చేయాలని గత రెండు, మూడు సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని, సంబంధిత శాఖ ఉన్నతాధికారులను లేఖల ద్వా రా కోరినా ఫలితం కనబడలేదు. గత నెలలో జిల్లా పరిషత్ స్థాయి సంఘా సమావేశాలలో సైతం తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. బీసీ సంక్షేమ శాఖల దరఖాస్తులు కుప్పలుగా పడి ఉంటున్నాయే తప్పా పరిష్కారం లభించడం లేదు. పెళ్లి చేసుకున్న ఇద్దరు కాస్త సంతానంతో ముగ్గురు, నలుగురిగా మారినా ప్రభుత్వం నుంచి పా రితోషకం అందకపోవడం శోచనీయకరమైన విషయమని బాధిత జంటలు వాపోతున్నారుు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలోనైనా తమకు అందాల్సిన ప్రోత్సహకం అందిస్తే సంతోసిస్తామంటున్నారు. నిధుల కోసం వేచి చూస్తున్నాం కులాంతర వివాహాలు చేసుకున్న బీసీ జంటలకు చాలా సంవత్సరాలు గా ప్రభుత్వం నుంచి నగదు ప్రోత్సహకం అందటం లేదు. ప్రభుత్వం ఏ టా రూ.20వేలు మాత్ర మే మంజూరు చేస్తోంది. అవి ఇద్దరికి మాత్ర మే సరిపోతున్నాయి. మిగతా వారికి అన్యాయం జరగుతోంది. దరఖాస్తుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. అ యితే, 90 జంట లకు రావాల్సిన నిధుల కోసం ప్రభుత్వాలకు, ప్రజాప్రతినిధులకు, జి ల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులకు చాలాసార్లు విన్నవించాం. చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేశాం. చివరికి ప్రతీ నెలా హైదరాబాద్లో జరుగుతున్న ఉన్నతాధికారులు సమీక్షలో కూడా విషయాన్ని తెలుపుతున్నాం. -విమలాదేవి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
ఎప్పుడూ పనీపనీ.. మాతో ఉండవా? అని నా కుమారుడు నిలదీశాడు
గ్రీన్ డ్రెస్లో కరిష్మా కపూర్.. జ్యువెలరీ షోరూంలో సందడి చేసిన భామ (ఫోటోలు)
రిజర్వేషన్లను తొలగించే కుట్ర జరుగుతోంది: నిర్మల్ సభలో రాహుల్
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement