-
నంబర్ ప్లేట్ కావాలా నాయనా!
హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ పేరుతో వాహనదారుల నుంచి డబ్బులు నొక్కేస్తున్నారు. నెలకు లక్షల్లో అక్రమంగా సంపాదిస్తున్నారు. వాహనదారులు ప్రశ్నిస్తే వేధింపులకు పాల్పడుతున్నారు. కంపెనీ ప్రతినిధుల అక్రమాలపై సంబంధిత అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పేట్లలో నాణ్యతకూడా అంతంత మాత్రంగానే ఉంది. నెల్లూరు(టౌన్): హై సెక్యూరిటీ పేరుతో కంపెనీ ప్రతినిధులు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ప్రమాదాలను తగ్గించి ప్రమాణాలను పెంపొందించాలన్న ఉద్దేశంతో హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు వాహనానికి నంబర్ ప్లేట్ను బిగించాల్సి ఉంది. అయితే కంపెనీ ప్రతినిధులు మాత్రం అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అక్రమ వసూళ్లను నియంత్రించాల్సిన రవాణా, ఆర్టీసీ అధికారులు తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ప్లేట్ కోసం ఎదురుచూపులు హైసెక్యూరిటీ నంబర్ ప్లేటు విధానం 2016 జనవరి నుంచి అమలులోకి వచ్చింది. నంబర్ ప్లేట్ల తయారీ కాంట్రాక్ట్ట్ను లింకో ఆటో టెక్ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి వాహనానికీ హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ బిగించుకోవాలని అధికారులు ఆదేశించారు. రిజిస్ట్రేషన్ సమయంలోనే నంబర్ ప్లేట్కు కూడా చలానా చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చలానా చెల్లించిన నాలుగు రోజులకు నంబర్ ప్లేట్ బిగించాల్సిఉంది. అయితే 20 నుంచి 25 రోజులకు పైగా నంబర్ ప్లేట్ కోసం ఎదురుచూడాల్సివస్తోందని వాహనదారులు వాపోతున్నారు. అన్ని రకాల పన్నులతో కలిపి ద్విచక్రవాహనానికి రూ.245, మూడు చక్రాల వాహనాలకు రూ.282, నాలుగు చక్రాల వాహనానికి రూ.619, లారీలకు రూ.650, ట్రాక్టర్ ట్రైలర్కు రూ.900 ధరను నిర్ణయించారు. నంబర్ ప్లేట్ను కంపెనీ ప్రతినిధులే బిగించాల్సిఉంటుంది. అయితే నంబర్ ప్లేట్ నాణ్యత పడిపోయి పలుచటి రేకును వాడుతుండడంతో దెబ్బతింటోందని వాహనదారులు చెబుతున్నారు. నెలకు రూ.3 లక్షల అక్రమార్జన జిల్లాలో నెల్లూరుతోపాటు గూడూరు, కావలి, సూళ్లూరుపేట, ఆత్మకూరు ప్రాంతాల్లో వాహనాలకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రోజుకు సరాసరి 200కు పైగా వివిధ రకాల వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. అయితే నంబర్ ప్లేట్కు చలానా కట్టించుకున్న లింక్ ఆటో టెక్ ప్రతినిధులు సంబంధిత వాహనానికి ప్లేట్ను ఉచితంగా బిగించాలన్న నిబంధన ఉంది. కంపెనీ ప్రతినిధులు మాత్రం నంబర్ ప్లేట్ బిగించినందుకు కారు, రవాణా వాహనాలకు రూ.200 నుంచి రూ.300 వరకు, బైకుకు రూ.50 నుంచి రూ.100 వరకు ఇస్తేనే నంబర్ ప్లేట్ బిగిస్తున్నారు. అదనంగా ఎందుకు ఇవ్వాలని వాహనదారులు అడిగితే కంపెనీ ప్రతినిధులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఈ లెక్కన అన్ని రకాల వాహనాలకు కలిపి సరాసరి రూ.50 ప్రకారం లెక్కిస్తే రోజుకు ఆదాయం రూ.10 వేలు ఉంటోంది. అంటే నెలకు వీరి అక్రమ సంపాదన రూ.3 లక్షల వరకు ఉంటోంది. ఇంటికి వచ్చి వాహనానికి నంబర్ ప్లేట్ బిగిస్తే రూ.200 వసూలు చేస్తున్నారు. ఇలా కంపెనీ ప్రతినిధులు వాహనదారులను దోపిడీ చేస్తున్నారు. చోద్యం చూస్తున్న అధికారులు నంబర్ ప్లేట్ బిగించే విషయంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. కంపెనీ వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన ఆర్టీసీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. రవాణా కార్యాలయంలోనే తమ కళ్ల ముందే కంపెనీ ప్రతినిధులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నా రవాణాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా అదనపు వసూళ్లపై ప్రశ్నిస్తే రవాణా అధికారుల సాయంతో నిబంధనల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని వాహనదారులు వాపోతున్నారు. నంబర్ ప్లేట్ కూడా వాహనానికి సక్రమంగా బిగించడం లేదని చెబుతున్నారు. వాహనానికి ఇచ్చిన రంధ్రాలు, నంబర్ ప్లేట్ సైజు సరిపడకపోవడంతో వంకరటింకరగానే ప్లేట్ బిగించుకోవాల్సివస్తోందని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా కంపెనీ ప్రతినిధుల అక్రమ వసూళ్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. డబ్బులు వసూళ్లు చేస్తున్నారన్న విషయం దృష్టికి వచ్చింది.నంబరు ప్లేటు బిగిస్తే అదనంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారన్న విషయం తన దృష్టికి వచ్చింది. ఈ విషయంపై ఇప్పటికే రవాణాశాఖ కమిషనర్కు ఫిర్యాదు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. వారి మీద చర్యలు తీసుకునే అధికారం మాకులేదు. కొంతమంది వాహన యజమానులు ఎక్కువ డబ్బులు ఇచ్చి నెంబరు ప్లేటును ఇంటికి తీసుకెళ్తుతున్నారు. – ఎన్.శివరాంప్రసాద్, రవాణాశాఖ ఉప రవాణా కమిషనర్ తయారీ వరకే మా పరిధి నంబర్ ప్లేట్ తయారీ వరకే మా పరిధి ఉంది. నాణ్యత ప్రమాణాలుపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారికి దానిని ఫార్వర్డ్ చేస్తాం. మిగిలిన వాటిని రవాణా అధికారులు చూసుకుంటారు. – రవివర్మ, రీజనల్ మేనేజర్, ఆర్టీసీ -
ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు
భువనగిరి: విధి నిర్వహణలో అలసత్వం.. అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే అభియోగంతో భువనగిరి మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న ఈఓపీఆర్డీ వెంకటనర్సయ్య, కూనూరు పంచాయతీ కార్యదర్శి ఎం.ఇంద్రసేనారెడ్డి, చందుపట్ల పంచాయతీ కార్యదర్శి ఎం.నాగరాజులపై సస్పెన్షన్ వేటు వేస్తూ డీపీఓ ప్రభాకర్రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్ఎండీపరిధిలోని కూనూరు, చందుపట్ల గ్రామాల మధ్యన నిబంధనలకు విరుద్ధంగా 54 ఎకరాల వెంచర్ను రియల్ఎస్టేట్ వ్యాపారులు చేశారు. అయితే నిబంధ నలకు విరుద్ధంగా ఉన్న వెంచర్ల హద్దురాళ్లు తొలగించాలని ఇచ్చిన అదేశాలను పంచాయతీ కార్యదర్శులు అమలుచేయలేదు. రియల్ఎస్టేట్ వ్యాపారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసినందునే వారిపై చర్యలు తీసుకోలేకపోతున్నారని అరోపణలు వచ్చాయి. దీంతో డీపీఓ ప్రభాకర్రెడ్డి ఈ నెల23 న చందుపట్ల గ్రామానికి వచ్చి స్వయంగా వెంచర్లపై విచారణ జరిపారు. విధినిర్వహణలో నిర్లక్ష్యం, అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని తేల డంతో, ఈఓ పీఆర్డీ, ఇద్దరు కార్యదర్శులపై సస్పెన్షన్ వేటువేశారు. అక్రమాలకు నిలయంగా.. భువనగిరి ఎంపీడీఓ కార్యాలయం అక్రమాలకు నిలయంగా మారిందని మరో మారు రుజువైంది. ముఖ్యమంత్రి స్వయంగా అక్రమ లేఅవుట్లపై కొరడ ఝలిపించాలని కోరుతుంటే క్షేత్రస్థాయిలో ఉద్యోగులు మాత్రం చేతివాటం చూపుతూనే ఉన్నారు. మండలంలో దీర్ఘ కాలికంగా పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై పలు ఆరోపణలు వస్తున్నాయి. 2002 నుంచి పంచాయతీ కార్యదర్శులుగా ఇక్కడే ఉంటున్న వారు అధికారులను మెప్పించి తమకు అనుకూలమైన గ్రామాలకు ఇన్చార్జ్లుగా బాధ్యతలను స్వీకరిస్తున్నారు. సస్షెన్షన్కు గురైన నాగరాజు వడపర్తిలో పర్మనెంట్ పోస్ట్ ఉండగా అదనంగా చందుపట్ల, ముస్త్యాలపల్లితో పాటు ఇటీవల రాయగిరి గ్రామ పంచాయతీని బలవంతంగా తీసుకున్నారు. రాయగిరిలో పనిచేస్తున్న కార్యదర్శిని అక్కడి విధుల్లోంచి తప్పించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇంద్రసేనారెడ్డి కూడా కూనురు, అనాజిపురం, బండసోమారం గ్రామాలకు కార్యదర్శిగా విధులను నిర్వహిస్తున్నారు. రియల్ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్న గ్రామాల్లో అక్రమ ఆదాయం దండిగా వస్తుందనే కారణంతో ఈ కార్యదర్శుల విధుల్లో కొనసాగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంకా విధులను నిర్లక్ష్యం చేయడంతో పాటు స్థానిక గ్రామపంచాయతీ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని ఫిర్యాదులున్నాయి. అక్రమాలకు పాల్పడుతున్న మరో ఇద్దరిపై కూడా సస్పెన్షన్ వేటు పడనున్నట్టు సమాచారం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement