-
మెసేజ్ కొట్టు.. గుట్కా పట్టు.. సరిహద్దులో జోరుగా సాగుతున్న దందా..
సాక్షి, తానూరు(నిర్మల్): జిల్లా సరిహద్దుల్లో నిషేధిత గుట్కా దందా యథేచ్ఛగా సాగుతోంది. లాక్డౌన్ సాకు చూపి కొరత పేరుతో అధిక ధరలకు విక్రయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు అక్రమార్కులు. సరికొత్త ఎత్తుగడలతో పోలీసులకు చిక్కుకుండా తప్పించుకుంటున్నారు. అంతకుముందు గోదాముల్లో భారీగా నిల్వలు ఉంచి, చిరు వ్యాపారులకు సరఫరా చేసేవారు. ప్రస్తుతం సంబంధిత వ్యాపారి సెల్ఫోన్కు మెసేజ్ చేస్తే చాలు సరుకును నేరుగా దుకా ణాల వద్దకే బైక్లపై చేరవేస్తున్నారు. పక్కా ప్రణాళికతో ... నిషేధిత గుట్కా, ఇతరత్రా నిషేధిత ఉత్పత్తులను సరఫరా చేసే అక్రమార్కులు పోలీసులకు చిక్కకుండా తమ పంథా మార్చుకుంటున్నారు. ఉన్నతాధికారులు దర్యాప్తు చేసినా పట్టుబడకుండా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. గతంలో హైదరా బాద్, నిజామాబాద్ నుంచి గుట్కా తెప్పించేవారు. కరోనా లాక్డౌన్ కారణంగా పోలీసులు తనిఖీలు అధికమయ్యాయి. దీంతో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల మీదుగా ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. నిర్మల్, భైంసాతోపాటు గ్రామీణ మండలాలకు చెందిన వారు కూడా ఈ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తుండటంతో స్థానిక వ్యాపారులు మహారాష్ట్ర వ్యాపారులతో కలిసి ఈ దందా సాగిస్తున్నట్లు సమాచారం. పక్కా ప్రణాళికతోనే సరిహద్దు ప్రాంతాలైన తానూరు, ముధోల్, కుభీర్, కుంటాల, సారంగపూర్, బాసర మండలాల మీదుగా నిషేధిత గుట్కా రవాణా సాగుతోంది. రవాణా ఇలా.. నిషేధిత గుట్కా అర్ధరాత్రి సమయంలో మహారాష్ట్ర నుంచి నిర్మల్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉన్న తా నూరు, ముధోల్, బాసర, కుభీర్, కుంటాల, సారంగాపూర్ మండలాల మీదుగా గుట్టుచప్పుడు కాకుండా తెప్పిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వాహనం బయలుదేరిన వెంటనే వాట్సప్ మెసేజ్ ద్వారా స్థానిక వ్యాపారులకు సమాచారం అందిస్తారు. ఏ గుట్కా ఎన్ని బస్తాలు.. ఎక్కడ దించాలో అప్పుడే సమాచారం ఇస్తారు. ప్రణాళిక ప్రకారమే వాహనం నిర్దేశిత ప్రాంతానికి చేరుకుంటుంది. ఆ తర్వాత వ్యాపారులు ద్విచక్ర వాహనాలపై వెళ్లి సరుకు తెచ్చుకుంటున్నట్లు సమాచారం. ఆ తర్వాత రోజు గ్రామాల వారీగా ద్విచక్ర వాహనాలతోపాటు ట్రాలీ ఆటోల ద్వారా చిరువ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. లాక్డౌన్ పేరుతో దోపిడీ.. కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కారణంగా హైదరాబాద్, నిజామాబాద్ నుంచి గుట్కా సరఫరా నిలిచిపోయింది. చిరువ్యాపారుల వద్ద కూ డా పూర్తిగా నిల్వలు అడుగంటాయి. దీంతో స్థానిక వ్యాపారులు మహారాష్ట్రకు చెందిన వ్యాపారుల సా యంతో గుట్కా దిగుమతి చేసుకుంటున్నారు. గ్రా మాల్లో గుట్కా కొరత ఉండటంతో వ్యసనపరులకు లాక్డౌన్ పేరు చెప్పి భారీగా దోపిడీకి పాల్పడుతున్నారు. గతంలో అంబర్ ప్యాకెట్ రూ.180కి లభించగా.. ప్రస్తుతం రూ.నాలుగు వందల వరకు విక్రయిస్తున్నారు. అలాగే సాగర్, తోట వంటి గుట్కా ప్యాకెట్ల ధరలనూ అమాంతం పెంచి అమ్ముతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సరిహద్దులో కొనసాగుతున్న నిషేధిత గుట్కా వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని జిల్లావాసులు కోరుతున్నారు. అక్రమ రవాణాకు సహకరిస్తే చర్యలు మహారాష్ట్ర నుంచి తెలంగాణకు నిషేధిత గుట్కా అక్రమంగా సరఫరా అవుతున్నట్లు మా దృష్టికి రాలేదు. గతంలో తానూరు, ముధోల్లో దాడులు నిర్వహించి, గుట్కా ప్యాకెట్లు పట్టుకున్నాం. అక్రమ రవాణాకు సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – అజయ్బాబు, సీఐ, ముధోల్ ఇటీవల పట్టుబడిన ఘటనలు.. ► ఐదు నెలల క్రితం ఎల్వత్ గ్రామానికి చెంది న వ్యాపారి కిరాణా షాపులకు గుట్కా ప్యాకె ట్లు సరఫరా చేస్తుండగా పోలీసులు సింగన్గాం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. ► మూడు నెలల క్రితం ఎల్వి గ్రామంలో ఓ వ్యాపారి బైక్పై వెళ్లి దుకాణాలకు గుట్కా ప్యాకెట్లు సరఫరా చేస్తుండగా తానూరు పోలీసులు పట్టుకున్నారు. ► రెండు నెలల క్రితం భైంసా నుంచి తానూరుకు అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను హిప్నెల్లి సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. -
వెండి ఉచ్చు
యువతను పావులుగా వాడుకుంటున్న వైనం ప్రతి గురువారం గుట్టుచప్పుడు కాకుండా రవాణా విద్యార్థుల్లా బ్యాగుల్లో తరలించి, దుకాణాల్లో విక్రయం వాణిజ్య పన్నుల శాఖకు రూ.లక్షల్లో ఆదాయానికి గండి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ.. వెండి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. ఇందుకోసం అక్రమార్కులు కొత్త పుంతలు తొక్కుతూ, యువతను పెడతోవ పట్టిస్తున్నారు. రెండు రోజుల క్రితం అమలాపురం బస్టాండ్ వద్ద 34 కిలోల వెండి వస్తువులను పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు యువకులు పట్టుబడగా, ఇలాంటి యువకులెందరో ఈ అక్రమ దందాలో పావులుగా మారుతున్నట్టు ఆందోళన వ్యక్తమవుతోంది. – అమలాపురం టౌన్ ప్రతి గురువారం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి ఓ బడా వెండి, బంగారు వ్యాపారి కోనసీమలోని అమలాపురం, రాజోలు, మలికిపురం, కొత్తపేట, రావులపాలెం, ముమ్మిడివరం, తాటిపాక తదితర ప్రాంతాలకు ఖరీదైన కార్లలో, చురుకైన యువకుల ద్వారా అక్రమ రవాణా సాగిస్తున్నారు. ఒక్క గురువారం మాత్రమే ఈ రవాణా గుట్టుగా చేస్తారు. గత గురువారం కారులో వచ్చిన ముగ్గురు సభ్యుల ముఠా పి.గన్నవరంలో ఓ దుకాణదారునికి వాటిని విక్రయిస్తుండగా, వారి మధ్య బేరసారాల విషయమై గొడవ జరిగింది. ఆ ముఠా అక్కడ నుంచి కారులో అమలాపురం బయలుదేరింది. పి.గన్నవరం వ్యాపారి ఈ అక్రమ రవాణా సమాచారాన్ని పట్టణ పోలీసులకు ఫోన్లో అందించారు. దీంతో అమలాపురం బస్స్టేçÙన్ వద్ద పోలీసులు నిఘా ఉంచి, వారిని పట్టుకోవడంతో ఈ అక్రమ రవాణా గుట్టు రట్టయింది. దుకాణాలకు చేరేదిలా.. నర్సాపురం నుంచి చించినాడ వంతెన మీదుగా ఖరీదైన కార్లలో, విద్యార్థుల్లా ఉండే కొందరుæయువకులతో కారు సీట్లు లోపల ఉండే రహస్య అరల్లో వెండి, బంగారు వస్తువులు దాచి తరలిస్తారు. వారు వెళ్లిన చోట ఇద్దరు యువకులు బ్యాగుల్లో వెండి, బంగారు వస్తువులను పెట్టుకుని, కాలినడకన దుకాణాలకు వెళతారు. అభరణాలను అక్కడికక్కడే అమ్మి, నగదు కూడా తక్షణమే తీసుకుంటారు. ఫోన్లలో మాటలు ముందుగా జరిగిపోవడంతో, పనులన్నీ చకచకా సాగిపోతాయి. కోనసీమలో ఈ అక్రమ రవాణా వల్ల వాణిజ్య పన్నుల శాఖకు పన్ను ఎగవేత ద్వారా రూ.లక్షల్లో ఆదాయానికి గండి పడుతోంది. నిఘా మరింత పెంచుతాం పన్ను చెల్లింపు లేకుండా జరుగుతున్న వెండి వస్తువుల అక్రమ రవాణాపై ఇక నుంచి మరింత నిఘా పెడతాం. ఇప్పటికే అక్రమ రవాణాతో పన్నులు ఎగవేసే వారిపై చెక్ ఆఫ్ వెహికలర్ ట్రాఫిక్ విధానంతో మూడు దశల్లో నిరంతర తనిఖీలు చేస్తున్నాం. మాకు గూడ్స్ వెహికల్స్ను ఆపి తనిఖీ చేసే అధికారం మాత్రమే ఉంది. కార్లను ఆపి, తనిఖీ చేసే అధికారం లేదు. కార్లలో వెండి వస్తువులను అక్రమ రవాణా నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల్లో నిఘా పెంచుతాం. – కృష్ణప్రసాద్, డీసీటీఓ(అమలాపురం రూరల్)
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement