-
ఎల్ఐసీ మెగా ఐపీవోకు సై...
కొన్ని దశాబ్దాలుగా బీమాకు మారుపేరుగా నిలుస్తున్న ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకి రానుంది. తద్వారా సరికొత్త రికార్డులకు తెరతీయనుంది. దేశీ బీమా రంగంలో 70 శాతం మార్కెట్ వాటాతో పోటీ సంస్థలకు అందనంత ఎత్తులో ఉన్న ఎల్ఐసీ.. గతేడాదిలో తొలి ఏడాది ప్రీమియమే రూ. 1.42 లక్షల కోట్లను తాకడం కంపెనీ బలాన్ని చెబుతోంది. దేశీ కేపిటల్ మార్కెట్లో కంపెనీకున్న పెట్టుబడుల విలువే రూ. 28.74 లక్షల కోట్లుదాటడం విశేషం!! న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) త్వరలో స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్కానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్లో ఇందుకు ప్రణాళికలు వేశారు. దశాబ్దాలుగా జీవిత బీమాకు మారుపేరుగా నిలుస్తున్న ఎల్ఐసీలో వాటా విక్రయాన్ని చేపట్టడం ద్వారా ప్రభుత్వం.. ఆదాయ లోటును పూడ్చుకోవాలని చూస్తోంది. దేశీయంగా అత్యంత విలువైన ఎల్ఐసీలో స్వల్ప వాటాకు సైతం అధిక విలువ చేకూరే అవకాశమున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇటీవల సౌదీ ఇంధన దిగ్గజం అరామ్కో స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్కావడం ద్వారా సాధించిన రికార్డులను దేశీయంగా ఎల్ఐసీ నెలకొల్పే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతేడాది లిస్టయిన అరామ్కో ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డు సాధించింది. ప్రస్తుతం ఎల్ఐసీలో ప్రభుత్వానికి 100 శాతం వాటా ఉంది! బీమా లీడర్ జీవిత బీమా రంగంలో ఎల్ఐసీ 70 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతుంటే.. మిగిలిన 23 కంపెనీలూ 30 శాతం వాటాను పంచుకుంటున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే మార్కెట్లో ఎస్బీఐ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియిల్ లైఫ్, ఐసీఐసీఐ లంబార్డ్ తదితర కంపెనీలు లిస్టయ్యాయి. ప్రభుత్వ ప్రణాళికలు అమలైతే ఎల్ఐసీ సైతం స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యే వీలుంది. తద్వారా మార్కెట్ విలువ(కేపిటలైజేషన్)లో దిగ్గజ కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తదితరాలను వెనక్కి నెట్టే అవకాశముంది. ఇవీ బలాలు ఎల్ఐసీ నిర్వహణలోని ఆస్తుల(ఏయూఎం) విలువ 2019లో తొలిసారి రూ. 30 లక్షల కోట్లను అధిగమించింది. రూ. 31.11 లక్షల కోట్లను తాకింది. వార్షిక ప్రాతిపదికన ఇది 9 శాతంపైగా వృద్ధికాగా.. మార్కెట్ విలువ 2019 మార్చికల్లా రూ. 28.74 లక్షల కోట్లుగా తెలుస్తోంది. గతేడాది(2018–19)లో ఎల్ఐసీ మొత్తం ఆదాయం ప్రీమియంలతో కలిపి రూ. 5,60,784 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 7 శాతం అధికం. ప్రధానంగా తొలి ఏడాది ప్రీమియం విలువే రూ. 1.42 లక్షల కోట్లకు చేరడం విశేషం! అతిచిన్న కేపిటల్ 1956 ఎల్ఐసీ చట్టం ప్రకారం కంపెనీ రూ. 5 కోట్ల కేపిటల్ బేస్తో నడుస్తోంది. రూ. 48,436 కోట్ల మిగులు(లాభం)తో ఉంది. అతిచిన్న ఈక్విటీ కారణంగా ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకి అత్యంత భారీ ప్రీమియం పలికే అవకాశముంది. అయితే ఐపీవో చేపట్టేముందు ఎల్ఐసీ చట్టంలో పలు మార్పులు చేపట్టవలసి ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎల్ఐసీ విక్రయించే అన్ని పాలసీలకూ ప్రభుత్వ హామీతో కూడిన సావరిన్ గ్యారంటీ ఉంటుంది. దీనికితోడు బీమా రంగంలో కంపెనీ ఏర్పాటుకు ఐఆర్డీఏ నిబంధనల ప్రకారం రూ. 100 కోట్ల కేపిటల్ బేస్ ఉండాలి. పెట్టుబడులు ఇలా ప్రభుత్వ రంగ కంపెనీలలో వాటా విక్రయ(డిజిన్వెస్ట్మెంట్) అంశంలో ఎల్ఐసీ పలుమార్లు ప్రభుత్వాన్ని ఆదుకుంటూ వచ్చిన విషయం విదితమే. తద్వారా పలు కంపెనీలలో వాటాలను సొంతం చేసుకోవండంతోపాటు.. డిబెంచర్లు, బాండ్లలోనూ పెట్టుబడులు కుమ్మరించింది. 2019 కల్లా వీటి విలువ రూ. 4.34 లక్షల కోట్లు. అంతేకాకుండా పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సైతం నిధులు సమకూర్చింది. ఈ బాటలో ఇటీవలే కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ రానున్న ఐదేళ్లలో రూ. 1.25 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు నిధులను సమకూర్చేందుకు ముందస్తు అంగీకారం తెలిపినట్లు పేర్కొనడం గమనార్హం! బంగారు బాతు నిజానికి ప్రభుత్వం ఇంతవరకూ చేపడుతున్న డిజిన్వెస్ట్మెంట్కు ఎల్ఐసీ భారీస్థాయిలోనే చేయూతను ఇస్తోంది. తద్వారా పలు ప్రభుత్వ రంగ కంపెనీలలో వాటాలను సొంతం చేసుకుంటూ వచ్చింది. అయితే తాజాగా కేంద్రం ఎల్ఐసీనే డిజిన్వెస్ట్మెంట్ జాబితాలో చేర్చింది. ప్రభుత్వ రంగ కంపెనీలలో వాటాల విక్రయం ద్వారా నిధుల సమీకరణ చేపట్టడాన్ని డిజిన్వెస్ట్మెంట్గా పేర్కొనే సంగతి తెలిసిందే. కాగా.. ఎల్ఐసీ లిస్టయితే కార్పొరేట్ పాలన మెరుగుపడే వీలున్నట్లు విశ్లేషణలు ఉన్నాయి. కంపెనీ అపార మిగులు నిధులను ఇన్వెస్ట్ చేసే అంశంలో ఆచితూచి అడుగేయవలసి రావచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. ►దేశీ కేపిటల్ మార్కెట్లో అరామ్కో తరహా లిస్టింగ్ను ఎల్ఐసీ సాధించే వీలున్నట్లు జాతీయ స్టాక్ ఎక్సే్ఛంజీల సభ్యుల అసోసియేషన్(ఏఎన్ఎంఐ) ప్రెసిడెంట్ విజయ్ భూషణ్ పేర్కొన్నారు. ఈ దశాబ్దపు ఐపీవోగా నిలిచే వీలున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. ►ఎల్ఐసీ లిస్టింగ్వల్ల కార్పొరేట్ గవర్నెన్స్, పారదర్శకతకు మెరుగుపడతాయని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండీ కృష్ణ కుమార్ కార్వా పేర్కొన్నారు. తద్వారా ప్రభుత్వానికి మరిన్ని నిధుల సమీకరణ అవకాశాలు లభిస్తాయని అంచనా వేశారు. ►ఎల్ఐసీ ఐపీవో కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్సే్ఛంజీ మధ్యంతర సీఈవో బాటు నాయర్ చెప్పారు. దీంతో ప్రైమరీ మార్కెట్లకు జోష్ వస్తుందని తెలియజేశారు. ►ఎల్ఐసీ లిస్టయితే మార్కెట్లకు సానుకూల సంకేతాలు అందుతాయని ట్రేడింగ్ బెల్స్ సహవ్యవస్థాపకులు, సీఈవో అమిత్ గుప్తా పేర్కొన్నారు. నిధుల సమీకరణకు జోష్ వ్యతిరేకిస్తున్నాం: యూనియన్లు ఎల్ఐసీలో వాటాను విక్రయించడం జాతి ప్రయోజనాలకు విరుద్ధమంటూ ఉద్యోగ సంఘాలు(యూనియన్లు) వ్యాఖ్యానించాయి. ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేశాయి. దేశ ఆర్థిక వృద్ధికి ఎల్ఐసీ పలు విధాలుగా తోడ్పడినట్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. దేశ ఆర్థిక సార్వభౌమత్వం ప్రమాదంలో పడినట్లు వ్యాఖ్యానించారు. ఎల్ఐసీలో వాటా విక్రయానికి ప్రభుత్వం ముందుకెళితే.. దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. -
ఫసల్ బీమా.. ఇచ్చేనా ధీమా!
పీఎం ఫసల్ బీమా యోజనలో టమాటాకు దక్కని చోటు వాతావరణ బీమాలో అవకాశమున్నా పెరిగిన ప్రీమియం వేరుశనగకు బీమాకు గడువు మరో నాలుగు రోజులే ఇంతవరకు వచ్చిన దరఖాస్తులు రెండు శాతమే ఈదఫా కూడా రైతన్నలకు బీమా దక్కడం సందేహంగా మారింది. జిల్లాలోని పడమటి మండలాల్లో ఎక్కువగా సాగయ్యే టమాటాకు ప్రధానమంత్రి ఫసల్ బీమాలో చోటు దక్కలేదు. పోనీ వాతావరణ ఆధారిత బీమాలో అయినా ఉపశమనం లభిస్తుందా అనుకుంటే ప్రీమియం రూ.2,500కు పెంచేశారు. కనీసం లోనీ ఫార్మర్స్కైనా బ్యాంకులో బీమా కవర్ అవుతుందనుకుంటే రుణమాఫీ ఎఫెక్ట్తో కొత్త రుణాలు అంతంత మాత్రమే. ఇక వేరుశనగ, వరి రైతులకన్నా బీమా దక్కుతుందనుకుంటే అది మూన్నాళ్లముచ్చటే. రెండ్రోజుల క్రితం బీమా గురించి ప్రకటన వచ్చింది. గడువు మరో నాలుగు రోజులే మిగిలింది. ఇన్ని సమస్యల మధ్య ఈ ఖరీఫ్లో బీమాతో రైతులకు ధీమా కనిపించడం లేదు. పలమనేరు: కేంద్ర ప్రభుత్వ సరికొత్త ఫసల్ బీమా యోజనలో రైతులు చెల్లించాల్సిన ప్రీమియం కేవలం రెండుశాతం మాత్రమే. మిగిలిన వాటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. జిల్లాలో ఎక్కువగా వేరుశనగ ఆపై టమాటా సాగుచేస్తారు. మదనపల్లె డివిజన్లో ఏటా టమాటా సాగు 11వేల హెక్టార్లుగా ఉండగా ఈ ఖరీఫ్లో 6వేల హెక్టార్లుగా ఉంది. కానీ ఈ పథకంలో టమాటాను చేర్చలేదు. దీంతో రైతులు వ్యవసాయ ఆధారిత బీమానే నమ్ముకోవాల్సి వస్తోంది. ఇందులో రైతులు చెల్లించాల్సిన ప్రీమియం 50శాతం కాబట్టి రైతులు బీమాపై ఆసక్తి చూపడం లేదు. వేరుశనగకు సమీపిస్తున్న గడువు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ప్రీమియం చెల్లించేందుకు ఈనెల 15న ఆఖరు తేదీగా గడువు నిర్ణయించారు. రెండ్రోజుల క్రితం బీమాకు సంబంధించిన వివరాలను తెలిపి మరో నాలుగు రోజుల్లోనే ఆఖరు గడవు పెట్టడంతో రైతులు బీమా చేసుకోలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఈదఫా 1.40 లక్షల హెక్టార్లలో వేరుశెనగ సాగవుతోంది. పలమనేరు డివిజన్లో 15,800 హెక్టార్లలో వేరుశనగ సాగవుతుండగా ప్రీమియం చెల్లించిన రైతులు 120 మంది విస్తీర్ణం కేవలం వంద హెక్టార్లు మాత్రమే. వరి సాగు చేసిన రైతులదీ ఇదే పరిస్థితి. జిల్లాలోని అన్ని డివిజన్లలోనూ ఇలాగే ఉంది. ఇప్పటిదాకా జిల్లాలో బీమా చేసుకున్న నాన్లోనీలు (బ్యాంకులో రుణం పొందని రైతులు) వారు కేవలం 2శాతం మంది మాత్రమే. ఇక నాలుగు రోజుల్లో వ్యవసాయశాఖ ఎంత విస్తృతప్రచారం చేసినా బీమా చేసుకునే రైతులు పదిశాతం మంది కూడా జరిగేలా లేదు. ఎన్నో తిరకాసులు పీఎం ఫసల్ బీమాలో రైతు చెల్లించాల్సిన ప్రీమియం రెండుశాతం మాత్రమే. అయితే ఇందులో టమాటాను చేర్చలేదు. వ్యవసాయాధారిత బీమాలో మాత్రం టమాటాకు అవకాశం కల్పించినా రైతు 50శాతం ప్రీమియం చెల్లించాలి. ఆలెక్కన హెక్టారుకు రూ,2.500 చెల్లించడం రైతులకు ఇబ్బందే. పోనీ బ్యాంకుల్లో రుణాలు పొందినవారికి బీమా కవర్ అవుతుంనుకుంటే అక్కడ రుణాలు మాఫీ కాకపోవడంతో సగం మందికి కొత్త రుణాలు రాలేదు. ఇక రైతులే సొంతంగా బీమా చేద్దామంటే ఇన్పుట్ సబ్సిడీ రాదేమోననే అనుమానం ఉంది. గతంలో బీమా ఉన్న రైతుల పేర్లను ఇన్పుట్ సబ్సిడీ జాబితానుంచి తొలగించారు. ఆఖరుకు బీమాను పొందలేని రైతులు ఇన్పుట్ సబ్సిడీగా ఎకరానికి రూ.100 నుంచి 500 లోపు పొందారు. అందిన నగదు అప్పట్లో బ్యాంకుల ఖాతాలు తెరవడానికి కూడా చాలకుండా పోయింది. ఈ అనుభవాల మధ్య వేరుశనగ, టమాటా రైతులు బీమా చెల్లించేందుకు ఆసక్తిని చూపడం లేదు. బ్యాంకుల్లో పుట్టని కొత్త రుణాలు రైతు రుణమాఫీ దెబ్బతో గతంలో రుణం ఉన్నవారికి కొత్త రుణాలను ఇచ్చేందుకు బ్యాంకర్లు సుముఖత చూపడం లేదు. ఆ లెక్కన రెన్యూవల్ చేసుకోలేని వారికి కొత్త రుణాలు రానట్టే. రుణ మాఫీ జాబితాలో ఉన్నా.. పూర్తిగా రుణం చెల్లించనివారు బ్యాంకర్ల లెక్కలో బకాయిదారులే. ఇలా ఉండగా లోనీఫార్మర్స్(బ్యాంకులో రుణం కొత్తగా పొందేవారు)కు అటు టమాటాకు ఇటు వేరుశనగకు పంట బీమా పొందే అవకాశం ఉంది. కానీ రీషెడ్యూల్ చేసుకున్న వారు లేదా అప్పు చెల్లించిన రైతులకు మాత్రమే కొత్త రుణాలు దక్కుతున్నాయి. దీంతో రుణాలు చెల్లించని రైతులకు బ్యాంకులో బీమా దక్కనట్టే. బీమా చేసుకుంటే చాలా మేలు పీఎం ఫసల్ బీమాలో టమాటాకు బీమాచేసుకునే అవకాశం లేనిమాట ని జమే. అయితే బజాజ్ అలయన్స్ వారి ద్వారా వాతావరణ ఆధారిత బీమాతో వచ్చేనెల 9దాకా ప్రీమియం చేసుకోవచ్చు. హెక్టారుకు రూ.2,500 కట్టాలి. ఈ ప్రాంత రైతులకు బీమా ఎంతో మేలుగా ఉంటుంది. కానీ ఇప్పటిదాకా 2శాతం కూడా లక్ష్యం ముందుకెళ్లలేదు. -సుబహానీ, ఏడీ హార్టికల్చర్, పలమనేరు డివిజన్ నాలుగురోజులే గడువు మాకు ఆదేశాలు వచ్చి రెండ్రోజులయింది. మరో నాలుగు రోజుల్లో వరి, వేరుశెనగ బీమా ఆఖరు గడవు. ఆలోపు రైతులు బీమా చేసుకోవాలి. గడవు పెంచే అవకాశాలైతే కనిపించడం లేదు. ఇప్పటిదాకా ఓ రెండు శాతం మంది రైతులు ప్రీమియం చెల్లించారు. మేం కూడా ప్రచారం చేస్తున్నాం. -విశ్వనాథరెడ్డి, వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?
సర్వీస్ అంటే ఇలా ఉంటుందా.. ఆశ్చర్యపోయిన ఆనంద్ మహీంద్రా
చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్
“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్
జితేందర్ రెడ్డి ట్రైలర్ విడుదల
వెళ్తూ వెళ్తూ...!
తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!
కేకేఆర్తో మ్యాచ్.. అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్
"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్
ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
తప్పక చదవండి
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- భయపడకు.. పారిపోకు: రాహుల్పై ప్రధాని మోదీ సెటైర్లు
Advertisement