-
జిన్నా హౌస్పై సిగపట్లు!
భారత్–పాక్ల మధ్య కొనసాగుతున్న వివాదాల్లోకి తాజాగా జిన్నా హౌస్ వచ్చి చేరింది. ముంబైలోని జిన్నా హౌస్ తమదంటే తమదంటూ భారత్, పాకిస్తాన్లు వాదిస్తున్నాయి. ఆ హౌస్ను తమ అధీనంలోకి తెచ్చుకుంటామని, ఉన్నత స్థాయి అధికార సమావేశాలకు, విందులకు అనువుగా తీర్చిదిద్దుతామని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించడం తాజా వివాదానికి తెర తీసింది. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ మాదిరిగా జిన్నా హౌస్ను అభివృద్ధి చేయాలని భారత్ భావిస్తోంది. దక్షిణ ముంబైలోని మలబార్ హిల్ బీజేపీ ఎమ్మెల్యే మంగల్ ప్రభాత్ లోధాకు ఈ నెల 5న రాసిన లేఖలో సుష్మా ఈ విషయం వెల్లడించారు. ప్రస్తుతం ఇది ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అధీనంలో ఉంది. ప్రధాని కార్యాలయం ఆదేశాల మేరకు దాన్ని విదేశాంగ శాఖకు బదలాయించడానికి చర్యలు తీసుకుంటున్నామని సుష్మా పేర్కొన్నారు. జిన్నా హౌస్ తమ సొంతమని భారత్ స్పష్టంగా చెబుతుంటే.. అది తమదని, దాన్ని సొంతం చేసుకునేందుకు భారత్ ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని పాక్ అంటోంది. గతంలో కూడా జిన్నాహౌస్ తమకివ్వాలని, అందులో పాక్ దౌత్య కార్యాలయం పెడతామని పాక్ చెబుతోంది. అయితే జిన్నా హౌస్ భారత ఆస్తి అని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ స్పష్టం చేశారు. పాక్కు దీనిపై ఎలాంటి హక్కు లేదని, ఒకవేళ హక్కు కోసం ప్రయత్నిస్తే తామూ పోరాడుతామని పేర్కొన్నారు. మరోవైపు జిన్నా హౌస్పై పూర్తి హక్కులు తమకే ఉన్నాయని పాక్ విదేశాంగ ప్రతినిధి మహ్మద్ ఫైజల్ అన్నారు. పాక్ కర్తార్పూర్ను ఇస్తుందా..? జిన్నాహౌస్ను ఇస్తే కర్తార్పూర్ను భారత్కు ఇస్తారా అన్న ప్రశ్నకు ఫైజల్ బదులిస్తూ అలా ఎప్పటికీ జరగదన్నారు. సిక్కుల కోరిక మేరకు కర్తార్పూర్కు వీసా లేకుండా వెళ్లివచ్చే అవకాశం కల్పించామని, ఈ నిర్ణయంలో భారత్కు కూడా భాగముందని వివరించారు. జిన్నాహౌస్పై తనకు యాజమాన్య హక్కు కల్పించాలని కోరుతూ జిన్నా కుమార్తె దినా వాడియా 2007 ఆగస్టులో ముంబై హైకోర్టులో పిటిషన్ వేశారు. జిన్నా ఏకైక వారసురాలిని తానే కాబట్టి తనకు ఆ ఇల్లు అప్పగించాలని కోరారు. ఆమె మరణించడంతో ఆమె కుమారుడు నస్లీవాడియా ఈ కేసును నడిపిస్తున్నారు. ఐరోపా శిల్పశైలికి ప్రతీక పాక్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా 1936లో జిన్నా హౌస్ను నిర్మించుకున్నారు. ముంబై మలబార్ హిల్లో సముద్రానికి అభిముఖంగా ఉన్న ఈ భవంతికి ప్రముఖ ఐరోపా ఆర్కిటెక్చర్ క్లాడ్ బాట్లే ఐరోపా శిల్పశైలిలో అద్భుతంగా రూపకల్పన చేశారు. దేశ విభజన జరిగి పాకిస్తాన్ (కరాచి)వెళ్లే వరకు జిన్నా ఈ ఇంట్లోనే ఉన్నారు. అప్పట్లోనే దీని నిర్మాణానికి రూ.2 లక్షలు ఖర్చయింది. రెండున్నర ఎకరాల్లో విస్తరించిన ఈ భవంతి నిర్మాణానికి ఇటాలియన్ పాలరాయిని వాడారు. 1944 సెప్టెంబర్లో దేశ విభజనపై గాంధీ, జిన్నాల మధ్య చర్చలు ఈ ఇంట్లోనే జరిగాయి. 1946 ఆగస్టు 15న నెహ్రూ, జిన్నాలు ఇక్కడే చర్చలు జరిపారు. -
ట్రంప్కు ఇండియా షాక్
- పాక్ తో చర్చల్లో అమెరికా మధ్యవర్తిత్వానికి నో న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానన్న అమెరికా ప్రకటనకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది. ఈ(భారత్-పాక్ చర్చల) విషయంలో డొనాల్డ్ ట్రంపేకాదు, ఏ ఇతర మూడో వ్యక్తి లేదా సంస్థల జోక్యాన్ని సహించబోమంటూ పరోక్షంగా హెచ్చరించింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించడం, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడం తదితర అంశాల్లో భాగంగా భారత్- పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న వివాదాలను రెండు దేశాలే పరిష్కరించుకోవాలన్న విధానానికే కట్టుబడి ఉన్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. తద్వారా మూడో వ్యక్తి ప్రమేయాన్ని మరోసారి నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. భారత్, పాక్ మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చేందుకు ట్రంప్ జోక్యం చేసుకోనున్నట్లు ఐక్యరాజ్యసమితిలో అమెరికా శాశ్వత రాయబారి నిక్కీ హాలే ప్రకటన చేసిన నేపథ్యంలో భారత ప్రభుత్వ తన విధానాన్ని మరోసారి తెలియజేసింది. భారత్-పాక్ మధ్య సంబంధాల విషయంలో ట్రంప్ పరిపాలన వర్గానికి ఆందోళన ఉన్నదని, సమస్యలను ఎలా పరిష్కరిస్తే బాగుంటుందో ఆ విధంగా ముందుకు వెళ్లాలని ట్రంప్ సర్కారు భావిస్తున్నట్లు నిక్కీ హేలీ చెప్పుకొచ్చారు. (చదవండి: ఇండియా, పాక్ విషయంలో రంగంలోకి ట్రంప్!)
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
పశ్చిమాసియా ఘర్షణ ఆర్థికానికి చేటే!
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement