-
ధోనిని ఇలాంటి స్టైల్లో ఎప్పుడైనా చూశారా?
-
టీమిండియా కెప్టెన్సీ రేసులో అతడు కూడా! జట్టులో చోటుకే దిక్కులేదు!
India Future Captain Candidates: పొట్టి ఫార్మాట్లో టీమిండియా తదుపరి కెప్టెన్ ఎవరన్న అంశంపై గత కొంతకాలంగా క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మూడు ఫార్మాట్లకు సారథిగా ఉన్న రోహిత్ శర్మ వయసు(35 ఏళ్లు) దృష్ట్యా, విశ్రాంతి పేరిట వరుస సిరీస్లకు అతడు దూరమవుతున్న నేపథ్యంలో కొత్త కెప్టెన్ ఆవశ్యకత గురించి ఇప్పటికే పలువురు మాజీలు తమ అభిప్రాయాలు వెల్లడించారు. రోహిత్ తర్వాత పాండ్యానే! ఇక ద్వైపాక్షిక సిరీస్లలో రోహిత్ నేతృత్వంలో అదరగొట్టిన టీమిండియా ఆసియా కప్, ప్రపంచకప్-2022 టోర్నీల్లో వైఫల్యం చెందిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ రెండు ప్రధాన టీ20 టోర్నీల్లో బ్యాటర్గా, కెప్టెన్గా హిట్మ్యాన్కు మంచి మార్కులు పడలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే రోహిత్ గైర్హాజరీలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా టీ20 జట్టుకు నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఐర్లాండ్తో సిరీస్ గెలవడం సహా కివీస్ గడ్డపై కూడా ట్రోఫీ గెలిచి సత్తా చాటాడు పాండ్యా. ఈ క్రమంలో త్వరలోనే టీ20 పూర్తి స్థాయి కెప్టెన్గా అతడి నియామకం ఖరారు కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ మరో కొత్త పేరును తెరమీదకు తెచ్చాడు. పాపం రోహిత్.. పాండ్యాతో పాటు అతడు కూడా రేసులో ఢిల్లీలో ఆదివారం జరిగిన ఫిక్కీ(ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) ఈవెంట్కు గౌతీ హాజరయ్యాడు. ఈ సందర్భంగా క్రికెట్కు సంబంధించిన విషయాలు ప్రస్తావనకు రాగా.. కెప్టెన్సీ అంశం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఐసీసీ ఈవెంట్లో ప్రదర్శనను బట్టి రోహిత్ శర్మ కెప్టెన్సీని జడ్జ్ చేయడం సరికాదన్న గంభీర్.. అతడిపై విమర్శలు దురదృష్టకరం అని పేర్కొన్నాడు. ఇక హిట్మ్యాన్ తర్వాత టీమిండియా కెప్టెన్గా హార్దిక్ పాండ్యాకు అవకాశం ఉందని గౌతీ అభిప్రాయపడ్డాడు. జట్టులో చోటే లేదు! కెప్టెనా? అయితే, పృథ్వీ షా కూడా భావి భారత జట్టు కెప్టెన్ కాగల అర్హత కలవాడని గంభీర్ పేర్కొనడం విశేషం. కాగా గతేడాది శ్రీలంక పర్యటనలో భాగంగా చివరిసారిగా టీమిండియా తరఫున ఆడిన షా.. ఇప్పటి వరకు మళ్లీ జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. అంతర్జాతీయ టెస్టులాడి కూడా రెండేళ్లకు పైనే అయింది. ఫిట్నెస్ లేని కారణంగా ఇదిలా ఉంటే.. 2019లో యాంటీ- డోపింగ్ టెస్టులో విఫలమైన పృథ్వీ షా.. కొన్నాళ్లపాటు క్రికెట్ ఆడకుండా నిషేధం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఫిట్నెస్పై దృష్టి సారించడంలో విఫలమైన అతడు.. ఈ ఏడాది మార్చిలో యో-యో టెస్టులో విఫలమయ్యాడు. ఈ క్రమంలో దేశవాళీ టోర్నీలో సత్తా చాటుతున్నప్పటికీ టీమిండియాలో మాత్రం చోటు దక్కించుకోలేకపోతున్నాడు. pic.twitter.com/KXYHcUcBR0 — Prithvi Shaw (@PrithviShaw) July 30, 2019 ఇలా జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న షా గురించి గంభీర్ మాట్లాడుతూ.. ‘‘జట్టు కూర్పు గురించి బయట చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. నిజానికి సెలక్టర్లు, కోచ్లు ఎన్నో రకాలుగా ఆలోచించాల్సి ఉంటుంది. 15 మందిని సెలక్ట్ చేయడం కాదు.. అందులో ఎవరు సరైన వాళ్లో చూసుకోవాలి. అందుకే అతడి పేరు సూచించా పృథ్వీ షా దూకూడైన కెప్టెన్. విజయవంతమైన సారథిగా అతడికి పేరుంది. ఆటగాడిగా కూడా అతడు భేష్. అందుకే టీమిండియా భవిష్యత్ కెప్టెన్గా నేను అతడి పేరును సూచించాను’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. గంభీర్ వ్యాఖ్యలపై స్పందించిన నెటిజన్లు... ‘‘జట్టులో చోటే లేని ఆటగాడు కెప్టెన్ అవుతాడా? ఏం మాట్లాడుతున్నావు గంభీర్?’’ అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, పృథ్వీ షా సత్తా గురించి తెలుసుకాబట్టే గౌతీ ఇలా అన్నాడంటూ అతడి అభిమానులు సమర్థించుకుంటున్నారు. చదవండి: WC 2023: టీమిండియా ప్రధాన సమస్య అదే! ఉన్నదే 25 మ్యాచ్లు.. ఇకనైనా కళ్లు తెరిచి.. Ind Vs NZ: అసలేం చేస్తున్నారు.. టీమిండియాను భ్రష్టు పట్టించకండి: నెహ్రా ఘాటు వ్యాఖ్యలు! కోచ్గా లక్ష్మణ్.. -
టీమిండియా పూర్తిస్థాయి కెప్టెన్గా..! టీ20 ప్రపంచకప్ టోర్నీలో..
India vs West Indies T20 Series: వెస్టిండీస్తో టీ20 సిరీస్లో భాగంగా ఆఖరి మ్యాచ్లో టీమిండియాకు మరోసారి కెప్టెన్గా వ్యవహరించే అవకాశం దక్కించుకున్నాడు హార్దిక్ పాండ్యా. నామమాత్రపు ఐదో టీ20కి రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో అతడి స్థానంలో సారథిగా బాధ్యతలు చేపట్టాడు. ఇక ఈ మ్యాచ్లో భారత జట్టు ఏకంగా 88 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అద్భుత విజయం! లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ను భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయి దెబ్బకొట్టారు. దీంతో 15.4 ఓవర్లకే పూరన్ బృందం చాపచుట్టేసి ఓటమిని ఆహ్వానించింది. అక్షర్కు మూడు, కుల్దీప్నకు మూడు, బిష్ణోయికి నాలుగు వికెట్లు దక్కాయి. మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 15 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు కూల్చిన అక్షర్ పటేల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇక ఫ్లోరిడా వేదికగా సాగిన ఈ ఆఖరి మ్యాచ్లో విజయంతో భారత జట్టు 4-1తో టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది. కచ్చితంగా చేస్తాను! ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పూర్తిస్థాయి టీ20 కెప్టెన్గా ఉండే అవకాశం వస్తే బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారా అనే ప్రశ్న అతడికి ఎదురైంది. ఇందుకు బదులుగా హార్దిక్.. ‘‘కచ్చితంగా! ఎందుకు సిద్ధంగా ఉండను? ఒకవేళ భవిష్యత్తులో నాకు ఈ అవకాశం వస్తే అంతకంటే సంతోషం మరొకటి ఉండదు. అయితే, ఇప్పుడు మా దృష్టి మొత్తం ప్రపంచకప్ మీదే ఉంది. అంతకంటే ముందు ఆసియా కప్ ఆడాల్సి ఉంది. జట్టుగా సమిష్టిగా ముందుకు సాగుతూ శాయశక్తులు ఒడ్డుతున్నాం. నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటున్నాం. విజయాలను ఆస్వాదిస్తున్నాం. అదే సమయంలో తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాం. నా వరకైతే మేము టీ20 ప్రపంచకప్ టోర్నీకి వందకు వంద శాతం సిద్ధంగా ఉన్నామనే అనుకుంటున్నా’’ అని చెప్పుకొచ్చాడు. కాగా ఐర్లాండ్తో టీ20 సిరీస్కు కెప్టెన్సీ చేసిన హార్దిక్ పాండ్యా అద్భుత విజయం అందుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు ఐపీఎల్-2022లో కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్కు టైటిల్ అందించి సారథిగా సత్తా చాటాడు. చదవండి: Asia Cup 2022: ఆసియా కప్కు భారత జట్టు.. అయ్యర్కు నో ఛాన్స్! హుడా వైపే మొగ్గు! Dressing room POV! 👌 👌 𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦: Captain @ImRo45's speech after #TeamIndia's successful tour of the West Indies & USA. 👏 👏 - By @28anand Watch the special feature 🎥 🔽https://t.co/m0C5nsgJDG pic.twitter.com/qKsm6hRuEJ — BCCI (@BCCI) August 8, 2022 -
టీ20 కెప్టెన్ పదవికి కొహ్లీ గుడ్ బై
-
కోహ్లి సంచలన నిర్ణయం.. టీ20 కెప్టెన్సీకి గుడ్బై!
Virat Kohli-T20 Captaincy: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడించాడు. యూఏఈ, ఒమన్ వేదికగా జరుగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీకి వీడ్కోలు పలకనున్నట్లు తెలిపాడు. ఈ విషయం గురించి బీసీసీఐ కార్యదర్శి జై షా, అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నాడు. అయితే వన్డే, టెస్టుల్లో మాత్రం కెప్టెన్గా కొనసాగుతానని స్పష్టం చేశాడు. ఈ మేరకు కోహ్లి ట్విటర్ వేదికగా ఓ లేఖను విడుదల చేశాడు. ‘‘టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడమే కాకుండా.. కెప్టెన్గా జట్టును ముందుండి నడిపించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నాను. సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, సెలక్షన్ కమిటీ, నా కోచ్లు, ప్రతీ భారతీయుడికి కృతజ్ఞతలు. మీ మద్దతు లేకుండా ఇదంతా సాధ్యమయ్యేదే కాదు. 8-9 ఏళ్లుగా మూడు ఫార్మాట్లలో ఆడుతుండటం, గత 5-6 ఏళ్లుగా కెప్టెన్సీ కారణంగా వర్క్లోడ్ ఎక్కువైంది. కాస్త విశ్రాంతి కోరుకుంటున్నా. వన్డే, టెస్టు కెప్టెన్సీపై దృష్టి సారించాలనుకుంటున్నాను. టీ20 కెప్టెన్గా నా బెస్ట్ ఇచ్చాను. ఇకపై బ్యాట్స్మెన్గా కూడా అదే తరహా ప్రదర్శనతో ముందుకు సాగుతాను. నిజానికి చాలా రోజుల కిందటే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా సన్నిహితులతో చర్చించాను. లీడర్షిప్ గ్రూపులో కీలకమైన రవి భాయ్, రోహిత్తో కూడా మాట్లాడాను. అందుకే దుబాయ్లో అక్టోబరులో జరుగనున్న టీ20 వరల్డ్కప్ ముగిసిన తర్వాత టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతా. ఈ విషయం గురించి సెక్రటరీ జై షా, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో మాట్లాడాను. వన్డే, టెస్టు కెప్టెన్గా నా శక్తిమేర జట్టును ముందుకు నడిపిస్తాను’’ అని కోహ్లి పేర్కొన్నాడు. కాగా కోహ్లి నిర్ణయంతో వైస్ కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ను ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన హిట్మ్యాన్కు టీమిండియా టీ20 కెప్టెన్సీ దక్కడం లాంఛనమే కానుంది. ఇందుకు సంబంధించి బీసీసీఐ నుంచి అధికారికి ప్రకటన వెలువడాల్సి ఉంది. (చదవండి: Sustainable Cities and Society Study: ఆరు అడుగుల భౌతిక దూరం సరిపోదు) T20 World Cup: అశ్విన్కు అది కన్సోలేషన్ ప్రైజ్ లాంటిది.. తుదిజట్టులో ఉంటాడా? 🇮🇳 ❤️ pic.twitter.com/Ds7okjhj9J — Virat Kohli (@imVkohli) September 16, 2021
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement