-
కుటుంబంలో అందరికీ సోకదు
అహ్మదాబాద్: కరోనా సోకిన వ్యక్తి ఉన్న కుటుంబంలో అందరికీ ఆ వైరస్ సోకుతుం దని చెప్పలేమని తాజా అధ్యయనంలో తేలింది. కోవిడ్–19 నిర్ధారణ అయిన వ్యక్తి ఉన్న కుటుంబంలోని దాదాపు 80% నుంచి 90% సభ్యులకు ఆ వైరస్ సోకకపోవచ్చని తేలింది. అందుకు కారణం వారిలో ఆ వైరస్ నిరోధక శక్తి పెరగడమే కావచ్చని గుజరాత్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనంలో స్పష్టమైంది. ‘వైరస్ సోకిన వ్యక్తిని కలిసిన అందరికీ అది సోకుతుందని చెప్పలేం. అదే నిజమైతే, కోవిడ్–19 నిర్ధారణ అయిన కుటుంబంలోని అందరికీ ఆ వైరస్ సోకాలి కదా?. కానీ అలా జరగడం లేదు. కోవిడ్–19తో చనిపోయిన వ్యక్తి ఉన్న కుటుంబాల్లో కూడా ఎవరికీ ఆ వైరస్ అంటుకోని ఉదాహరణలున్నాయి’అని ఆ సంస్థ డైరెక్టర్ దిలీప్ మవలాంకర్ వివరించారు. కుటుంబ సభ్యులకు వైరస్ సోకే అవకాశాలపై అం తర్జాతీయంగా ప్రచురితమైన 13 పరిశోధనల ఆధారంగా ఈ అధ్యయనం చేశామన్నారు. అహ్మదాబాద్లో కేసు ల సంఖ్య భారీగా పెరిగి, ఆ తరువాత ఒక్కసారిగా తగ్గాయని, అందుకు కారణం హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడమే కావ చ్చని వివరించారు. యూనివర్సిటీ కా లేజ్ ఆఫ్ లండన్ న్యూరో సైంటిస్ట్ కార్ల్ ఫ్రిస్టన్ ప్రతిపాదిం చిన ‘ఇమ్యూనలాజికల్ బ్లాక్ హోల్’సిద్ధాంతం ప్రకారం జనాభాలో 50% మందికి వైరస్ సోకదని వివరించారు. ఇమ్యూనిటీ, ఇళ్లకే పరిమితమవడం.. మొదలైనవి అందుకు కారణాలన్నారు. 17 లక్షలు దాటిన కేసులు దేశంలో కోవిడ్ కేసులు 16 లక్షలు దాటిన రెండు రోజుల్లోనే 17 లక్షల మార్కును దాటాయి. ఆదివారం కొత్తగా 54,735 కేసులు బయట పడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 17,50,723కు చేరుకుంది. గత 24 గంటల్లో 853 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కోలుకున్న వారి సంఖ్య 11,45,629కి చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 5,67,730గా ఉంది. గత నాలుగు రోజులుగా వరుసగా రోజుకు 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 65.44 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 2.13 శాతానికి పడిపోయిందని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 32.43 శాతం యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. 24 గంటల్లో 51,225 మంది కోలుకున్నట్లు పేర్కొంది. -
తొలిసారి ఎంపీహెచ్ కోర్సు
నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ సాక్షి, హైదరాబాద్ : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో తొలిసారి మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఎంపీహెచ్) కోర్సుకు సోమవారం నోటిఫికేషన్ జారీ అయింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సంస్థ ఈ కోర్సులను ఆఫర్ చేస్తోంది. రెండేళ్ల కాలపరిమితి కలిగిన ఈ కోర్సుకు ఏదైనా డిగ్రీ 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. దీనికి వయోపరిమితి లేదు. 20 సీట్లు కన్వీనర్ కోటా కింద, 16 సీట్లు యాజమాన్యకోటా కింద భర్తీ చేస్తారు. కన్వీనర్ కోటా సీట్లకు రెండేళ్లకు కలిపి రూ.2.25 లక్షలు, యాజమాన్య కోటా సీట్లకు కలిపి రూ.2.55 లక్షలు చెల్లించాలి. దరఖాస్తుదారులు రూ. 3 వేలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి. జ్ట్టిఞ://్టటఠజిట.్చఞ.జీఛి.జీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 29 నుంచి దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ 18న ఆన్లైన్లో హైదరాబాద్, విజయవాడల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు ఎన్టీఆర్ వర్సిటీ రిజిస్ట్రార్ పేర్కొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
అమేథీపై తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్?
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- ఆ సమయంలో నా బాయ్ఫ్రెండ్ భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్కుమార్
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- దాడులు, దౌర్జన్యాలు, దమనకాండే టీడీపీ అజెండా
- అమరజీవికి అవమానం
- సడన్ బ్రేక్... జీవితాలనే మార్చేసింది
Advertisement