-
ఇందిరమ్మ ఇళ్ల బకాయిల చెల్లింపు!
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల బకాయిలను చెల్లించాలని నిర్ణయించినట్లు గృహనిర్మాణ మంత్రి ఎ.ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. శాసనసభలో గృహ నిర్మాణ శాఖ వార్షిక బడ్జెట్ పద్దులపై గురువారం జరిగిన చర్చలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. రాష్ట్ర ఆవిర్భావం నాటికి అసంపూర్తిగా మిగిలిన 4,12,218 ఇందిరమ్మ గృహాలకు బిల్లులు చెల్లించాల్సి ఉండగా వీటిలో అర్హులైన లబ్ధిదారులకే బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు. అర్హుల గుర్తింపు కోసం సర్వే నిర్వహించగా 2,09,012 గృహాల లబ్ధిదారులు అర్హులని, మరో 1,29,633 మంది లబ్ధిదారులు అనర్హులని తేలిందన్నారు. మిగిలిన 73,573 గృహాల సర్వే పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు. ఇప్పటివరకు అర్హులకు రూ.396.63 కోట్లు చెల్లించామని, మరో రూ.1133.55 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. బీసీల స్థితిగతులపై బీసీ కమిషన్ నివేదిక రాగానే ఎంబీసీలకు స్వయం ఉపాధి పథకాల కింద రాయితీ రుణాలను పంపిణీ చేస్తామన్నారు. ఏపీలోని 23 బీసీ కులాలను బీసీ జాబితాలో చేర్చే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. కులాంతర వివాహాలు చేసుకున్నవారికి అందించే రూ.10 వేల ప్రోత్సాహకాన్ని పెంచే ప్రతిపాదనను సైతం ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. -
మోడల్ హౌజ్ ప్రారంభమెప్పుడో ?
బేల: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ప్రక్కన 2013 సంవత్సరంలో నిర్మాణ పనులు ప్రారంభించిన మోడల్ హౌజ్ నేటికి ప్రారంభానికి నోచుకోవడం లేదు. దాదాపు భవనం పనులు పూర్తి అయినప్పటికి అలంకార ప్రాయంగానే మిగిలిపోయింది. ఈ భవనానికి తలుపులు, కిటికిలు బిగింపు సైతం పూర్తి అయింది. కేవలం వైట్వాష్ వేసేస్తే మోడల్ హౌజ్ పూర్తి అయ్యే అవకాశం ఉన్నప్పటికి, దీన్ని అధికారులు పట్టించుకోకపోవడంతో నిరుపయోగంగా మారింది. 2013సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం రూ.2.50 లక్షల వ్యయంతో మండల కేంద్రంలో ఒక మోడల్ హౌజ్ నిర్మించడానికి నిధులు విడుదల చేసింది. మండల కేంద్రంలో ఇలా ఏర్పాటు చేసిన మోడల్ హౌజ్ నమూనాతో మండల వాసులు ఇందిరమ్మ గృహలను నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఈ భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. గత మూడు సంవత్సరాలుగా కొద్దిపాటి పనులతో ఈ మోడల్ భవనం అసంపూర్తిగా మిగిలిపోయింది. ఇకనైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి, ఈ అసంపూర్తి భవన నిర్మాణ పనులు పూర్తి చేయించి ప్రారంభిస్తే మండల కేంద్రంలో పనిచేసే సంబంధిత అధికారులకు మరో నూతన కార్యాలయం అందుబాటులోకి వస్తుందని మండలవాసులు అంటున్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల బకాయిలు ఇవ్వరా?
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా రెండు పడక గదుల ఇళ్లను పేదలకు అందివ్వని ప్రభుత్వం.. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ విమర్శించారు. అసలు చెల్లించే యోచన ఉందా లేదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు, డీకే అరుణ ఆరోపణలు ప్రత్యారోప ణలు చేసుకోవడంతో పరిస్థితి కాస్త వేడెక్కింది. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో డీకే అరుణ మాట్లాడుతుండగా సభలోకి వచ్చిన హరీశ్ రావు కాసేపు వేచి ఉండి.. ఆమె ప్రశ్న అడక్కుండా ఏదేదో మాట్లాడుతున్నారంటూ పేర్కొన్నారు. దీంతో డీకే అరుణ ఆగ్రహానికి గురయ్యారు. ‘ఆయన సభలోకి రాగానే నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు. నేను నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. నా మాటలకు అడ్డు తగలాల్సిన అవసరమేముంది. హామీ ఇచ్చినట్టుగా ఇళ్లు కట్టకుంటే ప్రశ్నించొద్దా, అసలు బిల్లులు చెల్లించే ఉద్దేశం ఉందా లేదా’ అని ప్రశ్నించారు. దీంతో స్పీకర్ మధుసూదనాచారి జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కది ద్దారు. -
ఇందిరమ్మ ఇళ్లపై విజిలెన్స్ తనిఖీలు
* రెండు జిల్లాల్లో వెయ్యి ఇళ్ల పరిశీలన * డీఎస్పీ ప్రసాదరావు బొబ్బిలి, బొబ్బిలి రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, బిల్లులు చెల్లింపులపై క్షేత్ర స్థాయి తనిఖీలు నిర్వహిస్తున్నామని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ బి. ప్రసాదరావు చెప్పారు. బొబ్బిలి మార్కెట్ కమిటీలో పౌరసరఫరాల గోదాంను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలిసిన విలేకరులతో మాట్లాడుతూ బొబ్బిలి మండలం చింతాడ, డెంకాడ మండలంలోని ఒక గ్రామంలో 400 ఇళ్లను పరిశీలిస్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి మండలం కేసరిపురం, సీతంపేట మండలంలో పెదరామ, జి.సిగడాం మండలం వాండ్రంగి గ్రామాల్లో 600 ఇళ్లను పరిశీలిస్తున్నామన్నారు. క్షేత్ర స్థాయిలో మంజూరైన ఇళ్లు నిర్మించారా, అవి ఏయే స్థాయిలో ఉన్నాయి, వాటికి ఇప్పటి వరకు అందిన బిల్లులు అసలు అందాయా లేదా తదితర అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నట్టు తెలి పారు. ఇందిరమ్మ ఇళ్లల్లో అక్రమాలపై ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో ఆరా తీసామన్నారు. పౌరసరఫరాల గోదాంలు, రేషను డిపోలు కూడా పరిశీలి స్తున్నామన్నారు. బొబ్బిలిలోని గోదాం పక్కనే చెత్త డంపింగ్ చేయడం ఆహార ఉత్పత్తులకు ప్రమాదకరమని గతంలో నివేదిక ఇచ్చినా మార్పు కనిపించలేదన్నారు. వీటిపై మళ్లీ నివేదిక ఇస్తామన్నారు. పరిశీలనలో విజిలెన్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎస్.త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. చింతాడలో విజిలెన్సు దర్యాప్తు ఇందిరమ్మ ఇళ్లపై శ్రీకాకుళం విజిలెన్సు డీఎస్పీ ప్రసాదరావు ఆధ్వర్యంలో విజిలెన్సు సీఐలు ప్రదీప్కుమార్, రేవతమ్మలు శుక్రవారం దర్యాప్తు నిర్వహించారు. గ్రామంలో అప్పట్లో మంజూరైన ఇళ్లను పరిశీలించి పంచాయితీ కార్యాలయానికి చేరుకుని పలు వివరాలు నమోదు చేసుకున్నారు. వారివెంట విజిలెన్సు ఎస్ఐ అప్పలనాయుడు ఉన్నారు. -
బిల్లులో జాప్యం.. కుటుంబం ఆత్మహత్యాయత్నం
రెండేళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో ఇటుకల వ్యాపారి మనస్తాపం భార్య, కొడుకుతో కలసి ప్రభుత్వ కార్యాలయం పైనుంచి దూకే యత్నం ఖమ్మంలో ఘటన.. నిధులు రాగానే ఇచ్చేస్తామన్న అధికారులు ఖమ్మం: ఇందిరమ్మ బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండడంతో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సాక్షాత్తూ జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి కార్యాలయ భవనం పైనుంచి కిందకు దూకే యత్నం చేసింది. మంగళవారం ఖమ్మంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎన్నిసార్లు తిరిగినా.. వీఆర్పురం మండలం రేఖపల్లికి చెందిన చీమల వెంకటేశ్వర్లు ఇటుకల తయారీ వ్యాపారం చేస్తున్నారు. 2013-14 ఏడాదిలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో లబ్ధిదారులకు ఇటుకలు సరఫరా చేసేందుకు అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.11 లక్షల విలువ చేసే ఇటుకలను సరఫరా చేశారు. వీటి బిల్లులు వెంకటేశ్వర్లుకు అందించాల్సి ఉంది. అయితే రూ.6.33 లక్షలు చెల్లించిన గృహ నిర్మాణ శాఖ అధికారులు మిగిలిన డబ్బులు చెల్లించడం లేదు. దీనిపై వెంకటేశ్వర్లు పలుమార్లు భద్రాచలం డీఈ నారాయణ, ఇతర అధికారులను కలిసినా ఫలితం లేకుండా పోయింది. మంగళవారం వెంకటేశ్వర్లు తన భార్య సరోజ, కొడుకు కృష్ణార్జున్తో కలసి మరోసారి జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి కార్యాలయానికి వచ్చారు. బిల్లుపై అడగ్గా.. అధికారులు స్పందించలేదు. దీంతో మనస్తాపం చెందిన వెంకటేశ్వర్లు.. భార్య, కొడుకుతో కలసి కార్యాలయ భవనం పైనుంచి దూకే ప్రయత్నం చేశారు. కుమారుడు కృష్ణార్జున్ వెంట తీసుకువచ్చిన కిరోసిన్ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే అక్కడికి చేరుకున్న పోలీసులు ముగ్గురిని స్టేషన్కు తరలించి వారిపై ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేశారు. బిల్లులు రాగానే చెల్లిస్తాం వెంకటేశ్వర్లుకు బిల్లు చెల్లించాల్సిన విషయం వాస్తవమే. రూ.11 లక్షలకుగాను రూ.6.33 లక్షలు చెల్లించాం. మిగిలిన డబ్బులు చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నాం. బిల్లుల్లో జాప్యం వల్లే చెల్లించలేకపోయాం. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే డబ్బులు ఇస్తాం. - వైద్యం భాస్కర్, పీడీ గృహ నిర్మాణశాఖ
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement