-
పుట్టినరోజునాడే తొలి టైటిల్
ఇండోర్: ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ యువతార సాకేత్ మైనేని కెరీర్లో మరో గొప్ప విజయాన్ని సాధించాడు. ఆదివారం ముగిసిన ఇండోర్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో విజేతగా అవతరించాడు. హోరాహోరీగా జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 451వ ర్యాంకర్ సాకేత్ 6-3, 6-7 (4/7), 6-3తో టాప్ సీడ్, ప్రపంచ 118వ ర్యాంకర్ అలెగ్జాండర్ నెదోవ్యెసోవ్ (కజకిస్థాన్)పై సంచలన విజయం సాధించాడు. ఆదివారం తన 27వ పుట్టిన రోజును జరుపుకున్న సాకేత్ ఈ గెలుపుతో కెరీర్లో తొలి ఏటీపీ చాలెంజర్ టోర్నీ టైటిల్ను జమ చేసుకున్నాడు. రెండు గంటల ఒక నిమిషంపాటు జరిగిన అంతిమ పోరులో ఈ వైజాగ్ క్రీడాకారుడు 12 ఏస్లు సంధించడంతోపాటు ఐదు డబుల్ ఫాల్ట్లు చేశాడు. విజేతగా నిలిచిన సాకేత్కు 7,200 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 4 లక్షల 41 వేలు)తో పాటు 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఇండోర్ ఓపెన్ ఫైనల్లో సాకేత్
ఇండోర్: అద్భుతమైన ఫామ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ యువతార సాకేత్ మైనేని ఇండోర్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో సాకేత్ 6-2, 6-1తో రామ్కుమార్ రామనాథన్ (భారత్)పై గెలిచాడు. ఈ విజయంతో సాకేత్ తన కెరీర్లో తొలిసారి ఓ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ 118వ ర్యాంకర్ అలెగ్జాండర్ నెదోవ్యెసోవ్ (కజకిస్థాన్)తో సాకేత్ తలపడతాడు. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ-దివిజ్ శరణ్ (భారత్) జంట రన్నరప్గా నిలిచింది. ఫైనల్లో యూకీ-దివిజ్ ద్వయం 6-2, 4-6, 3-10తో నెదోవ్యెసోవ్ (కజకిస్థాన్)-మెనెన్దెజ్ (స్పెయిన్) జోడీ చేతిలో ఓడిపోయింది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement