-
ఇలలో ఇంద్రభవనం: నూతన పార్లమెంట్ భవన విశేషాలు
కొత్త పార్లమెంటు ఇంద్రభవనాన్ని తలపిస్తోంది. మిర్జాపూర్ కార్పెట్లు, నాగపూర్ టేక్ వుడ్, త్రిపుర వెదురు ఫ్లోరింగ్, రాజస్తాన్ శిల్పకళాకృతులతో మన దేశ ప్రత్యేకత అయిన భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా ధగధగలాడిపోతోంది. ఏక్ భారత్ శ్రేష్టభారత్ అన్న ప్రధాని మోదీ నినాదం అడుగడుగునా కనిపించేలా వివిధ రాష్ట్రాల్లో పేరు పొందిన సామగ్రితో భవన నిర్మాణం జరిగింది. కలర్స్ ఆఫ్ ఇండియాను తలపించేలా కలర్ ఫుల్ గా ఉన్న పార్లమెంట్ భవన విశేషాలు.. ► పార్లమెంటు భవన నిర్మాణంలో వినియోగించిన ఎరుపు, తెలుపు శాండ్ స్టోన్ను రాజస్థాన్లోని సర్మథుర నుంచి తెచ్చారు. ఢిల్లీలోని ఎర్రకోట, హుమాయూన్ సమాధి ఈ రాతితో చేసిన నిర్మాణాలే. ► భవన నిర్మాణంలో తలుపులు, కిటికీలకు వాడిన టేకు చెక్కని మహారాష్ట్ర నాగపూర్ నుంచి తెప్పించారు. ► రాజస్తాన్ ఉదయపూర్ నుంచి కెషారియా గ్రీన్ స్టోన్, అజ్మీర్ సమీపంలోని లఖ నుంచి రెడ్ గ్రానైట్, అంబాజీ నుంచి తెల్ల పాలరాయిని వాడారు ► పార్లమెంటులో అమర్చిన కళ్లు చెదిరే ఫర్నిచర్ను ముంబైలో చేయించారు. ► లోక్సభ, రాజ్యసభ ఫాల్స్ సీలింగ్లో వాడిన ఉక్కుని కేంద్ర పాలిత ప్రాంతమైన డామన్, డయ్యూ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. ► భవనంలోకి సహజంగా గాలి వెలుతురు వచ్చేలా ఉత్తరప్రదేశ్ లోని నోయిడా, రాజస్థాన్ రాజ్ నగర్ నుంచి జాలీల రాయిని తెప్పించి వేయించారు ► లోక్సభ, రాజ్యసభ చాంబర్లలో అశోక చక్రం డిజైన్ ఆకృతి అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, రాజస్తాన్ జైపూర్ నుంచి ఈ డిజైన్ రూపొందించడానికి కావాల్సిన సామాగ్రిని తీసుకువచ్చారు. ► శిల్ప కళాకృతుల్ని రూపొందించడానికి ఉదయ్పూర్ నుంచి వచ్చిన శిల్పులు రేయింబవళ్లు శ్రమించారు. ► అహ్మదాబాద్ ఇత్తడిని వాడారు. ► త్రిపుర రాష్ట్రంలో లభించే అరుదైన వెదురుతో తయారు చేసిన ఫ్లోరింగ్పై యూపీలోని మిర్జాపూర్లో తయారు చేసిన కార్పెట్లను పరిచారు. ► సనాతన సంప్రదాయాలు ఉట్టిపడేలా, వాస్తు శాస్త్రాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని దేశంలో వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన 5 వేల కళాకృతులైన బొమ్మలు, పెయింటింగ్లు, కొన్ని ఫోటోలను ఏర్పాటుచేశారు. రెండు భవనాలకి ఎంత తేడా..! 1- పాత భవనంలో లోక్సభ సభ్యులు 543 మంది రాజ్యసభలో 250 మంది కూర్చొనే సదుపాయం ఉంది. అదే కొత్త భవనంలో సామర్థ్యాన్ని బాగా పెంచారు. లోక్సభలో 888 మందికి రాజ్యసభలో 300 మందికి సీట్లు ఏర్పాటు చేశారు. 2- బ్రిటిష్ ఆర్కిటెక్ట్ సర్ ఎడ్విన్ ల్యుటెన్స్, హెర్బర్ట్ బేకర్ పాత భవనం డిజైన్ చేస్తే, కొత్త పార్లమెంటు భవనాన్ని అహ్మదాబాద్కు చెందిన హెచ్సీపీ డిజైన్ ఆధునికంగా రూపొందించింది. ప్రముఖ ఆర్కిటెక్ట్ బిమల్ పటేల్ పర్యవేక్షణలో డిజైన్ రూపొందించారు. 3- పాత భవనం గుండ్రంగా ఉంటూ 24, 281 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తే, కొత్త భవనాన్ని త్రిభుజాకారంలో 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. 4- పాత భవనం నిర్మాణం రెండు అంతస్తుల్లో ఉంటే, కొత్తది 4 అంతస్తుల్లో నిర్మించారు. 5- పాత నిర్మాణానికి ఆరేళ్లు పడితే కొత్త భవనాన్ని రెండున్నర ఏళ్లలో నిర్మించారు. 6- 1927లో ప్రారంభోత్సవం జరుపుకున్న పాత భవనానికి అప్పట్లోనే రూ.85 లక్షలైతే , కొత్త భవనానికి వెయ్యి కోట్ల వరకు ఖర్చు అయింది. 7- పాత భవనంలో ఉభయ సభల సంయుక్త సమావేశాల కోసం సెంట్రల్ హాలులో నిర్మిస్తే, కొత్త భవనంలో లోక్సభ చాంబర్నే ఉభయ సభల సభ్యులు ఒకేసారి కూర్చొనేలా ఎక్కువ సీట్లతో సిద్ధంచేశారు. 8- పార్లమెంటు పాత భవనంలో అగ్ని ప్రమాద నిరోధక వ్యవస్థ అత్యంత ఆందోళనకరంగా ఉండేది. కొత్త భవనంలో అత్యంత ఆధునిక వ్యవస్థలన్నీ ఒక ప్రణాళిక ప్రకారం అమర్చారు. అందుబాటులో ఉన్న డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించి సీసీటీవీ, ఆడియో వీడియో వ్యవస్థ, ఓటింగ్కు బయోమెట్రిక్ వ్యవస్థ, ట్రాన్స్లేషన్ వ్యవస్థలు, ప్రోగ్రామబుల్ మైక్రోఫోన్స్, రీసౌండ్లు వినిపించకుండా వర్చువల్ సౌండ్ సిస్టమ్ వంటివన్నీ ఏర్పాటు చేశారు. భూకంపాలు వస్తే తట్టుకునే వ్యవస్థ ఏర్పాటు చేశారు. 150 ఏళ్లు చెక్కు చెదరకుండా ఉండేలా భవన నిర్మాణం సాగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
'విద్యార్థుల తరఫున ప్రభుత్వంపై పోరాడతాం'
హైదరాబాద్ : విద్యార్థుల తరఫున ప్రభుత్వంపై పోరాడతామని వారికి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి భరోసా ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్లోని ఇందిరాభవన్లో రఘువీరారెడ్డిని ఏపీలో మెడికల్ అడ్మిషన్లు పొందని విద్యార్థులు కలిశారు. ఈ సందర్బంగా రఘువీరారెడ్డితో వారు మాట్లాడుతూ... ఏపీ మెడికల్ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. బీసీ,ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 250 మెడికల్ సీట్లు దక్కకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మెడికల్ సీట్లు 900 పెరిగినా.. తమ న్యాయం జరగలేదన్నారు. మంత్రులకు మెడికల్ కాలేజీలు ఉండటం వల్లే... ఈ పరిస్థితి నెలకొందని వారు... రఘువీరాకు వివరించారు. ఈ నేపథ్యంలో రఘువీరారెడ్డి పైవిధంగా స్పందించారు. అంతకుముందు ఇందిరాభవన్లో మహాత్మా గాంధీ 147వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రఘువీరారెడ్డి, రాజ్యసభ ఎంపీ కేవీపీతోపాటు పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మనిషి ఆశాజీవిగానే ఉండాలి: చిరంజీవి
మనిషి జీవితానికి, ఉగాది పచ్చడికి అవినాభావ సంబంధం ఉందని కేంద్ర మంత్రి చిరంజీవి విపులీకరించారు. ఉగాది పచ్చడి రుచి ఎలా ఉంటుందో మనిషి జీవితం కూడా అలానే ఉంటుందని ఆయన విశదీకరించారు.ఆ రెండు షడ్ రుచుల సమాహారమే అని తెలిపారు. సోమవారం నగరంలోని ఇందిరాభవన్లో జరిగిన జయనామ సంవత్సర ఉగాది వేడుకలలో చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ... విభజన నేపథ్యంలో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్న నిరాశ చెందవద్దని ఆయన పార్టీ కార్యకర్తలకు హితవు పలికారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు భవిష్యత్త్పై ఆశలను వదులుకోవద్దని సూచించారు. మనిషి ఆశాజీవిగానే ఉండాలన్నారు. ఆశావాదంతో పని చేస్తూ పోతే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఉంటుందని అన్నారు. తెలుగు ప్రజలందరికి ఈ సందర్బంగా చిరంజీవి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఉగాది వేడుకలలో మాజీ మంత్రులు డొక్క మాణిక్య వర ప్రసాద్, సీ. రమచంద్రయ్య తదితరులు హాజరైయ్యారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement