-
శిశుగృహపై చిన్నచూపు!
మంకమ్మతోట : తల్లిదండ్రులు వదిలేసిన.. అనాథలుగా దొరికిన శిశువులను చేరదీసి సంరక్షించే శిశుగృహ భవన నిర్మాణంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నట్లు కనిపిస్తోంది. శిశుగృహలోని పిల్లలకు మరిన్ని వసతులు, సౌకర్యాలు, మెరుగైన సంరక్షణ అందించాలనే సంకల్పంతో చేపట్టిన భవనం పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. జిల్లాలో శిశుగృహ కు ప్రత్యేక భవనమంటూ లేకపోవడంతో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గృహాన్ని కొనసాగిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని బాలసదన్లో రెండుగదుల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో పిల్లల ఆలనాపాలన చూసేందుకు సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శిశువులకు గాలి, వెలుతురుతోపాటు ఆహ్లాదరకమైన వాతావరణం ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారని భావించిన సర్కారు.. మెరుగైన వసతుల కోసం ప్రత్యేక భవన నిర్మాణానికి సంకల్పించింది. బాలసదన్ ఆవరణలోని ఖాళీస్థలంలో పనులు చేపట్టేందుకు ఉపక్రమించింది. పనులు పూర్తిచేసినప్పటికీ అందులో సౌకర్యాలు మాత్రం పూర్తిగా కల్పించడంలో విఫలమైంది. దాదాపు ఆర్నెల్లుగా ఇదే పరిస్థితి ఉన్నా.. అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. భవనానికి నిధులు బాలసదన్ ఆవరణలోగల స్థలంలో శిశుగృహ భవన నిర్మాణానికి రూ.13లక్షలు మంజూరు చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ భవన నిర్మాణం చేపట్టింది. ఆగస్టుకు ముందే పూర్తయింది. భవనం లోపల పనులతోపాటు మరుగుదొడ్డి పైప్లైన్, సెప్టిక్ ట్యాంక్ వంటి పనులు చేపట్టాల్సి ఉంది. ఈ సౌకర్యాలు కల్పించేందుకు ఎస్టిమేషన్ నివేదిక అందించారు. ఈ పనులు పూర్తికావాలంటే మరో 9లక్షలు అదనంగా మంజూరు చేయాలని కోరారు. నివేదిక పరిశీలించిన కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ సెప్టెంబర్ 23న స్వయంగా శిశుగృహభవనాన్ని సందర్శించి పనులు పరిశీలించారు. అధికారులు తెలిపిన వాటిలో కొన్ని తగ్గించి రూ.4లక్షలు మంజూరు చేశారు. అయినా.. ఇప్పటివరకు పనులు పూర్తికావడం లేదు. కలెక్టర్ పర్యవేక్షణలో జరుగుతున్న శిశుగృహ భవనం ఆలస్యం కావడమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అనుమతి ఉందా..? శిశుగృహా భవన నిర్మాణానికి సంబంధించి నగరపాలక సంస్థ నుండి అనుమతి పొందలేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. నగర పాలక సంస్థ సంబంధిత శాఖ అధికారులు వారంక్రితం అనుమతి తీసుకోలేదని తెలుపుతూ నిర్మాణం చుట్టకొలతలు తీసుకున్నట్లు సమాచారం. పూర్తి చేయాల్సిన పనులు మరుగుదొడ్డి పైప్లైన్ నిర్మాణం, సెప్టిక్ ట్యాంక్, పిల్లలు కిందపడకుండా భవనం ముందు అరుగుకు ఫెన్సింగ్, పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండేంలా భవనం ముందు స్థలంలో గార్డెన్, లోపల బయట రంగులు వేయడం, ఏసీ లేదా కూలర్స్ ఏర్పాటు పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ పనులన్నీ త్వరితగతిన పూర్తిచేసి చిన్నారులకు ఆహ్లాదకరమైన సంరక్షణ అందించాలని ప్రజలు కోరుతున్నారు. -
చిన్నారులపై టెట్రాప్యాక్ పాల ప్రయోగం
నల్లగొండ : నల్లగొండ శిశుగృహలోని చిన్నారుల మృతుల సంఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. అతితక్కువ బరువు కలిగిన చిన్నారులు శిశుగృహకు వస్తున్నారని, రోగనిరోధక శక్తి లోపించి పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని అధికారులు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నా.. లోతుగా గమనిస్తే అధికారుల తప్పిదం ఎంత ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. శిశుగృహలో గతంలో మృతిచెందిన చిన్నారులకు, ఇటీవల కాలంలో చోటుచేసుకున్న వరుస మరణాలకు మధ్య వ్యత్యాసాన్ని గమనిస్తే పొరపాటు ఎక్కడ జరిగిందో అవగతమవుతోంది. కానీ ఆ దిశగా అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. 2016 ఏప్రిల్ నుంచి 2017 జూలై వరకు శిశుగృహలో మృతిచెందిన చిన్నారులు ఆరుగురు మాత్రమే. ఆ తర్వాత ఆగస్టు, నవంబర్, అక్టోబర్ అంటే మూడు నెలల్లోనే 11 మంది మృతి చెందారు. అదికూడా ఒక్క అక్టోబర్లోనే ఏడుగురు శిశువులు మృతిచెందడం గమనార్హం. వరుస మరణాలకు గల కారణాలను ఓసారి విశ్లేషిస్తే అధికారుల తప్పిందం ఎక్కడ జరిగిందో బహిర్గతమవుతుంది. వికటించిన ప్రయోగం నాలుగైదేళ్ల నుంచి చిన్నారులకు లాక్టోజెన్ 1, 2, జీరోలాక్ పాల డబ్బాలనే వాడుతున్నారు. ఈ పాల డబ్బాలను నల్లగొండ పట్టణంలోని అపోలో హాస్పిటల్ ఎంటర్ ప్రైజెస్ నుంచి కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు పిల్లలకు అవసరమయ్యే ఇంజక్షన్లు, సబ్బులు, మందులు అపోలో నుంచే తెప్పిస్తున్నారు. అదే క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు శిశుగృహకు పాల డబ్బాలతో పాటు, ఇతర మందులను సప్లయ్ చేసేందుకు ఫిబ్రవరిలో టెండర్లు పిలిచారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టెండర్ల ప్రక్రియలో నాలుగైదు ఏజెన్సీలు పోటీ పడగా.. దీంట్లో అపోలో హాస్పిటల్ ఎంటర్ప్రైజెస్ని ఎంపిక చేశారు. ఫిబ్రవరిలో టెండరు ప్రక్రియ పూర్తికాగా.. మార్చి నుంచి శిశుగృహకు పాల డబ్బాలు, మందులను అపోలో పంపిణీ చేస్తోంది. ఆగస్టు వరకు అక్కడి నుంచే పాల డబ్బాలు కొనుగోలు చేశారు. దీనికిగాను అపోలో ఎంటర్ప్రైజెస్కు రూ. 4 లక్షలు చెల్లించారు. ఈ విధంగా ఏడాది పాటు సప్లయ్ చేయాల్సిన అపోలో ఏజెన్సీ కాంట్రాక్టును అధికారులు అర్ధంతరంగా ఆపేశారు. అపోలో నుంచి పాల డబ్బాలు, మందులను తెప్పించడం మానేసి, అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు పంపిణీ చేస్తున్న ‘విజయ డెయిరీ స్టైల్’ పాలను పిల్లలపై ప్రయోగించారు. కొవ్వు, కొలెస్ట్రాల్ పాళ్లు తక్కువగా ఉన్న టెట్రా ప్యాకెట్లను సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు వాడుతూ వచ్చారు. తక్కువ బరువు, రోగనిరోధక శక్తి లోపంతో బాధపడుతున్న పిల్లలకు ఈ పాలను వాడడంతో మరింత బరువు తగ్గిపోయారు. దీంతో చిన్నారులు అనారోగ్యానికి గురవుతుండడంతో అప్పటికప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. అప్పటికే చిన్నారుల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు హుటాహుటిన హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే పిల్లల ఆరోగ్యం క్షీణించడంతో చిన్నారులు అక్కడ మృ త్యువాత పడ్డారు. టెట్రాపాలు వికటించాయన్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికా రులు వాటిని వాడడం మానేసి, అక్టోబర్ 15 నుంచి డెక్సోలాక్ పాల డబ్బాలను వాడుతు న్నారు. అనాలోచిత నిర్ణయాలు అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్లే చిన్నారులు మృతిచెందారని వైద్యులు ఆరోపిస్తున్నారు. శిశుగృహ చిన్నారులకు పట్టించే పాల విషయంలో ఐసీడీఎస్ అధికారులు వైద్యుల సలహాలు, సూచనలు పాటించలేదని స్పష్టమవుతోంది. కొన్నేళ్లుగా చిన్నారులకు లాక్టోజెన్, జీరోలాక్ పాల డబ్బాలనే వాడుతున్నప్పుడు అధికారులు ఉన్న పళంగా టెట్రాప్యాక్ పాలను ఎందుకు వినియోగించాల్సి వచ్చిందనే దానిపైన నోరు మెదపడం లేదు. నాసిరకమైన పాలను వాడుతున్నారని వైద్య పరీక్షల్లో తేలినా అధికారులు పట్టించుకోలేదు. కనీసం ఏ రకమైన పాల డబ్బాలను వాడాలనే దానిపైన వైద్యులను సంప్రదించకుండా సొంత నిర్ణయాలనే అమలు చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. వైద్యుల విషయంలోనూ.. శిశుగృహ చిన్నారులను పరీక్షించేందుకు తొలుత ప్రభుత్వ వైద్యుడు శ్రీకాంత్ను విజిటింగ్ డాక్టర్గా తీసుకున్నారు. వివిధ కారణాల రీత్యా ఆయన్ని కాదని మరో ప్రభుత్వ వైద్యుడు ప్రభాకర్రెడ్డిని తీసుకున్నారు. ఆగస్టు వరకు ప్రభాకర్రెడ్డి విజిటింగ్ డాక్టర్గా పనిచేశారు. ఏదో ఒక కారణాన్ని సాకుగా చూపి ప్రభాకర్రెడ్డిని కూడా కాదని, ప్రైవేట్ వైద్యుడు సుధాకర్ను ఆశ్రయించారు. ఆగస్టు నెలాఖరు నుంచి అక్టోబర్ 31 వరకు పిల్లలకు ఆయనే వైద్యపరీక్షలు చేశారు. ఈ సమయంలోనే పిల్లలు రోగాల బారినపడ్డట్టు సమాచారం. ఈయన సూచనల మేరకు చాలా మంది పిల్లలను నీలోఫర్కు తరలించారు. పిల్లలు మరణించడంతో ఏం చేయాలో పాలుపోని అధికారులు సుధాకర్ను కాదని మళ్లీ ప్రభాకర్రెడ్డిని తెరపైకి తీసుకొచ్చారు. ఈ నెల 1 నుంచి ఆయనే పిల్లలకు వైద్య చిక్సితలు అందిస్తున్నారు. నీలోఫర్ ఆస్పత్రికి వెళ్లిన ‘నల్లగొండ’ వైద్యులు నల్లగొండ : హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శిశుగృహ చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రభుత్వ పిల్లల వైద్యుడు దామెర యాదయ్య, ఐసీడీఎస్ పీడీ పుష్పలతను పంపినట్లు కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. చిన్నారులు అనారోగ్యంగా ఉన్నందున వారిని నీలోఫర్కు తరలించడం జరిగిందని చెప్పారు. నీలోఫర్ వైద్యులతో మాట్లాడి పిల్లలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని కోరినట్లు కలెక్టర్ తెలిపారు. నామమాత్రంగా విచారణ శిశుగృహలో చిన్నారుల వరుస మృతులపై ఉన్నతాధికారులు చేపట్టిన విచారణపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా యంత్రాంగం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ వేర్వేరుగా నిర్వహించిన విచారణలో శిశుగృహ రికార్డులను మాత్రమే పరిశీలించారు తప్ప అందులో పనిచేస్తున్న సిబ్బందిని, ఆయాలను, ఇతర ఉద్యోగులను వ్యక్తిగతంగా విచారించలేదు. పిల్లలకు వైద్యం అందించిన డాక్టర్లను సంప్రదించలేదు. తక్కువ బరువుతో పిల్లలు చనిపోతున్నారన్న కారణాలనే పైకి ప్రచారం చేస్తున్నారు. టెట్రా పాల ప్రయోగం పిల్లలపైన జరిగిందా..? లేదా..? అన్నది కూడా విచారించ లేదు. పాల సరఫరా విషయంలో అధికారులు సొంతగా ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది..? అనే కోణంలో విచారణ అధికారులు దృష్టి సారించలేదు. -
ప్రేమ ఉంటేనే దత్తత
- అనాథలపై చూపాల్సింది జాలికాదు - హోం స్టడీ రిపోర్టే కీలకం - జిల్లాలో రెండు శిశు గృహాలు విజయవాడ సెంట్రల్ : ఇటీవల కృష్ణలంక బాలాజీనగర్ వద్ద పాలిథిన్ కవర్లో చుట్టి డంపర్బిన్ వద్ద పసిపాపను గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. ఐసీడీఎస్ అధికారుల సంరక్షణలో ఉన్న ఈ బిడ్డను దత్తత తీసుకొనేందుకు ఇరవై మందికి పైగానే పోటీ పడుతున్నారు. ఇలాంటి మరెందరో అనాథలను దత్తత తీసుకుంటామంటూ ఐసీడీఎస్కు దరఖాస్తులు అనేకం వస్తున్నాయి. దత్తత తీసుకొనేవారికి ఉండాల్సింది జాలి కాదు, ప్రేమ అని నిబంధనలు చెబుతున్నాయి. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గన్నవరం మండలం బుద్ధవరం వద్ద కేర్ అండ్ షేర్, మచిలీపట్నంలో శిశు గృహాలు నిర్వహిస్తున్నారు. వీటిల్లో ప్రస్తుతం 16 మంది చిన్నారులు ఉన్నారు. చిన్నారులను దత్తత తీసుకోవాలంటే హోం స్టడీరిపోర్టే కీలకం. హోం స్టడీ ఇలా.. అనాథలను దత్తత తీసుకోవాలనుకొనేవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బిడ్డను ఎందుకు కావాలనుకుంటున్నారనే అంశాన్ని స్పష్టంగా పేర్కొనాలి. భార్యాభర్తలు ఆరోగ్యంగా ఉన్నారనే డాక్టర్ సర్టిఫికెట్, ఎలాంటి కేసులు లేవని పోలీసుల నుంచి ధ్రువీకరణ పత్రం, ఏడాదికి రూ.72 వేల ఆదాయం వస్తున్నట్లు రెవెన్యూ అధికారుల నుంచి పొందిన ఆదాయం సర్టిఫికెట్లను దరఖాస్తుకు జతచేయాల్సి ఉంటుంది. ఇలా అందిన దరఖాస్తులను ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డెరైక్టర్ సంబంధిత సీడీపీవోలకు పంపుతారు. వారు క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తుదారునికి సంబంధించిన సమగ్ర వివరాలను సేకరి స్తారు. దీన్నే హోంస్టడీ రిపోర్ట్ అంటారు. దరఖాస్తులో పేర్కొన్న అంశాలన్నీ వాస్తవాలని తేలితేనే దత్తతకు అర్హులుగా పరిగణిస్తారు. ఆర్థిక స్థోమత, కుటుంబ నేపథ్యానికి ప్రాధాన్యత ఉంటుంది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి సంవత్సరం లోపు, ఏడాది నుంచి మూడేళ్ల లోపు చిన్నారులను రెండు కేటగిరీలుగా విభజించి దత్తత ఇస్తుంటారు. ఏ వయసు పిల్లలను దత్తత తీసుకోవాలనుకుంటున్నారనే అంశాన్ని దరఖాస్తులో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది. ప్రేమ చూపాలి అనాథ బిడ్డలపై ప్రేమ ఉన్న వారికే దత్తత ఇస్తామని జిల్లా స్త్రీ శిశు సంక్షేమశాఖ ప్రాజెక్ట్ అధికారి కృష్ణకుమారి ‘సాక్షి’కి చెప్పారు. అనాథలపై జాలి చూపిస్తూ ఆదుకుంటామని కొందరు వస్తుంటారన్నారు. ఇలాంటి వారికి ప్రాథాన్యత ఇవ్వమన్నారు. పసిబిడ్డ రావడం వల్ల జీవితంలోకి వెలుగు వస్తోందని ఎవరు ఆతృతపడుతుంటారో వారికే తొలి ప్రాధాన్యత ఉంటుందన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
తప్పక చదవండి
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement