-
చంద్రన్న సంక్రాంతి: బూజుపట్టిన బెల్లం, పురుగుల పిండి
-
చంద్రన్న సంక్రాంతి: బూజుపట్టిన బెల్లం, పురుగుల పిండి
సాక్షి, నంద్యాల(కర్నూలు) : ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తున్న చంద్రన్న సంక్రాంతి కానుకల పట్ల ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఉచితం అంటూ పండుగకు పురుగులు పట్టిన సరకులు పంపిణీచేస్తున్నారని రాష్ట్రమంతటా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నవిషయం తెలిసిందే. తాజాగా కర్నూలు జిల్లా నంద్యాలలో రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసేందుకు సిద్దం చేసిన సరుకులన్నీ నాసిరకంగా ఉండటంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పురుగులు పట్టిన పిండి, బేడలు, బూజుపట్టిన బెల్లం ఇస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవి తింటే పండుగ రోజున ఆస్పత్రిలో చేరాల్సివస్తుందని భయాందోళనలకు గురవుతున్నారు. ఉచితం అంటూ సంక్రాంతి పండుగకు ఇలా పురుగులు, బూజు పట్టిన నాసిరకం సరుకులు ఇస్తారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం ఇస్తున్న కానుకలతో కాంట్రాక్టు పొందిన వ్యక్తులకే మేలు కలుగుతోందని.. కార్డుదారులు నాసిరకం వస్తువులతో ఇబ్బంది పడుతున్నారని విమర్శిస్తున్నారు. పెద్ద మొత్తంలో కాంట్రాక్టు పొందిన వ్యక్తులు తక్కువ ధరకు లభించే నాసిరకం సరుకులు సరఫరా చేశారనే ఆరోపణలు కార్డుదారుల నుంచి వ్యక్తమవుతున్నాయి. -
ప్రకాశం జిల్లా చంద్రన్న కానుకల్లో నాసిరకం సరుకులు
-
నాసిరకం ‘కానుకలు’
కర్నూలు (అగ్రికల్చర్): చంద్రన్న క్రిస్మస్, సంక్రాంతి కానుకలు నాసిరకంగా ఉన్నాయి. ఏ మాత్రమూ నాణ్యత లేనివి పంపిణీ చేసి రూ.కోట్లు కొల్లగొట్టడానికి టీడీపీ మద్దతుదారులైన సరఫరాదారులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందులో కమీషన్ల పర్వం కూడా జోరుగా నడుస్తోంది. నాణ్యత లేని వీటిని తాము రేషన్కార్డుదారులకు ఇవ్వలేమని అధికారులే కుండబద్దలు కొడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. క్రిస్మస్, సంక్రాంతిని పురస్కరించుకొని కార్డుదారులందరికీ చంద్రన్న కానుకలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో చౌకధరల దుకాణాలు 27,847 ఉన్నాయి. వీటి పరిధిలో 1,38,88,547 రేషన్ కార్డులు ఉన్నాయి. వివిధ జిల్లాలకు వచ్చిన గోధుమ పిండి, నెయ్యిలో నాణ్యత లేకపోవడాన్ని గుర్తించిన అధికారులు.. వాటిని తిరస్కరించడం కలకలం రేపుతోంది. గుజరాత్ నుంచి గోధుమ పిండి.. నాణ్యత లేని గోధుమ పిండి కర్నూలు జిల్లాతోపాటు కోస్తా జిల్లాలకు చేరింది. కర్నూలు జిల్లాకు 963 టన్నుల గోధుమ పిండి ప్యాకెట్లు మంగళవారం వచ్చాయి. కాసుల కక్కుర్తితో గుజరాత్ నుంచి నాసిరకం గోధుమ పిండిని దిగుమతి చేసుకున్నారు. నిబంధనల ప్రకారం ప్యాకింగ్ తేదీ నుంచి వ్యాలిడిటీ మూడు నెలలు ఉండాలి. కానీ కొన్ని ప్యాకెట్లపైన వ్యాలిడిటీ 2 నెలలు ఉండగా, కొన్నిటికి తయారీ తేదీ, వ్యాలిడిటీ డేట్ లేకపోవడం గమనార్హం. నిబంధనలు పాటించకపోవడం, నాసిరకంగా ఉండటంతో మొత్తం ప్యాకెట్లను అధికారులు వెనక్కి పంపారు. కోస్తా జిల్లాల్లో కూడా తిప్పిపంపినట్టు సమాచారం. కంపుకొడుతున్న నెయ్యి.. కర్నూలు, అనంతపురం జిల్లాలతోపాటు కోస్తా జిల్లాలకు సరఫరా చేసిన నెయ్యి కంపు కొడుతోంది. కర్నూలు జిల్లాకు 6.13 లక్షల ప్యాకెట్లు వచ్చాయి. ఇందులో ఏ ఒక్కటీ నాణ్యతతో లేదని అధికారులే నిర్ధారించారు. నెయ్యి ప్యాకెట్లను వాపసు తీసుకొని.. తిరిగి మంచివి ఇవ్వాలని కోరారు. అయితే.. అధికారులు మాత్రం ఆవు నెయ్యి వచ్చింది.. అందువల్లే తిరస్కరించామని బయటికి చెబుతున్నారు. గతేడాది తరహాలోనే ఈసారి కూడా బెల్లం నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. అర కిలో బెల్లం ప్రత్యేకంగా ప్లాస్టిక్ డబ్బాలో వేసి ఇస్తున్నారు. ఇది బంకలా సాగుతోంది. అది కూడా నల్లగా సారాయి బెల్లాన్ని తలపిస్తోంది. శనగ, కందిపప్పుల్లోనూ కల్తీ స్పష్టంగా కనిపిస్తోంది. నాసిరకం సరుకులనే పంచాలి! చంద్రన్న కానుకల పేరుతో జిల్లాకు వచ్చిన సరుకులనే పంచాలని, వాటి స్థానంలో వేరేవి ఇచ్చే ప్రసక్తే లేదని ప్రభుత్వం తేల్చిచెప్పినట్లు సమాచారం. ప్రభుత్వ నిర్వాకంతో పండగ పూట కార్డుదారుల నుంచి తాము తిట్లు తినాల్సి వస్తుందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రన్న కానుకల సరఫరా బాధ్యతను అధికార పార్టీ నేతలు తీసుకున్నట్లు సమాచారం. ‘మేం పంపిన వాటినే తిరస్కరిస్తారా? అక్కడ మీరు ఎలా పనిచేస్తారో చూస్తాం’ అని అధికారులను బెదిరిస్తున్నారు. కాగా, క్రిస్మస్ సందర్భంగా కార్డుదారులకు ఏడు రకాల సరుకులను పంపిణీ చేస్తున్నారు. 500 గ్రాముల బెల్లం, కిలో చొప్పున కందిపప్పు, శనగపçప్పు, గోధుమ పిండి, 500 ఎం.ఎల్ పామోలిన్ ఆయిల్ ప్యాకెట్, 100 ఎం.ఎల్ నెయ్యి ఇవ్వాల్సి ఉంది. నాణ్యమైన సరుకులు పంపిణీ చేయాలనేది లక్ష్యం క్రిస్మస్, సంక్రాంతి కానుకలను నాణ్యమైనవి పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. నిబంధనలకు విరుద్ధంగా వచ్చిన గోధుమ పిండి, నెయ్యి తిరస్కరించాం. జిల్లాకు ఆవు నెయ్యి వచ్చింది. గోధుమ పిండి ప్యాకెట్లపై వ్యాలిడిటీ డేట్ లేదు. కొన్నిటికి ఉన్నా తక్కువగా ఉంది. వ్యాలిడిటీ 3 నెలలు ఉండాలి. గోధుమపిండి ప్యాకెట్లను తిరస్కరించాం. బెల్లం, ఇతర సరుకుల నాణ్యత బాగానే ఉంది. – ప్రసన్న వెంకటేశ్, జేసీ, కర్నూలు -
నాసిరకం కానుకలు..!
* కందిపప్పులో రాళ్లు, పురుగులు * నెయ్యి,బెల్లం తూకంలో అవకతవకలు * రెండు డిపోలకు చేరని సరుకులు * అందని సంచులు * అసహనం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు లక్కవరపుకోట: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందజేస్తున్న క్రిస్మస్,సంక్రాంతి కానుకల్లో నాసిరకం సరుకులను అందజేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. పేదలే కదా ఇచ్చింది తీసుకుంటారు,..అదికూడా ఉచితంగానే కదా ఎలాంటి సరుకులు ఇస్తే ఏమిటి అనుకున్నారో ఏమో.పురుగులు పట్టి,పుచ్చిపోయిన కందిపప్పు.నాసిరకమైన బెల్లం అందజేస్తున్నారని లబ్ధిదారులు అవేదన చెందుతు న్నారు. ప్రతి తెల్లరేషన్ కార్డు దారుడికి కేజీ గోధుమపిండి,వంద గ్రాముల నెయ్యి,అరకేజీ బెల్లం,కందిపప్పు, శనగపప్పు,పంచదార అరకేజీ చొప్పున అందజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ వస్తువులను వాటి తూకాల ప్రకారం ప్యాకింగ్ చేసి కోట్లు రూపాయలు వెచ్చించి చంద్రబాబు ఫొటోతో ముద్రించిన సంచుల్లో అబ్ధిదారులకు అందజేస్తున్నారు. అయితే ఈ సరుకుల్లో బెల్లం అరకేజీకి బదులు 450 గ్రాములు,వంద గ్రాముల నెయ్యికి 90 గ్రాముల నెయ్యి మాత్రమే వస్తున్నట్లు పలువురు వాపోతున్నారు.అలాగే కందిపప్పులో రాళ్లు, పెంకిపురుగులతో పూర్తిగా నాసిరకం కొట్టొచ్చినట్లు కన్పిస్తోందని చెబుతున్నారు.ఈ సరుకులు అందజేసే సంచులు మాత్రం ఒక్కో డిపోకు కేవలం 50 చొప్పున అందజేశారు. ఆ సంచుల్లో ఎవరికి ఇవ్వాలో తెలియక డీలర్లు అయోమయంలో ఉన్నారు. క్రిస్మస్ పూర్తయినా అందని సరుకులు ప్రస్తుతం అదికారులు ముందస్తుగా క్రైస్తవ మతస్తులకు చంద్రన్న సంక్రాంతి కానుకలను క్రిస్మస్ పర్వదినానికి అందజేసేందుకు సిద్ధమయ్యారు. కాగా నేటికీ వేపాడ మండలంలోని చిన్నదుంగాడ,వేపాడ డిపోలకు సరుకుల సరఫరా జరగేదు.మరికొన్ని డిపోల్లో సర్వర్ పనిచేయకపోవడంతో సరుకుల పంపిణీ జరగలేదు. లక్కవరపుకోట మండలంలోని 15,834కార్డులు,వేపాడ మండలంలో 14,633కార్డులు ఉన్నాయి. సర్వర్లు సక్రమంగా పనిచేయకపోవడంతో శుక్రవారం నాటికి కేవలం 5శాతం మందికి మాత్రమే సరుకులను అందజేశారు. లబ్ధిదారుల్లో అసహనం ప్రభుత్వం అందజేస్తున్న సరుకుల్లో తూకాలు సక్రమంగా లేవని అదికూడా నాసిరకమైన సరుకులు అందజేయడంతో పలువురు లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ప్రచారం తప్ప సరుకుల్లో నాణ్యత లేదని వాపోతున్నారు. ఇచ్చింది గోరంత అయితే ప్రచారం మాత్రం కొండంతగా ఉందని అంటున్నారు. దీపావళికి కేజీ పంచదార అందజేస్తామని ప్రకటించారు. కాగా ఆరకేజీ చొప్పునే అందజేశారని పలువురు వాపోతున్నారు. ఈ విషయమై సీఎస్డీటీ రామచంద్రారెడ్డిని వివరణ కోరగా..సరుకుల కొలతలో తేడాలు వస్తున్నట్లు,నాణ్యత విషయంపై పలువురి దగ్గరనుంచి ఫిర్యాదులు వస్తున్నాయని అంగీకరించారు. ఈ విషయాలను పై అధికారులకు తెలియజేశామని చెప్పారు. మేము చేసిన ప్యాకింగ్లు కావు చంద్రన్న కానుకకు సంబంధించిన సరుకులు మేము ప్యాకింగ్ చేయలేదు. ప్యాకింగ్ చేసిన వస్తువులే మాకు అందజేశారు.ఆసరుకులే లబ్ధిదారులకు అందజేస్తున్నాం. తూకంలో కొద్దిపాటి తేడాలు రావడము వాస్తవమే. - ఐ.ముత్యాలు,ఆర్.జి.పేట డీలర్ సరుకులు బాగోలేవు ప్రస్తుతం కోటాలో ఇస్తున్న పండగ సరుకులు బాగోలేవు. బెల్లం,నెయ్యి తూకం వేస్తే తక్కువ వస్తున్నాయి.డీలర్లను అడిగితే వారు ఇచ్చిందే పంచుతున్నామంటున్నారు. -ఆర్.సత్యవతి,శ్రీరాంపురం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement