-
అందుకే సడన్గా రిటైర్మెంట్ ఇచ్చా.. నా చిన్న కొడుకు వల్ల: డివిలియర్స్
ఏబీ డివిలియర్స్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. 14 ఏళ్ల పాటు అభిమానులను అలరించిన ఈ దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్.. వరల్డ్క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. తన ఆట తీరుతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా భారత్లో అయితే ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అభిమానులు అతడిని ముద్దుగా 'మిస్టర్ 360' అని పిలుచుకుంటారు. అయితే 2004లో సౌతాఫ్రికా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన డివిలియర్స్.. 2018లో సడన్గా ఇంటర్ననేషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటిలో అతడి నిర్ణయంతో యావత్తు క్రికెట్ ప్రపంచం షాక్కు గురైంది. అయితే తాజాగా తన అకస్మాక నిర్ణయానికి గల కారణాన్ని డివిలియర్స్ వెల్లడించాడు. "నా చిన్న కొడుకు కాలి మడమ ప్రమాదవశాత్తూ నా ఎడమ కంటికి తాకింది. అందువల్ల నా దృష్టి కాస్త లోపించింది. ఆ తర్వాత సర్జరీ చేయించుకున్నాను. సర్జరీ అనంతరం డాక్టర్ ఇకపై ఆటకు దూరంగా ఉండమని చెప్పాడు. అందుకే డాక్టర్ సలహా మెరకు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాను. అయితే ఇంటర్ననేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ ఫ్రాంచైజీ క్రికెట్లో మాత్రం రెండేళ్ల పాటు ఆడాను. ఆ సమయంలో అదృవశాత్తూ కంటి వల్ల ఎటువంటి సమస్య తలెత్తలేదని" విజ్డెన్ క్రికెట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డివిలియర్స్ పేర్కొన్నాడు. కాగా దక్షిణాఫ్రికా తరపున 111 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20ల్లో ఏబీబీ ప్రాతినిథ్యం వహించాడు. మూడు ఫార్మాట్లు కలిపి 20014 పరుగులు చేశాడు. -
గంటా శ్రీనివాసరావు డబుల్ గేమ్
=అంతర్జాతీయ క్రికెట్ను అడ్డుకుంటామని గంటా హెచ్చరికలు =సినీ తారల క్రికెట్ మ్యాచ్కు పచ్చజెండా =మంత్రి తీరుపై సొంత పార్టీలోనే పెదవి విరుపు ‘బోడి గుండుకు మోకాలికి ముడిపెట్టినట్లు’ అన్న సామెతను కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. ప్రపంచ క్రికెట్ పోటీలకు, రాష్ట్ర విభజనకు లింకు పెట్టి వీర ప్రగల్భాలు పలికిన ఆయన సినిమా తారల క్రికెట్ మ్యాచ్ ప్రారంభోత్సవానికి హాజరవడం జిల్లా వాసులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విశాఖ జిల్లా సమైక్యాంధ్ర ఉద్యమ వీరుడిని తానేనని చూపించుకోవడానికి అడుగడుగునా తాపత్రయ పడుతున్న ఆయన క్రికెట్ మ్యాచ్ల విషయంలో తనకు తానే సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుంటే కేబినెట్ నుంచి తొలి రాజీనామా తనదే ఉంటుందని గతంలో మంత్రి గంటా శ్రీనివాసరావు గట్టిగా గర్జించారు. కారణాలేమైనా ఒట్టు తీసి గట్టున పెట్టారు. ఆమోదం పొందని రాజీనామా చేసిన ఆయన మంత్రిగా అధికార హోదా అనుభవిస్తున్నారు. సమైక్య ఉద్యమం నడుస్తున్న సమయంలోనే సీఎంను విశాఖకు రప్పించి ఫ్లై ఓవర్, తెలుగుతల్లి విగ్రహాల ప్రారంభం, బహిరంగ సభ నిర్వహించేందుకు గట్టిగానే ప్రయత్నించారు. ఉద్యమాన్ని నీరుగార్చేందుకే సీఎం పర్యటన ఏర్పాటు చేశారనే విమర్శలు వచ్చినా లెక్క పెట్టకుండా ముందడుగు వేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనకు సీఎం వచ్చిన సందర్భంలో ఆయనతో పాటు అనకాపల్లి, యలమంచిలి నియోజక వర్గాల్లో పర్యటించారు. ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు వారిని పరామర్శించడం, ధైర్యం చెప్పడం ఏ మాత్రం తప్పు కాదు. దీనికి రాజకీయాలతోనో, మరే ఇతర సమస్యలతోనో ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ఈ కారణంగానే సీఎం, మంత్రుల వరద ప్రభావిత ప్రాంతాల పర్యటను ఎవరూ తప్పు పట్టలేదు. కానీ ఈ నెల 24న విశాఖలో జరిగే ఇండియా- వెస్టిండీస్ క్రికెట్ మ్యాచ్ అడ్డుకుంటామని గంటా ప్రకటించారు. సమైక్య ఉద్యమం జరుగుతున్న సందర్భంలో మ్యాచ్ నిర్వహించడం సరైంది కాదని, ఒక వేళ మ్యాచ్ జరిగితే సమైక్యవాదులు అడ్డుకుంటారని హెచ్చరికలు చేశారు. మ్యాచ్ను రద్దు చేయాలని కోరుతూ బీసీసీఐకి లేఖ రాయాలని కలెక్టర్పై ఒత్తిడి తెచ్చారు. సమైక్య ఉద్యమానికి, క్రికెట్ మ్యాచ్కు సంబంధం ఏమిటని క్రీడాకారులే కాకుండా, జిల్లాలోని వివిధ వర్గాలకు చెందిన వారు విమర్శల బాణాలు వదిలారు. మంత్రి తీరుపై అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ క్రికెట్ మ్యాచ్ను అడ్డుకోవడం సరైంది కాదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. క్రీడాకారులు రౌండ్ టేబుల్ సమావేశం జరిపి మంత్రి తీరును తూర్పారబట్టారు. మంత్రి గంటాకు సమైక్య ఉద్యమం మీద చిత్తశుద్ధి నిజమే అయితే, సోమవారం నుంచి ప్రారంభమయ్యే రచ్చబండను ఎందుకు అడ్డుకోవడం లేదనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. రచ్చబండ కాంగ్రెస్కు ఓట్లు రాబట్టేందుకు ఉద్దేశించింది అయినందువల్లే మంత్రి దీనిపై నోరు మెదపక పోగా, సీఎంను కూడా ఆహ్వానించారనే విమర్శలు రేగుతున్నాయి. ఒక వైపు ఈ వివాదం నడుస్తుండగానే శనివారం హైదరాబాద్లో జరిగిన సినీ తారల క్రికెట్ పోటీలను దగ్గరుండి ప్రారంభింపజేశారు. ఈ మ్యాచ్ వచ్చే నెల 21న విశాఖలోనే నిర్వహిస్తారు. భారత్- వెస్టిండీస్ క్రికెట్ మ్యాచ్ను అడ్డుకుంటామని ప్రకటించిన మంత్రి... సినీ తారల క్రికెట్ మ్యాచ్ ప్రారంభానికి హాజరు కావడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. సినీ తారల క్రికెట్ మ్యాచ్ను రద్దు చేయించడం మంత్రికి సులువైన విషయం. దీనికి పచ్చ జెండా ఊపి, బీసీసీఐ నిర్వహణలోని మ్యాచ్ను అడ్డుకుంటామని ప్రకటించడం వెనుక ఏ రాజకీయ పరమార్థం దాగి ఉందో అంతు చిక్కడం లేదు. క్రికెట్ మ్యాచ్ విషయంలో మంత్రి గంటా తన పరస్పర విరుద్ధ వైఖరిని ఏ విధంగా సమర్ధించుకుంటారు?, ఆయన చెప్పబోయే కారణం ఏమిటి? అనేది ఆసక్తికరంగా మారింది.
క్యాబ్ డ్రైవర్తో 12th ఫెయిల్ హీరో గొడవ, వీడియో వైరల్
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి
IPL 2024: కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న కేఎల్ రాహుల్..?
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా
పంజాబ్ కింగ్స్తో ఆర్సీబీ కీలక పోరు.. యువ ఆటగాడు అరంగేట్రం
లింక్డ్ఇన్పై అసంతృప్తి.. భవిష్ అగర్వాల్ ట్వీట్ వైరల్
వెగా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ అక్షయ తృతీయ (ఫోటోలు)
విశాఖ బెస్ట్.. అమరావతి వేస్ట్: తేల్చి చెప్పేసిన బాలయ్య చిన్నల్లుడు
సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు
సన్రైజర్స్ పరుగుల సునామీ.. కావ్యా మారన్ రియాక్షన్ వైరల్ (ఫొటోలు)
మరో క్రికెట్ లీగ్కు విస్తరించనున్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్
తప్పక చదవండి
- నేను అతడికి బిగ్ ఫ్యాన్.. అది నా అదృష్టంగా భావిస్తున్నా: అభిషేక్
- ఏడేళ్ల తర్వాత సీక్వెల్.. 'మాయావన్' టీజర్ విడుదల
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- బఠానీల ఉచిత దిగుమతి గడువు పెంపు
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
- భారతదేశంలో బ్యాన్ చేసిన ఆహార పదార్థాలు ఇవే..!
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఐదు రోజులు గట్టి వానలే!
Advertisement