-
ఆ మూడు తరవాతే ఇండియా!
దావోస్: అంతర్జాతీయ వృద్ధి పట్ల సీఈవోల్లో విశ్వాసం కనిష్ట స్థాయికి చేరింది. అయినా కానీ, అంతర్జాతీయంగా అమెరికా, చైనా, జర్మనీ తర్వాత భారత్ వారికి నాలుగో ప్రాధాన్య దేశంగా ఉన్నట్టు పీడబ్ల్యూసీ సంస్థ సీఈవోలపై నిర్వహించిన సర్వే స్పష్టం చేసింది. భారత్లో తమ వ్యాపార వృద్ధికి అనుకూల పరిస్థితులున్నట్టు అంతర్జాతీయంగా నిర్వహించిన ఈ సర్వేలో 9 శాతం మంది సీఈవోలు చెప్పారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో భాగంగా ఈ నివేదికను పీడబ్ల్యూసీ విడుదల చేసింది. తమ ఆదాయ వృద్ధి అవకాశాల పట్ల భారత సీఈవోలు ఎంతో ఆశావహంగా ఉన్నారని సర్వేలో వెల్లడైంది. చైనాలో 45 శాతం మంది సీఈవోలు ఈ రకమైన విశ్వాసంతో ముందుండగా, ఆ తర్వాత భారత సీఈవోల్లోనే అత్యధిక విశ్వాసం వ్యక్తమైంది. 40 శాతం భారత సీఈవోలు వృద్ధి అవకాశాల పట్ల నమ్మకంగా ఉన్నారు. ఆ తర్వాత అమెరికాలో 36 శాతం, కెనడాలో 27 శాతం, బ్రిటన్లో 26 శాతం, జర్మనీలో 20 శాతం సీఈవోల్లో ఇదే విశ్వాసం వ్యక్తమైంది. అంతర్జాతీయంగా చూస్తే... తమ కంపెనీ అవకాశాల పట్ల సానుకూలత వ్యక్తం చేసిన వారు కొద్ది మందే. 27 శాతం సీఈవోలు మాత్రమే ఈ ఏడాది ఆదాయ వృద్ధి అవకాశాలపై నమ్మకంతో ఉన్నారు. 2009 తర్వాత అంతర్జాతీయంగా సీఈవోల్లో విశ్వాసం ఇంత కనిష్ట స్థాయికి చేరడం మళ్లీ ఇదే. గతేడాది ఇది 35 శాతంగా ఉంది. నిరాశావాదం తారస్థాయిలో.. అంతర్జాతీయ వృద్ధి పట్ల సీఈవోల్లో నిరాశావాదం రికార్డు స్థాయికి చేరిందని పీడబ్ల్యూసీ సర్వే పేర్కొంది. అంతర్జాతీయ జీడీపీ వృద్ధి రేటు తగ్గుతుందని సగానికి పైగా సీఈవోలు చెప్పడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. వ్యాల్యుబుల్ 500 ఇనీషియేటివ్లో డాక్టర్ రెడ్డీస్, మహీంద్రా వైకల్యం ఉన్న వారికి ఉపాధి కల్పించే విషయంలో గూగుల్, యాక్సెంచర్, బోయింగ్, కోకకోలా తదితర కంపెనీలతోపాటు భారత్ నుంచి డాక్టర్ రెడ్డీస్, మహీంద్రా, సరోవర్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ముందుకొచ్చాయి. 24 దేశాల నుంచి మొత్తం 241 కంపెనీలు ‘వాల్యుబుల్ 500 ఇనీషియేటివ్’ కార్యక్రమంలో చేరాయని, ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెలు 9.9 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని, వీటి ఆదాయం 3.8 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉందని డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది ప్రజలు ఎంతో కొంత వైకల్యాన్ని ఎదుర్కొంటున్నట్లు గుర్తు చేసింది. పారదర్శక వాణిజ్యాన్నే భారత్ కోరుకుంటోంది: గోయల్ పారదర్శకమైన, సమతుల్యమైన వాణిజ్య భాగస్వామ్యాల కోసం భారత్ కృషి చేస్తోందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ డబ్ల్యూఈఎఫ్ వార్షిక సదస్సులో స్పష్టం చేశారు. హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాల్లో వృద్ధికి ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సహకారం మరింత విస్తృతం కావాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (ఆర్సీఈపీ) ప్రస్తుత రూపంలో ఉన్నది భారత్కు ఆమోదనీయం కాదన్నారు. ఈ ప్రాంతంలో చైనా, ఇతర దేశాలతో భారత్ వాణిజ్య లోటును కలిగి ఉందని, ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని చెప్పారాయన. -
మార్కెట్లు అతలాకుతలం
అంతర్జాతీయ వృద్ధిపై ఆందోళన ► ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాల్లో ఐఎంఎఫ్ కోత ► కొనసాగుతున్న ముడి చమురు ధరల పతనం ► కరెన్సీ క్రాష్.. బంగారం వైపు పరుగులు ► సెన్సెక్స్ 418 పాయింట్లు డౌన్.. 24,062 వద్ద క్లోజ్ ► 126 పాయింట్ల నష్టంతో 7,309కు నిఫ్టీ అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఆందోళన కారణంగా ప్రపంచ మార్కెట్లు బుధవారం అతలాకుతలమయ్యాయి. స్టాక్ మార్కెట్లు. ముడి చమురు ధర నిలువునా పతనం కాగా, బంగారం భగ్గుమంది. మరోవైపు ఇతర వర్థమాన దేశాల కరెన్సీల్లానే రూపాయి విలవిలలాడంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి వృద్ధి అంచనాల్లో కోత విధించడం, చైనా ఆర్థికాభివృద్ధి 25 సంవత్సరాల కనిష్టస్థాయికి పడిపోవడం ఇన్వెస్టర్లను భయాందోళనలకు లోనుచేసింది. దాంతో వారు ఈక్విటీలను విక్రయించి, సురక్షిత సాధనంగా భావించే పుత్తడివైపు పరుగులు తీసారు. ఆసియా, యూరప్, అమెరికా మార్కెట్లు భారీ స్థాయిలో పతనమయ్యాయి. అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు బుధవారం ప్రపంచ మార్కెట్లతో పాటే భారత స్టాక్ మార్కెట్ను కుప్పకూల్చాయి. స్టాక్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 24వేల పాయింట్ల దిగువకు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 7,300 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి. ఒకదశలో బీఎస్ఈ సెన్సెక్స్ 640 పాయింట్లకు పైగా పతనమైంది. చివరిలో కొంత కొనుగోళ్లు జరగడంతో 418 పాయింట్లు నష్టపోయి 24,062 పాయింట్ల వద్ద ముగి సింది. మోదీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన నాటి(2014,మే 16) నుంచి చూస్తే ఇదే అత్యంత బలహీన స్థాయి. నిఫ్టీ 126 పాయింట్ల నష్టంతో 7,309 పాయింట్ల వద్ద ముగిసింది. అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. బ్యాంక్, లోహ, రియల్టీ షేర్లు బాగా నష్టపోయాయి. ఈ ఏడాది ఇప్పటివరకే నిఫ్టీ 20% పతనమైంది. మరింత పతనం: డాలర్తో రూపాయి మారకం కూడా భారీగా క్షీణించడం ప్రభావం చూపించింది. రూపాయి ఇంట్రాడేలో 68 మార్క్ దిగువకు పడిపోయింది. ముడి చమురు సరఫరా మరింతగా పెరుగుతుందని, దరలు మరింతగా తగ్గుతాయనే ఆందోళనకు చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం భయాలు కూడా తోడవుతుండటంతో మార్కెట్లు మరింత పతనమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు, రూపాయి క్షీణత ఇన్వెస్టర్ల ఆందోళనను మరింత అధికం చేస్తున్నాయని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ వ్యాఖ్యానించారు. ప్రపంచ మార్కెట్లు సమీప భవిష్యత్తులో కోలుకునే అవకాశాల్లేవని రోబొబ్యాంక్కు చెందిన మైఖేల్ ఇవ్రీ వ్యాఖ్యానించారు. అయితే లార్జ్ క్యాప్ షేర్లు కొనుగోలు చేయడానికి ఇదే సరైన తరుణమని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ఎస్. నరేన్ పేర్కొన్నారు. చైనా మందగమనం, ముడి చమురు ధరల పతనం, ప్రపంచ వృద్ధిపై ఆందోళనలు..మార్కెట్ పట్ల ఇన్వెస్టర్ల ప్రాధాన్యతను తగ్గిస్తున్నాయని బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ అంటున్నారు. రోజంతా నష్టాలే.. సెన్సెక్స్ 24,326 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ప్రపంచ వృద్ధి అంచనాల తగ్గింపుతో ఆసియా మార్కెట్లు పతనంతో నష్టాలు మరింత పెరిగాయి. ఇంట్రాడేలో 23,840 పాయింట్ల కనిష్ట స్థాయిని(మంగళవారం నాటి ముగింపుతో పోల్చితే 640 పాయింట్లు నష్టం) తాకింది. ఇక నిఫ్టీ 7,242-7,471 పాయింట్ల మధ్య కదలాడింది. బీఎస్ఈలో 400 కంపెనీల షేర్లకు కొనుగోలుదారులే కరువయ్యారు. మొత్తం 411కు పైగా కంపెనీలు లోయర్ సర్క్యూట్ బ్రేకర్ను తాకాయి. మూడు సెన్సెక్స్ షేర్లకే లాభాలు.. తాజా డిసెంబర్ క్వార్టర్లో అంచనాలను మించిన ఫలితాలను వెల్లడించినప్పటికీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 3.7 శాతం క్షీణించి రూ.1,004 వద్ద ముగిసింది. దీంతో ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12,613 కోట్లు ఆవిరైంది. 30 సెన్సెక్స్ షేర్లలో 3 షేర్లు (బజాజ్ ఆటో, హీరో మోటొకార్ప్, విప్రో)మాత్రమే స్వల్పంగా లాభపడ్డాయి. మిగిలిన 27 షేర్లు నష్టాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్ 5.5 శాతం నష్టపోయింది. ఎస్బీఐ 5.1%, కోల్ ఇండియా 3.45%, మారుతీ3.4%, టాటా మోటార్స్ 3.3% చొప్పున నష్టపోయాయి. 1.94 లక్షల కోట్లు ఆవిరి సెన్సెక్స్ భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్ల సంపద బుధవారం ఒక్క రోజే రూ.1.84 లక్షల కోట్లు ఆవిరైంది. బీఎస్ఈలో లిస్టైన్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.90,64,734 కోట్లకు తగ్గిపోయింది. పుత్తడి వెలుగులు... సురక్షిత మదుపు సాధనంగా పుత్తడికి ప్రాధాన్యత పెరుగుతోంది. బంగారం ధరలు రెండు నెలల గరిష్ట స్థాయికి ఎగిశాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.340 పెరిగి రూ.26,690కు చేరింది. అంతర్జాతీయంగానూ పుత్తడి మెరుపులు మెరిపిస్తోంది. న్యూయార్క్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర కడపటి సమాచారం అందేసరికి 1.5% ఎగసి 1,107 డాలర్లకు పెరిగింది. పాతాళానికి ప్రపంచ సూచీలు ఐఎంఎఫ్ వృద్ధి అంచనాల్లో కోత, ముడి చమురు ధరల పతనం కారణంగా ప్రపంచ మార్కెట్లు భారీగా నష్టాల పాలయ్యాయి. ఆసియా మార్కెట్లు 1-4 శాతం, యూరప్ మార్కెట్లు 3-6 శాతం నష్టపోయాయి. ముఖ్యంగా జపాన్, హాంకాంగ్ 3%పైగా పడిపోయాయి. కడపటి సమాచారం అందేసరికి అమెరికా మార్కెట్లు దాదాపు 3% నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఈ పతనం మరింతగా కొనసాగుతుందని, మరో రెండు, మూడు నెలల వరకూ బేర్ మార్కెట్ తప్పదని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకీ పతనం... వృద్ధి అంచనాల్లో కోత: అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ ప్రపంచ వృద్ధి అంచనాలు తగ్గించడంతో ఆసియా, యూరప్ మార్కెట్లు భారీ నష్టాలపాలయ్యాయి. ఈ ఏడాది ప్రపంచ వృద్ధి 3.6 శాతంగా ఉండొచ్చని గతంలో పేర్కొన్న అంచనాలను ఐఎంఎఫ్ తాజాగా 3.4 శాతానికి తగ్గించింది. వచ్చే ఏడాది వృద్ధి అంచనాలను 3.8 శాతం నుంచి 3.6 శాతానికి తగ్గిం చింది. దీంతో అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం తలెత్తుతుందేమోనన్న ఆందోళన, రుణ ఎగవేతలు పెరిగిపోతాయని, మరో మందగమనం తప్పదేమోనన్న భయాలు ఇన్వెస్టర్లను వణికించాయి. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. 27 డాలర్ల దిగువకు క్రూడ్: అధిక సరఫరాల కారణంగా ముడి చమురు ధరలు మరింత పతనమవుతాయని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ(ఐఈఏ) హెచ్చరించడం ముడి చమురు ధరలను మరింత క్షీణింప జేసింది. కడపటి సమాచారం అందేసరికి న్యూయార్క్ లైట్స్వీట్, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధరలు 12 ఏళ్ల కనిష్ట స్థాయిలో 27 డాలర్ల దిగువకు దిగజారాయి. తరలుతున్న విదేశీ నిధులు: విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి పెట్టుబడులను ఉపసంహరిస్తున్నారు. వీరి నికర అమ్మకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చైనా మందగమనం: చైనా తాజా జీడీపీ గణాంకాలు ఆ దేశ మందగమనాన్ని సూచిస్తుండటంతో ప్రపంచ మార్కెట్లపైనా ప్రభావం చపుతోంది. 28 నెలల కనిష్టానికి రూపాయి: మార్కెట్ల పతనంతో డాలర్తో రూపాయి మారకం 28 నెలల కనిష్టానికి పడిపోయింది. దిగుమతిదారుల నుంచి డా లర్లకు డిమాండ్ పెరగడంతో 23 పైసలు నష్టపోయి 67.95 వద్ద ముగిసింది. -
రెండు నెలల కనిష్టానికి సెన్సెక్స్
బలహీన అంతర్జాతీయ సంకేతాలు * 256 పాయింట్ల క్షీణతతో 25,611కు సెన్సెక్స్ * 66 పాయింట్లు క్షీణించి 7,762కు నిఫ్టీ ద్రవ్యోల్బణం పెరగడం, తయారీ రంగ ఉత్పత్తి తగ్గడం వంటి దేశీయ అంశాలకు తోడు ప్రతికూలంగా ఉన్న అంతర్జాతీయ సంకేతాల కారణంగా స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ వృద్ధికి సంబంధించి తాజాగా ఆందోళనలు ఉత్పన్నం కావడంతో అమ్మకాలు జోరుగా జరిగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 256 పాయింట్లు నష్టపోయి 25,611 వద్ద, నిఫ్టీ 66 పాయింట్లు క్షీణించి 7,762 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్కు ఇది రెండు నెలల కనిష్ట స్థాయి. నిఫ్టీ 7,800 పాయింట్ల దిగువకు పతనమైంది. క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లు పతనమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీలు రోజంతా నష్టాల్లోనే కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీ ధరలు కొన్నేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడం అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లపై తీవ్రమైన ప్రభావాన్నే చూపుతోంది. గత ఏడు ట్రేడింగ్ సెషన్లలో ఆరింటిలో స్టాక్ మార్కెట్ నష్టపోయింది. రోజంతా నష్టాలే... సెప్టెంబర్లో తయారీ రంగ వృద్ధి 3.6 శాతంగా నమోదైంది. ఇక అక్టోబర్లో ద్రవ్యల్బోణం నాలుగు నెలల గరిష్టానికి ఎగసింది. ఈ గణాంకాల కారణంగా ఇక వడ్డీరేట్లు తగ్గే అవకాశాల్లేవన్న అంచనాలతో వడ్డీరేట్ల ప్రభావిత బ్యాంక్, రియల్ ఎస్టేట్, వాహన షేర్లు నష్టపోయాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చే నెలలోనే రేట్లను పెంచే అవకాశాలుండం, మార్కెట్ అంచనాలను మించి అమెరికాలో నాలుగు రెట్లకు పైగా చమురు నిల్వలున్నాయన్న వార్తలతో ముడి చమురు రెండున్నర నెలలు కనిస్ట స్థాయికి ధరలు తగ్గడం స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపాయి. ఈ వారంలో సెన్సెక్స్ 655 పాయింట్లు(2.49 శాతం), నిఫ్టీ 192 పాయింట్లు(2.41 శాతం) చొప్పున నష్టపోయాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Advertisement