-
‘మెట్రో’కు పటిష్ట భద్రత
‘ప్రత్యేక ఠాణా’పై హెచ్ఎంఆర్ ఎండీ, సైబరాబాద్ కమిషనర్ చర్చ మెట్రో స్టేషన్ల పరిశీలన సాక్షి,సిటీబ్యూరో: మెట్రో రైలు స్టేష న్లు, డిపోలు, కారిడార్ భద్రత కో సం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చే యనున్న ప్రత్యేక పోలీసుస్టేషన్ విధివిధానాలపై సైబరాబాద్ పోలీస్ క మిషనర్ సీవీ ఆనంద్, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి గురువారం చ ర్చించారు. నాగోల్-మెట్టుగూడ రూట్లో మెట్రో స్టేషన్లు, ఉప్పల్ మె ట్రో డిపో, మెట్రో కారిడార్లో భ ద్రతా ఏర్పాట్లను ఇద్దరూ పరిశీలించారు. మెట్రో భద్రత కోసం తాము రూపొందించిన ప్రణాళికను త్వరలో హెచ్ఎంఆర్కు అందజేస్తామని ఈ సందర్భంగా సీవీ ఆనంద్ తెలిపారు. ఉప్పల్ మెట్రో డిపో, ఆపరేషన్ కం ట్రోల్ సెంటర్, నాగోల్-మెట్టుగూడ 8 కి.మీ మార్గంలోని ఏడు మెట్రో స్టేషన్లలో భద్రతా ఏర్పాట్లను కమిషనర్ పరిశీలించారు. మెట్రో స్టేషన్లలో అడుగడుగునా సీసీటీవీలతో నిఘా ఏర్పాటు చేస్తామని ‘మెట్రో’ ఎండీ తెలిపారు. భద్రతా సిబ్బంది లేని చోట సెన్సార్లు, సెక్యూరిటీ అలారం లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆటోమేటిక్ టికెట్ జారీ యంత్రాల వద్ద తనిఖీలతో పాటు బ్యాగేజీ స్కానర్లు ఏర్పాటు చేస్తామన్నారు. స్టేషన్లను నిరంతరం పహరా కాసేందుకు వాచ్టవర్లుతో పాటు డిపోలోనూ కట్టుది ట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నా రు. భారీగా ప్రయాణికులు మెట్రో స్టేషన్లకు వచ్చినపుడు రద్దీని ఎలా క్రమబద్దీకరించవచ్చో మెట్రో ఎండీ కమిషనర్కు వివరించారు. ప్రయాణికుల కోసం ఏర్పా టు చేయనున్న పార్కింగ్, ఇతర సదుపాయాలను ఉన్నతాధికారులిద్దరూ పరిశీలించా రు. వారి వెంట సైబరాబాద్, హెచ్ఎంఆర్ ఉన్నతాధికారులున్నారు. -
ఐఐటీకి స్థలాన్వేషణ
జిల్లాకు ఐఐఎం, ఐఐటీ, ట్రైబల్ యూనివర్సిటీ! స్థలాలు గుర్తించాలని ఉన్నత విద్యాశాఖ నుంచి ఆదేశాలు నివేదిక తయారీలో అధికారులు నిమగ్నం విశాఖ రూరల్, న్యూస్లైన్: విశాఖకు మహర్దశ పట్టనుంది. రాష్ర్ట విభజనతో జిల్లాకు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రానున్నాయి. పర్యాటక, పారిశ్రామిక కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విశాఖ మున్ముందు విద్యారంగంలో హైదరాబాద్కు దీటుగా తయారుకానుంది. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) విశాఖకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటితో పాటు గిరిజన విశ్వవిద్యాలయం కూడా జిల్లాలో ఏర్పాటయ్యే సూచనలున్నాయి. జిల్లాలో ఇందుకు అనువైన స్థలాలను గుర్తించి నివేదిక పంపించాలని ఉన్నత విద్యా శాఖ నుంచి సోమవారం కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్కు ఆదేశాలు అందాయి. గిరిజన యూనివర్సిటీ కోసమని స్పష్టంగా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నా జాతీయ విద్యా సంస్థల విషయంలో ఐఐటీ, ఐఐఎంలా? లేదా ఇతర విద్యా సంస్థలా?.. ఎన్ని?.. అవేమిటి? ..అనే విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. దీర్ఘకాల డిమాండ్ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అంతటి స్థాయిలో విశాఖ అభివృద్ధి దిశగా పయనిస్తోంది. కానీ విద్యారంగంలో మాత్రం ప్రతిష్టాత్మక, జాతీయ స్థాయి విద్యా సంస్థలు లేకపోవడం లోటుగా పరిణమించింది. ఫలితంగా ఉన్నత విద్యతో పాటు ఉద్యోగావకాశాల కోసం యువత హైదరాబాద్ లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచపటంలో గుర్తింపు పొందిన విశాఖలో ఐఐటీ, ఐఐఎంలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా దీర్ఘకాలంగా ఉంది. కనీసం విశాఖలో ఘన చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సెంట్రల్ యూనివర్సిటీగా మార్చాలన్న ప్రతిపాదనలు ముందుకు సాగలేదు. వీటిపై జిల్లా నుంచి కేంద్రమంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా ప్రాతినిథ్యం వహించిన వారంతా సిఫార్పులు చేసినా ఫలితం లేకపోయింది. తాజాగా జాతీయ విద్యా సంస్థల ఏర్పాటుకు స్థలాన్వేషణ చేయాలంటూ ఉన్నత విద్యా శాఖ నుంచి ఉత్తర్వులు రావడంతో విశాఖ వాసుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రెండు రోజుల్లో నివేదిక ఉన్నత విద్యా శాఖ ఉత్తర్వుల ప్రకారం.. జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యాయి. ఇప్పటికే ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడున్నాయో రెవెన్యూ అధికారులు గుర్తించి వాటికి ప్రహరీలు కూడా నిర్మించారు. వాటి రికార్డుల ఆధారంగా జాతీయ విద్యా సంస్థలకు అనువైన స్థలాలను రెండు రోజుల్లో గుర్తించి నివేదిక తయారు చేయనున్నారు. ఐఐటీ, ఐఐఎం విద్యా సంస్థలకు 400 నుంచి 500 ఎకరాల స్థలం అవసరముంటుంది. అదే గిరిజన యూనివర్సిటీకి 30 నుంచి 50 ఎకరాల స్థలం సరిపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ యూనివర్సిటీకి స్థలం ఏజెన్సీకి దగ్గరలో ఉండలా? లేదా గ్రామీణ ప్రాంతంలో చూడాలా? అన్న విషయంపై అధికారులు ఆలోచనలో పడ్డారు. దీని కోసం రెండు ప్రాంతాల్లో స్థలాలను గుర్తించి నివేదిక తయారు చేయాలని భావిస్తున్నారు. తుది నిర్ణయం ఉన్నత విద్యా శాఖ తీసుకుంటుందన్న ఆలోచనలో ఉన్నారు. జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఎన్ని? అవేమిటన్న విషయాన్ని స్పష్టం చెప్పకపోవడంతో నాలుగైదు ప్రాజెక్టులకు అవసరమయ్యే అనువైన స్థలాలను గుర్తించి నివేదికలు తయారుచేసి ఈ వారంలోనే ఉన్నత విద్యాశాఖకు పంపించనున్నట్టు కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ తెలిపారు. దీర్ఘకాల డిమాండ్ కావడం, రాష్ట్ర విభజన జరగడం, కేంద్ర ప్రభుత్వం హామీల నేపథ్యంలో తప్పకుండా ఐఐటీ లేదా ఐఐఎంలలో ఏదో ఒకటి త్వరలోనే జిల్లాకు మంజూరవుతుందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. విశాఖలో ఐఐఎం, విజయవాడలో ఐఐటీ విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: నేను ఏమాత్రం సంతోషంగా లేను: ప్రీతి జింటా ట్వీట్ వైరల్
పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని
మళ్ళీ బీజేపీదే విజయం: యూపీ డిప్యూటీ సీఎం
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement