-
ఇంటర్ విద్యార్థి గల్లంతు
సుబ్బరాయసాగర్లో ఈతకు వెళ్లి నీటమునిగిన వైనం మండలంలోని నారాయణరెడ్డిపల్లికి చెందిన ఇంటర్ విద్యార్థి పెద్ద కుళ్లాయప్ప (22) తన స్నేహితులు మల్లికార్జున, రంగనాయకులు, రాముతో కలిసి సోమవారం సంజీవపురం వద్దనున్న సుబ్బరాయసాగర్లో ఈత నేర్చుకునేందుకు వెళ్లారు. నీటిలోకి దిగిన పెద్ద కుళ్లాయప్ప కొద్దిసేపటికే మునిగిపోయాడు. మిగిలిన ముగ్గురికీ ఈత రాకపోవడంతో రక్షించండి అంటూ కేకలు వేసుకుంటూ సమీప గ్రామస్తులకు సమాచారం అందించారు. వారు వచ్చి నీటిలో గాలించినప్పటికీ పెద్ద కుళ్లాయప్ప జాడ కనిపించలేదు. కాసేపటి తర్వాత పోలీసులు, హెచ్చెల్సీ సిబ్బంది కూడా వచ్చి వెతికినా ప్రయోజనం లేకపోయింది. నీటి లోతు ఎక్కువగా ఉండటంతో పాటు సాగర్లో చేపలు ఉండటం వల్ల అట్టడుగుకు వెళ్లి గాలించడానికి ఎవరూ సాహసం చేయలేకపోతున్నారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ సురేష్బాబు పరిశీలించి ప్రమాదంపై స్నేహితులను విచారించారు. ఆశలన్నీ తనయుడిపైనే.. ‘ఆశలన్నీ నీపైనే పెట్టుకుంటిమయ్యా... నీవు లేకుండా పోతే మా గతి ఏమికాను’ అంటూ పెద్ద కుళ్లాయప్ప తల్లిదండ్రులు వెంకటరాముడు, రామాంజినమ్మ కన్నీరుమున్నీరయ్యారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. కాగా సాగర్లో గల్లంతైన పెద్ద కుమారుడు పెద్ద కుళ్లాయప్ప తాడిపత్రిలోని శ్రీవాణి కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. సాగర్లో ఏడాదికి ఒకరు బలి.. సుబ్బరాయసాగర్ వద్ద గత మూడేళ్లుగా ఏడాదికి ఒకరు చొప్పున మరణిస్తున్నారు. సాగర్లోకి నీరు వచ్చిన సమయంలో చూడటానికి ఈ ప్రదేశం ఆహ్లాదకరంగా ఉండటంతో సందర్శకుల సంఖ్యతో పాటు స్థానిక యువకులు పెద్ద ఎత్తున ఇక్కడకు ఈతకొట్టేందుకు వస్తున్నారు. ఇలాంటి సమయంలో నీటిలోకి దిగుతున్న యువకులను హెచ్చెల్సీ సిబ్బంది, పోలీసులు మందలించకపోవడంతో ఈ ప్రమాదాలు కొనసాగుతున్నాయి. 2014 డిసెంబర్ 7న కడవకల్లు గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్తి నరేష్, 2015 డిసెంబర్ 13న తాడిపత్రి పట్టణానికి చెందిన షాహీద్బాషా(22) నీటిలో మునిగి చనిపోయిన విషయం విదితమే. -
‘కాలం’ కాటేసింది
తొందరగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్న ఆత్రుత ఓ ఇంటర్ విద్యార్థి ప్రాణాలను బలికొంది. అంతేగాక తనతోపాటు వచ్చిన అతని స్నేహితుడు కూడా బలయ్యాడు. ఒక్కగానొక్క కుమారుడు ఉన్నత చదువులు చదివి వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటాడనుకున్న తల్లిదండ్రులకు తీరని వ్యథ మిగిలింది. ఒక్క క్షణం ముందు బస్టాపు వద్దకు వచ్చి ఉన్నా.. క్షణం ఆలస్యంగా వచ్చి ఉన్నా వారు క్షేమంగా ఉండేవారు. ములకలచెరువు సమీపంలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మండలంలోని సోంపల్లెకు చెందిన ఇంటర్ విద్యార్థి మృతి చెందగా అతని తోడుగా వచ్చిన మిత్రుడు కూడా దుర్మరణం పాలయ్యాడు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఒకేసారి మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదం అలుముకుంది. ఈ సంఘటన వివరాలిలా.. ములకలచెరువు: సోంపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ఆది నారాయణ, గంగులమ్మల కుమారుడు అనిల్కుమార్(18) ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభం కావడంతో పరీక్ష రాసేందుకు మదనపల్లెకు వెళ్లాల్సివుంది. దీంతో సోంపల్లె నుంచి ములకలచెరువుకు చేరుకుని అక్కడి నుంచి మదనపల్లెకు వెళ్లాలి. దీంతో అనిల్కుమార్ను బస్సెక్కించేందుకు మిత్రుడు అంజనప్ప(19) బైక్లో బయలుదేరారు. ఉదయం 6.30 గంటలకు బైక్లో ములకలచెరువుకు చేరుకోగా అప్పటికే మదనపల్లెకు వెళ్లే ఆర్టీసీ బస్సు ముందుకు కదిలింది. బస్సును అందుకునేందుకు బైక్లో వెంబడించాడు. విద్యుత్ సబ్స్టేషన్ వద్ద బస్సును ఓవర్టేక్ చేస్తూ ముందుకు వెళ్తుండగా..అదే సమయంలో ఎదురుగా పుంగనూరు నుంచి కర్నూలుకు కోళ్ల లోడుతో వెళ్తున్న ఐషర్ వాహనం బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో అంజనప్ప(19), అనిల్కుమార్ (18)లు సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. క్షణ కాలమే ఆలస్యం.. మిత్రులిద్దరూ ఉదయం బైక్లో ములకలచెరువు చేరుకోవడం క్షణకాలమే ఆలస్యమైంది. ఆ సమయంలో ఆర్టీసీ బస్సు కదులుతోంది. తొందరగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్న ఆత్రుతతో అదే బస్సును అందుకునేందుకు బైక్లో వెంబడించారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని గమనించక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కన్నీరుమున్నీరైన కుటుంబసభ్యులు విషయం తెలిసి మృతుల కుటుంబసభ్యులు, బంధువులు ఘటనా స్థలికి చేరుకుని బోరున విలపించారు. వీరివురు నిరుపేద కుటుంబాలకు చెందిన వారు. అనీల్కుమార్ తల్లిదండ్రులు ఆదినారాయణ, గంగులమ్మ కూలి పనులు చేసుకుంటూ కొడుకును చదివిస్తున్నారు. వీరికి అనీల్కుమార్ ఒక్కడే కుమారుడు. వృద్ధాప్యంలో తమకు చేదోడు వాదోడుగా ఉంటాడన్న ఆశించిన నీరుపేద తల్లిదండ్రులకు తీరని వ్యథ మిగిలింది. ఇక అంజనప్ప కూలి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఇతని తండ్రి వేమనారాయణ గతంలో మరణించగా తల్లి లక్ష్మీదేవి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఎదిగొచ్చిన బిడ్డ రోడ్డుపై విగతజీవిగా పడి ఉండటం చూసిన ఆ తల్లి తల్లడిల్లిపోయింది. మృతదేహాలను చూసి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎస్ఐ శ్రీకాంత్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లెకు తరలించారు. ఈ ఘటనతో సోంపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ తెలిపారు. ములకలచెరువు సీఐ రుషికేశవ మదనపల్లి ఆస్పత్రికి వెళ్లి మృతుల కుటుంబసభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం ఆందించారు. మృతుల కుంటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాల్సివుంది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
SRH vs PBKS: రాణించిన టాపార్డర్.. పంజాబ్ భారీ స్కోరు!
Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్బాస్ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)
మంచు హోటల్లో మంచి విందు! కేవలం శీతాకాలంలోనే ఎంట్రీ..!
పోలింగ్ ముగిసినా.. ‘ఆళ్లగడ్డ’లో ఆగని ఫ్యాక్షన్
ప్రియుడిని పరిచయం చేసిన ఫైమా.. ఇదేంటి రాధికా అంటూ కామెంట్లు
థాయ్లాండ్ ఓపెన్ విజేతగా సాత్విక్-చిరాగ్ జోడీ
ఆ బండరాయి.. కేవలం వేళ్లపైనే..! ఎలా అనేది నేటికీ మిస్టరీనే!
ఓటీటీకి రూ.150 కోట్ల చిత్రం.. ఈ సారైనా?
IPL 2024- SRH: నితీశ్ రెడ్డి.. పక్కా లోకల్! త్వరలోనే టీమిండియాలో..
ఇండోనేషియాలో స్టార్లింక్ సర్వీస్.. 'మస్క్' నెక్స్ట్ ప్లాన్ అదేనా!
తప్పక చదవండి
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement