-
స్లోవేకియా, పోలండ్ టీటీ టోర్నీలకు శ్రీజ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ రెండు అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాల్గొనేందుకు భారత జట్టుకు ఎంపికైంది. ఈ నెలలో స్లోవేకియా, పోలండ్లలో జరిగే జూనియర్ సర్క్యూట్ టోర్నీల్లో ఆమె పోటీపడనుంది. ముందుగా ఈ నెల 22 నుంచి 25 వరకు సెనెక్లో జరిగే స్లోవేక్ జూనియర్ ఓపెన్ టోర్నీలో, అనంతరం 28 నుంచి జూన్ 1 వరకు వ్లాదిస్లావోవో (పోలండ్) పోలిష్ జూనియర్, క్యాడెట్ ఓపెన్ చాంపియన్షిప్లో ఆమె పోటీపడనుంది. జూనియర్ బాలికల కేటగిరీలో భారత ఐదో ర్యాంకర్ అయిన శ్రీజ ఈ నెలారంభం నుంచి లక్నోలో జరుగుతున్న శిక్షణ శిబిరంలో పాల్గొంటోంది. ఈ రెండు టోర్నీలకు ఆంధ్రప్రదేశ్ తరఫున భారత జట్టులోకి ఎంపికైన ఏకైక క్రీడాకారిణి శ్రీజ. తన కుమార్తెకు స్థానం లభించడం పట్ల ఆమె తండ్రి ప్రవీణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. రెండు ఈవెంట్లలోనూ శ్రీజ మంచి ప్రదర్శన కనబర్చాలని ఆకాంక్షించారు. -
మూడు లక్ష్యాలతో ముందుకు...
న్యూఢిల్లీ: గతేడాదిని విజయవంతంగా ముగించిన ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఈ ఏడాది కూడా అదే రీతిన ఆరంభించింది. ఇప్పటికే సయ్యద్ మోడి అంతర్జాతీయ టోర్నీలో రన్నరప్గా నిలువగా... ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ టోర్నీలో విజేతగా నిలిచి మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇదే జోరును రానున్న టోర్నీల్లోనూ కొన సాగిస్తానని విశ్వా సం వ్యక్తం చేసింది. ప్రస్తుతానికైతే వచ్చే నెల 4 నుంచి 9 వరకు జరిగే ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్పై దృష్టి సారించానని ప్రపంచ పదో ర్యాంకర్ సింధు తెలిపింది. అలాగే ఈ ఏడాదే జరిగే కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో పతకాలు నెగ్గడంతోపాటు...సీజన్ ముగింపు దశకు ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్-6కు చేరడమే తన లక్ష్యమని పేర్కొంది. తన కొత్త స్పాన్సర్ లీ నింగ్ సంస్థ ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సింధు పలు అంశాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... ఈ ఏడాది షెడ్యూల్ కాస్త కఠినంగానే ఉంది. వెంటవెంటనే టోర్నీలున్నాయి. ఈనెల అయితే మొత్తం విశ్రాంతి దొరికింది. కాబట్టి నా స్ట్రోక్స్, డిఫెన్స్పై దృష్టి సారించాను. వచ్చే నెలలో జరిగే ఆల్ ఇంగ్లండ్ టోర్నీకి నా సన్నాహాలు బాగానే సాగుతున్నాయి. ఆ తర్వాత స్విస్ ఓపెన్ ఉంటుంది. వెంటనే సూపర్ సిరీస్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు జరుగనున్నాయి. నేను ఏయే టోర్నీలు ఆడాలనే విషయం కోచ్ గోపీచంద్ నిర్ణయిస్తాడు. అయితే కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి ఆడబోతున్నందుకు చాలా ఆసక్తిగా ఉంది. ఈసారి భారత ఆటగాళ్లు ఎక్కువ పతకాలు గెలుస్తారనుకుంటున్నాను. ఈ ఏడాది చివరి వరకు ప్రపంచ ర్యాంకింగ్స్లో ఏడు లేక ఆరో స్థానంలో ఉండాలని నా ఆలోచన. అయితే నా స్ట్రోక్స్ విషయంలో ఇంకా రాణించాల్సి ఉంది. మేలో న్యూఢిల్లీలో జరిగే ఉబెర్ కప్ టీమ్ చాంపియన్షిప్లో మేం విశేషంగా రాణించాలని భావిస్తున్నాం. క్రితం సారి నేను బాగానే ఆడాను. సైనాపై ఐబీఎల్లోకన్నా సయ్యద్ మోడి టోర్నీలోనే మెరుగ్గా ఆడాను. అటాకింగ్ గేమ్ ఆడాలనుకున్నా సాధ్యం కాలేదు. సైనా చాలా అనుభవజ్ఞురాలు. -
భారత రెజ్లర్లకు మూడు పతకాలు
న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో పోటీపడిన తొలి అంతర్జాతీయ టోర్నమెంట్లోనే భారత రెజ్లర్లు సత్తా చాటుకున్నారు. అమెరికాలోని కొలరాడో స్ప్రింగ్స్లో జరిగిన డేవ్ షుల్జ్ స్మారక టోర్నమెంట్లో భారత రెజ్లర్లు మూడు పతకాలు సాధించారు. ఇందులో ఒక్కో స్వర్ణ, రజత, కాంస్య పతకాలున్నాయి. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో ప్రవీణ్ రాణా (74 కేజీలు) స్వర్ణం సాధించగా... అమిత్ కుమార్ (61 కేజీలు) రజతం... సందీప్ తోమర్ (57 కేజీలు) కాంస్యం నెగ్గారు. ఫైనల్లో ప్రవీణ్ రాణా 5-0తో డాన్ వాలిమోంట్ (అమెరికా)పై నెగ్గగా... అమిత్ 0-11తో బొగోమొయెవ్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. కాంస్య పతక బౌట్లో సందీప్ తోమర్ 10-0తో స్టీవ్ మిచ్ (అమెరికా)పై గెలుపొందాడు. 65 కేజీల విభాగం కాంస్య పతక పోరులో బజరంగ్ (భారత్) 1-11తో నొవాచ్కోవ్ (బల్గేరియా) చేతిలో ఓడిపోయాడు. -
ధీమా పెరిగింది
గత ఏడాది లండన్ ఒలింపిక్స్లో ఎన్నడూలేని విధంగా ఆరు పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత క్రీడాకారులు ఈ సంవత్సరం కూడా తమ జోరు కొనసాగించారు. విశ్వ క్రీడా వేదికపై తమదైన ముద్ర వేశారు. ఆర్చరీ నుంచి రెజ్లింగ్ దాకా ప్రతి క్రీడాంశంలో మనోళ్లు మెరిశారు. భారత క్రీడాకారులు ఈ విజయనామ సంవత్సరంలో విజయాలు మోసుకొచ్చారు. కొన్నేళ్ల క్రితం వరకు అంతర్జాతీయ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం కోసమే వెళ్లేవారు ఇపుడు పతకాలతో తిరిగి వస్తున్నారు. వివాదాలు వెంటాడుతున్నా... అంచనాలను అందుకుంటూ... ఆశలను నేరవేరుస్తూ... క్రీడలను కూడా కెరీర్గా ఎంచుకోవచ్చనే ధీమాను పెంచుతూ... అద్వితీయ విజయాలతో క్రీడా ప్రపంచంలో మరింత ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది భారత క్రీడారంగంలో గుర్తుంచుకోదగిన క్షణాల సమాహారం... సాక్షి పాఠకుల కోసం. లేటు వయసులో మేటి ఫలితాలు (టెన్నిస్) ఉత్సాహం, పట్టుదల ఉంటే లేటు వయసులోనూ మేటి ఫలితాలు సాధించొచ్చని లియాండర్ పేస్ నిరూపించాడు. రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్)తో కలిసి ఈ కోల్కతా యోధుడు 40 ఏళ్ల ప్రాయంలో యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో డబుల్స్ టైటిల్ నెగ్గాడు. ఈ క్రమంలో గ్రాండ్స్లామ్ టైటిల్ సాధించిన పెద్ద వయస్కుడిగా పేస్ చరిత్ర లిఖించాడు. వేర్వేరు భాగస్వాములతో కలిసి రోహన్ బోపన్న రెండు డబుల్స్ టైటిల్స్ను... మహేశ్ భూపతి ఒక టైటిల్ను నెగ్గారు. డబుల్స్కే పరిమితమైన హైదరాబాద్ స్టార్ సానియా మీర్జాకు ‘గ్రాండ్స్లామ్’ విజయం దక్కకపోయినా స్థిరమైన ప్రదర్శనతో ఐదు టైటిల్స్ సాధించింది. బెథానీ మాటెక్ (అమెరికా)తో కలిసి బ్రిస్బేన్ ఓపెన్, దుబాయ్ ఓపెన్లో... జెంగ్ జీ (చైనా)తో కలిసి న్యూ హవెన్ ఓపెన్లో... కారా బ్లాక్ (జింబాబ్వే)తో కలిసి టోక్యో ఓపెన్, బీజింగ్ ఓపెన్లలో సానియా డబుల్స్ టైటిల్స్ను సొంతం చేసుకుంది. గురి అదిరింది (ఆర్చరీ) లండన్ ఒలింపిక్స్లో వైఫల్యాన్ని మరిపిస్తూ ఈ ఏడాది భారత ఆర్చర్లు తీపి జ్ఞాపకాలు మిగిల్చారు. దీపిక కుమారి, బొంబేలా దేవి, రిమిల్ బురిలీలతో కూడిన భారత జట్టు పోలండ్, కొలంబియాలలో జరిగిన రెండు ప్రపంచకప్లలో స్వర్ణ పతకాలు గెలిచింది. ఈ క్రమంలో భారత బృందం ఒలింపిక్ చాంపియన్ దక్షిణ కొరియాను, చైనా జట్లను బోల్తా కొట్టించింది. పురుషుల కాంపౌండ్ ఈవెంట్లో భారత జట్టు ఆసియా చాంపియన్షిప్లో విజేతగా నిలిచింది. ఇక మంగోలియాలో జరిగిన ఆసియా గ్రాండ్ప్రి టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వై.చరణ్ రెడ్డి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించాడు. ఉడుంపట్టు (రెజ్లింగ్) గతేడాది లండన్ ఒలింపిక్స్లో స్టార్ రెజ్లర్లు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ విజయాల స్ఫూర్తితో... ఈసారి ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. సెప్టెంబరులో హంగేరిలో జరిగిన ఈ మెగా ఈవెంట్లో తొలిసారి భారత రెజ్లర్లు మూడు పతకాలు సాధించారు. ఫ్రీస్టయిల్లో అమిత్ కుమార్ (55 కేజీలు) రజతం నెగ్గగా... బజరంగ్ (60 కేజీలు) కాంస్యం సాధించాడు. గ్రీకో రోమన్ విభాగంలో సందీప్ తులసీ యాదవ్ (66 కేజీలు) కాంస్యం రూపంలో తొలిసారి భారత్కు పతకాన్ని అందించాడు. ఈ ‘త్రయం’ ప్రదర్శనతో తొలిసారి భారత్ వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్కు అర్హత సాధించింది. ‘పంచ్’ పదును అదుర్స్ (బాక్సింగ్) మనోళ్లపై అంతర్జాతీయ అమెచ్యూర్ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) సస్పెన్షన్ కొనసాగుతున్నా... ఈ ప్రభావం భారత బాక్సర్లపై పడలేదు. జూలైలో జోర్డాన్లో జరిగిన ఆసియా సీనియర్ చాంపియన్షిప్లో శివ థాపా (56 కేజీలు) స్వర్ణం నెగ్గగా... మన్దీప్ జాంగ్రా (69 కేజీ), దేవేంద్రో సింగ్ (49 కేజీ)లకు రజతాలు, మనోజ్ కుమార్ (64 కేజీలు) కాంస్యం లభించాయి. కజకిస్థాన్లో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో తొలిసారి ఐదుగురు భారత బాక్సర్లు క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. సెర్బియా టోర్నీలో ఏపీ బాక్సర్ లలితా ప్రసాద్ (49 కేజీలు) పసిడి పతకం సాధించగా... సెప్టెంబరులో బల్గేరియాలో ప్రపంచ యూత్ చాంపియన్షిప్లో నిఖత్ జరీన్ (54 కేజీలు) రజతం గెల్చుకుంది. ‘రాకెట్’తో రఫ్ ఆడించారు (బ్యాడ్మింటన్) బ్యాడ్మింటన్ ప్రపంచంలో తెలుగు తేజం పి.వి.సింధు కొత్త రాకెట్లా దూసుకొచ్చింది. మేలో మలేసియా గ్రాండ్ప్రి గోల్డ్ టైటిల్ నెగ్గిన 18 ఏళ్ల సింధు అదే జోరును కొనసాగించి చైనాలో జరిగిన ప్రపంచ సీనియర్ చాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించింది. తద్వారా మహిళల సింగిల్స్లో పతకం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది. కేంద్ర క్రీడాపురస్కారం ‘అర్జున అవార్డు’ పొందిన ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి డిసెంబరులో మకావు గ్రాండ్ప్రి గోల్డ్ టోర్నీలోనూ విజేతగా నిలిచింది. దిగ్గజం ప్రకాశ్ పదుకొనే నుంచి బ్యాడ్మింటన్ భవిష్యత్ తారగా ప్రశంసలందుకుంది. గత ఐదేళ్లుగా భారత బ్యాడ్మింటన్కు పర్యాయపదంగా నిలిచిన సైనా నెహ్వాల్కు ఈ ఏడాది ఏదీ కలసిరాలేదు. ఆడిన 14 టోర్నమెంట్లలో ఆమె ఒక్కదాంట్లోనూ ఫైనల్కు చేరుకోలేదు. పురుషుల విభాగంలో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు కిడాంబి శ్రీకాంత్ ఆశాకిరణంలా ఎదిగాడు. జూన్లో థాయ్లాండ్ ఓపెన్ గ్రాండ్ప్రి గోల్డ్ టైటిల్ నెగ్గిన ఈ గుంటూరు జిల్లా క్రీడాకారుడు ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. 2001లో పుల్లెల గోపీచంద్ ఆల్ ఇంగ్లండ్ టైటిల్ సాధించిన తర్వాత శ్రీకాంత్ రూపంలో మరో భారత ప్లేయర్ సీనియర్ స్థాయిలో అంతర్జాతీయ టైటిల్ నెగ్గాడు. తెలుగు కుర్రాడు సిరిల్ వర్మ ఆసియా యూత్ చాంపియన్షిప్లో అండర్-15 చాంపియన్గా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారుడిగా నిలిచాడు. ఐపీఎల్ తరహాలో బ్యాడ్మింటన్లో ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) ఈ ఏడాది కొత్తగా ప్రారంభమైంది. సైనా నెహ్వాల్ సభ్యురాలిగా ఉన్న ‘పీవీపీ హైదరాబాద్ హాట్షాట్స్’ తొలి ఏడాది చాంపియన్గా అవతరించింది. బుల్లెట్ దిగింది (షూటింగ్) అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భారత మహిళా షూటర్ హీనా సిద్ధూ ప్రపంచకప్ ఫైనల్స్లో సంచలనం సృష్టించింది. నవంబరులో జర్మనీలో జరిగిన సీజన్ ముగింపు టోర్నీలో ఈ పంజాబ్ అమ్మాయి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో పసిడి పతకాన్ని నెగ్గింది. పిస్టల్ ఈవెంట్లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ షూటర్గా చరిత్ర సృష్టించింది. పతకం నెగ్గే క్రమంలో హీనా ‘డబుల్ ఒలింపిక్ చాంపియన్’ గువో వెన్జున్ (చైనా), ప్రపంచ చాంపియన్ అరునోవిచ్ జొరానా (సెర్బియా), రెండుసార్లు ఒలింపిక్స్లో పతకాలు నెగ్గిన కొస్టెవిచ్ (ఉక్రెయిన్)లను ఓడించింది. ‘లిఫ్ట్’ చేస్తే పతకాలే... (వెయిట్లిఫ్టింగ్) భారత వెయిట్లిఫ్టింగ్కు ఈ ఏడాది కలిసొచ్చింది. ఆంధ్రప్రదేశ్ యువ లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ భవిష్యత్పై ఆశలు పెంచాడు. ఆసియా యూత్ చాంపియన్షిప్లో, ఆసియా యూత్ క్రీడల్లో, కామన్వెల్త్ చాంపియన్షిప్లలో అతను స్వర్ణ పతకాల పంట పండించాడు. ఆంధ్రప్రదేశ్కే చెందిన శిరీషా రెడ్డి, దీక్షిత కూడా కామన్వెల్త్ చాంపియన్షిప్లో భారత్కు పతకాలు అందించారు. -
ఖేల్ ఖతం...
షాంఘై: మరో అంతర్జాతీయ టోర్నీ... మరో వైఫల్యం... భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్కు ఈ ఏడాది ఏ టోర్నీ కలిసి రావడంలేదు. ఈ సంవత్సరంలో తాను పాల్గొన్న ఏ టోర్నీలోనూ ఫైనల్కు చేరుకోలేకపోయిన సైనా... అదే ఆనవాయితీని చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నీలోనూ కొనసాగించి ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టింది. గురువారం జరిగిన మ్యాచ్లో ఆరో సీడ్ సైనా 21-16, 15-21, 17-21తో సున్ యూ (చైనా) చేతిలో ఓడిపోయింది. సైనాతోపాటు అరుంధతి పంతవానె, పారుపల్లి కశ్యప్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోయారు. దాంతో ఈ మెగా టోర్నీలో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. అరుంధతి 13-21, 10-21తో మూడో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓటమి చవిచూడగా... పురుషుల సింగిల్స్ మ్యాచ్లో కశ్యప్ 11-21, 12-21తో కెంటో మొమొటా (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. ప్రపంచ 32వ ర్యాంకర్ సున్ యూతో కెరీర్లో తొలిసారి ఆడిన సైనా తొలి గేమ్ను నెగ్గినా ఆ తర్వాత తడబడింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సైనా నెట్వద్ద 40 పాయింట్లు సంపాదించింది. అయితే కీలకదశల్లో అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. రెండో గేమ్లోనైతే స్కోరు 5-5 వద్ద సమంగా ఉన్నపుడు ఈ హైదరాబాద్ అమ్మాయి వరుసగా 11 పాయింట్లు ప్రత్యర్థికి సమర్పించుకొని 5-16తో వెనుకబడిపోయింది. ఆ తర్వాత సైనా కోలుకొని వరుసగా ఆరు పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది. కీలకమైన మూడో గేమ్లో సైనా 8-15తో వెనుకబడిన దశలో పుంజుకొని వరుసగా ఏడు పాయింట్లు నెగ్గి స్కోరును 15-15తో సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ రెండేసి పాయింట్లు స్కోరు చేశారు. ఈ దశలో సున్ యూ వరుసగా నాలుగు పాయింట్లు సాధించి గేమ్ను, మ్యాచ్ను కైవసం చేసుకుంది. మొమొటాతో జరిగిన మ్యాచ్లో కశ్యప్ అరగంటలో చేతులెత్తేశాడు. మొమొటా స్మాష్లతో హడలెత్తించి ఏకంగా 38 పాయింట్లు స్కోరు చేశాడు. సైనా, కశ్యప్ తదితరులు ఈనెల 19 నుంచి 24 వరకు జరిగే హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో బరిలోకి దిగుతారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement