-
నల్లా ఇరుక్కు!
మీ ఇంట్లో నల్లాల ద్వారా నీరొస్తోందా.. దాన్ని నేరుగా తాగుతున్నారా? లేదా ఏదైనా ఫిల్టర్లో వేసి తాగుతున్నారా? అత్యధిక శాతం ప్రజలు ఫిల్టర్లనే వాడుతుంటారు. ఎందుకంటే.. మంచి నీళ్లని చెబుతున్నా.. అవన్నీ మంచిగా ఉన్నవేనా అన్న డౌటు. ఫిల్టరైజేషన్ చేయకుంటే.. రోగాల బారినపడతామన్న భయం. అయితే.. కొన్ని దేశాల్లో నల్లా నీటిని నేరుగా తాగేయొచ్చు. ఎందుకంటే.. తాగునీటి సరఫరా విషయంలో ఇవి కఠిన నిబంధనలు పాటిస్తున్నాయి. సురక్షితమైన నీటిని నల్లాల ద్వారా ప్రజలకు సరఫరా చేస్తున్నాయి. అందుకే ఈ కింది దేశాల్లోని నీరు ‘నల్లా ఇరుక్కు’అన్నమాట!! చాలా సినిమాల్లో ఈ మాట విన్నట్లు అనిపిస్తోంది కదూ.. ఈ తమిళ పదానికి అర్థం ఇది బాగుంది లేదా మంచిది అని. మార్చి 22న ‘అంతర్జాతీయ నీటి దినోత్సవం’ నేపథ్యంలో.. ఈ ‘నల్లా ఇరుక్కు’ దేశాల టాప్–10 వివరాలివీ.. ఫిన్లాండ్ ప్రకృతి సహజ వనరులకు పెట్టింది పేరైన ఫిన్లాండ్లో అత్యాధునిక వ్యవస్థలతో విస్తృతంగా నీటి శుద్ధి చేపడతారు. ఇక్కడ నల్లాల ద్వారా సరఫరా చేసే మంచి నీరు ప్రపంచంలోనే సురక్షితమైనదిగా పేరుపొందింది. ఐస్ల్యాండ్ ఈ దేశంలో హిమానీ నదాలు (గ్లేసియర్లు), వేడి నీటి ఊటల నుంచి వచ్చే నీరు సాధారణంగానే సురక్షితమైనది. ఆ నీటినే మరికాస్త శుద్ధిచేసి ఇళ్లకు సరఫరా చేస్తారు. స్విట్జర్లాండ్ కలుషితాల విషయంలో కఠిన నిబంధనలు, శుద్ధి చేసేందుకు అనుసరించే విధానాలతో ఈ దేశంలో నల్లా నీళ్లు సురక్షితమైనవిగా గుర్తింపు పొందాయి. ఆస్ట్రియా ఇక్కడి పర్వత ప్రాంతాలు, వాటికి అనుబంధంగా ఉన్న మంచి నీటి వనరులకు తోడు.. నీటి సంరక్షణ చర్యలు, కఠిన నిబంధనలతో నాణ్యమైన నీటిని ఇళ్లకు సరఫరా చేస్తున్నారు. నార్వే హిమానీనదాలు, ఇతర మంచి నీటి వనరులు అందుబాటులో ఉండటం, నీటి శుద్ధికి అత్యంత ఆధునిక విధానాలు అవలంబించడంతో.. సురక్షిత నీరు సరఫరా చేసే దేశాల్లో నార్వే ఒకటిగా నిలిచింది. నెదర్లాండ్స్ మంచినీటి వనరులు మరీ ఎక్కువగా లేని దేశమే అయి నా.. నీటి శుద్ధి, నల్లాల ద్వారా పరిశుభ్రమైన నీటి సరఫరా విషయంలో ముందు నుంచీ మంచి ప్రమాణాలు పాటిస్తోంది. మాల్టా ఇది చుట్టూ ఉప్పునీరే కమ్ముకుని ఉన్న చిన్న ద్వీప దేశమే అయినా.. సముద్రపు నీటిని మంచినీటిగా మార్చే (డీసాలినేషన్ ప్రక్రియ) ద్వారా సురక్షిత నీటిని ఇళ్లకు సరఫరా చేస్తోంది. ఐర్లాండ్ ఇక్కడ మంచినీటి వనరులు పుష్కలంగా ఉండటంతోపాటు జలాల సంరక్షణ, శుద్ధి విషయంలో కఠిన నిబంధనలతో నాణ్యమైన నీటి సరఫరాలో టాప్–10 దేశాల్లో నిలిచింది. యునైటెడ్ కింగ్డమ్ కలుషితాల విషయంలో కఠిన నిబంధనలు పాటించడం, నీటి శుద్ధికి అత్యున్నత విధానాలను అవలంబించడంతో ప్రమాణాలతో కూడిన నీటిని ఈ దేశంలో సరఫరా చేస్తున్నారు. - సాక్షి సెంట్రల్ డెస్క్ -
ప్రాజెక్టుల వ్యయంపై మాట్లాడితే బ్రేకులే..
♦ పతిపక్షనేత ప్రసంగానికి పదేపదే బ్రేకులు ♦ పది నిమిషాలు కూడా అవకాశమివ్వని సభాపతి సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులు, వాటికి పెట్టిన వ్యయాలు, ఆయకట్టు వివరాలు.. వీటిపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి మాట్లాడితే చాలు మైక్ కట్ అయిపోతుంది. మంగళవారం అసెంబ్లీలో ఇదే సీన్ చోటు చేసుకుంది. అంతర్జాతీయ జలదినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు సుమారు గంటసేపు సుదీర్ఘంగా ప్రసంగించారు. పోలవరం, పట్టిసీమ, గాలేరు-నగరి తదితర ప్రాజెక్టులపై మాట్లాడారు. అనంతరం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాట్లాడే అవకాశమివ్వడంతో ఆయన తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రాజెక్టులపై చేసిన వ్యయం, వైఎస్ హయాంలో ప్రాజెక్టులకు చేసిన వ్యయం, ఆయన మరణానంతరం ఎంత వ్యయం చేశారన్నది అధికారిక లెక్కలతోసహా చదివి వినిపించారు. దీంతో అధికారపక్షం ఉలిక్కిపడింది. పదేపదే ఆయన ప్రసంగానికి అడ్డుతగిలింది. ఈ నేపథ్యంలో పదేపదే ఆయన మైక్ కట్ అయింది. 25 నిమిషాల ప్రసంగంలో దాదాపు 12 నిమిషాలు అంతరాయానికే సరిపోయింది. జగన్ ప్రసంగం చేపట్టిన మూడు నిమిషాలకే స్పీకర్ మైక్ కట్ చేసి జలవనరులమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు అవకాశమిచ్చారు. దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు పదేపదే మైక్ కట్ చేయడమేంటని ప్రశ్నించారు.ఆ వెంటనే చీఫ్విప్ కాల్వ శ్రీనివాసులుకు అవకాశమిచ్చారు. అనంతరం జగన్కు అవకాశమివ్వగా... రెండు నిమిషాలు మాట్లాడారో లేదో మైక్ కట్ చేసి మళ్లీ దేవినేనికి మైకిచ్చారు. మళ్లీ జగన్కు అవకాశమిచ్చినట్టే ఇచ్చి.. వెనువెంటనే మైక్ కట్చేసి బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్రాజుకు మాట్లాడే చాన్సిచ్చారు. ఆ తర్వాత స్పీకర్ కోడెల కలుగజేసుకుంటూ.. ప్రస్తుతం ప్రాజెక్టుల మీద చర్చ జరగట్లేదని, సబ్జెక్టుపరంగా వెళ్లాలని.. డీవియేట్ కాకూడదని.. ఇలా వెళితే ప్రజలకు రాంగ్ మెసేజ్ వెళుతుందని జగన్కు సలహా ఇచ్చారు. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావుకు స్పీకర్ అవకాశమిచ్చారు. ఆయన ప్రసంగానంతరం జగన్కు అవకాశమిచ్చిన నిమిషంలోపలే స్పీకర్ కలగజేసుకుంటూ... సభలో సీఎం స్టేట్మెంట్ ఏదైనా ఇచ్చినప్పుడు చర్చ ఉండదని, మీరు ప్రాజెక్టులపై చర్చకు వెళ్లాలనుకుంటే వేరేమార్గంలో వెళ్లవచ్చునని, ఇప్పుడు అంతర్జాతీయ జలదినోత్సవం అంశం వరకే మాట్లాడాలన్నారు. వెంటనే జగన్కు మైక్ ఇచ్చిన స్పీకర్.. మళ్లీ కట్ చేసి జలదినోత్సవంపై ప్రతిజ్ఞకు వెళ్లారు. జలదినోత్సవంపై సభలో ప్రతిజ్ఞ అంతర్జాతీయ జలదినోత్సవం సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు మంగళవారం అసెంబ్లీలో సభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు. శనగ రైతులకు ఇంత అన్యాయమా? వైఎస్సార్ జిల్లాలో 2012లో శనగ పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పంటల బీమా సొమ్ము ఇవ్వ కపోవడం దారుణమని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. 55 వేలమంది రైతులు పంటల బీమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. మంగళవారం అసెంబ్లీ జీరో అవర్లో ఆయనీ అంశాన్ని ప్రస్తావించారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘2012లో రైతులు శనగ పంట వేసి నష్టపోయారు. 2013 పోయింది.. 2014 పోయిం ది.. 2015వ సంవత్సరం కూడా పోయింది. పంట నష్టపోయిన మూడున్నరేళ్ల తర్వాత కూడా రైతులకు బీమా సొమ్ము ఇవ్వకపోవడం, దీనిగురించి ఇప్పుడు మాట్లాడాల్సి రావడం బాధాకరం. అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఏఐసీ) వారితో గట్టిగా మాట్లాడాక 25 వేల మంది రైతులకు రూ.132 కోట్లు విడుదల చేశారు. ఇంకా రూ.37 కోట్లు రైతుల ఖాతాల్లో జమకాలేదు. మిగిలిన రైతుల పరిస్థితి దయనీయం. నాటి తప్పులు ఇప్పుడు చూపిస్తారా? పంటల బీమాకోసం రైతులు ప్రీమియం చెల్లించే సమయంలోనే తప్పులుంటే సరిది ద్దాలి. ఏమైనా పొరపాట్లు ఉంటే నిర్దిష్ట కాలంలో(ఒక నెలలోనో, రెండు నెలల్లోనో) సవరించాలి. 2012 రబీలో రైతులు పంటల బీమా ప్రీమియం చెల్లించారు. ఇప్పుడు ఏఐసీ తప్పు లు చూపిస్తోంది. ఇది ఎంతవరకు ధర్మం. వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల్లో పంటల బీమా అందని రైతుల దుస్థితి ఇది. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకుని బాధిత అన్నదాతలకు త్వ రగా పంటల బీమా సొమ్ము అందేలా చూడాలని మనవి చేస్తున్నా’’ అని ఆయన కోరారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
నల్లమలలోగుప్తనిధుల వేట
10న ప్రధాని మోదీ రాక
సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం
లక్ష్యం.. బహుదూరం
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
జూనియర్ ఏషియన్విజేతకు సన్మానం
ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
వంశీచంద్ అభ్యర్థి కాదు.. రేవంత్ షాడో
ఈవీఎంల స్ట్రాంగ్రూంల వద్ద పటిష్ట బందోబస్తు
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement