-
నులిపేద్దాం!
గద్వాల న్యూటౌన్: నులిపురుగుల సంక్రమణను నిరోధించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టనుంది. ఈనెల 19న జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలో 1–19 ఏళ్లలోపు ఉన్న 2,02,763 మందికి అల్బెండజోల్ మాత్రలు వేయించాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఇప్పటికే వైద్యసిబ్బంది, ఉపాధ్యాయులకు అధికారులు శిక్షణ ఇచ్చారు. ఈ మాత్రలను ఆయా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, పీహెచ్సీలకు సరఫరా చేశారు. వాస్తవానికి మనిషి పేగుల నుంచి పోషకాలను గ్రహించి వృద్ధిచెందే పరాన్న జీవులే నులిపురుగులు. ముఖ్యంగా పిల్లల్లో ఏలికపాములు, నులి, కొంకి పురుగులుగా ఉంటాయి. ఆరుబయట ఒట్టికాళ్లతో ఆడుకోవడం ద్వారా, చేతులు శుభ్రం చేసుకోకుండా భుజించడం, బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం, అపరిశుభ్రమైన పరిసరాల వల్ల వ్యాప్తి చెందుతుంది. దీనిని నివారించేందుకు షూ ధరించడం, భోజనం చేసే ముందు, మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయొద్దు. పండ్లు, కూరగాయలను శుభ్రం చేసి తినాలి. పరిశుభ్రమైన నీటిని తాగాలి. ఆరుబయట మలవిసర్జనకు వెళ్లరాదు. ఆహార పదార్థాలపై మూతలు పెట్టాలి. వీధుల్లో విక్రయించే ఆహారాన్ని భుజించరాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలపై ప్రభావం నులిపురుగులతో పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, బలహీనంగా మారడం, తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలు కలుగుతాయి. దీంతోపాటు శారీరక, మానసిక పెరుగుదల తగ్గిపోతుంది. ముఖ్యంగా విద్యార్థుల్లో ఏకాగ్రత తగ్గిపోతుంది. అల్బెండజోల్ మాత్రలు వేసుకోవడం ద్వారా వీటిని నిర్మూలించవచ్చు. రక్తహీనతను నియంత్రించడమేగాక వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. మాత్రలు ఇలా ఇవ్వాలి అల్బెండజోల్ మాత్రలు 1–2 ఏళ్లలోపు చిన్నారులకు సగం మాత్రను పొడి చేసి నీటిలో కలిపి తాగించాలి. జబ్బుతో ఉన్న, ఇతర మందులను తీసుకుంటున్న వారికి ఇవ్వరాదు. 2–19 ఏళ్లలోపు వారు మాత్రను చప్పరించి, నమిలి మింగాలి. కాగా, జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. ఫిబ్రవరిలో మొదటి, ఆగస్టులో రెండో విడత నిర్వహిస్తారు. మొదటి విడతలో భాగంగా ఈనెల 19న అల్బెండజోల్ మాత్రల పంపిణీకి వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. జిల్లాస్థాయిలో గత నెల 22న కలెక్టర్ శశాంక అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు. దీనికి ఐసీడీఎస్, విద్యాశాఖ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ తదితర 16 శాఖల అధికారులు హాజరయ్యారు. ఆ తర్వాత ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించి మాత్రలు వేసే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యసిబ్బంది, ఉపాధ్యాయులకు వివరించారు. నులిపురుగుల వల్ల వచ్చే ఇబ్బందులు, నివారణ చర్యలతో కూడిన కరపత్రాలు, వాల్పోస్టర్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయానికి పది రోజుల క్రితమే చేరాయి. పీహెచ్సీల వారీగా వీటిని సరఫరా చేశారు. ఇదిలాఉండగా జిల్లావ్యాప్తంగా 1–19 ఏళ్లలోపు వారికి అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల వారీగా గుర్తించారు. బడిబయట ఉన్న పిల్లలను సైతం ఆశా కార్యకర్తలు గుర్తించి అంగన్వాడీ కేంద్రాల్లో వేస్తారు. మిగిలిన వారికి ఈనెల 23న వేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. పకడ్బందీగా నిర్వహిస్తాం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినో త్సవం రోజు అల్బెండజోల్ మాత్రల పంపిణీని పకడ్బందీగా నిర్వహిస్తాం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఈపాటికే 1–19 ఏళ్లలోపు ఉన్న వారిని గుర్తించాం. తల్లిదండ్రులు తప్పక తమ పిల్లలకు ఈ మాత్రలు వేయించాలి. – డాక్టర్ రాజేంద్రకుమార్, ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ -
పేగు బ్యాక్టీరియాపై చక్కెర ప్రభావం
కడుపులో పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆరోగ్యంగా, తగినంత బరువు మాత్రమే ఉండే వారిలో మంచి బ్యాక్టీరియా చేరేందుకు కావాల్సిన కీలకమైన ప్రొటీన్ ఉత్పత్తిని చక్కెర అడ్డుకుంటుందని అంటున్నారు యేల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తాజా సంచికలో ప్రచురితమైన వివరాల ప్రకారం.. చక్కెర పేగుల్లోనే జీర్ణమైపోతుందని కడుపులోకి రాదని శాస్త్రవేత్తలు ఇప్పటివరకూ కట్టిన అంచనా తప్పని ఈ కొత్త పరిశోధన చెబుతోంది. ఫ్రక్టోజ్ గ్లూకోజ్ వంటి చక్కెరలు ఎక్కువగా ఉండే పాశ్చాత్యదేశాల ఆహారం బ్యాక్టీరియాపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు తాము ఈ పరిశోధన చేపట్టామని ఈ రెండు కలిసి తయారు చేసే సుక్రోజ్ ఆర్ఓసీ అనే ప్రొటీన్ ఉత్పత్తిని నిలిపిస్తున్నాయని గుర్తించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఎడ్యురాడో గ్రోయిస్మాన్ తెలిపారు. ఫలితంగా కొన్ని రకాల బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థలో మనుగుడ సాగించలేకపోతున్నాయని చెప్పారు. -
పేగు బంధాన్ని మరచి..
తల్లిని కాటికి సాగనంపేందుకు కుమారుడి నిరాకరణ కూతుళ్లే తలకొరివి పెట్టి రుణం తీర్చుకున్న వైనం వలిగొండ మండలం సుంకిశాలలో విషాదం పుత్రులు పున్నామనరకం నుంచి విముక్తి కలిగిస్తారని నానుడి...కానీ ఓ సుపుత్రుడు కన్నతల్లి రుణం తీర్చుకోవడానికి నిరాకరించాడు.. అవసాన దశలో ఆలనా పాలనా చూడాల్సిందిపోయి.. తనకు సంబంధం లేదని తెగదెంపులు చేసుకున్నాడు.. చివరకు కాటికి సాగనంపేందుకు కూడా ముఖం చాటేసి మానవ సంబంధాలకు మచ్చతెచ్చాడు. నల్గొండ జిల్లా : వలిగొండ మండలం సుంకిశాలకు చెందిన బొక్క పద్మారెడ్డి, బొక్క కమలమ్మ దంపతులకు నలుగురు కూతుళ్లు, కుమారుడు సంతానం. పద్మారెడ్డి మిలిటరీలో పనిచేస్తూ వ్యవసాయం చేసేవాడు. కొన్ని కారణాలతో హత్యకు గురయ్యాడు. ఆ సమయంలో సంతానమంతా చిన్న పిల్లలు. కుమారుడు రాజిరెడ్డికి రెండు సంవత్సరాల వయస్సు ఉంటుంది. అప్పటి నుంచి కమలమ్మ వ్యవసాయం చేస్తూ ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పిల్లలను పెంచి పెద్ద చేసింది. అందరి వివాహాలు జరిపించి తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చింది. రెండు సంవత్సరాల క్రితం వరకు కుమారుడు, ఆయన కుటుంబం ఆమెతోనే ఉండేవారు. పింఛన్ డబ్బులు కూడా ఆ కుటుంబానికి కొంత ఖర్చుపెట్టేది. ఏం జరిగిందో కానీ రెండేళ్ల క్రితం అతను సుంకిశాల విడిచి, తల్లిని అక్కడే వదిలేసి హైదరాబాద్కు వెళ్లి పోయాడు. దీంతో కమలమ్మ అదే గ్రామంలో ఉంటున్న చిన్న కూతురైన లలిత ఇంట్లో ఉంటుంది. ఇటీవల అనారోగ్యం బారిన పడి మంగళవారం మృతిచెందింది. ఈ సమాచారం కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులు రాజిరెడ్డికి చేరవేశారు. తలకొరివి పెట్టడానికి రమ్మని పిలిచారు. అయినా అతను తనకు సంబంధం లేదంటూ తాను రానని ఖరాకండిగా చెప్పాడు. దీంతో గత్యంతరం లేక కూతుర్లే తలకొరివి పెట్టారు. ఈ దృశ్యం పలువురిని కంట తడిపెట్టించింది. ఇలాంటి కొడుకులు ఉన్న ప్రయోజనం ఏంటని అనుకుంటున్నారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రకాశంలో ఫ్యాన్ గాలి ఉధృతం
బాబు–మోదీ ఇద్దరూ తోడు దొంగలే..
చంద్రబాబు కుట్రలు...భగ్నం
యార్డులో 70 ,776 బస్తాల మిర్చి విక్రయం
స్విస్ బ్యాంక్లో నల్లధనం తెచ్చేదెన్నడు?
అంతర్జాతీయ స్థాయికి ఏపీ విద్యా సంస్కరణలు
సీఎం జగన్తోనే బీసీల జీవితాల్లో వెలుగులు
జగన్ను మళ్లీ సీఎంను చేసుకుందాం
ఏడాదిలో సీపీఎస్ సమస్యకు పరిష్కారం
కూటమి కోటలు బద్దలు కొట్టాలి
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement