-
అరకోటి దోచింది ఖాకీలే..
నెల్లూరు(క్రైమ్): ఖాకీలే దోపిడీ దొంగలుగా మారారు. రైల్వే పోలీసులమని నమ్మించి రైల్లో అక్షరాల అరకోటిని దోచుకున్నారు. పోలీసుల విచారణలో ఈ విషయం తేటతెల్లమైంది. ఈ నెల 15న నవజీవన్ ఎక్స్ప్రెస్లో జరిగిన దోపిడీ కేసులో సూత్రధారులైన టీడీపీ నేత, అతని స్నేహితురాలితో పాటు ఆర్ఐ, ముగ్గురు ఏపీఎస్పీ కానిస్టేబుళ్లను శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు రైల్వే డీఎస్పీ జి.వసంతకుమార్ సోమవారం వెల్లడించారు. ఆయన మాటల్లోనే.. కావలి పట్టణానికి చెందిన అనిత అక్కడే బంగారు వ్యాపారి మల్లికార్జున వద్ద పనిచేస్తోంది. చెన్నాయపాళేనికి చెందిన టీడీపీ నాయకుడు రవితో ఆమె సన్నిహితంగా ఉంటోంది. రవి అప్పులపాలై ఉండటం, అనితకు సైతం నగదు అవసరం కావడంతో బంగారు వ్యాపారిని బురిడీ కొట్టించి నగదు దోచుకోవాలనుకున్నారు. ఇదే విషయాన్ని రవి తన బంధువైన ఏపీఎస్పీ కానిస్టేబుల్ (ప్రస్తుతం విజయవాడ ఎస్డీఆర్ఎఫ్)లో విధులు నిర్వహిస్తున్న మహేష్తో చర్చించాడు. మహేష్ తనతో పాటు పనిచేస్తున్న సహచర కానిస్టేబుల్స్ షేక్ సుల్తాన్బాషా, సుమన్కుమార్, ఆర్ఐ పి.మల్లికార్జున దృష్టికి తీసుకెళ్లి సహకరించాలని కోరారు. దోచుకున్న సొమ్మును పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. 15న మల్లికార్జున రూ.50 లక్షలు అనితకు ఇచ్చి చెన్నై వెళ్లి బంగారు బిస్కెట్లు తేవాలన్నాడు. అనిత ఈ విషయాన్ని రవికి చెప్పింది. తన స్నేహితురాలు, సీజన్బాయిలతో కలసి నవజీవన్ ఎక్స్ప్రెస్లో చెన్నై వెళుతున్నామని చెప్పింది. మహేష్కు విషయాన్ని చేరవేసిన రవి.. అతని సూచనల మేరకు అదే రైలెక్కాడు. పథకం ప్రకారం నెల్లూరు రైల్వేస్టేషన్లో సుల్తాన్బాషా, సుమన్కుమార్లు రైలెక్కారు. అనిత ఉన్న కోచ్లోకి వెళ్లి తాము రైల్వే పోలీసులమని బెదిరించి నగదు ఉన్న బ్యాగులతో గూడూరు రైల్వేస్టేషన్లో దిగేశారు. అదే రోజు రాత్రి బిట్రగుంట వద్ద నగదును పంచుకున్నారు. తీగ లాగితే డొంకంతా కదిలింది.. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు అనిత ఈ వ్యవహారాన్ని తన యజమానికి తెలియజేసింది. ఆయన సూచనల మేరకు గూడూరు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. అనిత ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో రైల్వే పోలీసులు 25వ తేదీన ఆమెను అదుపులోకి తీసుకుని విచారించడంతో విషయం బయటపడింది. ఆ తర్వాత రవిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు కానిస్టేబుళ్లు, ఆర్ఐ వద్ద నుంచి రూ. 30 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. -
పొత్కపల్లి ఎస్సైకి రాష్ట్ర ప్రథమ బహుమతి
సుల్తానాబాద్(కరీంనగర్ జిల్లా): సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలోని పొత్కపల్లి ఎస్సై షేక్జానీ పాషాకు రాష్ట్ర ప్రథమ బహుమతి లభించినట్లు సీఐ తులా శ్రీనివాస్రావు తెలిపారు. ఇన్విస్టిగేషన్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్, ఎస్సెన్షియల్ లా ఫర్ పోలీస్ ఆఫీసర్ అనే అంశంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతిని పొత్కపల్లి ఎస్సై హైదరాబాద్లో సోమవారం అడిషనల్ డీజీ ద్వారకా తిరుమల రావు చేతుల మీదుగా అందుకున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement