-
మ్యూచువల్ ఫండ్స్కు రిటైలర్ల ‘జోష్’
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్కు రిటైల్ ఇన్వెస్టర్లు అండగా నిలుస్తున్నారు. ఫండ్స్ నిర్వహణలోని రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు 2023 జనవరి నాటికి రూ.23.4 లక్షల కోట్లకు చేరాయి. 2022 జనవరి నాటికి ఉన్న రూ.21.40 లక్షల కోట్లతో పోలిస్తే 9.3 శాతం వృద్ధి చెందాయి. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) తాజా గణాంకాలను విడుదల చేసింది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని సంస్థల (ఇనిస్టిట్యూషనల్) పెట్టుబడులు ఏడాది కాలంలో రూ.17.49 లక్షల కోట్ల నుంచి, 2023 జనవరి చివరికి రూ.17.42 లక్షల కోట్లకు తగ్గాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్టర్లు చేసే పెట్టుబడుల్లో వృద్ధి, రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరగడానికి కారణమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సిప్ ద్వారా రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ప్రతి నెలా రూ.13,000 కోట్ల పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి వస్తుండడం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో సిప్ ద్వారా ఫండ్స్లోకి రూ.13,856 కోట్ల పెట్టుబడులు రాగా, 2022 డిసెంబర్ నెలలో రూ.13,573 కోట్లు రావడం గమనించాలి. మొత్తం మీద అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ జనవరి చివరికి రూ.40.80 లక్షల కోట్లకు చేరింది. 2022 జనవరికి ఉన్న రూ.38.89 లక్షల కోట్లతో పోలిస్తే 5 శాతం వృద్ధి చెందింది. -
బంగారం బంగారమే!
నరసాపురం: ధరల పెరుగుదలలో ఎప్పటికప్పుడు రికార్డులు నమోదు చేసుకుంటున్న బంగారం తనకేదీ సాటిలేదని నిరూపిస్తోంది. గడిచిన వందేళ్లను పరిగణనలోకి తీసుకుంటే బంగారం ధరలు 2వేల రెట్లు పెరిగాయి. ఆస్తుల విలువ పెరుగుదలకు సంబంధించి బంగారానికి మరేదీ పోటీకాదని స్పష్టమవుతోంది. 1917లో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం కాసు ధర కేవలం 11 రూపాయల 8 పైసలు ఉంటే ప్రస్తుతం అదే కాసు ధర రూ.22,800. అలాగే, 1917లో 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం 10 గ్రాములు రూ.15.20 ఉంటే, ఇప్పుడది రూ.30వేలు. అంటే గడచిన వందేళ్లలో బంగారం 2వేల రెట్లకు పైగానే పెరిగింది. మరోవైపు.. వందేళ్ల క్రితం భూముల ధరలు కూడా స్వల్పంగానే ఉండేవి. ఈ నూరేళ్లలో వందలు, వేలల్లో ఉండే భూముల ధరలు కోట్లల్లోకి మారినా.. అది అభివృద్ధిని బట్టి, ఆయా ప్రాంతాల పరిస్థితిని బట్టి కొన్ని ప్రాంతాలకే ఈ పెరుగుదల పరిమితమైంది. ఇక షేర్ మార్కెట్లో పెట్టిన సదరు కంపెనీల లాభనష్టాల మీదే రాబడి ఆధారపడి ఉంటుందనేది తెలిసిందే. డిపాజిట్లు ఇతర రూపాల్లో కూడా పెట్టుబడి రెండు వేల రెట్లు పెరగడమనేది జరగని పని. దీంతో బంగారం ప్రధాన పెట్టుబడి వస్తువుగా మారిపోయింది. వందేళ్ల క్రితం బంగారంపై రూపాయి పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు చేతిలో 2 వేలు ఉన్నట్టు గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఒకప్పుడు అలంకరణలు, సామాజిక అవసరాలకు మాత్రమే బంగారం సమకూర్చుకోవాలని పరితపించే వారి దృక్పథంలో స్పష్టమైన మార్పు రావడంతో బంగారంపై పెట్టుబడులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. బంగారం ధరల తగ్గుదల పెద్దగా ఉండదు బంగారం ధరలు పెద్దగా తగ్గవు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా బంగారం, బంగారమే అని తేలిపోయింది. బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. అందుకే వందేళ్లుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. భవిష్యత్లో కూడా ఇదే ఒరవడి కొనసాగుతుంది. – వినోద్కుమార్ జైన్, బులియన్ వ్యాపారి 2017లో రూ.22,000–23,000 మధ్య ట్రేడవుతోంది. కాగా, 1962లో రూ.89లు ఉన్న కాసు బంగారం ధర 1964లో రూ.64కు పడిపోయింది. -
పెట్టుబడులకు ఇబ్బందులు: ఎస్అండ్పీ
ముంబై: భారత్లో పెట్టుబడుల వృద్ధికి కొన్ని ఇబ్బందులు పొంచి ఉన్నట్లు అంతర్జాతీయ రేటింగ్ సంస్థ స్టాండెర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) అధ్యయనం ఒకటి తెలిపింది. విధాన సంస్కరణల అమల్లో అడ్డంకులు, అధికారుల అలసత్వం భారత్లో పెట్టుబడులకు ప్రధాన అడ్డంకులని పేర్కొంది. దేశంలో కార్పొరేట్ ఆదాయాల్లో వృద్ధి మందగమనంలో ఉందని, రుణ భారం కొనసాగుతోందని.. ఇవన్నీ పెట్టుబడులకు, భారీ వృద్ధికి విఘాతం కలిగిస్తున్న అంశాలని వివరించింది. భారత్సహా చైనా, ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థలపై సైతం ఎస్అండ్పీ అధ్యయనం జరిపింది. ప్రస్తుతం ఎస్అండ్పీ భారత్కు స్థిరమైన అవుట్లుక్తో ‘బీబీబీమైనస్’ రేటింగ్ను కొనసాగిస్తోంది. పెట్టుబడులకు ఏమాత్రం సరికాని ‘జంక్’ స్థాయికి ఇది కేవలం ఒక అంచె మాత్రమే ఎగువ. ధరలు పెరిగే అవకాశం: నోముర ఇదిలాఉండగా, భారత్కు ఈ ఏడాది ఎల్ నినో ఇబ్బందులు పొంచి ఉన్నాయని జపాన్ బ్రోకరేజ్ సంస్థ- నోముర తన నివేదికలో పేర్కొంది. దీనివల్ల దేశంలో ధరల తీవ్రత పెరగవచ్చని హెచ్చరించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
Advertisement