-
ఆ 8 ఫోన్లపై రూ.8వేల వరకు క్యాష్బ్యాక్
స్మార్ట్ఫోన్లపై ఈ-కామర్స్ కంపెనీలు భలే భలే ఆఫర్లను ప్రకటిస్తూ ఉన్నాయి. కేవలం ఈ-కామర్స్ వెబ్సైట్లు మాత్రమే కాక, టెలికాం ఆపరేటర్లు సైతం మొబైల్ ఫోన్లపై క్యాష్బ్యాక్లకు తెరలేపాయి. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్ వెబ్సైట్లు, మొబైల్ కంపెనీలు అందిస్తున్న క్యాష్బ్యాక్ ఆఫర్ల వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఓ సారి చూద్దాం.. ఐఫోన్ ఎక్స్ : పేటీఎంలో రూ.4000 క్యాష్బ్యాక్ ఆపిల్ అత్యంత ఖరీదైన స్మార్ట్ఫోన్ ఐఫోన్ ఎక్సే. ఈ ఫోన్ 256జీబీ వేరియంట్పై రూ.4000 క్యాష్బ్యాక్ను పేటీఎం ప్లాట్ఫామ్పై పొందవచ్చు. రూ.1,01,498గా లిస్టు అయిన ఈ ఫోన్ను క్యాష్బ్యాక్ అనంతరం రూ.97,498కే కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా 88,698 రూపాయల 64జీబీ వేరియంట్ను కూడా రూ.4000 క్యాష్బ్యాక్తో రూ.84,698కే వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ను పొందడానికి యూజర్లు ప్రోమోకోడ్ ఏ4కే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. శాంసంగ్ నోట్8 : అమెజాన్లో రూ.8000 క్యాష్బ్యాక్ అమెజాన్ పే ను వాడుతూ నోట్ 8ను కొనుగోలు చేసిన వారికి రూ.8000 క్యాష్బ్యాక్ అందుబాటులో ఉంటుంది. ఫోన్ను కస్టమర్కి పంపిన తర్వాత 72 గంటల వ్యవధిలో అమెజాన్ పేలో ఈ క్యాష్బ్యాక్ మొత్తాన్ని క్రెడిట్ చేస్తారు. జనవరి 10 వరకే ఇది వాలిడ్లో ఉంటుంది. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ : పేటీఎంపై రూ.6000 వరకు క్యాష్బ్యాక్ 2016లో లాంచ్ అయిన ఈ రెండు ఐఫోన్లపైనా రూ.6000 వరకు క్యాష్బ్యాక్ లభ్యమవుతోంది. రూ.57,690గా ఉన్న ఐఫోన్ 7, 256జీబీ వేరియంట్ రూ. 51,690కు అందుబాటులోకి వచ్చింది. ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవడానికి ఏ6కే కోడ్ను అప్లయ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 32జీబీ వేరియంట్ ఐఫోన్ 7 ప్లస్ స్మార్ట్ఫోన్కు కూడా రూ.5,500 వరకు క్యాష్బ్యాక్ వర్తిస్తుంది. క్యాష్బ్యాక్ అనంతరం ఐఫోన్ 7 ప్లస్ రూ.51,604కు దిగొచ్చింది. మోటో జీ5ఎస్ ప్లస్ : పేటీఎంలో రూ.1,625 క్యాష్బ్యాక్ రిటైల్ ధరపై 10 శాతం క్యాష్బ్యాక్ను మోటో జీ5ఎస్ ప్లస్ స్మార్ట్ఫోన్పై పేటీఎం ఆఫర్ చేస్తుంది. ఈ ఆఫర్ కింద ఒక్కో యూజర్ మూడు ఆర్డర్లను బుక్ చేసుకోవడానికి ఉంది. ఇది కూడా కేవలం ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమే. ఫోన్ షిప్ అయిన 24 గంటల వ్యవధిలో యూజర్ అకౌంట్లోకి ఈ క్యాష్బ్యాక్ మొత్తాన్ని జమచేస్తారు. శాంసంగ్ గెలాక్సీ జే7 మ్యాక్స్ - వొడాఫోన్ ద్వారా రూ.1500 క్యాష్బ్యాక్ ఇటీవల శాంసంగ్తో జతకట్టిన వొడాఫోన్, గెలాక్సీ జే7 మ్యాక్స్ కొత్త, పాత యూజర్లకు రూ.1500 క్యాష్బ్యాక్ ఆఫర్ చేస్తుంది. ఎం-పైసా వాలెట్ల ద్వారా ఈ క్యాష్బ్యాక్ను అందిస్తోంది. ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ కస్టమర్లిందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. వివో వీ7 ప్లస్ : పేటీఎంలో రూ.1,100 క్యాష్బ్యాక్ రూ.21,990 ధర కలిగిన ఈ హ్యాండ్సెట్పై రూ.1100 క్యాష్బ్యాక్ పొందవచ్చు. క్యాష్బ్యాక్ అనంతరం ఈ స్మార్ట్ఫోన్ ధర రూ.20,890కి దిగొచ్చింది. 10.ఆర్ డీ స్మార్ట్ఫోన్ : జియో ద్వారా రూ.1500 క్యాష్బ్యాక్ 10.ఆర్ డీ స్మార్ట్ఫోన్ నిన్నటి నుంచే విక్రయానికి వచ్చింది. ఈ స్మార్ట్ఫోన్పై జియో ప్రైమ్ కస్టమర్లకు అమెజాన్లో రూ.1500 క్యాష్బ్యాక్ లభిస్తోంది. అయితే యూజర్లు కనీసం రూ.199తో రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. -
అదరగొడుతున్న ఐఫోన్7 మోడల్స్
కోల్కత్తా : యాపిల్ ఐఫోన్7, ఐఫోన్7 ప్లస్ మోడల్స్ అడ్వాన్స్ బుకింగ్స్లో అదరగొడుతున్నాయి. భారత రిటైల్ స్టోర్లలో ఈ స్మార్ట్ఫోన్ల ముందస్తు బుకింగ్స్ గతేడాది విడుదలైన ఐఫోన్6ఎస్, 6ఎస్ ప్లస్లతో పోలిస్తే 50 శాతానికి పైగా ఎగిశాయని ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్స్ వెల్లడించారు.అత్యాధునిక ఫీచర్లతో పాటు, ప్రధాన ప్రత్యర్థి శాంసంగ్కు గెలాక్సీ నోట్7 రూపంలో ఎదురైన ముప్పు, యాపిల్ తాజా ఐఫోన్లకు బాగా కలిసొచ్చిందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అధికారికంగా అక్టోబర్ 1 నుంచి ఈ ఆర్డర్లు ప్రారంభమవుతున్నప్పటికీ, ముందస్తు బుకింగ్స్ అదరగొడుతున్నాయని చెబుతున్నాయి. కాలిఫోర్నియాకు చెందిన ఈ దిగ్గజం భారత్లో పెరుగుగున్న డిమాండ్కు అనుగుణంగా లాంచ్ ఇన్వెంటరీని ఎక్కువగా విడుదల చేయాలని భావిస్తోంది. జెట్ బ్లాక్ కలర్ ఐఫోన్7 ప్లస్కు, 32 జీబీ వేరియంట్ ఐఫోన్7కు ఎక్కువగా డిమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఐఫోన్7 ధర భారత్లో రూ.60వేల నుంచి రూ.80వేల మధ్యలో ఉండగా.. ఐఫోన్7 ప్లస్ ధర రూ.72వేల నుంచి రూ.92వేల మధ్యలో ఉన్నాయి. మరో వైపు యాపిల్ ప్రధాన ప్రత్యర్థి శాంసంగ్ కంపెనీకి బ్యాటరీ పేలుళ్ల ఘటనతో వచ్చిన చిక్కుతో, గ్లోబల్గా తన గెలాక్సీ నోట్7 ఫోన్లను రీకాల్ చేస్తోంది. అయితే శాంసంగ్ తన బ్యాటరీ పేలుళ్ల సమస్యను పరిష్కరించిందని, సెప్టెంబర్ 28-30 తేదీల్లో భారత మార్కెట్లోకి గెలాక్సీ నోట్7 ఫోన్లు పునఃప్రవేశపెడుతుందని పలువురు టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. సెప్టెంబర్ 28న దక్షిణ కొరియాలో గెలాక్సీ నోట్ 7 ఫోన్లను మార్కెట్లోకి రీలాంచ్ చేస్తామని శాంసంగ్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. దక్షిణకొరియాతో పాటు భారత్లోనూ ఈ ఫోన్లను రీలాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. పండుగ సీజన్లో భారత్లో యాపిల్-శాంసంగ్లకు పోటీ తీవ్రంగా ఉంటుందని, ఒకవేళ శాంసంగ్ తన ఫోన్లను పునఃప్రవేశపెట్టడం ఆలస్యం చేస్తే ఆ కంపెనీకి ఎక్కువ నష్టం జరిగే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement