-
‘ఆ పోస్టులతో వైఎస్సార్సీపీకి సంబంధం లేదు’
సాక్షి, అమరావతి: తమ పార్టీ కార్యకర్తలుగా, సానుభూతిపరులుగా ప్రచారం చేసుకుంటూ కొంతమంది సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులతో వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధంలేదని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇలా పార్టీ పేరు ఉపయోగించుకుని సోషల్ మీడియాలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కొంతమంది వ్యక్తులను గుర్తించినట్టు ఆ పార్టీ పేర్కొంది. సోషల్ మీడియాలో వారు పెడుతున్న పోస్టులకు గానీ, జగన్ కోసం.. అంటూ వారు నిర్వహిస్తున్న వాట్సాప్ గ్రూపులు, ఫేస్ బుక్ పోస్టులతో వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని పార్టీ స్పష్టం చేసింది. ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న ఇప్పాల రవీంద్రారెడ్డి, వర్రా రవీంద్రారెడ్డి, యశ్వంత్రెడ్డి, ఆనం నరేంద్రరెడ్డి, ఎ.సతీష్రెడ్డితో తమ పార్టీకి సంబంధంలేదని వెల్లడించారు. -
తాడిపత్రి కోర్టుకు ఇప్పాల
- రవీంద్రకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం - వైఎస్సార్సీపీ నాయకుల సంఘీభావం - పోలీసుల ఓవరాక్షన్ తాడిపత్రి రూరల్ : ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేశారంటూ స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు సావిత్రి వేసిన ప్రైవేటు కేసుకు సంబంధించి బెంగళూరుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టు ఇప్పాల రవీంద్రను పోలీసులు శనివారం తాడిపత్రి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే రవీంద్ర మరో కేసుకు సంబంధించి వైజాగ్ కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్నారు. ఆయనను అక్కడి నుంచి తీసుకొచ్చిన పోలీసులు శనివారం ఇక్కడి కోర్టులో హాజరుపర్చగా బెయిల్ మంజూరైంది. అనంతరం తిరిగి వైజాగ్ తీసుకెళ్లారు. సెక్షన్ 501 ఐపీసీయూ/ఎస్66ఏ(బి)ఆఫ్ ఐపీ యాక్ట్ 156(3)సీ ఆర్పీసీ కింద(క్రైం నెంబరు 78/17) కేసు నమోదైందని, ఇందులో భాగంగానే రవీంద్రను తాడిపత్రి కోర్టులో హాజరుపరిచామని పట్టణ సీఐ భాస్కర్రెడ్డి తెలిపారు. పోలీసుల ఓవరాక్షన్ కోర్టుకు హాజరుపర్చడానికి ముందు రవీంద్రను పట్టణ పోలీస్స్టేషన్లో ఉంచారు. ఆయన్ను పరామర్శించడానికి వైఎస్సార్సీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. వారిని రవీంద్రతో మాట్లాడడానికి అనుమతించకుండా పోలీసులు ఓవరాక్షన్ చేశారు. సంఘీభావం తెలిపిన ప్రముఖ నేతలు రవీంద్రకు వైఎస్సార్సీపీ నేతలు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్నారాయణ, ఎమ్మెల్సీ గోపాల్రెడ్డి, తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రమేష్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వీఆర్ వెంకటేశ్వరరెడ్డి, జిల్లా నాయకులు రాగేపరశురాం, కౌన్సిలర్ మున్నా తదితరులు తామున్నామంటూ భరోసా ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే నెటిజన్లపై కేసులు బనాయిస్తోందని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో సోషల్ మీడియా సాయంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అదే మీడియాను కట్టడి చేయాలని చూస్తుండటం దారుణమన్నారు. టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. కేసులు, బెదిరింపులతో సోషల్ మీడియా కార్యకర్తలను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. -
మరో సోషల్మీడియా కార్యకర్త అరెస్టు
-
మరో సోషల్మీడియా కార్యకర్త అరెస్టు
బెంగుళూరు: సోషల్మీడియా స్వచ్ఛంద కార్యకర్త ఇప్పాల రవీంద్రను బెంగుళూరులో అమరావతి పోలీసులు అరెస్టు చేశారు. తొలుత నోటీసులు అందుకోవడానికి రామ్మూర్తి నగర్ స్టేషన్కు రావాలని చెప్పిన పోలీసులు.. అక్కడికి వెళ్లిన రవీంద్రను ఎలాంటి విచారణ జరపకుండా అదుపులోకి తీసుకున్నారు. చట్టబద్దంగా సమాధానం ఇస్తామని.. సమయం ఇవ్వాలని రవీంద్ర చెప్తున్నా పోలీసులు వినలేదు. కాగా, రవీంద్ర అరెస్టును వైఎస్ఆర్సీపీ ఖండించింది. సోషల్మీడియాను అణగదొక్కడానికి ఏపీ ప్రభుత్వం నిరంకుశ విధానాలను అవలంభిస్తోందని పేర్కొంది. నోటీసుల పేరుతో స్టేషన్కు పిలిపించి అరెస్టు చేయడం కుట్రపూరిత చర్య అని వ్యాఖ్యానించింది. పోలీసు అధికారి మోహనరావు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రవీంద్ర అరెస్టుపై న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తామని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement