-
ముడి ఇనుము సంస్థలకు రేట్ల కష్టాలు
దశాబ్ద కనిష్టానికి ముడి ఇనుము ధరలు ఇంకా పడిపోతాయని ఆందోళనలో మైనింగ్ కంపెనీలు న్యూఢిల్లీ: ముడి ఇనుము ధరలు దశాబ్ద కనిష్టానికి పడిపోవడం మైనింగ్ సంస్థల్లో గుబులు పుట్టిస్తోంది. ప్రధానంగా తక్కువ గ్రేడ్ ముడి ఇనుమును ఎగుమతి చేసే గోవా ఉత్పత్తిదారుల్లో ఆందోళన నెలకొంది. సరైన చర్యలు లేకపోతే వచ్చే ఏడాది కాలంలో రేట్లు మరింత పడిపోయే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. గోవాలో ప్రధానంగా తక్కువ రకం గ్రేడ్ ముడి ఇనుము (ఇనుము శాతం 55-58 శాతం ఉండేది) ఉత్పత్తవుతుంది. దీన్ని ఎక్కువగా చైనా, జపాన్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం ఈ తరహా ముడి ఇనుము టన్నుకు రేటు 29 డాలర్ల స్థాయికి పడిపోయింది. దాదాపు దశాబ్దం క్రితం 2003-04లో ఈ రేట్లు ఉండేవని గోవా మినరల్ ఓర్ ఎక్స్పోర్ట్ అసోసియేషన్ (జీఎంవోఈఏ) ప్రెసిడెంట్ శివానంద్ వి. సల్గావ్కర్ తెలిపారు. అటు అంతర్జాతీయంగా ఉక్కు పరిశ్రమ నుంచి డిమాండ్ మందగించడం, ఇటు భారీ పన్నులు మైనింగ్ కార్యకలాపాలను కుదేలు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఉక్కు తయారీలో కీలకమైన ముడి ఇనుము రేట్లు మరింతగా పడిపోతాయని మైనింగ్ సంస్థల్లో తీవ్ర ఆందోళన నెలకొందని సల్గావ్కర్ తెలిపారు. ఈ గడ్డు పరిస్థితి నుంచి బైటపడటానికి మైనింగ్ కంపెనీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని వివరించారు. అంతర్జాతీయంగా మరింత మెరుగైన గ్రేడ్ ముడి ఇనుము చౌకగా లభిస్తున్నందున.. గోవా కంపెనీల నుంచి తక్కువ గ్రేడ్ ఖనిజాన్ని కొనేందుకు ఎవరు ముందుకొస్తారని జీఎంవోఈఏ గౌరవ కార్యదర్శి అంబర్ టింబ్లో వ్యాఖ్యానించారు. ఇది ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారు. అధిక పన్నులు ఇలాగే కొనసాగితే మైనింగ్ కార్యకలాపాలు కొనసాగించడం ఎంత మాత్రం లాభసాటి కాదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. గోవాలో మైనింగ్ రంగాన్ని ఆదుకోవాలంటే అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు.. ఎగుమతి పన్నులను, ఇతరత్రా పన్నులను తొలగించాలని తెలిపాయి. ఎగుమతి పన్నులు, గోవా పర్మనెంట్ ఫండు తొలగిస్తే టన్నుకు ఉత్పత్తి ధర దాదాపు 4.5 డాలర్ల మేర తగ్గగలదని టింబ్లో తెలిపారు. -
ఎన్ఎండీసీపై ధరల తగ్గుదల ప్రభావం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ ఎన్ఎండీసీ తొలి త్రైమాసిక నికర లాభం 47 శాతం క్షీణించింది. అంతకుముందు ఏడాది రూ. 1,915 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది రూ. 1,010 కోట్లకు పడిపోయింది. ఇదే సమయంలో ఆదాయం రూ. 48 శాతం క్షీణించి రూ. 3,476 కోట్ల నుంచి రూ. 1,806 కోట్లకు తగ్గింది. అంతర్జాతీయంగా ముడి ఇనుము ధరలు తగ్గడం ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపినట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
వైట్హౌస్కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి
టీడీపీ కార్యకర్తల దాడి అంబటి స్ట్రాంగ్ కౌంటర్
పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు
పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
తప్పక చదవండి
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement