-
పంటలెండుతున్నయ్.. పట్టించుకోండి
సాక్షి, కల్వకుర్తి రూరల్: ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు ఎండిపోతున్నాయి.. కేఎల్ఐ సాగునీరు వస్తుందనుకుంటే నిరాశే మిగిలింది.. నీళ్లందక కళ్లముందే పంటలు వాడుపట్టి పోతుంటే చూడలేకపోతున్నాం.. అధికారులు వెంటనే సాగునీరందించి పంటలను కాపాడాలి.. అని శనివారం తిమ్మరాశిపల్లి, జంగారెడ్డిపల్లి గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. కల్వకుర్తి-అచ్చంపేట రహదారిపై తిమ్మరాశిపల్లి గేటు ఎదుట రాస్తారోకో నిర్వహించారు. నాలుగు రోజులుగా నీరందక సాగు చేసిన వేరుశెనగ, వరి పంటలు ఎండిపోయే దశకు చేరాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వేరుశెనగ గింజ పట్టే దశలో ఉందని, ఇప్పుడు నీరందక పోతే పంట దిగుబడి తగ్గిపోతుందని తెలిపారు. చివరి ఆయకట్టు అయిన జంగారెడ్డిపల్లి వరకు నీరు రాకుండా ఎగువ ప్రాంతాల్లో కాలువలను ధ్వంసం చేసి నీటిని వృథా చేస్తున్నారని, దీంతో వేలాది ఎకరాల్లో లక్షలాది రూపాయలు పెట్టి సాగుచేసిన పంటలు చేతికందకుండా పోయే ప్రమాదం ఉందని కన్నీళ్ల పర్యంతమయ్యారు. అందరికీ న్యాయం చేయాలంటే కాలువలను ధ్వంసం చేయకుండా నిఘా పెట్టించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ నర్సింహులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అలాగే వారి ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సంఘీభావం ప్రకటించారు. అక్కడినుంచే కేఎల్ఐ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సాగునీరందించేలా చూస్తామని వారు భరోసా ఇవ్వడంతో అదే విషయాన్ని రైతులకు చెప్పి ఆందోళన విరమింపజేశారు. -
రోడ్డెక్కిన రైతన్న
మైదుకూరు(చాపాడు): కేసీ ఆయకట్టులో ఏటా మాదిరి కాకుండా ఈసారి సంపూర్ణంగా కాలువల ద్వారా ఖరీఫ్ పంటలకు సాగునీరు వస్తుందని గత నెల 29న టీడీపీ నేతలు రాజోలి వద్ద సాగునీటిని వదిలారు. వదిలిన వారం రోజులకే ఆగిపోయాయి. దీంతో ఇప్పటికే 92వేల ఎకరాల ఆయకట్టులో 70శాతం మంది రైతులు వేసుకున్న నారుమళ్లు నీరు లేక ఎండిపోతున్నాయి. ఎండిన నారుమళ్లను ట్యాంకర్లతో రైతులు తడుపుకొంటుండగా, మరోవైపు శ్రీశైలంలో నీరు ఉన్నా.. మన వాటా ఇవ్వకుండా కృష్ణాడెల్టాకు 10టీఎంసీలు నీరు తీసుకుపోతుండటంతో కడుపుమండిన రైతన్నలు బుధవారం రోడ్డెక్కారు. సీనియర్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా కడప–కర్నూలు జాతీయ రహదారిని దిగ్బంధించారు. జిల్లాలోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిలు అండగా నిలిచారు. రాయలసీమ ద్రోహి సీఎం చంద్రబాబు మన నీటిని కిందికి తీసుకుపోతున్నారని, సీమ టీడీపీ నేతలకు పౌరుషం, దమ్ము, ధైర్యం ఉంటే శ్రీశైలం వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుందామని వైఎస్సార్సీపీ నేతలు సవాల్ విసిరారు. రాస్తారోకోలో వైఎస్సార్సీపీ రైతువిభాగం జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాద్రెడ్డి, ఏపీ రైతుసంఘం ప్రెసిడెంట్ ఏవీ రమణ, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి శ్రీరాములు పాల్గొన్నారు. రెండు రోజులకే నీరు ఆగిపోయింది: కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి టీడీపీ నాయకులు రాజోలి నుంచి నీరు వదిలి ఈసారి రైతులు రెండు కార్లలో పంటలు పండిం చుకోవచ్చని గొప్పలు చెప్పారని, రెండు రోజు ల్లోనే సాగునీరు ఆగి పోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే ఏ ఒక్కరూ కూడా పట్టించుకోలేదనన్నారు. విద్యుత్ ఉత్పత్తి అంటూ 150 టీఎంసీల నీరు ఉన్నా, కేసీ రైతులకు సాగునీరు ఇవ్వకుండా సాగర్, కృష్ణాడెల్టాలకు తీసుకెళ్లటం అన్యాయం, అక్రమమని పేర్కొన్నారు. టీడీపీ నేతలు, ప్రభుత్వానికి ప్రజ లు బుద్ధి చెప్పాలన్నారు. చంద్రబాబు లంచాలు, కమీషన్లు వచ్చే పనులకే మద్దతుగా ఉంటాడని, రైతులకు సాగునీరు ఇచ్చేందుకు ఏనాడు ముందుకు రాడన్నారు. చంద్రబాబు అధికారంలో వచ్చాడంటేనే కరువు కూడా వచ్చినట్లేనని, దీంతోనే రైతులు సాగునీరు లేక, మద్దతు ధరల్లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో వ్యవసాయం కుదేలు: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు గతంలో, ఈ నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ వ్యవసాయం కుదేలవుతుందని, పంటల సాగులో కలుపు మొక్కలను ఏరి పారేసినట్లు రైతులు టీడీపీని ఏరి పారేయాలన్నారు. రాయలసీమకు సాగునీరు ఇస్తున్నామని గొప్పలు చెప్పే సీఎం, టీడీపీ నేతలు 92వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వకపోవడంతో రైతన్నలు రోడ్డెక్కుతున్నారని తెలిపారు. సిగ్గుంటే తాగునీరు, సాగునీరు ఇవ్వాలని లేకుంటే ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హతే లేదన్నారు. తక్షణమే చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దుర్భర పరిస్థితులు పోవాలంటే వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని, రైతుల కోసం అనునిత్యం పరితపించే రఘురామిరెడ్డిని ఎమ్మెల్యేను చేసుకోవాలని, జిల్లాలోని 10 ఎమ్మెల్యేలు, 2ఎంపీల స్థానాలను వైఎస్సార్సీపీకి ఇస్తే రైతుల సమస్యలన్నీ తీరుతాయని ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలు: కడప ఎమ్మెల్యే అంజాద్బాషా చంద్రబాబు, కరువు కవల పిల్లలని, ఈయన అధికారంలో రాగానే కరువు కూడా వస్తుందన్నారు. ఈ పాలనలో రైతులు కష్టాలు తప్పవని, కరువు కూడా సిగ్గుపడుతుందన్నారు. నాలుగేళ్లుగా కేసీ రైతులు పంటలు సాగు చేసుకునేందుకు ఉద్యమాలు, ధర్నాలు చేయకతప్పటం లేదన్నారు. 125 ఏళ్ల చరిత్ర కలిగిన రైతాంగానికి దుర్భర పరిస్థితులు రావటం బాధాకరమన్నారు. గతంలో పట్టిసీమను వ్యతిరేకించిన వైఎస్సార్సీపీ నేతలపై అభాండాలు వేశారని, ఇప్పుడేమో ఆ వాటాను సీమకు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని, చంద్రబాబుకు రైతులు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. వైఎస్ పాలనలో దేవుడు కూడా కరుణించి రైతులకు సాగునీటి కష్టాలు లేకుండా చేశాడని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే దేవుడికి కూడా ఇష్టం లేదన్నారు. జగన్ను సీఎం చేసుకుంటేనే రాయలసీమ రైతులకు తాగు, సాగునీరు అందుతుందని రైతులకు సూచించారు. వైఎస్ 40వేల క్యూసెక్కులకు పెంచారు: కడప మేయర్ సురేష్బాబు రాయలసీమ రైతాంగం తాగు, సాగునీరు అందక ఏళ్ల తరబడి నష్టపోతుండటంతో వైఎస్సార్ ముఖ్య మంత్రి కాగానే ప్రతిపక్షం, టీఆర్ఎస్ ఇంకా ఇతర పార్టీలన్నీ తప్పుపట్టినా పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 10వేల క్యూసెక్కుల నుంచి 40 వేల క్యూసెక్కులకు పెంచారని, రాయలసీమకు సాగునీరు అందించారన్నారు. మన వాటా కూడా ఇవ్వకుండా ఏటా కేసీ రైతాంగానికి టీడీపీ ప్రభుత్వం ఇబ్బందులు గురిచేస్తోందన్నారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి రైతులు, ప్రజల కోసం నిత్యం అధికారులతో మాట్లాడుతూనే ఉన్నారని, ఉద్యమాలు, ధర్నాలకు తమను కూడా రమ్మని కోరుతుంటాడని, ఆయన రైతుల కోసం నిత్యం పోరాడుతూనే ఉంటున్నాన్నారు. నాలుగేళ్లుగా రైతులకు అవస్థలే: మాజీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి టీడీపీ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన నాలుగేళ్ల నుంచి కేసీ రైతులు సాగునీటి కోసం అవస్థలు పడుతూనే ఉన్నారు. ఏటా మైదుకూరులో రైతులు ధర్నాలు, ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. జిల్లా› టీడీపీ నేతలు సాగునీరు వదిలి వరి సాగు చేసుకోవచ్చని చెప్పి, నారుమళ్లు సిద్ధం చేసుకున్నాక నీరు రాకపోగా పట్టించుకోకపోవటం దారుణమన్నారు. సత్వరమే కేసీ రైతాం గానికి సాగునీరు ఇవ్వకుంటే రైతులు తీవ్రం గా నష్టపోతారన్నారు. శ్రీశైలంలో నీరు ఉన్నప్పటికీ రైతులకు ఇవ్వకపోవటం దారుణమన్నారు. కేసీ రైతాంగానికి సాగునీటి సమస్య లేకుండా దివంగత సీఎం వైఎస్సార్ రాజోలి జలాశయం తలపెట్టారన్నారు. ఆయన మరణంతో ప్రాజెక్టు ఆటకెక్కిందన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలి రైతులకు సాగునీరు ఇవ్వాలని మాజీ ఎంపీ డిమాండ్ చేశారు. శ్రీశైలం వద్దకెళ్లి నీటిని తెచ్చుకుందాం: ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు సాగునీరు ఇచ్చి, దీని వాటా రాయలసీమకు తెస్తామని కల్లబొల్లి మాటలు చెప్పిన సీఎం ఇప్పుడేమో సీమకు సాగునీరు ఇవ్వకుండా 10టీఎంసీలు కృష్టా డెల్టాకు తీసుకుపోతున్నారన్నారు. కర్నూలు ఐఏïబీ మీటింగ్లో మంత్రులు, అధికారులు చేసిన తీర్మానాలతో రైతుల్లో ఆశలు రేపారని, ఇప్పుడు నీరు రాకపోవటంతో వేసుకున్న నారుమళ్లు ఎండిపోతుంటే రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మూడు కార్లు పంటలు పండే కృష్ణా డెల్టాకు నీరు తీసుకెళ్లకుండా ఆడ్డుకోవాలన్నారు. సీఎం వద్ద వంగి వంగి పోవటం కాదని, రైతులకు సాగునీరు ఇప్పించేందుకు పోరాడాలని టీడీపీ నేతలకు హితవు పలి కారు. రాజోలి వద్ద నుంచి నెల్లూరుకు చెందిన మంత్రి సోమిరెడ్డి 6వేల క్యూసెక్కుల చొప్పున ఐదు రోజుల పాటు సోమశిలకు నీరు తీసుకెళ్లారని, మన నీటికి కిందికి తీసుకుపోతుంటే టీడీపీ నేతలు గాడిదలు కాస్తున్నారా.. అని ప్రశ్నించారు. -
రాజకీయ గ్రహణం
►‘బ్రహ్మానందసాగర్’ రిజర్వాయర్తోనే నీటి సమస్యకు చెక్ ►2013లోనే పూర్తయిన ప్రాజెక్టు సర్వే ►రాజకీయ కారణాలతో పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం ►ప్రాజెక్టు పూర్తయితే 22 లక్షల మందికి తాగునీరు ►గ్రావిటీ ద్వారా నరసరావుపేటతో పాటు గుంటూరుకు... ►1.5 టీఎంసీల నిల్వతో పెరగనున్న భూగర్భ జలాలు ►ఏటా త్వరితగతిన ఖరీఫ్ ఆరంభానికి అవకాశం నకరికల్లు మండలం చేజర్ల-కుంకలగుంట గ్రామాల మధ్య రూ.65 కోట్ల వ్యయంతో 2150 ఎకరాల్లో ప్రతిపాదించిన బ్రహ్మానందసాగర్ (కాసు బ్రహ్మానందరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్)కు రాజకీయ గ్రహణం పట్టింది. గత పాలకులు ప్రతిపాదించిన పనులు పూర్తిచేస్తే తమకు ప్రయోజనమేమిటనే కారణంతో ప్రాజెక్ట్ ఊసే లేకుండా చేశారు. నాగార్జునసాగర్ ద్వారా కాలువలకు విడుదలైన నీటిని ఒక చోట నింపి కరువు సమయంలో వినియోగించుకోవడం ఈ రిజర్వాయర్ నిర్మాణ ఉద్దేశం. ఈ ప్రాజెక్టు పూర్తయిఉంటే ప్రస్తుత కరువు పరిస్థితుల్లో ప్రజలకు సాగు, తాగునీటి కష్టాలు తప్పేవి. నరసరావుపేటవెస్ట్: సాగునీరు లేక గత ఖరీఫ్, రబీ సీజన్లలో వేలాది ఎకరాల్లో పంటలు వేయలేక ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం వేసవిలో తాగేందుకు మంచినీరు లభ్యం కాక నరసరావుపేట, చిలకలూరిపేట, గుంటూరు కార్పొరేషన్ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటిని అధిగమించాలంటే కుడికాలువ పరిధిలో ఇప్పటికే ఉన్న బుగ్గవాగులాంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్తో పాటు మరో రిజర్వాయర్ నిర్మాణమే శరణ్యమని ఎన్ఎస్పీ ఇంజినీర్లు చెబుతున్నారు. 1250 ఎకరాల్లో 1.5 టీఎంసీల నిల్వ గత ప్రభుత్వంలో నకరికల్లు మండల పరిధిలోని చేజర్ల-కుంకలగుంట గ్రామాల మధ్య 1250 ఎకరాల్లో 1.5 టీఎంసీల సాగర్ నీటిని నిల్వచేసేందుకు బ్రహ్మానందసాగర్ పేరుతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను పూర్తిచేయాలని ప్రతిపాదించారు. ఈ నిర్మాణంలో 1.5 కిలోమీటర్ల పొడవైన గట్టు(బండ్)ను అక్కడక్కడ నిర్మించాల్సి వుంది. ఈ రిజర్వాయర్లో నిల్వచేసే నీటితో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రతి గ్రామంలోని చెరువులు, కుంటలు, మున్సిపాల్టీలోని రిజర్వాయర్లను నింపవచ్చు. అటువంటి నీటి పరిమాణంగల రిజర్వాయర్ నిర్మాణానికి రూ.33 లక్షల వ్యయంతో సర్వే చేయాలని 2013 మార్చి 1న అప్పటి ప్రభుత్వం జీవో నం.17ను జారీ చేసింది. సర్వే పూర్తయి ప్రభుత్వానికి నివేదిక అందించడంతో పరిపాలనా ఆమోదం లభించి ఆర్థిక ఆమోదం కోసం ఫైల్ వెళ్లింది. ఆ తర్వాత సమైక్య రాష్ట్ర ఉద్యమం, అనంతరం ఎన్నికల వలన రిజర్వాయర్ పనులకు ఆర్థిక ఆమోదం లభించలేదు. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్తో ప్రయోజనాలు... ఈ రిజర్వాయర్ పూర్తయి నీటిని నిల్వ చేస్తే భూగర్భ జలాలు పెరగడంతో పాటు గ్రావిటీ ద్వారా నరసరావుపేట, చిలకలూరిపేట మున్సిపాల్టీలు, గ్రామాల్లోని చెరువులు, కుంటలతో పాటు గుంటూరు కార్పొరేషన్ పరిధి కలుపుకొని మొత్తం 21.23 లక్షలమంది ప్రజలకు ఒక్కొక్కరికి 200 లీటర్ల చొప్పున 100 రోజులపాటు తాగునీరు అందించవచ్చని ఇంజినీర్లు అంచనావేశారు. దీంతో పాటు సాగర్ కాలువలు విడుదలయ్యే దాకా వేచి ఉండకుండా త్వరగా ఖరీఫ్ సీజన్లో రైతులు తమ పొలాలను సాగుచేసేందుకు సమాయత్తం కావచ్చు. దీనివలన ఈ ప్రాంతంలో కరువు చాయలు తొలగిపోతాయని చెబుతున్నారు. సేకరించాల్సిన భూమి 650 ఎకరాలే ఈ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించిన కుంకలగుంట-చేజర్ల గ్రామాల మధ్యలోని 1250 ఎకరాల్లో 600ఎకరాలు ప్రభుత్వ భూమే ఉందని నివేదికలో పేర్కొన్నారు. మిగతా 650 ఎకరాలను రైతులకు సరైన మార్కెట్ రేటును అప్పగించి స్వాధీనం చేసుకుంటే రిజర్వాయర్ను పూర్తిచేసుకునేందుకు తగిన వెసులుబాటు లభిస్తుంది. కొంతమంది టీడీపీ నాయకుల ప్రోద్బలంతో అప్పుడు కొంతమంది రైతులు తమ పొలాలను ఇవ్వబోమంటూ ఆందోళనలు నిర్వహించారు. నకరికల్లు వద్దనున్న 270 ఎకరాల్లోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఉండగా కమీషన్లు కొట్టేసేందుకే బ్రహ్మానందసాగర్ను ప్రతిపాదిస్తున్నారంటూ టీడీపీ నాయకులు ప్రచారం చేశారు. ఇప్పటికైనా కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న పలనాడు రైతుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుడితే ప్రజలకు మేలు చేసిన వారవుతారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)
దాక్షాయణి బర్త్ డే.. పుష్ప మేకర్స్ స్పెషల్ అప్డేట్!
దేవర బర్త్ డే ట్రీట్.. అప్డేట్ అదిరిపోయింది!
‘బీజేపీకి ఓటేస్తే నేను జైలుకే’.. కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్ రైతు వ్యతిరేక చర్యలు.. రాష్ట్రవ్యాప్త నిరసనకు కేసీఆర్ పిలుపు
మాజీ గవర్నర్ కమలా బెనివాల్ కన్నుమూత
ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్.. సాధారణ తీర్పు కాదన్న అమిత్ షా
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
తప్పక చదవండి
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement