-
ఆరియన్ప్రొ జూమ్- అదానీ గ్రీన్ రికార్డ్
కొద్ది రోజులుగా నిరంతర ర్యాలీ చేస్తున్న అదానీ గ్రీన్ ఎనర్జీ కౌంటర్ మరోసారి వెలుగులో నిలుస్తోంది. ఈ ఏడాది(2020-21) తొలి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించడం ప్రభావం చూపుతోంది. ఇక మరోవైపు సింగపూర్ బ్యాంకింగ్ సంస్థ నుంచి ఆర్డర్ను పొందినట్లు వెల్లడించడంతో టెక్నాలజీ ప్రొడక్టుల కంపెనీ ఆరియన్ప్రొ సొల్యూషన్స్ కౌంటర్కు సైతం డిమాండ్ పెరిగింది. వెరసి ఈ రెండు కౌంటర్లూ 5 శాతం చొప్పున అప్పర్ సర్క్యూట్లను తాకాయి. వివరాలు చూద్దాం.. అదానీ గ్రీన్ ఎనర్జీ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో అదానీ గ్రీన్ ఎనర్జీ రూ. 51 కోట్ల పన్నుకు ముందు లాభం ఆర్జించింది. గతేడాది క్యూ1లో రూ. 131 కోట్ల ఇబిట్ నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం 30 శాతం ఎగసి రూ. 878 కోట్లను తాకింది. కాగా.. సౌర విద్యుదుత్పత్తిలో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా ఆవిర్భవించనున్న అదానీ గ్రీన్ ఎనర్జీ కౌంటర్ ఇటీవల నిరవధికంగా లాభపడుతూ వస్తున్న విషయం విదితమే. ఈ బాటలో మరోసారి అమ్మేవాళ్లు కరువుకావడంతో ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. రూ. 639 వద్ద ఫ్రీజయ్యింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) దాదాపు రూ. లక్ష కోట్లకు చేరింది. వెరసి బీపీసీఎల్, ఓఎన్జీసీ, పవర్గ్రిడ్ కార్పొరేషన్ తదితర పీఎస్యూ దిగ్గజాలను విలువరీత్యా వెనక్కి నెట్టింది. గత ఏడాది కాలంలో అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు ఏకంగా 1,173 శాతం దూసుకెళ్లడం విశేషం! ఆరియన్ప్రొ సొల్యూషన్స్ అనుబంధ సంస్థ ఇంటెగ్రో టెక్నాలజీస్ ద్వారా సింగపూర్లోని అతిపెద్ద బ్యాంకు నుంచి ఐటీ ప్రొడక్టుల సేవల కోసం ఆర్డర్ను పొందినట్లు ఆరియన్ప్రొ సొల్యూషన్స్ పేర్కొంది. ఆర్డర్లో భాగంగా స్మార్ట్ లెండర్ ప్రొడక్ట్ వెర్షన్4 ద్వారా సింగపూర్ బ్యాంక్ బ్రాంచీలు, అనుబంధ సంస్థలకు సర్వీసులను అందించనున్నట్లు తెలియజేసింది. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కోసం లభించిన ఈ ఆర్డర్ విలువను 5.5 మిలియన్ డాలర్లుగా ఆరియన్ప్రొ తెలియజేసింది. 2022 ఫిబ్రవరిలోగా ప్రాజెక్టును అభివృద్ధి చేయవలసి ఉంటుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆరియన్ప్రొ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. రూ. 61.4 వద్ద ఫ్రీజయ్యింది. -
'లీకులెవరు చేస్తున్నారు.. జాగ్రత్తగా ఉండండి'
తిరువనంతపురం: కేరళ హోమంత్రి రమేశ్ చెన్నితాలా ప్రభుత్వాధికారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అనవసరంగా మీడియాకు సమాచారం అందించినా, తప్పుడు వివరాలు తెలియజేసినా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హుకుం జారీ చేశారు. కేరళలోని ఓ ఐటీ ప్రాజెక్టు విషయంలో దాదాపు రూ.రెండు కోట్లు వృధా చేశారనే విషయం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. దీనిపై మీడియాలో వార్తలు హల్ చల్ చేయడంతో ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కలిగింది. ఓ సీనియర్ పోలీసు అధికారి ఐటీ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు మీడియాకు లీక్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆదివారం ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడుతూ అధికారులందరికీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో దర్యాప్తు విషయాలు మీడియాకు అప్పుడే చెప్పవద్దని హెచ్చరించారు.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
'కరోనా' సమయంలో.. కానరాని పచ్చ నేతలు! ఫోన్లు సైతం..
బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్
సీఎం జగన్ సింహగర్జన.. దద్దరిల్లిన మంగళగిరి సభ
నారా లోకేష్ కు ఈ దెబ్బతో..!
హీరోగా రవితేజ వారసుడు.. టీజర్ రిలీజ్
మన ప్రభుత్వం ఉంటే..మరెన్నో సంక్షేమ పథకాలు
అక్షయ తృతీయ వేళ భారీ షాకిచ్చిన బంగారం!
BRS ఓటమిపై కేసీఆర్ మనసులో మాట
కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్ తప్పు మాది కాదు: కేసీఆర్
డల్లాస్లో నాట్స్ ఆధ్వర్యంలో నృత్య, నట శిక్షణా శిబిరం
తప్పక చదవండి
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- నాకోసం ఆ స్టార్ హీరో నెలలతరబడి వెయిట్ చేశాడు: కమెడియన్
- ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
- అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..
- అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- RCB Vs PBKS: ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement