-
కేజ్రీవాల్ మౌనం వెనుక అర్థం ఏంటి..?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని జహంగీర్పూరిలో బుధవారం అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేసిన విషయం తెలిసిందే. నిర్మాణాల కూల్చివేతల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు బాధితులను పరామర్శించేందుకు అక్కడకు వెళ్లారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఇంత జరుగుతున్నా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎందుకు మౌనంగా వున్నారని ప్రశ్నించారు. ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం చట్ట విరుద్ధమని మాకెన్ మండిపడ్డారు. కాగా, జాహంగీర్పూరిలో బాధిత కుటుంబాలను అజయ్ మాకెన్ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం పరామర్శించింది. మాకెన్ బృందలో 16 మంది నేతలు ఉన్నారు. ఇక, కూల్చివేతల వ్యవహారాన్ని మతపరమైన కోణంలో చూడవద్దని అన్నారు. మరోవైపు జహంగీర్పూరి ఘటనపై కాంగ్రెస్ నేత చిదంబరం స్పందించారు. కూల్చివేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుల్డోజర్ అంటేనే ఏకపక్ష కూల్చివేతలంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. ఇది చదవండి: మత ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై సీఎం కీలక నిర్ణయం -
జహంగీర్ పురి-బడ్లీ మధ్య ట్రయల్ రన్
♦ పరుగులు తీసిన మెట్రో రైలు ♦ {పాజెక్టు పనులు దాదాపు ఓ కొలిక్కి ♦ అనుమతి రాగానే అందుబాటులోకి న్యూడిల్లీ : జహంగీర్ పురి-బడ్లీ మార్గంలో శుక్రవారం మెట్రో రైలు ప్రయోగాత్మకంగా పరుగులు తీసింది. యెల్లో లైన్ పొడగింపులో భాగంగా నిర్మించిన ఈ మార ్గంలో జహంగీర్పురి-హుడా సిటీ సెంటర్ మధ్య ఇప్పటికే మెట్రో రైలు సేవలందిస్తోంది. జహ ంగీర్పురి-బడ్లీ మధ్య దూరం 4.392 కిలోమీటర్లు. మూడోదశ కింద చేపట్టిన ఈ ఎలివేటెడ్ ప్రాజెక్టు పనులు దాదాపు ఓ కొలిక్కివచ్చాయి. ట్రయల్ రన్లు, ప్రాథమిక లాంఛనాలు పూర్తవడంతోపాటు అనుమతులు అందినవెంటనే ఈ మార్గాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు శుక్రవారం డీఎంఆర్సీ వర్గాలు వెల్లడించాయి. ఈ మార్గం అందుబాటులోకి వస్తే ఉత్తర ఢిల్లీ పరిధిలోని జహంగీర్పురి, సమయ్పూర్, బడ్లీ, ట్రాన్స్పోర్ట్నగర్, జీటీ కర్నాల్ రోడ్డు ప్రాంతాలతోపాటు రోహిణి పరిధిలోని కొన్ని ప్రాంతాలవాసులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ విషయమై సంబంధిత అధికారి ఒకరు మాట్లాడుతూ ‘ఈ పనులు సజావుగా సాగాలంటే ఆయా సంస్థల మధ్య సమన్వయం అత్యంత అవసరం. డీఎంఆర్సీకి భూసేకరణ సవాల్ న్యూఢిల్లీ: శరవేగంగా మెట్రో పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్సీ)కు భూసేకరణ పెద్ద అవరోధంగా మారింది. ఈ విషయాన్ని డీఎంఆర్సీ చీఫ్ మంగూసింగ్ మీడియాకు వెల్లడించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మూడో దశలో భాగంగా మూడు ప్రాంతాల్లో నిర్మించతలపెట్టిన మెట్రో పనులకు భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారిందన్నారు. ఈ అడ్డంకులు తొలిగిపోతే ప్రస్తుతం 190 కిలోమీటర్ల మేర జరుగుతున్న పనులను అదనంగా మరో 140 కిలోమీటర్ల మేర చేపట్టడానికి వీలవుతుందన్నారు. ఈ సమస్యపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీఎం స్పోలియాకు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. తూర్పుఢిల్లీలోని త్రిలోక్పురి ప్రాంతంలోగల కొన్ని కుటుంబాలు తాము ప్రకటించిన పునరావాస ప్యాకేజీని తిరస్కరించాయని చెప్పారు. అలాగే పశ్చిమ ఢిల్లీలోని మాయపురి, పంజాబీభాగ్లో మరికొన్ని కుటుంబాలు కూడా అంగీకరించలేదని తెలిపారు. పంజాబీభాగ్లో మురికివాడలు ఎక్కువగా ఉన్నాయని, దీంతో ఈ సమస్య తలెత్తిందన్నారు.
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Advertisement