-
రణరంగమైన ‘నిజాం’ హాస్టల్
దత్తాత్రేయనగర్ /కలెక్టరేట్, న్యూస్లైన్: నిజాం కళాశాల హాస్టల్ శనివారం రణరంగంగా మారింది. ఏపీ ఎన్జీవోల సభ నేపథ్యంలో.. తెలంగాణ నినాదాలు చేస్తున్న విద్యార్థులపై పోలీసులు పలుమార్లు విరుచుకుపడ్డారు. వసతిగృహంలో టీఆర్ఎస్వీ నేత బాల్క సుమన్ హాస్టల్లో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు లోనికి వెళ్లారు. సుమన్తో పాటు దాదాపు 60 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అనుమతి లేకుండా హాస్టల్లోకి రావడంపై విద్యార్థులు ప్రశ్నించగా.. వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. దీంతో రోడ్లపైకి రాళ్లు రువ్వారు. అనంతరం కొందరు హాస్టల్ భవనం ఎక్కి నిరసన తెలిపారు. పోలీసులు హాస్టల్ విడిచి వెళ్లకపోతే దూకుతామంటూ హెచ్చరించారు. పోలీసులు మరోసారి హాస్టల్ లోపలికి ప్రవేశించి భవనంపై ఎక్కి వారిని అదుపులో కి తీసుకోవడంతో కొద్ది సేపు పరిస్థితి సద్దుమణిగింది. కొద్దిసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న నిజాం కళాశాల ప్రిన్సిపల్ టిఎల్ఎన్ స్వామి.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లోకి వచ్చేందుకు మీకెవరు అనుమతి ఇచ్చారని నిలదీశారు. అనుమతి లేకుండా హాస్టల్లోకి వెళ్లి విద్యార్థులపై లాఠీచార్జి చేయడాన్ని ఖండించిన ఆయన.. ఓయూ వీసీకి దృష్టికి తీసుకెళ్లి, హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేస్తామని చెప్పారు. మధ్యాహ్నం సమయంలో విద్యార్థులు మళ్లీ భవనమెక్కి, జెతైలంగాణ నినాదాలు చేశారు. పోలీసులు మళ్లీ వెళ్లి కిందకు దింపేందుకు యత్నించారు. అయితే, పోలీసులు వెళ్లిపోవాలని కోరాగా.. పట్టించుకో ని పోలీసులు వారిని నెట్టివేశారు. ప్రతిఘటిం చిన వారిపై లాఠీలతో విరుచుకు పడ్డారు. దీం తో శేఖర్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా, ప్రశాంత్ అనే విద్యార్థి చేయి విరిగింది. మరికొం దరికి గాయాలయ్యాయి. తోటి విద్యార్థులు శేఖర్ను చేతులపై ఎత్తుకుని బయటకు తీసుకురాగా, పోలీసులు డీసీఎంలో తీసుకెళ్లారు. అతని పరిస్థితి ఆందోళ న కరంగా ఉన్నట్లు సమాచారం. జర్నలిస్టుల ధర్నా.. విద్యార్థులపై లాఠీచార్జి ఘటనను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాను పోలీసులు అనుమతించ లేదు. లోపల లాఠీచార్జి జరగడం లేదని వాదించారు. కానీ, పలువురు గాయాలతో బయటకు రావడంతో జర్నలిస్టులు లోనికి అనుమతించాలని పట్టుబట్టారు. దీంతో పోలీసులు వారిని నెట్టివేయడంతో జర్నలిస్టులు అక్కడే ధర్నాకు దిగారు. దాడులను ఖండించిన ఓయూ జేఏసీ విద్యార్థులపై పోలీసులు, సీమాంధ్రులు దాడులు చేయడాన్ని టీఎస్, ఓయూ జేఏసీ ఖండించింది. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే భౌతిక దాడులకు తప్పవని హెచ్చరించింది. -
తెలంగాణ కేసరి: కీసర జితేందర్రెడ్డి
కోదాడటౌన్, న్యూస్లైన్: తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమంలో సరిహద్దులో ఉన్న కోదాడ ప్రాంతానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఉద్యమంలో ఏ చిన్న సంఘటన జరిగినా ఆ ప్రభావం ఇక్కడ ఉండే ది. 1969లో జరిగిన జై తెలంగాణ, ఆంధ్రా గోబ్యాక్ ఉద్యమంలో ఈ ప్రాంత దివంగత నేత కీసర జితేందర్రెడ్డి ఉరఫ్ కేసరిరెడ్డి పోషించిన పాత్ర మరువలేనిది. వేలాది మంది ఒక వైపు ఉండి ఆవేశంతో దాడికి వస్తుంటే ధైర్యంగా ఒక్కరే ఎదురెళ్లి తెలంగాణ ఉద్యమంలో రక్తపాతం జరగకుండా అడ్డుకున్నాడు. దాడులనుంచి కో దాడ వాసులను రక్షించారు. నాటి తెలంగాణ ఉద్యమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి తర్వాత కోదాడకు చెందిన రత్పవరం దొర, మాజీ ఎమ్మెల్యే దివంగత కీసర జితేందర్రెడ్డే ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమాన్ని ఆపాలని నాటి ముఖ్యమంత్రి కాసుబ్రహ్మానందరెడ్డి స్వయం గా కోదాడకు వచ్చి జితేందర్రెడ్డితో చర్చలు జరిపారు. మంత్రి పదవి ఇస్తానని చెప్పినా ఆయన లొంగలేదు. తెలంగాణ ఉద్య మం ముమ్మరంగా జరుగుతున్న 1969లో కోదాడలో జరిగిన ఓ సంఘటన ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లింది. 2009 అక్టోబర్లో జితేందర్రెడ్డి మృతి చెందారు. ప్రత్యేక రాష్ట్ర ప్రకటన నేపథ్యంలో ఆయనను తెలంగాణ వాదులు మరోసారి స్మరించుకుంటున్నారు. అసలు ఏం జరిగిందంటే.. 1969లో తెలంగాణఉద్యమం ఉధృతంగా నడుస్తున్నది. అప్పటి మిర్యాలగూడెం ఎమ్మె ల్యే తిప్పన కృష్ణారెడ్డి, కోదాడ సమితి ప్రెసిడెంట్ కీసర జితేందర్రెడ్డిలు ఈ ప్రాంతంలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. హైదరాబా ద్ నుంచి విజయవాడకు వెళ్లేందుకు కోదాడ మీదుగా జాతీయ రహదారి ఉంది. ఆ సమయంలో ఆంధ్రా ప్రాంతానికి చెందిన మహిళలపై తెలంగాణ ఉద్యమకారులు కోదాడ ఆర్టీ సీ బస్టాండ్ వద్ద, మిర్యాలగూడెంలో దాడులు చేస్తున్నారని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని కొన్ని అల్లరి మూ కలు ఆంధ్రాప్రాంతంలో పుకార్లు పుట్టిం చాయి. రెండు, మూడు రోజుల్లో ఇది ఆంధ్రా ప్రాంతమంతా దావనంలా వ్యాపించింది. దీంతో విజయవాడ నుంచి గరికపాడు వరకు ఉన్న ఆంధ్రాప్రాంతం వాసులు ఆవేశంతో రగిలిపోయి కర్రలు, కత్తులు చేతబట్టుకుని వేలాదిగా కోదాడ వైపు తరలి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని గరికపాడు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పనిచేస్తున్న తెలంగాణ వ్యక్తి.. జితేందర్రెడ్డికి చేర వేశారు. దీంతో కోదాడ మసీదు వద్ద సైరన్పెట్టారు. అది మోగితే అంతా కర్రలు, కారం పట్టుకుని దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన ప్రచారం చేశారు. కానీ నాలుగు రోజుల తర్వాత మధ్యాహ్నం అల్లరి మూకలు వేలాదిగా ప్రత్యేక వాహనాల్లో కోదాడ వైపు తరలివస్తున్నాయని తెలుసుకున్న జితేందర్రెడ్డి.. కోదాడ కేఆర్ఆర్ కళాశాలకు చెందిన కొంత మంది విద్యార్థులతో కలిసి పాలేరు వంతెన వద్దకు చేరుకున్నారు. వంతెనపై రాళ్లతో గోడ కట్టారు. సాయంత్రం వేళ వేలాదిగా అల్లరిమూకలు ఆంధ్రావైపు నుంచి పాలేరు వంతెన వద్దకు చేరుకున్నాయి. వెనక్కి వెళ్లాల్సిందిగా జితేందర్రెడ్డి వారిని బతిమిలాడినా వినిపించుకోలేదు. ఈలోగా కొందరు వాహనాలతో రాళ్లగొడను ఢీకొట్టారు. వెంటనే జితేందర్రెడ్డి తనవద్ద ఉన్న లెసైన్స్ తుపాకితో కాల్పులు జరిపారు. భయపడిన అల్లరిమూకలు వెనక్కితగ్గి పారిపోయాయి. ఈ సంఘటనతో వారం రోజుల పాటు ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయని ఆనాటి సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న తాటికొండ బ్రహ్మానందం తెలిపాడు. అడ్డుకోకపోతే అల్లరిమూకలు విధ్వంసం సృష్టించేవి 1969 తెలంగాణ ఉద్యమంలో కోదాడ కీలకంగా ఉండేది. కోదాడలోని కేఆర్ఆర్ కళాశాల విద్యార్థులు ఉద్యమంలో ముందుండేవారు. నాయకుడిగా కోదాడ సమితి అధ్యక్షుడు కీసర జితేందర్రెడ్డి ఎంతో ధైర్య సాహసాలతో వ్యవరించేవారు. అప్పటి మిర్యాలగూడెం ఎమ్మెల్యే తిప్పన కృష్ణారెడ్డికూడా తెలంగాణ ఉద్యమంలో బాగా పని చేసేవారు. నాడు జితేందర్రెడ్డి అడ్డుకోకపోతే అల్లరి మూకలు కోదాడ ప్రాంతంలో విధ్వంసం సృష్టించేవి. దానిని తలుచుకుంటేనే భయం అవుతుంది. ఏదైనా కీసర జితేందర్రెడ్డి కేసరిగా మారి తెలంగాణ ప్రజలను రక్షించారు. జై తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు కోదాడలో అనేకమంది ఆంధ్రాపాంతంవారు నివసించేవారు. వారు ఇక్కడి నుంచి వెళ్లిపోతామని చెబుతుండటంతో నేను, జితేందర్రెడ్డి వారి వద్దకు వెళ్లి ప్రజలతో మాకు ఎటువంటి విభేదాలు లేవని, ఇక్కడ ఉన్న ఆంధ్రావారంతా మా సోదరులేనని వారి ఇళ్లకు వెళ్లి బతిమిలాడాము. వారిని వెళ్లకుండా అడ్డుకున్నాం. నేటికీ వారంతా కోదాడలోనే ఉంటున్నారు. తెలంగాణ ఉద్యమం లో అరెస్ట్ అయిన జితేందర్రెడ్డిని వరంగల్ జైలుకు, చెన్నారెడ్డిని రాజమండ్రి జైలుకు, నన్ను హుజూర్నగర్ సబ్జైలుకు తరలించారు. వారం రోజుల తరువాత విడుదలైన మ మ్మల్ని కోదాడలో తెలంగాణవాదులు ఊరేగింపు తో స్వాగతం పలికారు. తెలంగాణ ఉద్యమాన్నిఉస్మానియా యూనివర్సిటీలో ప్రారంభించిన సూర్యాపేట మం డలం రామన్నగూడెంకు చెందిన బొక్కా వెంకట్రెడ్డి, డాక్టర్ ఎం. శ్రీధర్రెడ్డి లను కోదాడకు తీసుకువచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేశాం. ఇప్పడు నాకు 74 ఏళ్ల వయస్సు. నేను బతికున్నంత కాలం తెలంగాణను చూస్తానో లేదో ననే బాధ ఉండేది. కానీ ఇపుడు మనసు కుదుటపడింది. మంత్రిపై ఘనవిజయం కీసర జితేందర్రెడ్డి 1972లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి ఇండిపెం డెంట్గా పోటీ చేసి అప్పటి సమాచార శాఖ మంత్రిగా ఉన్న అక్కిరాజు వాసుదేవరావు(కాంగ్రెస్)పై 14,308 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
ఎండుతున్న జలకళ
షూటింగ్... పార్టీయింగ్...
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement