-
వైఎస్ఆర్సీపీ అధ్వర్యంలో ఈనెల 25న మహిళస్వరం
-
ఎమ్మెల్యే అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తా
-
కొండను అక్రమంగా తవ్వుతున్నారు
-
అవినీతి బాబుకు రక్షణ కవచం అవసరమా!
సీతానగరం (రాజానగరం): రాష్ట్రంలో అవినీతి మారాజుగా పేరొందిన చంద్రబాబుకు ప్రజల రక్షణ కవచం అవసరమా అని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి విరుచుకుపడ్డారు. మంగళవారం సీతానగరంలో ప్రజా సంకల్ప యాత్రపై పార్టీ నాయకులు, కార్యకర్తలను కలిశారు. విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబులో భయాందోళనలు ప్రారంభమయ్యాయని, తాను చేసిన రూ.లక్షలాది కోట్ల దోపిడీకి కేంద్రం లెక్కలు చెప్పాలని అడగడంతో చంద్రబాబు భయాందోళనలో ఉన్నారన్నారు. అలాగే ఓటుకు నోటు కేసు ఎక్కడ విరుచుకుపడుతుందోనని ఆందోళనలో ఉన్నారని, అందుకే ఎక్కడ సభలు, సమావేశాలు పెట్టినా ప్రజలను రక్షణ కవచంగా ఉండాలని అడుగుతున్నాడన్నారు. రాష్ట్ర ప్రజలకు ఏమి చేశావని నీకు రక్షణగా ఉండాలని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో వందలాది హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయని ఘనుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. అవినీతి ఆకాశాన్ని తాకింది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి ఆకాశాన్ని అంటిందన్నారు. ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు, ఇప్పుడు ఎయిర్ ఏషియా కుంభకోణంలో బుక్కయ్యారని అన్నారు. ఎయిర్ ఏషియా కుంభకోణంలో చంద్రబాబు పేరు ప్రస్తావన, కుంభకోణానికి సంబంధించి ఆడియో టేపులు తమ వద్ద ఉన్నాయని ప్రముఖ ఆంగ్ల పత్రిక బిజినెస్ టుడే ప్రకటించడంతో చంద్రబాబు అవినీతి ఎల్లలు దాటిందని ఆక్షేపించారు. కుంభకోణాలు, అవినీతి బయట పడడంతో చంద్రబాబుకు మానసిక ఆందోళన, భయాందోళన, మానసిక స్థితి బాగాలేదని ఆయన వ్యాఖ్యల ద్వారా అర్థం అవుతోందన్నారు. తను చేసిన తప్పును మరిచి ఎమ్మెల్యేలను కొంటారా అని బీజేపీని నిలదీయడం, ప్రజలు రక్షణ కవచంగా ఉండాలనడం చంద్రబాబుకు జైలుకు వెళ్లిపోతానని తెలిసిపోయిందన్నారు. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజలకు భరోసా కల్పిస్తుందని, ప్రజలు తమ కష్టాలు చెప్పుకోడానికి పాదయాత్ర మంచి అవకాశంగా ప్రజలు భావిస్తున్నారని, అందుకే ప్రజలు జగన్మోహన్రెడ్డికి పాదయాత్రలో బ్రహ్మరథం పడుతున్నారని గుర్తు చేశారు. జిల్లాలోకి ప్రవేశించే జగన్మోహన్రెడ్డికి ఎప్పుడు ఘన స్వాగతం పలుకుదామా అని జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పెదపాటి డాక్టర్బాబు, పార్టీ నాయకులు వలవల రాజా, చల్లమళ్ల సుజీరాజు, వలవల వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు చెబితే సంకెళ్లా?
రాజమహేంద్రవరం సిటీ: ఏళ్ల తరబడి చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్న అన్ ఎయిడెడ్ అధ్యాపకులు, తమ సమస్యలు చెప్పుకోవాలని ప్రయత్నిస్తే.. ప్రభుత్వం వారి గొంతు నొక్కేందుకు ప్రయత్నించడం దారుణమని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అసెంబ్లీ దండాలు’ పేరుతో అన్ ఎయిడెడ్ అధ్యాపకులు శుక్రవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం తలపెట్టారు. దీనికి బయలుదేరుతున్న సుమారు 62 మందిని వన్టౌన్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి, స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీసీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి హుటాహుటిన స్టేషన్కు చేరుకుని, అన్ ఎయిడెడ్ అధ్యాపకులకు సంఘీభావం తెలిపారు. వన్టౌన్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి వారిని సొంత పూచీకత్తులపై విడిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అన్ ఎయిడెడ్ అధ్యాపకుల సమస్యలను వినే ప్రయత్నం చేయకుండా, అరెస్టు చేయడం ప్రభుత్వ నిరంకుశ పాలనకు అద్దం పడుతోందన్నారు. అన్ ఎయిడెడ్ స్టాఫ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సంజీవరావు మాట్లాడుతూ, ఎయిడెడ్ స్టాఫ్ కోసం ప్రభుత్వం ఏటా రూ.60 కోట్లు మంజూరు చేస్తోందని, అవి ఖర్చు కాకపోవడంతో వేరే కార్యక్రమానికి మళ్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిడెడ్ సిబ్బందికి మంజూరు చేసిన నిధులను అన్ ఎయిడెడ్ సిబ్బంది కోసం వినియోగిస్తే సమస్య పరిష్కారమవుతుందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బొంతా శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement