-
తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల కోసం.. తెలంగాణలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ మిగతా చోట్ల బలమైన అభ్యర్థుల కోసం వేట కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టి.. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలకు గాలం వేస్తోంది. ఆ పార్టీలోని కీలక నేతలను.. టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్లను.. టికెట్ దక్కే ఆస్కారం లేనివాళ్లను తమ వైపు తిప్పుకునే యత్నం చేస్తోంది. తాజాగా.. శుక్రవారంనాడు మహబూబాబాద్ మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నేత సీతారాం నాయక్ ఇంటికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి వెళ్లారు. ఇటీవల బీఆర్ఎస్ మహబూబాబాద్ పార్లమెంటరీ సన్నాహాక సమావేశంలో.. సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవితకే టికెట్ ఉంటుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. దీంతో అప్పటిదాకా క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా కనిపించిన సీతారాం నాయక్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఇదీ చదవండి: తొమ్మిదిలో ముగ్గురు సిట్టింగ్లే! కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయిన సీతారాం నాయక్.. 2014 లోక్సభ ఎన్నికల్లో అప్పటి కేంద్రమంత్రి బలరాం నాయక్ను ఓడించారు. అయితే గత ఎన్నికల్లో కేసీఆర్ చెప్పడంతో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. ఆ స్థానంలో రెడ్యా నాయక్ తనయ, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే కవిత మాలోత్కు బీఆర్ఎస్కు టికెట్ ఇవ్వగా.. ఆమెనెగ్గారు. ఈసారి ఎలాగైనా టికెట్ దక్కుతుందనే ఆశతో ఉన్న సీతారాం నాయక్కు అధిష్టానం ప్రకటన తీవ్ర అసంతృప్తి కలిగించింది. దీంతో తమ పార్టీలో చేర్చుకుని సీతారాం నాయక్కు ఎంపీ టికెట్ ఆఫర్ చేసే యోచనలో బీజేపీ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ‘‘సీతారాం నాయక్ లాంటి వాళ్లు బీజేపీలోకి వస్తే కాదంటామా?.. బీజేపీలో చేరాలన్నది ఇక ఆయనే నిర్ణయించుకోవాలి’.. సీతారాం నాయక్ను కలిసిన అనంతరం కిషన్రెడ్డి చెప్పిన మాటలివి. ‘‘బీఆర్ఎస్ కోసం అహర్నిశలు శ్రమించా. కానీ, అధిష్టానం పట్టించుకోలేదు. బీజేపీ నుంచి చేరాలనే ప్రతిపాదన వచ్చింది. కార్యకర్తలతో చర్చించి త్వరలో నిర్ణయం ప్రకటిస్తా’’ అని మీడియాకు సీతారాం నాయక్ తెలిపారు. ఇక.. గులాబీ జెండా పట్టుకునే నాధుడే లేని రోజుల్లో ఆయన ఖమ్మంలో ఆ పార్టీ తరఫున గెలిచిన ఏకైక వ్యక్తి జలగం వెంకటరావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐదవ ముఖ్యమంత్రి అయిన జలగం వెంగళరావు తనయుడే ఈయన. అయితే కాలక్రమేణ రాజకీయాలు ఆయన్ని బీఆర్ఎస్కు దూరం చేశాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మరో పార్టీ తరఫున పోటీ చేసినా.. రెండో స్థానానికే పరిమితం అయ్యారాయన. దీంతో ఆయన్ని బీజేపీలోకి తీసుకుని ఖమ్మం ఎంపీ టికెట్ ఆఫర్ చేయాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీ నేత, మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డి జలగంను కలిసి బీజేపీలోకి ఆహ్వానించగా.. ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వీళ్లతోపాటు.. మరికొందరు బీఆర్ఎస్ నేతలతోనూ బీజేపీ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. -
'వనమా.. జలగం'ల మధ్య ‘సుప్రీం’ తీర్పు ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గత మూడు నెలలుగా కొనసాగుతున్న సస్పెన్స్కు నేడు తెర పడనుంది. ‘కొత్తగూడెం’ విషయంలో ప్రస్తుత ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుల మధ్య నడుస్తున్న కేసులో మంగళవారం సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. దీంతో తీర్పు ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ కొత్తగూడెం బీఆర్ఎస్ పార్టీలో నెలకొంది. వనమా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన వనమా 2018లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి వనమా వెంకటేశ్వరరావు, జలగం వెంకట్రావులు పోటీ చేశారు. అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న వెంకట్రావుపై వనమా వెంకటేశ్వరావు 4,139 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత వనమా గెలుపును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో 2019లో జలగం కేసు దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో వనమా తప్పుడు వివరాలు సమర్పించారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. నాలుగేళ్లపాటు విచారణ కొనసాగిన కేసులో 2023 జూలై 25న తీర్పు వచ్చింది. వనమా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు పేర్కొంది. దీన్ని సవాల్ చేస్తూ వనమా వెంకటేశ్వరరావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రెబల్గా జలగం.. కొత్తగూడెం ఎమ్మెల్యే అనర్హత కేసులో ఇరువర్గాలు సుప్రీం కోర్టులో కౌంటర్లు దాఖలు చేశారయి. ఆగస్టు, సెప్టెంబర్లో విచారణ జరిగింది. అయితే ఈ కేసులో తీర్పును అక్టోబరు 31కి న్యాయస్థానం రిజర్వ్ చేసి ఉంచింది. నేడు సుప్రీం కోర్టు వెలువరించే తీర్పు వనమా వెంకటేశ్వరావుకు ప్రతికూలంగా వస్తే, పరిస్థితులు ఏ మలుపు తీసుకుంటాయనే చర్చ బీఆర్ఎస్ పార్టీలో జోరుగా కొనసాగుతోంది. మరోవైపు జలగం వెంకట్రావు అభ్యంతరాలను న్యాయస్థానం తోసి పుచ్చితే, రాజకీయంగా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే జలగం మద్దతుదారులు బీఆర్ఎస్ రెబల్గా జలగం కొత్తగూడెం బరిలో ఉండటం ఖాయమంటూ సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ టికెట్ మీద కొత్తగూడెం నుంచి బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. వనమాకు అండగా కేసీఆర్ హైకోర్టు తీర్పు వెలువడ్డాక విపత్కర పరిస్థితుల్లో ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. ప్రగతి భవన్కు ప్రత్యేకంగా పిలిపించుకుని పార్టీ తరఫున అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. దీంతో అప్పటివరకు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో కొనసాగుతూ వస్తోన్న గ్రూపు రాజకీయాలు సద్దుమణిగాయి. ఎంపీ వద్దిరాజు రవిచంద్రను ప్రత్యేకంగా నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. సీఎం కేసీఆర్ తిరిగి వనమాకే టికెట్ కేటాయించడంతోపాటు బీ ఫామ్ను అందించారు. కేసీఆర్ ప్రోత్సాహంతో వనమా ఇప్పటికే ప్రచారం ఉధృతంగా కొనసాగిస్తున్నారు. ఊరువాడా తిరుగుతూ ‘ఇవే తనకు చివరి ఎన్నికలు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలి. అంటూ కోరుతున్నారు. 5న కొత్తగూడెంలో సీఎం హాజరయ్యే బహిరంగ సభకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవి చదవండి: ఓవైపు సంక్షేమ పథకాలను వివరిస్తూనే.. మరోవైపు ప్రతిపక్షాలపై విమర్శలు -
వనమాకు మరోసారి ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వనమా వెంకటేశ్వరావుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. వనమా పిటిషన్ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. వివరాల ప్రకారం.. కొద్దిరోజుల క్రితం కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల చెల్లదంటూ కోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా, దీనిపై వనమా మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టులకు అప్పీల్కు వెళ్లే వరకు స్టే విధించాని వనమా.. కోర్టును కోరారు. దీంతో, వనమా పిటిషన్కు హైకోర్టు కొట్టివేసింది. వనమా పిటిషన్పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇదిలా ఉండగా.. కొత్తగూడెం శాసనసభ్యుడిగా తనను గుర్తించాలని కోరుతూ జలగం వెంకట్రావు బుధవారం అసెంబ్లీ కార్యదర్శితో పాటు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిని కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జలగం వెంకట్రావు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులను కలసి కోర్టు తీర్పు కాపీని అందజేశారు. సాయంత్రం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్తో కూడా సమావేశమై కోర్టు తీర్పు కాపీతో పాటు తన విజ్ఞాపన అందజేశారు. కాగా, కోర్టు తీర్పును పరిశీలించి, నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాత సమాచారం ఇస్తామని అసెంబ్లీ కార్యదర్శి, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ చెప్పినట్లు జలగం వెంకట్రావు ‘సాక్షి’కి వెల్లడించారు. ఈ అంశంపై తాను అసెంబ్లీ స్పీకర్తో ఫోన్లో మాట్లాడానని చెప్పారు. ఇది కూడా చదవండి: కేసీఆర్కు అన్ని విషయాలు తెలుసు: జలగం వెంకట్రావ్ కీలక వ్యాఖ్యలు -
వనమా సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చు.. జలగం వెంకట్ రావు
-
తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీని కలిసిన జలగం వేంకట్రావు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
మీ ఇంటి ఆడబిడ్డను ఆశీర్వదించండి
కాంగ్రెస్ మాయమాటలకు మోసపోవద్దు
ఆదరించండి.. అభివృద్ధి చేస్తా
ప్రాణం తీసిన మామిడి కాయల గొడవ
బీజేపీ అనుకూల పార్టీలను ఓడించాలి
ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి..
ఉరేసుకొని వ్యక్తి మృతి
ఆర్ఎస్పీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత
మెరుగైన వైద్యసేవలు అందించాలి
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement