-
పవిత్రోత్సవం..పరిసమాప్తం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు ఆదివారం ముగిశాయి. అర్చకులు తెల్లవారుజాము నుంచే స్వామివారికి పూజలు, అభిషేకాలు చేసి, యాగశాలలో పూర్ణాహుతిని శాస్త్రోక్తంగా జరిపించారు. అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్ల సమేత వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవ మూర్తులకు పుష్పయాగం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రమణమూర్తి, దేవస్థానం చైర్మన్ ఉప్పల శివ రామ ప్రసాద్, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస శర్మ, అర్చకులు కురవి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, ఉప్పల విజయ దేవ శర్మ, ప్రభాకర్ శాస్త్రి, పెళ్లూరి వెంకట రాయ శర్మ, సిబ్బంది ఎస్.విజయ కుమారి, కేవీఆర్.ఆంజనేయులు పాల్గొన్నారు. -
శాకంబరిగా జమలాపురం అమ్మవార్లు
జమలాపురం (ఎర్రుపాలెం): తెలంగాణ తిరుపతిగా పేరొందిన జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలలో భాగంగా నాల్గవ రోజు శనివారం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో శ్రీ స్వామి వారికి, శ్రీ అలివేలు మంగ, శ్రీ పద్మావతి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకాలు చేశారు. రకరకాల కూరగాయలతో శ్రీ అలివేలు మంగ, శ్రీ పద్మావతి అమ్మవార్లను శాకంబరీదేవిగా అర్చకులు రాజీవ్ శర్మ, రఘు రామMృSష్ణ అలంకరించి అర్చనలు చేసి, భక్తులకు దర్శనం కల్పించారు. కన్నుల పండువగా శ్రీవారిని, అమ్మవార్లను భక్తులు తిలకించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. సాయంత్రం స్వామివారిని, అమ్మవార్లను మేళతాళాలతో ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు. గోవింద నామంతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులకు శ్రీ వేంకటేశ్వర సేవాసమితి నిర్వాహకులు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎవి.రమణమూర్తి, ఆలయ చైర్మన్ ఉప్పల శివరామ ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ ఎస్.విజయకుమారి, జూనియర్ అసిస్టెంట్ కెవిఆర్.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
జమలాపురంలో ఘనంగా పూర్ణాహుతి
పవిత్రాల విసర్జన చక్ర పెరుమాళ్లకు అవబృద స్నానం ఎర్రుపాలెం : తెలంగాణ తిరుపతి జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో 3వ రోజు శుక్రవారం శ్రీవారి ఆలయంతో పాటు ఉప ఆలయాలకు ధారణ చేసిన పవిత్రాలను విసర్జన చేశారు. తొలుత తెల్లవారుజామున ఆలయ అర్చకులు శ్రీవారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఉప్పల శ్రీనివాసశర్మ దంపతులతో యాగశాలలో ఘనంగా శాస్త్రోక్తంగా పూర్ణాహుతి నిర్వహించారు. శ్రీచక్ర పెరుమాళ్లను అర్చకులు మేళతాళాలతో కోనేటికి తోడ్కోని వచ్చారు. కోనేటిలో శ్రీస్వామి వారి సుదర్శన చక్ర పెరుమాళ్లకు సంప్రదాయబద్ధంగా శ్రీచక్ర స్నానం (అవబృద స్నానం) చేయించారు. అనంతరం మంగళవాయిద్యాలతో, వేదమంత్రోచ్చారణ నడుమ శ్రీవారికి శాంతి కల్యాణం నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మొక్కులు తీర్చుకుని కానుకలు సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఏవీ రమణమూర్తి, ఆలయ చైర్మన్ ఉప్పల శివరామ ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ ఎస్.విజయకుమారి, జూనియర్ అసిస్టెంట్ కేవీఆర్ ఆంజనేయులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
జంటలను కలిపే కళ్యాణ క్షేత్రాలు
జమలాపురం / తెలంగాణ తిరుపతి కళ్యాణ క్షేత్రాలు శ్రీ వేంకటేశ్వరుడు భక్తుల పక్షపాతి. అందుకే ఏడు కొండల మీద ఉన్న తనను అందుకోలేని భక్తుల కోసం తానే దిగివచ్చి, తెలుగు నాట కొన్ని మహిమాన్విత క్షేత్రాల్లో వెలిశాడు. పశ్చిమ గోదావరిజిల్లాలోని ద్వారకా తిరుమల అలాంటి క్షేత్రమే కాబట్టి చిన్న తిరుపతిగా పేరు పొందింది. అదేవిధంగా తెలంగాణలో తెలంగాణ తిరుపతిగా పేరుందిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం కూడా అంతే విశిష్టమైనది. ఖమ్మం జిల్లా మధిర సమీపంలో ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామం జములవాయి దుర్గం పైన ఉన్న ఈ పవిత్ర పుణ్యక్షేత్రం తెలంగాణా రాష్ట్రానికే తలమానికంగా విరాజిల్లుతోంది. ఏపీ, తెలంగాణా రాష్ట్రాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని శ్రీవారి కృపను పొందడం ఆనవాయితీగా ఉంది. ఆలయ చరిత్ర ........ జమలాపురం గ్రామం పేరు జాబాలి మహర్షి నుంచి వచ్చి ఉంటుందని ఒక భావన. పూర్వం జాబాలి మహర్షి ఈ గ్రామంలోని కొండ (గుట్ట) పై తపస్సు ఆచరించేవాడట. ఇక్కడే తన మునివాటికను నిర్మించుకున్నాడట. జాబాలి ఉన్న చోటు కాలక్రమంలో జములవాయి అయి ఉంటుందని అంటారు. శ్రీ వేంకటేశ్వరుడు ఈ క్షేత్రంపై స్వయంభువుగా వెలిశాడని, లేదు జాబాలి తపస్సుకు మెచ్చి వెలిశాడని కథనాలు ఉన్నాయి. ఏమైనా జాబాలి కాలంలోనే ఆలయానికి అంకురార్పణ జరిగి ఉండాలి. ఆయన హయాంలోనే ఇక్కడ పుష్కరిణి నిర్మాణం జరిగిందని చరిత్ర. కాకతీయ రాజులలో ప్రసిద్ధుడైన ప్రతాప రుద్రదేవుడు తన జైత్రయాత్ర సందర్భంగా ఓరుగల్లు నుంచి ఖమ్మం మీదుగా ప్రయాణిస్తూ జములవాయి దుర్గానికి వచ్చాడనీ, పుష్కరణిని బాగు చేయించి దేవాలయాన్ని పునరుద్ధరణ చేసి ఇక్కడ దుర్గం నిర్మించాడనడానికి ఆధారాలున్నాయి. అలాగే శ్రీవేంకటేశ్వరుని భక్తుడైన విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు జమలాపుర దుర్గాన్ని దర్శించి ఆలయాన్ని పునరుద్ధరణ చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్న మరో కథను చెప్తారు. శ్రీవేంకటేశ్వరస్వామి అర్చకులలో ఆరవతరానికి చెందిన అక్కుభట్టు అనే పురోహితుడు వృద్ధాప్యంలో కొండ పైకి ఎక్కలేక చేతిలో ఉన్న స్వామి వారి నైవేద్యంతో కొండ మొదలులో కూలబడ్డాడు. అక్కడి నుంచి కదల్లేక ఎక్కడ ఉన్నాడో అక్కడే నైవేద్యం పెట్టి ‘ఇక నా గతి ఇంతే నీ గతి అంతే’ అంటూ దుఃఖంతో వెనుదిరిగాడు. ఇంతలో ఒక గంభీరమైన ధ్వని వినిపించినట్లయింది. ‘నేను వచ్చుచున్నాను నీవు వెనుదిరగక ముందుకు పద’ అనే మాటలు వినిపించాయి. అక్కుభట్టు అట్లే గ్రామం వైపు నడుస్తుండగా చెవులు చిల్లులు పడేంత ధ్వని వచ్చింది. దీంతో వెనుదిరిగి చూడగా ఒక గొప్ప వెలుగు గుట్టపై నిలబడినట్లయింది. ఆ జ్యోతి కనిపించిన చోట చూడగా మహా అద్భుతంగా ఇంతకు ముందు ఎన్నడూ లేని శ్రీస్వామి వారి పాదం కనిపించింది. అప్పుడు అక్కుభట్టు భక్తిపారవశ్యంతో పూజలు చేయడం ఆరంభించాడు. అప్పటినుంచి అక్కుభట్టు వారి వంశీకులే అర్చకత్వం చేస్తున్నారు. శ్రీవారి పాదాన్ని నేటికీ చూడవచ్చు. పెళ్ళిళ్ళ సందడి..... శ్రీవేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో పెళ్ళిళ్ళు చేసుకుంటే శుభం కలుగుతుందనేది ఈ ప్రాంత వాసుల విశ్వాసం. దీంతో శావ్రణ, కార్తీక మాసాల్లో, వేసవి కాలంలో పెళ్ళిళ్ళు కోలాహలంగా జరుగుతాయి. పెళ్ళిళ్ళ నిర్వహించుకోవడం కోసం దశాబ్దాల క్రితం టీటీడీ ఇక్కడ కళ్యాణ మండపాన్ని నిర్మించింది. దాతల వితరణతో నిర్మించిన ప్రయివేటు సత్రాల్లో కూడా వివాహాలు జరుగుతున్నాయి. గత దశాబ్దకాలం గా టీటీడీ అధికారులు ఇక్కడ ‘కళ్యాణమస్తు’ పేరుతో పేదజంటలకు తాళిబొట్టు, వస్త్రాలు అందచేసి ఉచితంగా వివాహాలు చేస్తున్నారు. ఉత్సవాలు జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రతి ఏటా మార్చి- ఏప్రిల్ నెలల్లో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. జనవరి 1న, ఉగాది పర్వదినాల్లో తెలంగాణా, ఏపీ రాష్ట్రాలకు చెందిన వేలాదిమంది భక్తులు వచ్చి స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకోవడ ం ఆనవాయితీగా ఉంది. - గంధం శ్రీనివాసరావు ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా బస్సు మార్గం: హైద్రాబాద్ నుంచి ఖమ్మం మీదుగా మధిర పట్టణానికి చేరుకుని మధిర డిపో బస్సుల ద్వారా జమలాపురం ఆలయానికి చేరుకోవచ్చు. ఖమ్మం నుంచి జమలాపురంకు 80 కి.మీ. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం తదితర ప్రాంతాల నుంచి జమలాపురంకు బస్సులున్నాయి. విజయవాడ నుంచి కంచికచర్ల, ఎర్రుపాలెం మీదుగా జమలాపురం చేరుకునే రహదారి సౌకర్యం ఉంది. విజయవాడ-భద్రాచలం జాతీయ రహదారిలోని మైలవరం మీదుగా జమలాపురం చేరుకోవచ్చు. రైలు మార్గం: సికింద్రాబాద్- తిరుపతిల మధ్య ప్రయాణించే కృష్ణా ఎక్ప్ప్రెస్, గుంటూరు - సికింద్రాబాద్ల మధ్య నడిచే గోల్కొండ ఎక్స్ప్రెస్, డోర్నకల్ టు విజయవాడ ప్యాసింజర్ల రైళ్ళు ఎర్రుపాలెం మండల కేంద్రంలో ఆగుతాయి. ఇక్కడ నుంచి కేవలం 6 కి.మీ. దూరంలోనే జమలాపురం ఆలయం ఉంది. 25 కి.మీ. దూరంలో ఉన్న మధిర రైల్వే స్టేషన్లో సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్ళు ఆగుతాయి. ఇక్కడ నుంచి బస్సులు జమలాపురం ఆలయానికి వస్తాయి. విమాన మార్గం: హైద్రాబాద్ విమానాశ్రయం నుంచి 250 కి.మీ. దూరంలో జమలాపురం ఉంటుంది. గన్నవరం విమానాశ్రయం నుంచి 75 కి.మీ. దూరంలో ఉంది.
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- ఎలాన్ మస్క్కు నాగ్ అశ్విన్ రిక్వెస్ట్.. ఇండియాకు రావాలంటూ ట్వీట్
- India vs China: టగ్ ఆఫ్ వార్లో భారత బలగాల గెలుపు
- నన్ను వాళ్లు మోసం చేశారు: నటుడు జగపతిబాబు
- రేవ్ పార్టీ కేసులో నటి హేమకు మరోసారి నోటీసు
- JC Diwakar Reddy: వేధించి, ఆపై సంతకాన్ని ఫోర్జరీ చేసి..
- ఈ ఏడాది.. వికసించిన 'మే పుష్పం' ఇదే!
- స్కానింగ్ సెంటర్ వికృత చేష్టలపై కలెక్టర్ సీరియస్.. నలుగురి కమిటీ
- ప్రమాదమా.. గాయాలేవీ? ఖమ్మం కేసులో ట్విస్ట్
- ముస్లిం ఓటు బ్యాంకు ప్రభావమెంత? ఏ పార్టీకి ప్రయోజనం?
- 'గోరుముద్ద'కు తాజ్ రుచులు
Advertisement