-
మైనారిటీలను ఏకం చేసి గెలిపిస్తాం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు జమాత్ ఎ హింద్ సంపూర్ణ మద్దతు తెలిపింది. జమాత్ ఎ హింద్ అధ్యక్షుడు హమీద్ మహ్మద్ఖాన్ ఈ విషయాన్ని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో మైనారిటీలందరినీ ఏకం చేసి టీఆర్ఎఎస్ను గెలిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆధ్వర్యంలో హమీద్ మహ్మద్ ఖాన్, ఇంజనీర్ అబ్దుల్ జబ్బార్ సిద్ధిఖీ, మాలిక్ మోతషామ్ ఖాన్, టీఎస్పీఎస్సీ సభ్యుడు ఎండీ అజారుద్దీన్, ఎండీ సాదిక్ అహ్మద్, ఖాలిద్ జాఫర్, సయ్యద్ అబ్దుల్ బాసిత్ అన్వర్ తదితరులు సోమవారం ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ను కలిశారు. ముస్లిం వర్గాల అభ్యున్నతికి ఉపప్రణాళిక అమలు చేయాలని కోరారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉపప్రణాళిక అంశాన్ని చేర్చాలని సూచించారు. మళ్లీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కొత్తగా 100 రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ను కోరారు. ఇంటర్మీడియట్, డిగ్రీలలో ఉర్దూ భాష పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అన్ని అంశాలపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. మేనిఫెస్టోపై సీఎం కసరత్తు జమాతే ఎ హింద్ నేతలు సీఎం కేసీఆర్కు కోరిన అంశాలను మేనిఫెస్టోలో చేర్చే విషయాన్ని పరిశీలించాలని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావుకు సూచించారు. మేనిఫెస్టో రూపకల్పన ఎంతవరకు వచ్చిందని ఆరా తీశారు. త్వరగా పూర్తి చేయాలని సూచించారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫోస్టో ఉండాలని చెప్పారు. మేనిఫెస్టో కమిటీ సమావేశాలు త్వరగా పూర్తి చేసి అన్ని రంగాలకు, అన్ని వర్గాలకు సంబంధించిన అంశాలను చేర్చాలని సూచించారు. తొలి భారీ బహిరంగసభ.. ముందస్తు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నిజామాబాద్లో నిర్వహిస్తున్న బహిరంగ సభ ఏర్పాట్లపై కేసీఆర్ సమీక్షించారు. నిజామాబాద్ జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎంపీ కవితలతో ఫోన్లో మాట్లాడారు. ‘ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ నిర్వహిస్తున్న మొదటి బహిరంగ సభ ఇదే. టీఆర్ఎస్ గెలుస్తుందనే చర్చ జరిగేలా సభ జరగాలి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామం నుంచి సభకు జనం వచ్చేలా అభ్యర్థులు చర్యలు తీసుకోవాలి’అని కేసీఆర్ సూచించారు. అంగన్వాడీల మద్దతు.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ప్రకటిస్తున్న సంఘాల సంఖ్య పెరుగుతోంది. అంగన్వాడీ టీచర్ల సంఘం నేతలు 31 జిల్లాల బాధ్యులు సోమవారం నిజామాబాద్లోని ఎంపీ కవిత కార్యాలయానికి తరలి వచ్చారు. వేతనాలు పెంచి తమకు సమాజంలో గౌరవ ప్రదమైన జీవనం సాగించేలా చేసిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. మాల మహానాడు నిజామాబాద్ జిల్లా సంఘంతో పాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని మాల సంఘాల నేతలు కవితను కలసి టీఆర్ఎస్కు మద్దతిస్తూ తీర్మానం చేసినట్లు తెలిపారు. చిందు కళాకారులు సైతం ఇదే తరహాలో మద్దతు ప్రకటించారు. మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. -
18న ‘మరణం తరువాత ఏమౌతుంది’ ?
* జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ధార్మిక సమావేశం * హాజరు కానున్న వివిధ మతాల ప్రముఖులు ఇందూరు : నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఈ నెల 18న సాయంత్రం ఏడు గంటలకు ‘మరణం తరువాత ఏమౌతుంది’ అంశంపై ఒక గొప్ప ధార్మిక సమావేశం నిర్వహిస్తున్నట్లు జమాతే ఇస్లామి హింద్ కన్వీనర్ శేఖ్ హుస్సేన్ తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మనిషి మరణం తరువాత జరిగే పరిణామాలు ఏమిటీ ? మన ధార్మిక గ్రంథాలు ఏం బోధిస్తున్నాయి..? తెలుసుకునేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. సమావేశానికి వక్తలుగా సనాతన ధార్మిక పరిషత్ రాష్ర్ట కార్యదర్శి రామానంద సరస్వతి, పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సోల్మాన్ జాషువా, ఇస్లామియా ధార్మిక పండితులు మౌలానా మొహమ్మద్ రఫిక్లు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి కుల, మత,స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ హాజరు కావాలని కోరారప్రశ్నోత్తరాల సమయం ఉంటుందన్నారు. ఆహ్వానితులకు భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
తప్పక చదవండి
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement