-
జైహింద్ స్పెషల్: ఎడిటర్కి ఎనిమిదేళ్ల జైలు!.. రెండేళ్లకే పేపర్ మూత!!
‘జాతీయవాదం అనే మహా సౌధ నిర్మాణంలో భారతీయ పత్రికారంగం ప్రధానమైన, ప్రతిష్టాత్మకమైన పాత్రను నిర్వహించింది’ అన్నారు, స్వాతంత్య్రోద్యమ కాలం నాటి న్యాయ నిపుణుడు తేజ్ బహదుర్ సప్రూ. కాలానికి ఆధునికతనీ, చైతన్యాన్నీ అద్దిన చరిత్ర పత్రికలకు ఉంది. ప్రలకు కొత్త దృష్టిని ప్రసాదించడం, కదిలించడం వాటి సహజ లక్షణం. ఉద్యమాల చరిత్రలో కనిపించే ప్రజాసమూహాల అడుగులన్నీ పత్రికారంగం చూపిన దారి వెంట పడినవే. భారత స్వరాజ్య సమరంలోను ఆ జాడలు కనిపిస్తాయి. చదవండి: జైహింద్ స్పెషల్: జాతీయ గీతానికి ‘మదన’పల్లె రాగం జాతీయభావమే భారతీయులందరిని స్వాతంత్య్రం అనే లక్ష్యం వైపు నడిపించింది. మాతృభూమిని విదేశీ పాలన నుంచి తప్పించడానికి స్వాతంత్య్రోద్యమం అనివార్యమన్న తాత్త్వికతనీ, ఏకాత్మతనూ తీసుకువచ్చినవి వార్తాపత్రికలు. స్వేచ్ఛాస్వాతంత్య్రాలు లేని జాతి ప్రతిభ, సృజన, ఘనతరగతాలకు రాణింపు ఉండదని, ప్రపంచపటంలో స్థానం ఉండదని హెచ్చరించినవీ పత్రికలే. స్వయం పాలనే ఆధునిక ప్రాపంచిక చింతన అని తెలియచెప్పినవీ అవే. ప్రజాళిని బానిసత్వం నుంచి బానిసత్వానికి కాకుండా, భవిష్యత్తులోకి పత్రికలు నడిపించాయి. ఎన్నో నిర్బంధాల మధ్య ఇలాంటి ఒక చారిత్రక కర్తవ్యాన్ని నిర్వహించినందుకే స్వాతంత్య్రోద్యమ చరిత్రలో పత్రికలకు కూడా ప్రముఖ స్థానం ఇస్తారు. 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం, జాతీయ కాంగ్రెస్ స్థాపన ఘట్టాలతో రాజకీయ ఐక్యతను సూచించే వాతావరణం దేశంలో ఏర్పడింది. ఆ భూమికతోనే పత్రికలు పుట్టుకు వచ్చాయి. బెంగాల్ విభజన నుంచి జనించిన జాతీయభావం వాటికి పదును పెట్టింది. తొమ్మిది దశాబ్దాల అణచివేత బ్రిటిష్ ఇండియాలో వార్తాపత్రికల ఉనికి, లేదా భారత స్వాతంత్య్ర సమరంలో వార్తాపత్రికల పాత్ర ఏ విధంగా పిలుచుకున్నా, అది తొమ్మిది దశాబ్దాల అణచివేత చరిత్ర. 1858–1947 మధ్య ఊపిరాడని తీరులోనే వాటి మనుగడ సాగింది. వలసదేశంలో వార్తాపత్రిక అంటే, ఉద్యమాలకు ఊపిరినిస్తూనే, తన ఊపిరి నిలిచిపోకుండా చూసుకుంటుంది. పత్రిక బ్రిటిష్ జాతీయుడిదైనా, భారతీయుడిదైనా ప్రభుత్వాలను వ్యతిరేకిస్తే బతికి బట్టకట్టలేదు. భారతదేశంలో పుట్టిన తొలిపత్రిక జనన మరణాలు ఇదే చెబుతున్నాయి. ఇంతకీ ఇదంతా అంతకు ముందు ఏడున్నర దశాబ్దాల పత్రికా రంగ అణచివేతకు కొనసాగింపే. 1780 జనవరి 29 న జేమ్స్ అగస్టస్ హికీ ‘బెంగాల్ గెజెట్’ అనే రెండు పేజీల వారపత్రికను ప్రారంభించాడు. ‘కలకత్తా జనరల్ అడ్వైజర్’ అని కూడా ఆ పత్రికకు పేరు. ఆంగ్లేయుడు భారతదేశంలో ఆరంభించిన ఈ తొలి పత్రిక, తొలి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్, ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపే మీద ద్వేష పూరిత విమర్శలు కురిపించింది. ప్రధాన న్యాయమూర్తి మీద విమర్శలు సహించబోమని ఈస్టిండియా కంపెనీ బెదిరిస్తే, ఏకంగా ఆయన భార్య మీదే రాశాడు హికీ. ఎనిమిదేళ్లు కారాగారం, రూ. 2000 జరిమానా విధించారు. 1782లో పత్రిక మూతపడింది. హికీ నుంచి రాజా రామమోహనరాయ్ కాలం (1826) వరకు భారతీయ పత్రికారంగానిది నిజానికి సంఘర్షణ ధోరణి కాదు. అయినా నిర్బంధమే ప్రాప్తమైంది. పత్రికలకు కొంచెం స్వేచ్ఛ కావాలని రామమోహన్రాయ్ సుప్రీంకోర్టుకు వినతిపత్రం ఇచ్చారు. మనవాళ్లు దిగారు 1851 నుంచి 1900 వరకు సాగిన యుగంలో పత్రికల కదలిక కొంచెం సుస్పష్టంగా ఉంది. జాతీయభావాల వ్యాప్తికి ఒక భూమిక సిద్ధమవుతున్న జాడలు కనిపిస్తాయి. ప్రజలకు, ప్రభుత్వానికి వార్తాపత్రికలు వారథిగా వ్యవహరిం చాయి. భారతదేశ స్థితిగతులు, పాలకుల ధోరణి ప్రజలకు అర్థం కావడానికి ఈ యుగంలోని పత్రికలే దోహదం చేశాయి. ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ (రాబర్ట్ నైట్), ‘ది స్టేట్స్మన్’ (రాబర్ట్ నైట్), ‘ది ట్రిబ్యూన్’ (సర్దార్ దయాళ్సింగ్ మజీథియా) ‘బాంబే క్రానికల్’ (ఫిరోజ్షా మెహతా), ‘వాయిస్ ఆఫ్ ఇండియా’ (దాదాభాయ్ నౌరోజీ), ‘సుధాకర’ (గోపాలకృష్ణ గోఖలే), ‘కేసరి’, ‘మరాట్టా’ (బాలగంగాధర తిలక్), ‘ది హిందు’, ‘స్వదేశమిత్రన్’ (జి.సుబ్రహ్మణ్య అయ్యర్), ‘బెంగాలీ’ (సురేంద్రనాథ్ బెనర్జీ), ‘వందేమాతరం’ (సుబోధ్చంద్ర మాలిక్, చిత్తరంజన్ దాస్, బిపిన్ చంద్రపాల్), ‘అమృత్ బజార్ పత్రిక’ (శిశిర్కుమార్ ఘోష్), ‘హరిజన్’, ‘యంగ్ ఇండియా’ (గాంధీ) వంటి పత్రికల్ని ఈ సమయంలోనే నెలకొల్పారు. అరవిందుడు, మదన్ మోహన్ మాలవీయ, మోతీలాల్ నెహ్రూ, అబుల్ కలాం ఆజాద్, సుబ్రహ్మణ్య భారతి, సీవై చింతామణి, కోటంరాజు పున్నయ్య, కోటంరాజు రామారావు, ఎం.చలపతిరావు, కుందూరి ఈశ్వరదత్ వంటివారు కూడా అటు స్వరాజ్య సమరయోధులుగా, ఇటు పత్రికా రచయితలుగా ద్విపాత్రాభినయం చేసినవారే. అంటే, స్వాతంత్య్రోద్యమ రథసారథులంతా దాదాపు పత్రికా రచయితలే. లేదా పత్రికాధిపతులు. – డా.గోపరాజు నారాయణరావు ఎడిటర్, ‘జాగృతి’ -
మన జర్నలిజానికి తొలి అక్షర హారతి
నేటి భారతీయ పత్రికల రూపురేఖలకు 234 ఏళ్ల చర్రిత ఉంది. తొలి భారతీయ వార్తాపత్రిక బెంగాల్ గెజిట్ను జేమ్స్ అగస్తస్ హెకీ 1780 జనవరి 29న కలకత్తాలో స్థాపించాడు. భావస్వేచ్ఛకు ప్రతిరూపమైన పత్రిక అంటే పాలకులకు తొలి నుంచీ కంటగింపే కాబట్టి నాటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ బెంగాల్ గెజిట్పై పరువునష్టం దావా దాఖలు చేసి రెండేళ్లలోపే అంటే 1782 మార్చిలో పత్రిక మూసివే తకు కారణమయ్యాడు. 1785లోపే మరో నాలుగు వార్తాపత్రి కలు వెలువడ్డాయి. 1786 జనవరి 5న వెలువడిన కలకత్తా క్రానికల్ దేశంలోనే తొలి మాసపత్రికగా నమోదైంది. 18వ శతా బ్దంలో ఇండియన్ గెజిట్, కలకత్తా గెజిట్, బెంగాల్ జర్నల్, ఇండి యన్ హెరాల్డ్, టెలిగ్రాఫ్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బాంబే టైమ్స్ వంటి అనేక పత్రికలు ఆవిర్భవించినప్పటికీ ఇవన్నీ ఇంగ్లిష్ పత్రికలే. ఇంగ్లండ్ నుంచి 1818 లో వచ్చిన సిల్క్ బకింగ్హామ్ భారతీయ జర్నలిజంకు పితామహునిగా కీర్తిపొందారు. భారతీయ దురాచారాలను విమర్శిస్తూ, వాటిని అరికట్ట లేని ప్రభుత్వ అసమర్థతను దుయ్యబట్టేవాడు. ఈ నేప థ్యంలోనే భారతీయ పత్రికల ప్రస్థానంలో తొలిదశ సంస్కరణోద్యమం మొదలైంది. భారతీయ పత్రికలకు జన్మస్థలం కలకత్తా కాగా పత్రికల సంఘ సంస్కరణోద్యమానికి బొంబాయి వేదికైంది. హిందుత్వం గురిం చి ప్రజలకు సరైన అవగాహన కల్పించటం ఇప్పుడే మొదలైంది. సతీస హగమనాన్ని నిరసిస్తూ రాజారామ్మోహన్రాయ్ ఉద్యమించిన నేపథ్యం లో అనేక పత్రికలు వెలుగులోకి వచ్చాయి. తొలి మహిళా పత్రిక స్త్రీబోధ్ 1857లో ప్రచురితమవగా హిందూ పత్రిక 1878లో మద్రాసులో మొదలైంది. 1933లో మద్రాసులో ఇండియన్ ఎక్స్ప్రెస్, 41లో బ్లిట్జ్, 42లో తమిళ డైలీ, తంతి పత్రికలు జాతీయోద్యమానికి అండగా నిలిచాయి. తెలుగులో తొలి మాసపత్రిక సత్యదూత 1931లో బళ్లారిలో మొదలైంది. 1892లో కృష్ణాపత్రిక వచ్చినప్పటికీ, 1938లో వెలు వడిన వృత్తాంత తొలి తెలుగు పత్రికగా చెప్పుకోవచ్చు. తర్వాత వర్తమాన తరంగిణి, ఆంధ్రకేసరి, దేశాభిమాని, చింతామణి, గాండీవం, జనత వంటి పత్రికలు వచ్చాయి. 1908లో ఆంధ్ర పత్రిక, 38లో ఆంధ్రప్రభ, 30లో జమీన్రైతు, 45లో ప్రజాశక్తి, తర్వాత విశాలాంధ్ర, 1926లో గోలకొండ, 24లో భారతి పత్రిక వెలువడ్డాయి. ఒకప్పుడు జాతిని జాగృతం చేసిన పత్రికలు నేడు ధనికవర్గాలకు, పాల కవర్గం ముసుగులోని పెత్తందారీ వర్గాలకు బాకాలుగా మారుతున్నాన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పత్రికారంగ వ్యవస్థ ప్రజాబాధ్యతగా ఉండినప్పుడే ప్రజాస్వామ్యానికి మూలస్తంభమనే నానుడికి పత్రికా రంగం ఆదర్శమవుతుంది. - నేడు భారతీయ పత్రిక దినోత్సవం) తలగాపు వెంకటరమణ ఫ్రీలాన్స్ జర్నలిస్టు, శ్రీకాకుళం
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement