-
ఇజ్రాయెల్నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది
టెల్-అవీవ్ పర్యటన వివరాలు వెల్లడించిన డీజీపీ జేవీ రాముడు సాక్షి, హైదరాబాద్: ఇజ్రాయెల్లో ఆంధ్రప్రదేశ్కు అనువైన, అవసరమైన, నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని డీజీపీ జాస్తి వెంకటరాముడు చెప్పారు. అక్కడి టెల్-అవీవ్లో గత వారం జరిగిన అంతర్గత భద్రతపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 130 ప్రజాస్వామ్య దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారని ఆయన తెలిపారు. భారత్ తరఫున దక్షిణాది నుంచి డీజీపీ హోదాలో తనతోపాటు ఉత్తరాది నుంచి అదనపు డీజీ, ఐజీ, డీఐజీలు ముగ్గురు వచ్చారనిచెప్పారు. పోర్చుగల్, సైప్రస్, లాస్ ఏంజెల్స్, చికాగో పోలీసు చీఫ్లు, ఇంగ్లండ్ పోలీసు అధికారులు వక్తలుగా ప్రసంగించారని తెలిపారు. కొత్తగా ఏర్పడిన ఏపీ ఇజ్రాయిల్ను అనేక విషయాల్లో స్ఫూర్తిగా తీసుకోవాల్సిందేనన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, పటిష్టమైన కమ్యూనికేషన్స్ ఏర్పాటు, టెక్నాలజీ వినియోగం, ఆయుధాల సమీకరణ, వాడుతున్న ప్రొటెక్టివ్ గేర్స్ ఇవన్నీ ఇజ్రాయెల్ నుంచి ఏపీ సమీకరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. -
సబ్ డివిజన్గా తుళ్లూరు స్టేషన్
రాజధాని నేపథ్యంలో అప్గ్రేడ్ చేయాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన రాజధానిగా మారుతున్న తుళ్లూరులో శాంతిభద్రతల పరిరక్షణ, బందోబస్తు అవసరాలపై రాష్ట్ర పోలీసు విభాగం దృష్టి పెట్టింది. తుళ్లూరు పోలీసుస్టేషన్ను సబ్-డివిజన్గా అప్గ్రేడ్ చేయనున్నారు. ఇతర అవసరాలకు సంబంధించి పూర్తి ప్రతిపాదనలు పంపాల్సిందిగా గుంటూరు జోన్ ఐజీ పీవీ సునీల్కుమార్ను డీజీపీ కార్యాలయం ఆదేశించింది. గుంటూరు గ్రామీణ జిల్లాలోకి వచ్చే తుళ్లూరు పోలీసుస్టేషన్ ప్రస్తుతం అమరావతి సర్కిల్లో ఉంది. అమరావతితో పాటు సత్తెనపల్లి, అర్బన్, రూరల్, పిడుగురాళ్ల అర్బన్, రూరల్ సర్కిళ్లు సత్తెనపల్లి సబ్-డివిజన్లో ఉన్నాయి. పోలీసుస్టేషన్ స్థాయిలో ఉన్న తుళ్లూరుకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ హోదాలో ఇన్చార్జ్గా సబ్-ఇన్స్పెక్టర్ (ఎసై్స) స్థాయి అధికారి ఉంటారు. కొత్త రాజధాని ఏర్పాట్ల నేపథ్యంలో ఆ ప్రాంతానికి ముఖ్యమంత్రి మొదలు అనేక మంది ప్రముఖుల తాకిడి ఉంటుంది. దీనికోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మరోపక్క కొత్త రాజధానిలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీలను ఆకర్షించాలంటే అక్కడ శాంతిభద్రతల పరిరక్షణ అత్యంత కీలకం. ఆ ప్రాంతంలో జరుగుతున్న భారీ ఆర్థిక లావాదేవీలు నేరగాళ్లను సైతం ఆకర్షిస్తున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న డీజీపీ కార్యాలయం తక్షణ అవసరంగా తుళ్లూరును సబ్-డివిజన్గా అప్గ్రేడ్ చేసి డీఎస్పీని నియమించాలని నిర్ణయించింది. దీనికోసం ప్రస్తుతం ఉన్న సత్తెనపల్లి సబ్-డివిజన్ను పూర్తిస్థాయిలో పునర్వ్యవస్థీకరించాలని భావిస్తున్నారు. దీని పరిధిలో ఉన్న సర్కిళ్లు, పోలీసుస్టేషన్లను తుళ్లూరులో కలపాలని యోచిస్తున్నారు. ప్రతి పోలీసుస్టేషన్కు స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఎసై్సకి బదులు ఇన్స్పెక్టర్ను నియమించే ఆలోచన ఉన్నతాధికారులకు ఉంది. ఏపీ పోలీసుకు కొత్త డీఎస్పీలు శిక్షణ పూర్తి చేసుకున్న 2012 బ్యాచ్కు చెందిన 34 మంది డీఎస్పీలను ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగానికి కేటాయించారు. వీరు మంగళవారం డీజీపీ జాస్తి వెంకట రాముడుకు రిపోర్ట్ చేశారు. ఈ అధికారులకు నిబంధనలకు అనుగుణంగా పోస్టింగ్ ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. మరో వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు డీజీపీ కార్యాలయం కసరత్తులు చేస్తోంది. -
ఏపీలో 29 మంది డీఎస్పీల బదిలీ
12 మంది అధికారులకు పోస్టింగ్ ఇవ్వని వైనం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు విభాగంలో పనిచేస్తున్న 29 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ జాస్తి వెంకట రాముడు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోపణలు సహా వివిధ కారణాల నేపథ్యంలో వీరిలో 12 మందికి పోస్టింగ్ ఇవ్వని డీజీపీ హైదరాబాద్లోని తన కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. వీరిలో కొందరు స్థానికత ఆధారంగా తెలంగాణ ప్రాంతానికి చెందినవారు ఉన్నారు. -
'సీమాంధ్రులకు ఇబ్బందులు వస్తే స్పందిస్తాం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి గట్టి భద్రత ఏర్పాటు చేసినట్టు డీజీపీ జాస్తి వెంకట రాముడు తెలిపారు. చంద్రబాబు నాయుడి ప్రమాణస్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు వచ్చే అవకాశముందని తెలిపారు. హైదరాబాద్లో ఉంటున్న సీమాంధ్రులకు ఇబ్బందులు వస్తే తప్పకుండా స్పందిస్తామని చెప్పారు. ఎర్రచందనం స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇరు రాష్ట్రాల పోలీసులు పరస్పరం సహకరించుకుంటూ పనిచేయాలని అప్పుడే ఇరు రాష్ట్రాలూ అభివృద్ధి చెందుతాయని అంతకుముందు అభిప్రాయపడ్డారు. -
జాస్తి రాముడు బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక డీజీపీగా జాస్తి వెంకట రాముడు నేడు బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర పోలీసు విభాగంలోని ఆపరేషన్స్ వింగ్ డీజీపీగా పని చేస్తున్న జాస్తి వెంకట రాముడును ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) తాత్కాలిక డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం నుంచి తెలంగాణ రాష్ట్ర కార్యకలాపాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 1981 బ్యాచ్కు చెందిన జె.వి.రాముడు ప్రస్తుతం ఆపరేషన్స్ డీజీపీ హోదాలో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర డీజీపీ నియామకం అన్నది ఆయా ప్రభుత్వాల సిఫారసు మేరకు యూపీఎస్సీ సిఫారసుల ఆధారంగా జరుగుతుంది. ఈ తంతు పూర్తయ్యే వరకు ఆంధ్రప్రదేశ్కు రాముడు తాత్కాలిక డీజీపీగా వ్యవహరించనున్నారు. ఆంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఆయన నివాసంలో రాముడు ఆదివారం సాయంత్రం భేటీ అయ్యారు. సీఎంగా బాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో బందోబస్తు, భద్రతా ఏర్పాట్లతో పాటు పోలీసు విభాగంలో ఇతర కీలక పోస్టుల భర్తీపై వీరిద్దరూ చర్చించినట్లు తెలిసింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
Advertisement