-
జయలలిత డెత్ మిస్టరీ
-
జయ కేసులో వెంకయ్యకు సమన్లు?
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత మరణంపై విచారణలో భాగంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావులకు సమన్లు జారీ చేసేందుకు విచారణ కమిషన్ సిద్ధమవుతోంది. 2016 సెప్టెంబరు 22వ తేదీన అనారోగ్య కారణాలతో జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరడం, అదే ఏడాది డిసెంబర్ 5వ తేదీన కన్నుమూయడం తెలిసిందే. నాడు జయను పరామర్శించేందుకు అపోలో ఆస్పత్రికి వచ్చిన ఉపరాష్ట్రపతి వెంకయ్య, గవర్నర్ విద్యాసాగర్లను విచారించాలని కమిషన్ భావిస్తోంది. తన తరఫు లాయర్ను అనుమతించాలని జయ మేనకోడలు దీప చేసిన విజ్ఞప్తిని కమిషన్ తోసిపుచ్చింది. దీంతో ఆమె బుధవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జయ ఆస్పత్రికి వెళ్లేందుకు నిరాకరించారా?
సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం విషయమై ఆమె నెచ్చెలి శశికళ పలు కీలకమైన విషయాలు వెల్లడించారు. 2016 సెప్టెంబర్ 22న జయలలిత వాష్రూమ్లో కుప్పకూలారని, అయినా, ఆస్పత్రికి వెళ్లేందుకు ఆమె నిరాకరించారని శశికళ తెలిపారు. అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతుండగా.. నాలుగుసార్లు వీడియో చిత్రీకరించారని, ఆస్పత్రిలో ఆమెను పన్నీర్ సెల్వం, తంబిదురై వంటి అన్నాడీఎంకే సీనియర్ నేతలు కలిశారని చెప్పారు. జయలలిత అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరుపుతున్న రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని విచారణ కమిషన్కు ఆమె ఈ మేరకు వివరాలు తెలిపారు. అయితే, ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో ఆమెను తాము కలువలేదని, చూడలేదని పన్నీర్ సెల్వం, తంబిదురైతోపాటు అన్నాడీఎంకే సీనియర్ నేతలు పేర్కొంటున్న సంగతి తెలిసిందే. జయలలిత మృతికి దారితీసిన పరిస్థితులు, ఆమెకు అందజేసిన చికిత్స తదితర అంశాల్లో అనుమానాల నివృత్తి కోసం హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఏ అరుముఘస్వామి నేతృత్వంలో దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అవినీతి కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న శశికళ.. జయ మృతికి దారితీసిన పరిస్థితులను రిటైర్డ్ జడ్జికి వివరించారు. 2016 సెప్టెంబర్ 22న జయలలిత అనారోగ్యానికి గురయ్యారని, అదే రోజున ఆమెను ఆస్పత్రిలో చేర్చామని శశికళ చెప్పారు. అయితే, ఆస్పత్రికి తీసుకెళుతుండగా.. జయలలిత స్పృహలోకి వచ్చారని, తనను ఎక్కడికి తీసుకెళుతున్నారని ఆమె ప్రశ్నించారని తెలిపారు. పోయెస్ గార్డెన్లో ఉన్న తన నివాసంలోని మొదటి అంతస్తు వాష్రూమ్లో జయలలిత సృహకోల్పోయి పడిపోయారని చెప్పారు. ‘ఆమె వెంటనే నన్ను సాయానికి పిలిచారు. నేను వెళ్లి ఆస్పత్రికి వెళ్దామని సూచించాను. కానీ ఆమె వద్దన్నారు. అంతలో ఆమె స్పృహ కోల్పోవడంతో నేనే అంబులెన్స్ కోసం ఫోన్ చేశాను’ అని శశికళ వివరించారు. -
అమ్మ కోసం ఒకే ఒక్కడు!
సాక్షి, చెన్నై : అమ్మ మరణంపై నిజాలు తేల్చేందుకు తమిళనాడు ప్రభుత్వం కమిటీ ఏర్పాటుకు అంగీకరించిన విషయం తెలిసిందే. విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ను పన్నీర్ వర్గం లేవనెత్తగా.. దానికి పళని ఓకే చెప్పటంతోనే ఆ రెండు వర్గాలు ఒకయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ ఏ ఆర్ముగస్వామి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసినట్లు శుక్రవారం ప్రకటించింది. జయ ఆస్పత్రిలో చేరేందుకు దారితీసిన పరిస్థితుల దగ్గరి నుంచి ప్రతీ విషయాన్ని ఈ మాజీ న్యాయమూర్తి ఒక్కడిగానే దర్యాప్తు చేయనుందన్న మాట. అయితే కీలకమైన ఈ అంశంలో ఆయన ఒక్కడే ఏం చేయబోతున్నారన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు ప్రతిపక్ష డీఎంకే.. అమ్మ మృతి వ్యహారంలో అనుమానాలు నివృత్తి చేయటంపై ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. అయితే తాను మాత్రం విచారణను చాలా పారదర్శకంగా చేపడతానని అర్ముగస్వామి చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మూడు నెలలో ఆయన తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. అమ్మ అనారోగ్యం, ఆస్పత్రిలో 75 రోజుల చికిత్సకు సంబంధించిన పూర్తి విషయాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. -
జయలలిత డెత్ మిస్టరీలో మరో ట్విస్ట్
చెన్నై: తమిళనాడులో అధికార అన్నాడీఎంకేలో సంక్షోభం కొనసాగుతుండగా శశికళ మేనల్లుడు జయానంద్ దివాకరన్ మరో బాంబు పేల్చారు. జయలలిత చివరి రోజులకు సంబంధించిన వివరాలు బయటపెడతానని ప్రకటించారు. అపోలో ఆస్పత్రిలో జయలలిత, శశికళకు జరిగిన సంభాషణ వివరాలు, ఫొటోలు వెల్లడిచేస్తానని హెచ్చరించారు. జయలలితను శశికళ కుటుంబం పొట్టన పెట్టుకుందని పన్నీర్ సెల్వం వర్గం ఆరోపించడం పట్ల దివాకరన్ ఆవేదన వ్యక్తం చేశారు. నిజం నిప్పులాంటని, అది ఏనాటికైనా బయటకు వస్తుందని తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ‘ఆస్పత్రిలో ఉండగా జయలలిత ఫొటోలు శశికళ ఎందుకు బయటపెట్టలేదని అడుగుతున్నారు. పచ్చ రంగు గౌన్ లో ఆస్పత్రిలో దీనంగా ఉన్న అమ్మను ఆమెను ప్రత్యర్థులకు చూపించడం ఇష్టంలేకే శశికళ ఈ నిర్ణయం తీసుకున్నారు. చనిపోయే వరకు ‘అమ్మ’ సింహంలా బతికింది. ఈ ఇమేజ్ కాపాడేందుకు ప్రయత్నించాం. కానీ పన్నీర్ సెల్వం అమ్మ శవపేటిక నమూనాతో ఓట్లు అడుక్కున్నారు. నిజం చాలా బలమైంది. అమ్మ, చిన్నమ్మ మాట్లాడుకున్న వీడియోలు ఏదో ఒక రోజు బయటకు వస్తాయి. పీహెచ్ పాండియన్, మనోజ్ కె పాండియన్ లను అప్పుడు మనం ఏం చేయాల’ని దివాకరన్ ప్రశ్నించారు. తన వర్గాన్ని అన్నాడీఎంకేలో విలీనం చేసేందుకు పార్టీ నుంచి శశికళ కుటుంబ సభ్యులను బహిష్కరించాలని పన్నీర్ సెల్వం షరతు పెట్టిన నేపథ్యంలో సంక్షోభం మరింత ముదిరింది. జయలలిత మృతిపై విచారణ జరిపించాలని ఆయన మరో షరతు విధించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్షాపై కోడ్ ఉల్లంఘన కేసు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement