-
కష్టాల కడలిలో కాంగ్రెస్
న్యూఢిల్లీ: కాంగ్రెస్కు మళ్లీ చావుదెబ్బ! మరో రెండు రాష్ట్రాలు ఆ పార్టీ చేజారాయి. జార్ఖండ్, కశ్మీర్ ఎన్నికల్లో ఓటమితో కష్టాలు పెరిగాయి. గత లోక్సభ ఎన్నికల నుంచి వరుస పరాజయాలే ఎదురవుతున్న నేపథ్యంలో పార్టీలో అంతర్మథనం మొదలైంది. లోక్సభ 44 మంది ఎంపీలకే పరిమితమైన కాంగ్రెస్.. ఆ తర్వాత మహారాష్ర్ట, హరియాణా రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. మోదీ హవాలో కొట్టుకుపోయింది. తాజాగా జార్ఖండ్లోనూ అదే పునరావృతమైంది. జేడీయూ, ఆర్జేడీతో కాంగ్రెస్ చేతులు కలిపినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఈ కూటమి పదిలోపు సీట్లకే పరిమితం కావడం ఊహించని పరిణామం. జార్ఖండ్ ప్రభుత్వంలో జేఎంఎంతో కలిసి భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఆర్జేడీలు ఎన్నికల వేళ వేరుగా పోటీచేసినా పెద్దగా ప్రయోజనం దక్కలేదు. ఇక కశ్మీర్లో ఎన్సీతో కలిసి ఆరేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్కు ఈ ఫలితాలు షాక్నిచ్చాయి. బీజేపీ అనూహ్య విజయాలు సాధించి రాష్ర్టంలో రెండో పెద్ద పార్టీగా మారడం ఆ పార్టీకి శరాఘాతమే. తన ఓటమి కంటే కాషాయ పార్టీ బలపడటమే కాంగ్రెస్ను ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తోంది. బీజేపీని అడ్డుకునేందుకు పీడీపీకి మద్దతిచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు ఈ దిశగా ప్రకటన లు కూడా గుప్పిస్తున్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు ఏకం కావాలని పార్టీ ప్రతినిధి అజయ్కుమార్ పిలుపునిచ్చారు. -
కార్యకర్తల కష్టానికి ప్రతిఫలం: మోదీ
న్యూఢిల్లీ: బీజేపీ కార్యకర్తల కష్టానికి, అంకితభావానికి జార్ఖండ్, కశ్మీర్ ఎన్నికల ఫలితాలు ప్రతిఫలమని ప్రధాని మోదీ ట్వీటర్లో పేర్కొన్నారు. ‘రెండు రాష్ట్రాల్లోని కార్యకర్తలకు అభినందనలు. కశ్మీర్లో నమోదైన రికార్డు పోలింగ్ ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకాన్ని చాటింది. బీజేపీపై విశ్వాసాన్ని ఉంచినందుకు కృతజ్ఞతలు. జార్ఖండ్ ప్రజలు స్థిరత్వానికే పట్టంకట్టారు. వారికి కూడా కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. మోదీకి చంద్రబాబు అభినందన సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినందుకు మోదీని ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ ఫలితాలను పరిశీలిస్తే ప్రజలు అభివృద్ధికి ఓటేశారని అర్థమవుతోందని లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. -
రసకందాయంలో కశ్మీర్ రాజకీయం!
ప్రజల ఆకాంక్షల మేరకే నడుస్తామన్న పీడీపీ ‘కింగ్ మేకర్’గా నిలిచిన బీజేపీ శ్రీనగర్: కశ్మీర్లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించడం, 25 సీట్లతో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ ‘కింగ్మేకర్’గా మారడంతో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఎన్సీ, కాంగ్రెస్ సైతం పొత్తులకు సుముఖంగా ఉండటంతో పరిస్థితి రసకందాయంలో పడింది. ప్రభుత్వ ఏర్పాటుపై తొందరపడం: ముఫ్తీ ప్రభుత్వ ఏర్పాటుపై తొందరపడబోమని, సంఖ్యాబలాన్ని కూడగట్టి హడావుడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన లేదని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ వెల్లడించారు. కశ్మీరీల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని అందుబాటులోని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. పీడీపీకి కాంగ్రెస్ నేత గులామ్ నబీ ఆజాద్ బేషరతు మద్దతు ప్రతిపాదన చేయడంపై ప్రశ్నించగా 2002 నుంచి 2008 నాటి పీడీపీ-కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రాష్ర్ట ప్రజలకు మంచి చేసిందని ముఫ్తీ పేర్కొన్నారు. మూడు ప్రత్యామ్నాయాలు: అమిత్ షా సాక్షి,న్యూఢిల్లీ: కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి తమ వద్ద మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని బీజేపీ చీఫ్ అమిత్ షా తెలిపారు. ‘ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, బయటి నుంచి ఎవరికైనా మద్దతు ఇవ్వడం, ఎవరి ప్రభుత్వంలోనైనా కలవడం అనే ప్రత్యామ్నాయాలు మాకు ఉన్నాయి’’ అని చెప్పారు. ఎన్సీ, ఇతరులతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం (ఇందుకు ప్రతిఫలంగా ఒమర్కు రాజ్యసభ సీటు ఇవ్వడం) లేదా పీడీపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం పదవిని చెరో మూడేళ్లు పంచుకోవడం అనే అవకాశాలను బీజేపీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. పీడీపీ కోరితే మద్దతు: ఒమర్ పీడీపీకి మద్దతు అంశాన్ని తోసిపుచ్చడంలేదని అదే సమయంలో వ్యతిరేకించడమూ లేదని ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా తెలిపారు. అయితే ప్రభుత్వ ఏర్పాటులో పీడీపీ మద్దతు తమ కోరితే పరిశీలిస్తామన్నారు. బీజేపీతో పొత్తుకు సిద్ధంగా లేమన్నారు. -
ఓటమి పాలైన 15 మంది మంత్రులు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో మంత్రుల సైతం కుదేలయ్యారు. జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో ఏకంగా 15 మంది మంత్రులు ఓటమి పాలైయ్యారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి అధికశాతంలో ఎనిమిది మంది మంత్రులు ఓటమి చెందగా, ఎన్సీ(నేషనల్ కాన్పరెన్స్ ) నుంచి ఆరుగురు పరాజయం పాలయ్యారు. డెమోక్రటిక్ పార్టీ నేషనలిస్ట్ పార్టీ నుంచి కూడా ఒక మంత్రి ఈసారి ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అతికష్టమ్మీద పరువు దక్కించుకున్నారు. సోనావార్, బీర్వా నియోజకవర్గాల నుంచి బరిలో దిగిన ఒమర్ అతి కష్టం మీద బయటపడ్డారు. సోనావార్ నియోజక వర్గంలో 4,700 ఓట్లతో ఓటమి పాలైన ఒమర్.. బీర్వాలో కూడా ఓటమి పాలైనట్లు వార్తలు వచ్చాయి. అయితే 1,000 మార్జిన్ ఓట్లతో ఒమర్ బీర్వాలో విజయాన్ని కైవశం చేసుకున్నారు. ఓటమి పాలైన మంత్రుల్లో డిప్యూటీ చీఫ్ మినిష్టర్- తారా చంద్(ఎన్సీ), ఆరోగ్య శాఖమంత్రి- తాజ్ మోహిద్దీన్(ఎన్సీ), పర్యాటక శాఖ మంత్రి- గులామ్ అహ్మద్ మిర్(కాంగ్రెస్), అబ్దుల్ రహీమ్ రాథే(ఆర్థిక శాఖ మంత్రి) తదితర ఉద్దండులు ఓటమి చెందారు. -
'ప్రభుత్వ ఏర్పాటుకు టైమ్ పడుతుంది'
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు తొందరపడడం లేదని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తామని ఆమె చెప్పారు. జమ్మూకశ్మీర్ ప్రజలకు ఏది అత్యుత్తమో అదే చేస్తామన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సమయం పడుతుందని తెలిపారు. మంగళవారం వెల్లడైన జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ 28 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ సంఖ్య 44.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
బెంగాల్ గవర్నర్పై ఆరోపణలు: విచారణ జరపాలన్న మిసా భారతి
డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
Pooja Hegde: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ
వివాదాస్పద భూభాగాలతో రూ.100 నోట్ ముద్రించాలని నిర్ణయం
ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన
నీ ముఖానికి డ్యాన్సా? ట్రోలింగ్పై స్పందించిన నటి
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- నిజ్జర్ హత్య కేసు.. ముగ్గురు భారతీయుల అరెస్ట్
Advertisement