-
కరాచీ విమానాశ్రయంపై తాలిబన్ల దాడి
తిప్పికొట్టిన పాక్ భద్రతా బలగాలు 10 మంది ఉగ్రవాదులు సహామొత్తం 29 మంది మృతి 13 గంటలు సాగిన కాల్పులు కరాచీ: పాకిస్థాన్ ఆర్థిక రాజధాని కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంపై తాలిబన్ ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఆదివారం ఆర్ధరాత్రి సమయంలో ప్రారంభమైన ఈ దాడి సోమవారం మధ్యాహ్నం వరకు సుమారు 13 గంటలపాటు సాగింది. భద్రతాదళాల దుస్తుల్లో వచ్చిన మిలిటెంట్లు విచక్షణారహితంగా కాల్పులు సాగించారు. పాక్భద్రతాదళాలు ఈ దాడిని తిప్పికొట్టాయి. ఇరుపక్షాలమధ్య జరిగిన భీకరపోరులో మొత్తం 29 మంది మృతిచెందారు. ఇందులో 10 మందివరకు ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం. నిషేధిత తెహ్రికే తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాద సంస్థ ఈ దాడికి తామే పాల్పడినట్టు ప్రకటించింది. ప్రస్తుతం విమానాశ్రయం పూర్తిగా తమ ఆధీనంలోకి వచ్చిందని, ఉగ్రవాదులను మట్టుపెట్టామని పాక్ పారామిలిటరీ రేంజర్స్ ప్రతినిధి సిబ్తియాన్ రిజ్వీ మీడియాకు తెలిపారు. 17 గంటల అనంతరం విమానాశ్రయాన్ని తిరిగి ప్రయాణికులకోసం తెరిచారు. పదిమంది ఉగ్రవాదులు రెండు బృందాలుగా విడిపోయి ఈ దాడి చేశారని ఆయన వివరించారు. ఆర్మీ, పారామిలిటరీ రేంజర్లు, పోలీసులు, విమానాశ్రయ భద్రతా సిబ్బంది కలిసి ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టినట్టు ఆయన చెప్పారు. తుపాకీ గుళ్ల గాయాలను సెకండ్లలోనే మానిపించే ఆధునిక పరికరాలు, మందులను ఉగ్రవాదులు తమ వెంట తెచ్చుకున్నారని తెలిపారు. విమానాశ్రయాన్ని ఆక్రమించుకునే ఉద్దేశంతో వారు అన్ని ఏర్పాట్లతో వచ్చినట్టు తెలుస్తోందని అన్నారు. గ్రెనేడ్లు, రాకెట్ లాంచర్లతో ఉగ్రవాదులు దాడిచేశారని ఆయన వివరించారు. ఈ దాడిలో 11 మంది విమానాశ్రయ భద్రతా సిబ్బంది, ఇద్దరు రేంజర్లు, ఓ పోలీసు అధికారి, నలుగురు సిబ్బంది మృతిచెందారని అధికారులు తెలిపారు. ఈ దాడిలో ప్రయాణికులకు ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. ఇదిలా ఉండగా, దేశంలో పౌరవిమాన నెట్వర్క్ను కుప్పకూల్చడానికి ఉగ్రవాదులు కుట్రపన్నినట్టు అధికారులు ప్రధాని నవాజ్షరీఫ్కు అందించిన నివేదికలో పేర్కొన్నారు. విమానాశ్రయంలో ఉన్న విమానాలన్నిటినీ పేల్చివేయడానికి ఉగ్రవాదులు వ్యూహం పన్నారని, అయితే భద్రతాదళాలు వారి ప్రయత్నాలను భగ్నం చేశాయని ఆ నివేదికలో వివరించారు. విధ్వంసమే లక్ష్యం...ఉగ్రవాదులు ఆహారం, పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రిని తమ వెంట తెచ్చుకున్నారు. పాక్ దళాలు జరిపిన ఎదురుదాడిలో ఏడుగురు ఉగ్రవాదులు మృతిచెందగా, మరో ముగ్గురు ఆత్మాహుతికోసం ఉపయోగించే బెల్టులను పేల్చడంద్వారా మృతిచెందినట్టు తెలుస్తోంది. విమానాలను హైజాక్ చేయడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని తాలిబన్ల ప్రతినిధి షహీద్ పేర్కొన్నాడు. ఈ దాడి తమ సత్తాకు చిన్న ఉదాహరణమాత్రమేనని, ముందు ముందు మరిన్ని దాడులకు పాల్పడతామని షహీద్ హెచ్చరించాడు. కాగా, ఉగ్రవాదులు ప్రధాన టెర్మినల్వద్దకు వెళ్లిఉంటే భారీ ప్రాణనష్టం సంభవించి ఉండేదని, ప్రయాణికులను బందీలుగా పట్టుకునే అవకాశాలుండేవని అధికారులు అభిప్రాయపడ్డారు. విమానాశ్రయంలోని కొంత భాగం మంటలకు కాలిపోయింది. భారత్లో విమానాశ్రయాలకు గట్టి భద్రత న్యూఢిల్లీ: కరాచీు విమానాశ్రయంపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సహా దేశంలోని 59 ప్రధాన విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఈ విమానాశ్రయాల్లో సుమారు 23వేలమంది సీఐఎస్ఎఫ్ బలగాలను భద్రతకోసం వినియోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కరాచీ దాడిని భారత్ ఖండించింది. -
కరాచి ఎయిర్పోర్టుపై ఉగ్రవాదుల దాడి
పాకిస్థాన్: కరాచి జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుపై ఉగ్రవాదుల దాడి చేసిన ఘటనలో 11 మంది మృతి చెందారు. ఆదివారం రాత్రి పాత విమానాశ్రయం భవనాన్ని చుట్టుముట్టిన ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఎయిర్ భద్రతా సిబ్బంది(ఏఎస్ఎఫ్) వేషాల్లో వచ్చిన 10 మంది తీవ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు అధికారులు తెలిపారు. అయితే ఏ విమానాన్ని ధ్వంసం చేయలేదని వెల్లడించారు. ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. భద్రతా సిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు తీవ్రవాదులు మృతి చెందారు. -
జిన్నా విమానాశ్రయంపై ఉగ్రదాడి
నలుగురు జవాన్లు, ఒక ఉగ్రవాది మృతి కరాచీ: పాకిస్థాన్లో తరచూ బాంబుదాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులు ఏకంగా ఆ దేశ ఆర్థిక రాజధాని అయిన కరాచీ పట్టణంలోని జిన్నా విమానాశ్రయంపైనే దాడికి తెగబడ్డారు. ఆదివారం రాత్రి భారీగా ఆయుధాలతో వచ్చిన ఐదు నుంచి ఎనిమిది మంది మిలిటెంట్లు కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని పాత టెర్మినల్ వద్ద హ్యాండ్ గ్రనేడ్ విసిరి దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో విమానాశ్రయ భద్రతా సిబ్బంది చనిపోగా, ఓ ఉగ్రవాదిని బలగాలు కాల్చిచంపాయి. విమానాశ్రయంలోని పాత టెర్మినల్ వద్ద గల ఫోకర్ బిల్డింగ్లో నక్కిన ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు హోరాహోరి ఎదురుకాల్పులు జరుగుతున్నాయని స్థానిక మీడియా పేర్కొంది. విమానాశ్రయన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయని, సిబ్బందిని క్షేమంగా తరలిస్తున్నారని తెలిపింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement