-
బెంగాలీ కవికి జ్ఞాన్పీఠ్
శంఖ ఘోష్కు పురస్కారం కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించిన ఘోష్ న్యూఢిల్లీ: ప్రసిద్ధ బెంగాలీ కవి, విమర్శకుడు శంఖ ఘోష్కు ప్రతిష్టాత్మక ‘జ్ఞాన్పీఠ్’ పురస్కారం దక్కింది. శుక్రవారం ఇక్కడ జరిగిన సమావేశంలో 2016 సంవత్సరానికి గాను ఘోష్ పేరును ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు ప్రముఖ రచయిత నమ్వార్ సింగ్ నేతృత్వంలోని ‘జ్ఞాన్పీఠ్ ఎంపిక మండలి’ ప్రకటించింది. గతేడాది గుజరాతీ రచయిత రఘువీర్ చౌదరికి జ్ఞాన్పీఠ్ దక్కింది. ఈ అవార్డు కింద సరస్వతి దేవి కాంస్య విగ్రహంతో పాటు నగదు బహుమతి అందిస్తారు. ఆధునిక బెంగాలీ కవి, విద్యావేత్త అయిన శంఖ ఘోష్ 1932లో జన్మించారు. ప్రయోగాత్మక కవిత్వ రూపాలతో అరుదైన శైలిలో కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించారు. నోబెల్ సాహిత్య పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ టాగూర్ రచనలపై ఆయనకు మంచి పట్టుంది. ఆయన కవిత్వం ఆద్యంతం సామాజిక స్పృహ, సందేశాలతో సాగుతుంది. ఎక్కడా విమర్శలకు తావు లేకుండా సున్నితంగా అక్షరాలు పేర్చడంలో ఘోష్ దిట్ట. ఆయన ప్రతిభావంతమైన కవితా పంక్తుల్లో సంఘంలోని రుగ్మతలపై ఆవేదన ప్రతిధ్వనిస్తుంది. ఎన్నో అపురూపాలు... అవార్డులు... 52వ జ్ఞాన్పీఠ్ పురస్కారం అందుకోనున్న శంఖ ఘోష్ కలం నుంచి ఎన్నో అపురూప కవితలు జాలువారాయి. ‘అదిమ్ లతాగుల్మోమే, ముర్ఖా బారో.. సమాజిక్ నే, కబీర్ అభిప్రాయ్, ముఖ్ దేఖే జే బిగ్యాపనే, బాబరర్ ప్రార్థనా’ వంటివి ఘోష్ సృజనాత్మక కవితా సృష్టికి మచ్చుతునకలు. ముఖ్యంగా ఆయన రచించిన ‘డింగులి రాత్గులి, నిహితా పటాల్చయా’లు ఆధునిక కవితా స్రవంతికి స్ఫూర్తిగా నిలిచాయి. ఘోష్ రచనలు హిందీ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, మళయాళం తదితర భారతీయ భాషలతో పాటు విదేశీ భాషాల్లోకీ అనువాదమయ్యాయి. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు నర్సింగ్దాస్ పురస్కార్, సరస్వతి సమ్మాన్, రవీంద్ర పురస్కార్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులెన్నో ఘోష్ అందుకున్నారు. -
కన్నడ అంటే కువెంపు
కస్తూరి పరిమళం ‘కువెంపు’ పేరుతో ప్రసిద్ధులైన కుప్పళి వెంకటప్పగౌడ పుట్టప్ప ఆధునిక కన్నడ సాహిత్యంలో ఎవరెస్టు శిఖరం లాంటి వారు. కవితలు, ఖండకావ్యాలు, మహాకావ్యం, నాటకం, నవల, కథ, బాల సాహిత్యం, విమర్శ, జీవితచరిత్రలు, స్వీయచరిత్ర- ఇలా సాహిత్యంలోని దాదాపు అన్ని ప్రక్రియల్లోనూ రచనా వ్యాసంగం చేసిన బహుముఖ ప్రతిభాశాలి ఆయన. కేంద్ర సాహిత్య అకాదెమీ బహుమతి పొందిన తొలి కన్నడ రచయితగా, జ్ఞానపీఠ పురస్కారం స్వీకరించిన ప్రప్రథమ కన్నడ సాహిత్యవేత్తగా కువెంపు ఖ్యాతి అసామాన్యం. కువెంపు చిక్కమగళూరు జిల్లా కొప్ప తాలూకాలోని హిరేకూడిగే గ్రామంలో 1904 డిసెంబర్ 29న జన్మించారు. ఆయన బాల్యం తండ్రిగారి వూరైన శివమొగ్గ జిల్లా కుప్పళిలో గడిచింది. ఉన్నత విద్యాభ్యాసం మైసూరు మహారాజా కాలేజీలో సాగింది. 1929లో ఎం.ఎ. కన్నడ మొదటి వరుసలో ఉత్తీర్ణులై అదే కాలేజీలో అదే సంవత్సరం కన్నడ ఉపన్యాసకులుగా చేరారు. 1946-55 మధ్య కన్నడ విభాగాధ్యక్షులుగా ప్రశంసనీయమైన కృషి చేసి, 1955లో ఆ కళాశాల ప్రిన్సి పాల్గా, 1956-60 మధ్య మైసూరు విశ్వవిద్యాలయ కులపతిగా విధి నిర్వహణ చే శారు. తన జీవితకాలంలో మొత్తం 76 పుస్తకాలు రాసి కన్నడ భాషకు నేడు పర్యాయపదంగా పిలువబడుతున్న కువెంపుకు విద్యార్థి దశలో ఆంగ్లమంటే పంచప్రాణాలు. నూనూగు మీసాల నూత్న యవ్వనంలో ఆయన ‘బిగినర్స్ మ్యూజ్’ (1922) అనే ఆంగ్ల కవితా సంకలనం ప్రచురించారు. ఆ ఇంగ్లిష్ కవితల రాతప్రతిని చూసి ఫరవాలేదని తలవూపుతూ మీరు మీ మాతృభాషలో రచనలు చేస్తే మీరునూ గొప్పగా రాణించగలరని ప్రసిద్ధ ఆంగ్ల రచయిత జేమ్స్హెచ్. కజిన్సు సలహా ఇచ్చారు. ఈ మహానుభావుడే మన దువ్వూరి రామిరెడ్డి ఇంగ్లిష్ కవితల్ని మెచ్చుకొంటూ మాతృభాషలలో రచనచేయమని ఆయనకు సలహా ఇచ్చారు. కువెంపు 1973లో ‘ఎలైన్ హార్ట్’ అనే మరో ఇంగ్లిష్ కవితా సంకలనం ప్రచురించినా కన్నడ సాహిత్యానికే అంకితమయ్యారు. రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన కువెంపు శివమొగ్గ జిల్లా కుప్పళి ప్రాంత ప్రకృతి సౌందర్యానికి సమ్మోహితులయ్యారు. ఆయన ఏకాంతయోగి, మౌని, తపస్వీ, ప్రకృతిలోని కొండలు, గుట్టలు, సెలయేర్లు, నదులు, చెట్టూ చేమా, పక్షులు వీటి మధ్య తన్ను తాను మరిచిపోయేవారు. ప్రకృతి ఒడిలో పెరిగి, జీవించి, పక్షిలా పాడుతూ నిర్మల చింతన ధ్యానాల్లో మునిగితేలే వర్డ్స్ వర్త్ను తన ఆదర్శంగా స్వీకరించిన కువెంపు అంతే లలితంగా జీవించారు. కువెంపు శాశ్వత కీర్తికి మూలం ఆయన రచించిన ‘శ్రీరామాయణ దర్శనం’ మహాకావ్యం. ఈ బృహత్ కావ్యం రెండు సంపుటాలుగా (1949, 1959) వెలువడింది. ఇందులో పరాత్పరుడైన శ్రీరాముడి ‘లోక తీలా దర్శనం’తో పాటు మంధర, ఊర్మిళ, కుంభకర్ణుడు, వాలి మొదలైన పాత్రల చిత్రణ మనోహరంగా సాగింది. ‘శ్రీరామాయణ దర్శనం’లో ఆయన సామాన్య పాత్రల్ని కూడా తెరమీదకి తెచ్చి వాళ్లకు గుర్తింపు, సహానుభూతి సంపాదించి పెట్టారు. కువెంపు ‘కానూరు హెగ్గడితి’ (కానూరురెడ్డిసాని), ‘మలెగళల్లి మదుమగళు’ (కొండల్లో పెళ్లికూతురు) అనే రెండు పెద్ద నవలల్ని రాశారు. ఈ రెండు నవలల్లో తాను పుట్టిపెరిగిన మలనాడు ప్రాంతంలోని ప్రజా జీవితాన్ని సహజ నేపథ్యంలో చిత్రించారు. ఇంగ్లిష్ విద్యావిధానం వల్ల అన్ని వర్గాల ప్రజలకు చదువు సంధ్యలు చేరువయ్యి మేలు చేశాయని చెప్పారు. మలనాడు ప్రాంత పల్లీయుల జీవితాల్లో స్వాతంత్య్రానంతరం వచ్చిన కొత్త మార్పుల్ని, సామాన్య జనుల మేలైన బతుకుల్ని చక్కగా చిత్రీకరించారు. కువెంపు (1904-1994) భారతీయ సాహిత్యానికి తన జీవితాన్ని ధారపోయడమే కాకుండా పూర్ణచంద్ర తేజస్వి వంటి గొప్ప కథకుడిని కని, తన పరంపరకు వారసుడిగా చేసి వెళ్లారు. - ఘట్టమరాజు కువెంపు సాహిత్యం-జాతీయ సదస్సు కువెంపు ప్రతిష్ఠాన, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, కన్నడ విశ్వవిద్యాలయంల ఆధ్వర్యంలో ‘జాతీయకవి కువెంపు జీవితం- రచనలు’ అనే అంశంపై జాతీయ సదస్సు అక్టోబర్ 18, 19 తేదీలలో హైదరాబాద్ తెలుగు యూనివ ర్సిటీలో జరగనుంది. ఎల్లూరి శివారెడ్డి, ఘట్టమరాజు, వెలుదండ నిత్యానంద రావు, చంద్రశేఖర ఎన్.బెట్టహళ్లి, వాడ్రేవు చినవీరభద్రుడు, ఎన్.గోపి తదితరులు పాల్గొంటారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement