-
మామా.. ఇంటికో ఉద్యోగం అటకెక్కినట్టేగా!
అమరావతి, కైకలూరు : అధికారంలోకి రాగానే ఇంటికో ఉద్యోగం ఇస్తాం.. లేదంటే ఒక్కో నిరుద్యోగికి నెలకు రూ.2వేల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తాం.. ఎన్నికల సమయంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నమాటలివి. తిరిగి ఎన్నికల దగ్గరపడటం, దగాపడ్డా నిరుద్యోగ యువత ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్కు గోడు చెప్పుకోవడంతో నాలుగేళ్లకు ఎన్నికల హామీ గుర్తొంచింది. చేసేది లేక ఆంక్షల కత్తితో హడావుడిగా నిరుద్యోగ భృతిని ప్రభుత్వం ప్రకటించింది. తీరా రూ.2వేలు భృతి కాస్తా రూ.1000కి దిగజారింది. ఇక ఎన్నికల ప్రణాళికలో చెప్పకుండా పది, ఇంటర్ చదివిన విద్యార్థులకు భృతి లేదంటున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత నిస్తేజంగా చూస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో సాయంత్రం అయ్యిందంటే చాలు ఏ గ్రామ రచ్చబండపై చూసిన ఇదే చర్చ. దీనిపై ఓ నలుగురు గ్రామస్తులు మధ్య సాగిన సంభాషణ ఇది.. అప్పలస్వామి : అన్నాలైనాయా బద్రయ్య మామ? అత్తకు నలత చేసిందంటగా.. పట్నం ఆసుపత్రికి తీసుకెళ్లలేదా..? బద్రయ్య : ఏం.. చెప్పేది అల్లుడా.. (కండువాతో ముఖం తుడుచుకుంటూ) అతి కష్టం మీద అప్పు చేసి కూతురిని ఓ అయ్య చేతిలో పెట్టా.. కొడుకుని చదివించిన ఉద్యోగం రాలేదు.. మీ అత్తా నేను, రెక్కలు ముక్కలు చేసుకుంటే గాని అప్పులు తీరవు. పగోడికి కూడా వద్దురా బాబు.. ఈ కట్టాలు.. స్వామి :అదేంటి మామ.. మొన్న ఎన్నికల్లో చదువుకున్న కుర్రోళ్లకు నెలకు రెండేలు ఇత్తానని చంద్రబాబు చెప్పుడుగా.. ఆ లెక్కన మీ వోడుకి నాలుగేళ్లులో మొత్తం 98 వేలు రావాలి కదా.. బద్రయ్య : ఓరి నా పిచ్చినా అల్లుడా.. లేని నదిపై వంతెన కట్టిస్తాననేవాడేరా.. ఈ రోజుల్లో పెద్ద రాజకీయ నాయకుడు. ఎన్నికల ముందు బాబుగారేమన్నారు.. ఉద్యోగం లేకపోతే ఒక్కొక్కలికి రెండేసి వేలు బ్యాంకుల్లో వేసేత్తానన్నారు. ఇప్పుడేమో పొలం ఎక్కువుంటే ఇవ్వరంటా.. అందునా 35 సంవత్సరాలు దాటితే కుదరదంటా.. మరి ఎన్నికలప్పుడు ఈ షరతులు గుర్తుకు రాలేదా..! స్వామి : అది నిజమేగాని మామ.. ఆ చెరువు గట్టు నుంచి హడావుడిగా వస్తుంది మన ఊరు ప్రసాదం పంతులుగారబ్బాయి రవి కదా..బద్రయ్య : అవునల్లుడు.. అతను పాలిటెక్నిక్ వరకూ చదివినట్లున్నాడు.. ఓ సారి ఇక్కడకు రమ్మను.. స్వామి : ఓ.. రవిబాబు.. ఉరుకులు పరుగుల మీద వెళుతున్నాం.. ఓ సారి ఇటురా.. బద్రయ్య మామా పిలుస్తున్నాడు..రవి : (వస్తూ.. వస్తూనే..) ఊరు పెద్దలంతా రచ్చబండపై పెద్ద మీటింగే పెట్టారే.. మాన గుడిలో నైవేద్యం సరుకులకు వెళుతున్నా.. చెప్పండి ఏంటీ పని? బద్రయ్య : కాస్తంత కూచోవయ్యా.. రవిబాబు.. పేపర్లో ఈ రోజు నిరుద్యోగ భృతి కింద డబ్బులిస్తారని రాశారు.. అదెంటో చెప్పు.. రవి : అహా.. అదా విషయం.. చెబుతాను వినండి.. ఈ రోజుల్లో సదువుకున్నోడికన్నా.. సంతలో వ్యాపారం చేసేవాడే నయమనిపిస్తోంది. నిరుద్యోగులందరికి నెలకు రూ.2000 అని ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు ఇప్పుడు రూ.1000 ఇస్తామంటున్నారు. దీనికి తోడు 2.50 ఎకరాలు పొలం ఉండకూదంటా. నాలుగు చక్రాలు వాహనం ఉన్నా రాదంటా. ఇక పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ చదివినోళ్లకు ఇవ్వరంటా. ఎన్నికల మ్యానిఫేస్టోలో ఇవన్ని ఎందుకు పెట్టలేదో ఆ పెరుమాళ్లకే ఎరుక. అందరికి అర్థమయ్యిందా.. ఏసురాజు : (చుట్ట వెలిగిస్తూ).. రవి బాబు.. నీ మాటకు అడ్డు వస్తున్నానని ఏం అనుకోకూ.. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అనుభవించి, ఎన్నికల దగ్గర పడుతుంటేనే వీళ్లకు హామీలు గుర్తుకొస్తాయా.. నాలుగేళ్లుగా నెలకు రెండు వేలు చొప్పున మీకు 96 వేలు రావాలి కదా.. వాటి సంగతేంటి.. రవి : మంచి ప్రశ్నే అడిగావు ఏసయ్య.. మళ్లీ మన ఓట్లు కావాలి కదా మరి. హామీలన్ని ఎన్నికల వేళ గుర్తుకు వస్తాయి. ప్రైవేటు ఉద్యోగాలు చేసిన యువకులకు భృతి ఇవ్వరంటా.. నిరుద్యోగులు సాయం చేసే విషయంలో ఇన్ని నిబంధనలు ప్రభుత్వానికి ఎందుకో అర్థం కావడం లేదు. ఏసురాజు : రవి బాబు ఇంకో విషయం.. మన ప్రాంతంలో రొయ్యల రైతులకు కరెంటు యూనిట్ రూ.1.50 పైసలకు ఇస్తానని ప్రతిపక్ష నేత జగన్న్చెప్పగానే చంద్రబాబు అప్పటి వరకు వసూలు చేస్తున్న రూ.3.80లను రూ.2.00 లకే ఇస్తానని వెంటనే ప్రకటించేశారు. నిరుద్యోగులందరూ ఓ సారి జగన్ను వెళ్లి కలవండి.. మార్పు ఉంటుందేమో.. దావీదు (ఏసు రాజు కొడుకు) : నాన్నో.. కిందటి నెల కరెంటు బిల్లు కట్టలేదంటా.. కరెంటోళ్లు వచ్చి ఫీజు పీకేశారు.. అమ్మ టీవీలో సీరియల్ ఆగిపోయిందని శివాలెత్తుతుంది.. బేగా వచ్చేయ్.. ఏసురాజు : అమ్మ బాబోయ్ కొంప మునిగింది.. సీరియల్ ఆగిందా.. నేనయిపోయా.. ఉంటానండి.. రేపు కలుద్దాం.. అంటూ పరిగెత్తాడు. అందరూ ఇంటి ముఖం పట్టారు. -
డీఎస్సీ.. బుస్సేనా!
కర్నూలు విద్య: ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గద్దెనెక్కిన తరువాత వాటిని మరిచిపోయారు. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటించినా ఎప్పటి నుంచో స్పష్టంగా చెప్పడం లేదు. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు రోజుకో మాట మాట్లాడుతూ నిరుద్యోగులను గందరగోళంలో పడేస్తున్నారు. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ వస్తుందో లేదోననే ఆందోళన నెలకొంది. ఈ ఏడాది పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు తాత్కాలిక సర్దుబాటు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఆ తరువాత మరి కొద్ది రోజులకు డీఎస్సీ నోటిఫికేషన్ అని.. లేదు లేదు ముందుగా టెట్ పెట్టి ఆ తరువాత కొత్త పోస్టులు భర్తీ చేస్తామని.. మరి కొద్ది రోజులకే టెట్, డీఎస్సీ రెండు ఒకే రోజు నిర్వహిస్తామంటూ ప్రకటనలు చేశారు. ఇంత వరకు దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించిన ప్రకారమైతే టెట్ నోటిఫికేషన్ ఈ నెల 15లోపు రావాలి. ప్రస్తుత పరిస్థితుల బట్టి చూస్తే ఆ అవకాశం లేదు. వచ్చే నెల మొదటి వారంలోనే టెట్ నిర్వహణపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామంటూనే ప్రభుత్వం కొత్త పోస్టుల భర్తీ భారాన్ని తగ్గించుకునే ఎత్తుగడలు వేస్తోంది. ఇందులో భాగంగానే 6,7 తరగతులలో విద్యార్థులు తక్కువగా ఉన్నారని ప్రాథమికోన్నత పాఠశాలలను ప్రాథమిక పాఠశాలలుగా కుదించారు. దీంతో పరోక్షంగా కొత్త పోస్టులు తగ్గే అవకాశం ఉందని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. జీవో నంబర్లు 55, 61ల ప్రకారం 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ప్రకారం రేషనలైజేషన్ చేసిన తరువాత ఎన్ని పోస్టులు మిగులుతాయనే దానిపై కసరత్తు చేయించి వివరాలను ప్రభుత్వం తీసుకుంది. ప్రస్తుతం జిల్లాలో 730 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీటిని రేషైనలైజేషన్ చేసిన తరువాత మిగిలే వాటిలో అవసరం మేరకు డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అప్పటి వరకు నిరుద్యోగ అభ్యర్థులకు ఉత్కంఠ తప్పదు. ఈ ఏడాది మే 31వ తేదీ వరకు ఖాళీలు అయిన పోస్టులను పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. జిల్లాలో 730 పోస్టులలో ఎస్జీటీలు 497, లాంగ్వేజ్ పండిట్స్ 98, పీఈటీ 13, స్కూల్ అసిస్టెంట్లు 122 ఖాళీలు ఉన్నాయి. టెట్కు పాత సిలబస్.. డీఎస్సీకి కొత్త సిలబస్ 2012-14 డీఎడ్ బ్యాచ్ ఛాత్రోపాధ్యాయులకు డీఎస్సీలో అవకాశం ఇచ్చేందుకు ఖచ్చితంగా టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ప్రభుత్వం రెండు ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంది. డీఎస్సీ రోజే ఉదయం ఒక పేపరుగా టెట్ నిర్వహంచాలని, ఇందులో అర్హత సాధిస్తేనే డీఎస్సీ జవాబు పత్రాలను దిద్దుతారు. గతంలో టెట్ అర్హత సాధించిన వారు కూడా మళ్లీ రాయొచ్చు. దేనిలో అధిక మార్కులు వస్తే దాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. టెట్ మాత్రం గతంలో ఉన్న పాత సిలబస్ ప్రకారమే నిర్వహించి. డీఎస్సీకి ఈ విద్యా సంవత్సరంలోని నూతన సిలబస్ ప్రకారమే నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ప్రశ్నపత్రం నమూనా, ప్రశ్నల సరళి కూడా మారే అవకాశం ఉన్నట్లు తెలిసింది. తెరపైకి కొత్త వాదన ప్రస్తుతం ఉపాధ్యాయులుగా పని చేస్తున్న వారికి పదోన్నతలు, బదిలీలు చేసిన తరువాతే రేషనలైజేషన్ చేయాలని ఆ తరువాతే కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. పదోన్నతులు, బదిలీలపై ఇటీవలే ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. దీంతో ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమపడుతోంది. ఫలితంగా డీఎస్సీ నోటిఫికేషన్ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement