-
Youth Pulse: ‘చిప్స్’.. ఇప్పుడు హాట్టాపిక్! వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు!
Semiconductor Career Opportunities in India: ‘శుభాకాంక్షలు’ తెలియజేసే ఛీర్... హిప్ హిప్ హుర్రే. ఇప్పుడు అదే ఛీర్తో భవిష్యత్కాల శుభ సందర్భాలను దృష్టిలో పెట్టుకొని ‘చిప్ చిప్ హుర్రే’ అంటుంది యూత్. ఎందుకంటే...పరాధీనతకు చరమగీతం పాడడానికి, సెమికండక్టర్ చిప్ల తయారీవ్యవస్థను బలోపేతం చేస్తూ, స్వావలంబన దిశగా ప్రయాణిస్తున్న దేశాల్లో మన దేశం కూడా ఒకటి. రాబోయే కాలంలో ఈ రంగంలో వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు యూత్ కోసం ఎదురుచూస్తున్నాయి. సర్వం సాంకేతికమయం అయిన ఈ ప్రపంచంలో సెమికండక్టర్ చిప్లు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. కరోనా కాటేసిన రంగాలలో ‘చిప్’ తయారీరంగం కూడా ఒకటి. కరోనాదెబ్బతో ‘చిప్’ల డిమాండ్, సరఫరాకు మధ్య భారీ అంతరం ఏర్పడింది. తయారీదార్లు రేట్లు పెంచారు. ఈ నేపథ్యంలో దేశాలు సెమీకండక్టర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టడం, బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. మన దేశం సెమీకండక్టర్ చిప్ల రూపకల్పన,తయారీ ప్రాజెక్ట్ కోసం 76వేల కోట్లు కేటాయించింది. మరోవైపు విద్యాసంస్థలు తమ పాఠ్యప్రణాళికలో సెమికండక్టర్ల డిజైన్ను అనుసంధానం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ‘దేశంలో చిప్ల కొరత...అనే వార్త చదువుతున్న క్రమంలో ఎందుకు? ఏమిటి? ఎలా? అనే కోణంలో ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. నన్ను ఆశ్చర్య,ఆనందాలకు గురి చేసిన విషయం ఈ రంగంలో భారీ ఉద్యోగావకాశాలు. ఇంజనీరింగ్ చదువుతున్న చెల్లి సుహానితో నేను చదివిన విషయాలను షేర్ చేసుకున్నాను’ అంటోంది నాగ్పూర్(మహారాష్ట్ర)కు చెందిన కావేరి. చెల్లి సుహానికి ఇప్పుడు ‘చిప్స్’ అనేది హాట్టాపిక్. ఆ రంగంలో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? అనేదాని గురించి చిన్నపాటి రిసెర్చ్ చేయడమే కాదు ఆ విషయాలను స్నేహితులకు చెబుతోంది. పెద్ద పెద్ద సంస్థలు దేశంలోని వివిధప్రాంతాలలో సెమికండక్టర్ల తయారీ యూనిట్లను ప్రారంభించడానికి ఉత్సాహంగా ఉన్నాయి. వివిధ రూపాల్లో ప్రభుత్వం నుంచి లభిస్తున్న ప్రోత్సాహం కూడా బాగానే ఉంది. ఇదే సందర్భంలో మాన్యుఫాక్చరింగ్ టాలెంట్, ప్రాక్టికల్ స్కిల్స్పై చర్చ మొదలైంది. కళాశాల చదువు పూర్తిచేసుకున్న విద్యార్థులను ‘జాబ్–రెడీ’కి సిద్ధం చేయడానికి ఆరు నుంచి పన్నెండు నెలల టైమ్ పడుతుంది అంటున్నారు సాంకేతిక నిపుణులు. ‘ఫ్యూచర్ ఏమిటి?’ అని రకరకాలుగా ఆలోచించిన సహజకు ‘చిప్’ల రూపంలో ఇప్పుడొక దారి దొరికింది. తిరునెల్వేలి(తమిళనాడు) చెందిన సహజ ‘సెమీకండక్టర్ ఇంజనీర్’ కావాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ‘సెమీకండక్టర్ల పరిశ్రమలో నైపుణ్యం కొరతను దృష్టిలో పెట్టుకొని చైనా ప్రభుత్వం చిప్ స్కూల్ను ప్రారంభించింది. దీనికోసం ప్రత్యేకంగా సైన్స్పార్క్ను ఏర్పాటుచేసింది. చిప్ స్కూల్లో విద్యార్థులకు సెమీకండక్టర్లకు సంబంధించిన ప్రాథమిక జ్ఞానాన్ని అందించడంతో పాటు సీనియర్ ఇంజనీర్లు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్లు, ప్రొఫెసర్లతో ఉపన్యాసాలు ఇప్పిస్తుంది. అలాంటి స్కూల్స్ మన దేశంలో కూడా ఏర్పాటుచేయాలి’ అంటుంది సహజ. మాసివ్ టాలెంట్ షార్టేజీ... అనే మాట ఒకవైపు నుంచి నిరాశగా వినిపిస్తున్నప్పటికీ, మరోవైపు నుంచి మాత్రం అత్యంత ఉత్సాహంగా ‘మేము రెడీ’ అని సన్నద్ధం అవుతోంది యువతరం. సాంకేతిక చదువు మాత్రమే చిప్ తయారీ పరిశ్రమలో రాణించడానికి ప్రధాన అర్హత కావడం లేదు. దీనికి క్రియేటివిటీ కూడా అత్యవసరం అంటున్నారు నిపుణులు. తమ డిజైనింగ్ ద్వారా టైమ్, డబ్బును ఆదా చేయడం యూత్ క్రియేటివిటీలో ఒకటి కాబోతుంది. చదవండి: Indravathi Inspiring Story: ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఇంద్రావతి.. పాపులర్ ఎలా అయింది -
నైపుణ్యముంటే.. కొలువుకు కొదవలేదు
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో విద్యనభ్యసించి నైపుణ్యం కనబరిచిన వారికి ఉద్యోగ అవకాశాలు వెదుక్కుంటూ వస్తున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) గణాంకాలను చూస్తే ఈవిషయం స్పష్టమవుతుంది. ఆ గణాంకాల ప్రకారం గత ఏడాదిలో దేశంలోని వివిధ విద్యాసంస్థల్లో చదివిన వారిలో 7.77 లక్షల మందికి ప్లేస్మెంట్స్ లభించాయి. వీటిలో అత్యధికం ఇంజనీరింగ్ తదితర టెక్నాలజీ కోర్సులలోని వారికే దక్కాయి. టెక్నాలజీలో నైపుణ్యం ఉన్న వారికి కరోనా కాలంలోనూ కొలువులకు కొదవలేదని నిపుణులు చెబుతున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) నియామకాల సరళి కూడా దీనిని స్పష్టం చేస్తోంది. గతంలో కన్నా 20 శాతం పెరుగుదలతో ప్యాకేజీ ఆఫర్లు అందాయని ఆ గణాంక నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఐఐటీ విద్యార్థులు అంతర్జాతీయంగానే కాదు, దేశీయంగానూ అత్యధిక వేతన ప్యాకేజీలు అందుకుంటున్నారు. ఈ సంవత్సరం దేశీయ సంస్థలలో ముఖ్యంగా క్లౌడ్ ఆధారిత టెక్ సంస్థలు అత్యధిక వేతనాలు చెల్లిస్తున్నాయి. ఆర్అండ్డీ విభాగాల్లో ఐఐటీ గ్రాడ్యుయేట్లకు అధిక డిమాండ్ ఉంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనాలసిస్ వంటి వాటిలో నైపుణ్యాలున్న విద్యార్థులకు అధిక ప్యాకేజీలను ఇవ్వడానికి కంపెనీలు ముందుకు వస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా కారణంగా క్యాంపస్ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూలు ఆన్లైన్లో వర్చువల్గా నిర్వహిస్తున్నారు. అ‘ధర’గొడుతున్న ప్యాకేజీలు ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ ముంబై, ఐఐటీ ఖరగ్పూర్ సహా ఇతర ఐఐటీల విద్యార్థులు అంతర్జాతీయ ఆఫర్లను ఎక్కువగా అందుకుంటున్నారు. ఆయా ఐఐటీలు వెలువరిస్తున్న గణాంకాల ప్రకారం.. అంతర్జాతీయ సంస్థల ఆఫర్లలో డచ్ సంస్థ ఆప్టివర్ ఈ ఏడాది ఐఐటీ ముంబైలో చేపట్టిన డ్రైవ్లో గరిష్టంగా 1.39 కోట్ల ప్యాకేజీని ఇచ్చింది. సోనీ సంస్థ (జపాన్) రూ. 1.14 కోట్లు, హోండా –ఆర్అండ్డి (జపాన్) రూ. 57.85 లక్షలు, తైవాన్ సెమీకండక్టర్ తయారీ సంస్థ రూ. 53.52 లక్షలు, క్వాల్కమ్ రూ. 46.41 లక్షలు, వరల్డ్క్వాంట్ రూ. 39.70 లక్షలు, మోర్గాన్ స్టాన్లీ రూ. 37.25 లక్షలు, ఉబెర్ రూ.35.38 లక్షలు, ఎన్ఇసి (జపాన్) రూ. 34.73 లక్షలు ప్యాకేజీని ఇచ్చాయి. ⇔ ఐఐటీ రూర్కీ విద్యార్థులలో గరిష్ట వేతనం ఈ ఏడాది రూ. 80 లక్షల వరకు వచ్చింది. గత ఏడాదిలో రూ. 60 లక్షలు మాత్రమే. జాతీయ సంస్థలతో పాటు ఏడు అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ నియామక డ్రైవ్ చేపట్టాయి. ఇక్కడ 484 మందికి మంచి ఆఫర్లు వచ్చాయి. ⇔ ఐఐటి గువహటి విద్యార్థికి గత ఏడాదిలో గరిష్ట వేతనం రూ. 52 లక్షలు కాగా ఈ ఏడాది రూ. 70 లక్షల వరకు పెరిగింది. ఈసారి నాలుగు అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ ప్లేస్మెంట్స్ను నిర్వహించాయి. 353 మందికి ప్లేస్మెంట్లు వచ్చాయి. ⇔ ఐఐటీ కాన్పూర్లో ఈ ఏడాది చేపట్టిన ప్లేస్మెంట్సులో అత్యధిక దేశీయ ఆఫర్ రూ. 82 లక్షలు. గతేడాది కన్నా ఇది 32 శాతం ఎక్కువ. దేశీయ ప్యాకేజీల్లోనూ పెరుగుదల ఈ ప్లేస్మెంట్ సీజన్లో ఐఐటీ విద్యార్థులకు అంతర్జాతీయ సంస్థల ఆఫర్లను మించి దేశీయ టెక్ సంస్థలు వేతనాలు ప్రకటిస్తుండడం విశేషం. గతంతో పోలిస్తే 30 నుంచి 35 శాతం అధికంగా వేతనాలు పెరిగాయి. మద్రాస్, రూర్కీ, గువహటి తదితర ఐఐటీల్లో దేశీయ సంస్థలు ప్రకటించిన వేతనాలు అంతర్జాతీయ ప్యాకేజీలను దాటాయి. విదేశాలకు వెళ్లేకన్నా దేశంలోనే ఉంటూ అంతకన్నా ఎక్కువ సంపాదించే అవకాశం ఉండటంతో దేశీయ కంపెనీలవైపు విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. మైక్రోసాఫ్ట్, ఉబర్ వంటి సంస్థలతో పోటీపడుతూ.. ఎమ్టీఎక్స్ గ్రూప్, క్వాంట్బాక్స్ రీసెర్చ్, గ్రావిటన్ వంటి సంస్థలు టెక్ విద్యార్థులకు రూ. 70 లక్షల నుంచి రూ. 80 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నాయి. ఏఐసీటీ ఈ గణాంకాల ప్రకారం ఆయా విభాగాలలో ప్లేస్మెంట్లు దక్కిన వారి సంఖ్య.. విభాగం దేశంలో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ 649 ఆర్కిటెక్చర్ ప్లానింగ్ 2,184 డిజైన్ 104 ఇంజనీరింగ్, టెక్నాలజీ 6,05,297 మేనేజ్మెంటు 1,15,599 ఎంసీఏ 17,219 ఫార్మసీ 33,428 హోటల్ మేనేజ్మెంటు 2,555 మొత్తం 7,77,035 గత ఐదేళ్లలో ప్లేస్మెంట్సు ఇలా 2015–16 7,01,527 2016–17 7,22,868 2017–18 7,15,918 2018–19 7,94,815 2019–20 7,77,035 ఏపీలో గత ఐదేళ్లలో ఇలా 2015–16 56,359 2016–17 60,404 2017–18 61,431 2018–19 75,028 2019–20 74,204 నైపుణ్యమే ప్రధానం.. కరోనా తరువాత ప్రపంచం డిజిటల్ యుగంలోకి చొచ్చుకుపోతోంది. 3డీ ప్రింటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా సైన్సెస్లే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటిలో నైపుణ్యం, విభిన్నమైన ఆలోచనలు, సృజనాత్మకత ఉన్న వారికి ఎక్కువ అవకాశాలు దక్కుతాయి. ప్లేస్మెంట్ ఇచ్చే సంస్థలు ఇకపై విద్యా సంస్థలకు ప్రాధాన్యమిచ్చే పరిస్థితి ఉండదు. విద్యార్థుల్లోని నైపుణ్యాలనే పరిగణనలోకి తీసుకుంటాయి. ప్రస్తుతం పలు డిజిటల్ సైట్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిద్వారా నైపుణ్యాలు పెంపొందించుకొనే వారికి అవి స్కోర్లు ఇస్తున్నాయి. ఆ స్కోర్లు బాగా ఉన్న వారిని కంపెనీలు ఆన్లైన్లోనే పరీక్షించి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. రానున్న కాలంలో క్యాంపస్ ఎంపికలు ఉండకపోవచ్చు. – ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి, ఉపకులపతి, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం సామర్థ్యాలు పెంచుకోవాలి ఐఐటీల్లో చదివే విద్యార్థులలోనే కాకుండా ఇతర కాలేజీ విద్యార్థుల్లో కూడా మంచి తెలివి తేటలుంటాయి. విద్యార్థులు ఆత్మస్థయిర్యంతో నైపుణ్యాలను వ్యక్తపరిచే సామర్థ్యాలు అలవర్చుకోవాలి. నైపుణ్యముంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయి. విద్యార్థులకు మార్కులు, ర్యాంకులే కాకుండా మారుతున్న ప్రపంచానికి అవసరమైన పరిజ్ఞానం, నైపుణ్యాలను వారికి నేర్పిస్తున్నాం. కరోనా సమయంలోనూ శిక్షణ ఇవ్వడంతో మంచి అవకాశాలు విద్యార్థులకు వచ్చాయి. – డాక్టర్ వి.మధుసూదనరావు, రెక్టార్, వీ.ఎం.రావు, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, విశాఖపట్నం -
భారత్లో కొలువుల జోరు!
కలసి వస్తున్న దేశీయ వ్యాపారాల్లో వృద్ధి అమెరికన్ ఎక్స్ప్రెస్, సీఎఫ్ఓ రీసెర్చ్ వెల్లడి న్యూఢిల్లీ: భారత్లో ఉద్యోగావకాశాలు వేగంగా వృద్ధి చెందగలవన్న అంచనాలున్నాయని ఒక నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారత్లోనే ఉద్యోగావకాశాలు వేగంగా వృద్ధి చెందుతాయని కార్పొరేట్లు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతమున్న వ్యాపారాల్లో వృద్ధి ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తుందని వారు భావిస్తున్నారు. సీఎఫ్ఓ రీసెర్చ్ సంస్థతో కలసి అమెరికన్ ఎక్స్ప్రెస్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సర్వే నివేదిక ప్రకారం... ఉద్యోగావకాశాలు భారత్లోనే అధికంగా ఉన్నాయని 78 శాతం మంది అభిప్రాయపడ్డారు. భారత్ తర్వాతి స్థానాల్లో అమెరికా(61 శాతం), చైనా (50 శాతం) నిలిచాయి. ఆర్థిక వృద్ధి జోరుగా వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటని అమెరికన్ ఎక్స్ప్రెస్ కంట్రీ బిజినెస్ హెడ్ గ్లోబల్ కార్పొరేట్ పేమెంట్స్ సరు కౌశాల్ చెప్పారు. ఆర్థిక వృద్ధే కాకుండా ఉద్యోగాలు కూడా భారత్లోనే అధికంగా రానున్నాయని పేర్కొన్నారు. అయితే ప్రతిభ గల ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. ఉద్యోగాలు చేయడానికి తగిన నైపుణ్యాలున్న అభ్యర్థులను తయారు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. తమ తమ కంపెనీల్లో ఇటీవల కాలంలో ఆదాయం కంటే ఉద్యోగుల భర్తీ పెరిగిందని భారత్ నుంచి సర్వేలో పాల్గొన్నవారిలో 29 శాతం మంది అభిప్రాయపడ్డారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
IPL 2024: సన్రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement